Girl
-
ఐదు ఉద్యోగాలు సాధించిన సంకీర్తన
మంచిర్యాలటౌన్: చిన్ననాటి నుంచి చదువులో రాణిస్తూ వరుసగా ఐదు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి అందరి ప్రశంసలు అందుకుంటోంది మంచిర్యాల జిల్లా కేంద్రానికి చెందిన బొడ్డు సంకీర్తన. పట్టణంలోని రాంనగర్కు చెందిన బొడ్డు భీమయ్య, మల్లక్క దంపతులకు కుమారుడు సాయికిరణ్, కుమార్తె సంకీర్తన సంతానం. భీమయ్య హమాలి పనిచేస్తూ తన ఇద్దరు పిల్లలను ఉన్నత చదువులు చదివించాడు. పదోతరగతి మంచిర్యాల జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో, డిగ్రీ కోటి ఉమెన్స్ కళాశాలలో చదివిన సంకీర్తన 2023లో కానిస్టేబుల్ ఉద్యోగం సాధించింది. అందులో చేరకుండానే గ్రూప్–4 రాసి మంచిర్యాలలోని జ్యోతిబాపూలే బీసీ గురుకులంలో జూనియర్ అసిస్టెంటుగా ఉద్యోగం సాధించింది. విధులు నిర్వహిస్తూనే మహిళా, శిశు, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జనవరిలో నిర్వహించిన సీడీపీవో పరీక్షతో పాటు, ఎక్స్టెన్షన్ ఆఫీసర్(సూపర్వైజర్) గ్రేడ్–1లో రెండు ఉద్యోగాలు సాధించింది. సీడీపీవో ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో 12వ ర్యాంకు, మల్టీజోన్ కేటగిరీలో 7వ ర్యాంకు సాధించింది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎక్స్టెన్షన్ ఆఫీసర్(సూపర్వైజర్) గ్రేడ్ 1 మహిళా, శిశు అభివృద్ధి శాఖ ఫలితాలను బుధవారం ప్రకటించగా, రాష్ట్రస్థాయిలో 2వ ర్యాంకు, మల్టీజోన్లో 1వ ర్యాంకు సాధించింది. -
సైన్స్ కోర్సు చదవలేకపోయానంటూ.. కన్నీళ్లు పెట్టుకుంది! కట్చేస్తే..
తల్లిదండ్రులు ఒక్కోసారి తమ పిల్లలు చదవాలనుకున్న ఉన్నత చదువులను చదివించలేకపోవచ్చు. ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఆ స్థాయి చదువులను చదివించలేకపోతుంటారు. కొందరేమో..! మగపిల్లవాడు కదా అని వాడిని మాత్రం అప్పోసొప్పో చేసి మరీ చదివిస్తుంటారు. ఆడపిల్లలని మాత్రం ఏ సర్కారీ బడిలోనో జాయిన్ చేసి.. తూతూ మంత్రంగా చదివిస్తుంటారు. పాపం అలానే ఇక్కడ ఈ అమ్మాయి విషయంలో తల్లిదండ్రులు చేశారు. అయితే ఆ అమ్మాయి డ్రీమ్ని నెరవెర్చేందుకు కేంద్ర విద్యా మంత్రే కదిలొచ్చారు. అదెలా జరిగిందంటే..బీహార్లోని దానాపూర్కు చెందిన విద్యార్థిని ఖుష్బు కుమారి తాను సైన్సు కోర్సులో జాయిన్ అయ్యి డాక్టర్ అవ్వాలనుకుంది. అయితే ఇంట్లో పరిస్థితులు అంతంత మాత్రమే కావడంతో తల్లిదండ్రులు ఆ అమ్మాయిని బలవంతంగా ఆర్ట్స్ కోర్సులో జాయిన్ చేశారు. దీంతో ఆ అమ్మాయి తన తల్లిదండ్రుల కారణంగా తన డ్రీమ్ని ఎలా కోల్పోయిందో ఓ వీడియోలో వివరించింది. ఆ వీడియో క్షణాల్లో వైరల్ అయ్యి కేంద్ర ప్రభుత్వం దృష్టికి చేరింది. ఆ బాలిక వీడియోలో తన తల్లిదండ్రులు చూపిస్తున్న లింగ వివక్షపై విరుచుకుపడుతూ.. తన గోడుని వెళ్లబోసుకుంది. తాను ఇంటర్లో సైన్స్ కోర్సులో జాయిన్ అవ్వాలనుకున్నా..కానీ నా తల్లిదండ్రులు పదిలో 400 మార్కులకు తెచ్చుకుంటే నీకు నచ్చిన కోర్సులో జాయిన్ అవ్వచ్చని అన్నారు. అయితే తాను 399 మార్కులే స్కోర్ చేయడంతో తన కల కలగానే మారిపోయిందని కన్నీళ్లుపెట్టుకుంది. అబ్బాయిలకు మాత్రమే నచ్చిన చదువు చదువుకునే స్వేచ్ఛ ఉంది. ఆడపిల్లలకు ఉండదు. కనీసం తమకు ఫోన్ కూడా ఇవ్వరు పేరెంట్స్ అంటూ భోరుమంది వీడియోలో. అంతే ఆ వీడియోపై కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే స్పందించి.. ఆమెకు చదవు విషయంలో పూర్తి మద్దతిస్తానని హామీ ఇచ్చారు. పాట్నా జిల్లా మేజిస్ట్రేట్ ఏర్పాటు చేసిన వీడియో కాల్లో మంత్రి ప్రధాన్ ఆ బాలికతో నేరుగా మాట్లాడారు. తల్లిదండ్రులపై ఎలాంటి ద్వేషం పెట్టుకోవద్దని చెప్పడమే గాక బాగా చదువుకోవాలని సూచించారు. అలాగే ఆమె చదువాలనుకున్న చదువుకి కావాల్సిన ఏర్పాట్లను బిహార్ సీఎం నితీష్ కుమార్ చూసుకుంటారని చెప్పారు మంత్రి ప్రధాన్. ఆ బాలిక ప్రతిస్పందనగా.. మంచి కళాశాలో సైన్సు కోర్సులో చేరాలన్న తన కోరికను కేంద్రమంత్రికి విన్నవించింది. ఆయన అందుకు తగిన ఏర్పాటు చేసేలా పాట్నా జిల్లా మేజిస్ట్రేట్ చంద్రశేఖర్ సింగ్కి ఆదేశాలు జారీ చేశారు. 2025-27 విద్యా సంవత్సరానికే ఆమెకు నచ్చిన కోర్సులో జాయిన్ అయ్యేలా వెసులబాటు కల్పించనున్నట్లు అధికారిక వర్గాల సమాచారం. కాగా, ఆ అమ్మాయి తల్లిదండ్రులు తమ ఆర్థిక స్థోమత దృష్ట్యా తమ కూతురిని ఇలా బలవంతంగా ఆర్ట్స్ కోర్సులో జాయిన్ చేశామని చెప్పారు. ఏదీఏమైతేనేం తన కోరిక నెరవేర్చుకునేందుకు కేంద్ర ప్రభుత్వమే దిగొచ్చేలా చేసింది. (చదవండి: ఎవరీ తారా ప్రసాద్..? ఆనంద్ మహీంద్రా ప్రశంసల జల్లు..) -
కారు ఢీకొట్టి ఈడ్చుకెళ్లినా.. నొప్పి తెలియదట ఆమెకు..!
ఓ పట్టాన అంతుచిక్కని కొన్ని రకాల వ్యాధులు వైద్యులకు భలే గమ్మత్తైన సవాళ్లని విసురుతుంటాయి. ఒక్కోసారి అదెలా సాధ్యం అని వైద్యులకే చెమటలు పట్టించేస్తాయి. అచ్చం అలాంటి వైద్య పరిస్థితితోనే పోరాడుతోంది ఈ చిన్నారి. వైద్యపరంగా ఆమె ఓ అద్భుతంగా మారింది. ప్రతి వ్యక్తి మనుగడకు, ఆరోగ్యానికి ప్రధానమైన మూడు ప్రాథమిక అవసరాలు లేకుండానే బతికేస్తుంది ఆమె. మరీ ఆ చిన్నారి ఎలాంటి వైద్యపరిస్థితితో బాధపడుతోందంటే..యూకేకి చెందిన ఒలివియా పార్న్స్వర్త్ అనే అమ్మాయి అరుదైన జన్యుపరమైన సమస్యతో పోరాడుతోంది. ఆ ప్రత్యేకమైన పరిస్థితి కారణంగా వైజ్ఞానికంగా అద్భతమైన అమ్మాయిగా మారిందామె. ప్రపంచంలో ప్రతి మానవుడికి కీలమైన మూడు ప్రాథమిక అవసరాలు లేకుండానే జీవించగలదామె. సింపుల్గా చెప్పాలంటే ఆమె ఆ మూడు సవాళ్లను ఒకేసారి అధిగమించగల అసాధారణ అమ్మాయి. అంతెందుకు వైద్యులు కూడా ఆమెను ఓ ఆద్బుతంగా పరిగణించారు. ఏంటా వైద్యపరిస్థితి అంటే..ఒలివియాకి నొప్పి, ఆకలి, నిద్ర అనేవి ఉండవట. ఇది మనిషిలో ఉండే ఆరవ క్రోమోజోమ్లోని జన్యుపరమైన అసాధారణత ఫలితంగా ఆమెకు ఇలాంటి పరిస్థితని వైద్యలు భావిస్తున్నారు. ఒకరకంగా ఇది వరంలా కనిపించినా ఆమెకు ఈ పరిస్థితి ఆందోళనకరమైనదే అనే ఒలివియా తల్లి ఆవేదనగా చెప్పారు. ఈ మూడింటి ఫీలింగ్స్ ఆమెకు తెలియదు కాబట్టి ఏ క్షణంలో తనను తాను ఎలా గాయపరుచుకుంటుందో అనే భయపడుతూ బతకాల్సి వస్తోందంటూ కన్నీటి పర్యాంతమైంది ఒలివియా తల్లి. ఇక ఆమెకు ఆకలి ఉండదు కాబట్టి ఆమె పోషకాహార లోపంతో బాధపడకుండా మంచి ఆహారాన్ని ఇచ్చేలా పర్యవేక్షించక తప్పదని చెబుతోంది. అంతేగాదు ఒలివియాకు ఏడేళ్ల వయసులో జరిగిన ప్రమాదం గుర్తించేసుకుంటూ..నాడు తామంతా ఒలివియా పరిస్థితి చూసి కంగుతిన్నామని చెప్పింది. ఆమె చిన్నతనంలో ఓ కారు ఆమెను ఢీకొట్టి చాలాదూరం ఈడ్చుకుని వెళ్లిపోయిందని నాటి ఘటనను వివరించారు. ఒళ్లంతా నెత్తురోడుతున్న...ఆ ఆకస్మిక ఘటనకు మా కుటుంబం అంతా షాక్లో ఉండిపోయింది. కొద్దిపాటి మెరుపు వేగంలో తేరుకుని ఒలివియాను రక్షిద్దాం అనుకునేలోగా ..ఒలివియా ఏమి కానట్లుగా తనంతాట తానే లేచి తమ వద్దకు రావడంతో హుతాసులైపోయాం అంటూ నాటి సంఘటనను గుర్తుచేసుకున్నారామె. ఒంటినిండా గాయలైనా ఏం కానట్లు ఒలివియా ప్రవర్తించిన తీరు ఇప్పటికీ మర్చిపోలేనంటోంది తల్లి. "ఒలివియాకి నిద్ర కూడా ఓ సవాలు. ఎందుకంటే మందులు లేకుండా సహజంగా నిద్రపోలేదు. మనం గనుక మందులు వేయకపోతే అలా మూడు రోజుల వరకు మేల్కొనే ఉంటుందట. ఆ నిద్రలేమిని నిర్వహించేలే కఠినమైన నిద్ర సహాయాలను అనుసరిస్తున్నట్లు చెప్పారు". ఒలివియా తల్లి. ఆ అమ్మాయి పరిస్థితిని ఆస్పత్రి వారు బయోనిక్గా అబివర్ణించారు. ఈ అరుదైన కేసు జీవశాస్త్రం సంక్లిష్టతలు, జన్యుఉత్పరివర్తనాల ప్రభావంపై అంతర్దృష్టిని అందిస్తోందని చెబుతున్నారు వైద్య నిపుణులు. ఆ అమ్మాయి కేసు తమ వైద్యానికే అంతపట్టని చిక్కుప్రశ్నలా ఉందన్నారు. ఒలివియా పరిస్థితిని ప్రపంచంలోనే అత్యంత అరుదైన వాటిలో ఒకటిగా పేర్కొన్నారు. నిజంగా ఆ అమ్మాయి పరిస్థితి వైద్య నిపుణులకేకాదు సాధారణ ప్రజలకు కూడా ఆశ్చర్యం కలిగించేలా ఉంది కదూ..!.(చదవండి: కిడ్నీలు పదిలమేనా..? మదుమేహం లేకపోయినా వస్తుందా..?) -
బరువు తగ్గాలని ఆ డైటింగ్ : చివరికి ప్రాణమే పోయింది!
బరువు తగ్గాలనే ఆరాటంలో చాలా పొరబాట్లు చేస్తూ ఉంటారు కొంతమంది. శరీర తత్వాన్ని అవగాహన చేసుకోవాలి. అసలు బరువు తగ్గడం అవసరమా? తగ్గితే ఎన్ని కిలోలు తగ్గాలి? ఎలాంటి డైట్ పాటించాలి? ఎలాంటి వ్యాయామాలు చేయాలి? అనేది నిర్ణయించుకోవడం అవసరం. ఇందుకు వైద్యుల సలహాలు, నిపుణుల సూచనలు చాలా ముఖ్యం. అలాకాకుండా బరువు పెరుగుతామనే భయంతో ఆన్లైన్లో చూసో, లేదా మరెవరో చెప్పారనో ఏ డైట్ బడితే అది ఫాలో కావడం అనర్థం. ఒక్కోసారి ఇది ప్రాణాలు కూడా పోవచ్చు. కేరళలో కన్నూరులో చోటు చేసుకున్న ఘటన ఇలాంటి ఆందోళనలనే రేకెత్తిస్తోంది. కొన్ని రకాల రుగ్మతల వల్ల కూడా భయం పెరిగిపోతామనే భయం పట్టుకుంటుందని మీకు తెలుసా? రండి తెలుసుకుందాం! కేరళలోని కన్నూర్కు చెందిన 18 ఏళ్ల అమ్మాయి తీవ్రమైన ఆహార నియంత్రణలు పాటించేది. యూట్యూబ్లో చూసి దాదాపు పూర్తిగా ఆహారాన్ని తీసుకోవడం మానేసింది. కేవలం నీటినే తీసుకునేది. చివరికి తీవ్రమైన దీర్ఘకాలిక ఆకలి కారణంగా ఏర్పడిన ఆరోగ్య సమస్యల కారణంగా చనిపోయింది. మృతురాల్ని కూతుపరంబ నివాసి శ్రీనందగా గుర్తించారు. తీవ్రమైన సమస్యలతో తలస్సేరిలోని ఒక ఆసుపత్రిలో చేరింది. వెంటిలేటర్పై చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకపోయింది. కొన్ని రోజులు వెంటిలేటర్పై ఉండి ప్రాణాలు కోల్పోయింది. ఆమె గతంలో కూడి ఇలాంటి సమస్యలతో కోజికోడ్ మెడికల్ కాలేజీలో చేరిందట. వైద్యుడు డాక్టర్ నాగేష్ ప్రభు ప్రకారం, శ్రీనంద అనోరెక్సియా నెర్వోసా అనే తినే రుగ్మతతో బాధపడుతోంది. దీని వలన రోగి బరువు పెరుగుతారనే భయం ఉంటుంది. ఆరు నెలల కింత నుంచి ఆకలితోనే ఉంటోందని ఆయన తెలిపారు. సోడియం , చక్కెర స్థాయిలు తీవ్రంగా పడిపోవడంతో చనిపోయిందని వైద్యులు ప్రకటించారు. ఇలాంటి సమస్యలకు వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాలని సూచించారు. ఈ వ్యాధి తీవ్రత గురించి తెలుసు కోవాలన్నారు. పశ్చిమ దేశాల్లో ఎక్కువగా కనిపించే అనోరెక్సియా నెర్వోసా కేరళలో కనిపించడం ఇది చాలా అరుదు అని కూడా ఆయన చెప్పారు. అనోరెక్సియా నెర్వోసా అంటే..?డా. నగేష్ అందించిన వివరాల ప్రకారం అనోరెక్సియానెర్వోసాతో బాధపడేవారిలో కాలక్రమేణా ఆకలి అనే అనుభూతిని కోల్పోతారు. దీనికి కారణాలపై స్పష్టత లేదు. అయితే మానసిక ఆరోగ్యం, జన్యు మార్పులు, పర్యావరణం వంటివి ఈ పరిస్థితికి కారణమవుతుంది. అన్ని వయసులు, జాతులు, శరీర రకాలను కూడా ఇది ప్రభావితం చేస్తుంది.మానసిక చికిత్సఅనోరెక్సియా నెర్వోసా ఒక మానసిక పరిస్థితి. దీని లక్షణాలను బట్టి మానసిక చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. మందులు, పోషకాహార కౌన్సెలింగ్, వారానికి ఒకసారి మానసిక కౌన్సెలింగ్ తీసుకోవాలి. అవసరమైతే ఆసుపత్రిలో చేరాలి. సకాలంలో చికిత్స చేస్తే నయమవుతుంది. అయితే, ఇలాంటివి రుగ్మతలు రాత్రికి రాత్రే నయం కావు. కోలుకోవడానికి సమయం చాలా పట్టవచ్చు. వైద్యులను సలహాలను తప్పక పాటిస్తూ, క్రమం తప్పకుండా మందులు వాల్సి ఉంటుంది. -
ఇక్కడి అమ్మాయి.. అక్కడి అబ్బాయి (ఫొటోలు)
మైసూరు: ప్రేమ ఎల్లలు దాటింది. మైసూరుకు చెందిన యువతి, నెదర్లాండ్కు చెందిన యువకుడి మధ్య చిగురించిన ప్రేమ ఫలించింది. దీంతో పెద్దల సమక్షంలో హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్నారు. నగరంలోని హూటగళ్లికి చెందిన విద్య, నెదర్లాండ్కు చెందిన యువకుడు రుటైర్ పరస్పరం ప్రేమించుకున్నారు. ఈ విషయాన్ని ఇరు కుటుంబాల పెద్దలకు తెలియపరచగా వారి పెళ్లికి అంగీకరించారు. దీంతో నగరంలోని కల్యాణ మండపంలో చెన్నగిరి తాలూకాలోని పాండోమట్టి విరక్త మఠం డాక్టర్ గురుబసవ స్వామీజీ నేతృత్వంలో విద్యా మెడలో రుటైర్ తాళి కట్టాడు. అనంతరం పెళ్లికి వచ్చిన అతిథులు వారిని ఆశీర్వదించి శుభాశీస్సులు పలికి విందు భోజనం ఆరగించారు. -
బాబుకే షాకిచ్చిన స్టూడెంటు
-
అమెరికా అమ్మాయి.. నల్గొండ అబ్బాయి.. ధూంధాంగా పెళ్లి!
మోత్కూర్, నల్గొండ జిల్లా: అమెరికాకు చెందిన యువతితో మోత్కూర్ మండలం దాచారం గ్రామానికి చెందిన యువకుడికి వివాహం(Marriage) జరిగింది. దాచారం గ్రామానికి చెందిన జినుకల లలిత, ధర్మయ్య దంపతుల ప్రథమ కుమారుడు సందీప్కుమార్(Sandeep Kumar) ఉన్నత చదువుల కోసం పదేళ్ల క్రితం అమెరికాకు(America) వెళ్లాడు. అక్కడ కంప్యూటర్ సైన్స్లో మాస్టర్స్ పూర్తిచేసి టెక్సాస్ రాష్ట్రంలోని ఓ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా(Software Engineer) పనిచేస్తున్నాడు. అమెరికా దేశానికి చెందిన మరీయా డిలారోసా, అర్మాండో హెర్నాండేజ్ దంపతుల కుమార్తె అవని ఏలేనా ఎంబీఏ పూర్తిచేసి సందీప్కుమార్ పనిచేసే కంపెనీలోనే మేనేజర్గా పనిచేస్తోంది. ఈ క్రమంలో సందీప్కుమార్, ఏలేనా మధ్య ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది. దీంతో ఇరు కుటుంబాల అంగీకారంతో హిందూ సాంప్రదాయం ప్రకారం మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లా ఘట్కేసర్లోని రాక్ ఎన్క్లేవ్ ఫంక్షన్ హాల్లో శుక్రవారం వివాహ బంధంతో వారిద్దరు ఒక్కటయ్యారు. -
కోటిన్నర బంగారం కేవలం రూ.680కే అమ్మిన టీనేజర్!
ఓ బాలికకు తన స్నేహితుల్లో ధరించిన పోగులు,ముక్క పుడకలు నచ్చాయి. వెంటనే వాటిని కొనుగోలు చేయాలని అనుకుంది. కానీ చేతిలో డబ్బులు లేవు. ఇంట్లో వాళ్లను అడిగితే కోప్పడతారు. అందుకే ఏదో ఒకటి చేసి గిల్ట్ నగల్ని కొనుగోలు చేయాలని అనుకుంది. ఇందుకోసం తన తల్లి ధరించే రూ.1.16 కోట్ల బంగారాన్ని కేవలం రూ.680కే అమ్మేసింది. ఆ తర్వాత ఏమైందంటే? సౌత్ చౌనా మార్నింగ్ పోస్ట్ ప్రకారం.. చైనాలోని షాంఘైకు చెందిన బాలిక లిప్ స్టడ్లు, చెవిపోగులు కొనుగోలు చేసేందుకు మిలియన్ యువాన్ (రూ.1.16 కోట్లు) విలువైన తన తల్లి ఆభరణాలను దొంగిలించింది. వాటిని కేవలం 60 యువాన్లకు (రూ.680) విక్రయించింది.కుమార్తె చేసిన నిర్వాకం తెలియని తల్లి వాంగ్ వెంటనే పుటువో పబ్లిక్ సెక్యూరిటీ బ్యూరోలోని వాన్లీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. తన ఇంట్లో దొంగతనం జరిగిందని, కోట్లు విలువ చేసే బంగారం నగలు మాయమైనట్లు ఆ ఫిర్యాదులో పేర్కొంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ దర్యాప్తులో వాంగ్ ధరించే జేడ్ బ్రాస్లెట్లు, నెక్లెస్లు, డైమండ్లు పొదిగిన ముక్కపుడకల్ని ఆమె కుమార్తె అమ్మినట్లు గుర్తించారు. వాస్తవానికి ఆ బాలిక సైతం తాను అమ్మింది గిల్ట్ నగలనే అనుకుంది. ఇదే విషయంపై తల్లిని ఆరా తీయగా.. తన కుమార్తె లిప్ స్టడ్స్ కోసమే బంగారాన్ని అమ్మినట్లు చెప్పింది. ‘ఆ రోజు నా కుమార్తె నన్ను డబ్బులు అడిగింది. ఎంత అని అడగ్గా 60యువాన్లు అని చెప్పింది. ఎందుకు అని అడగ్గా..తన స్నేహితులు లిప్ స్టడ్స్ ధరించారని, అవి తనకు బాగా నచ్చాయని .. తాను కూడా ధరించాలని తన కోరికను చెప్పింది.లిప్ స్టడ్ ఖరీదు 30 యువాన్లు (రూ.340), మరియు ఆమె 30 యువాన్ల ధరతో మరో జత చెవిపోగులు కావాలని వివరించింది. వాటి మొత్తం ఖరీదు 60 యువాన్లు అని తెలిపింది. కానీ తాను ఆ డబ్బులు ఇవ్వలేదని చెప్పింది. తల్లి,కుమార్తెల మధ్య జరిగిన సంభాషణ విన్న పోలీసులు.. తల్లి డబ్బులు ఇవ్వలేదు కాబట్టి.. ఇంట్లో ఉన్న బంగారాన్ని గిల్ట్ నగలు అనుకుని బంగారాన్ని అమ్మినట్లు ఓ నిర్ధారణకు వచ్చారు. అనంతరం, బాలిక బంగారాన్ని ఎక్కడ అమ్మింది? ఎవరికి అమ్మింది? ఎంతకు అమ్మింది? అన్న కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు. బాలిక తిరిగిన ప్రాంతాల సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. చివరికి బాలిక బంగారం ఎవరికి విక్రయించిందో గుర్తించారు. ఆ బంగారాన్ని స్వాధీనం చేసుకుని బాధితురాలికి అందించారు. దీంతో కథ సుఖాంతం అయ్యింది. -
తెలంగాణ అబ్బాయి.. మాంచెస్టర్ అమ్మాయి
(నల్గొండ జిల్లా) చిట్యాల: మండలంలోని పెద్దకాపర్తి గ్రామానికి చెందిన రామన్నపేట సమితి మాజీ ప్రెసిడెంట్ కందిమళ్ల జగ్గారెడ్డి మనుమడు రాజీవ్రెడ్డికి యూకేలోని మాంచెస్టర్కు చెందిన యువతితో శనివారం వివాహం జరిగింది. రాజీవ్రెడ్డి మాంచెస్టర్లో హోటల్ మేనేజమెంట్ కోర్సు పూర్తి చేసి అక్కడే ఉద్యోగం చేస్తున్నాడు. అక్కడే పోలీస్శాఖలో పనిచేస్తున్న లారెన్ ఫిషర్తో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. ఇద్దరూ వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. హైదరాబాద్లో ఇరు కుటుంబాల పెద్దల సమక్షంలో హిందూ సంప్రదాయ పద్ధతిలో శనివారం మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. తమ కుమార్తె తెలంగాణ ఇంటి కోడలు కావటం ఎంతో ఆనందంగా ఉందని వధువు తల్లిదండ్రులు కే.ఫిషర్ డేవ్ ఫిషర్ ఆనందం వ్యక్తం చేశారు. పెళ్లి కుమారుడి తల్లిదండ్రులు మహేందర్రెడ్డి–ప్రేమలత ఇరుకుటుంబాలకు చెందిన పెద్దలతో పాటు పెద్దకాపర్తి గ్రామ మాజీ సర్పంచ్ కందిమళ్ల శిశుపాల్రెడ్డి–రేణుక, కందిమళ్ల జైపాల్రెడ్డి నూతన వధూవరులను ఆశీర్వదించారు. -
సవతి కూతురిని చంపి..
బక్సర్ (బిహార్): ఎనిమిదేళ్ల సవతి కూతురిని అత్యంత కిరాతకంగా హత్య చేసింది బిహార్కు చెందిన ఓ మహిళ. శనివారం రాత్రి మృతురాలి అవశేషాలను గుర్తించిన పోలీసులు మహిళను అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. బక్సర్ జిల్లాలోని డుమ్రాన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నయా భోజ్పూర్ ప్రాంతంలో ఓ మహళకు సవతి కూతురు ఎనిమిదేళ్ల ఆంచల్ కుమారి ఉంది. ఆమె తండ్రి ఢిల్లీలో ఉంటున్నారు. మహిల సవతి కూతురుతోపాటు భోజ్పూర్లో ఉంటోంది. కూతురిని గొంతు నులిమి చంపింది. ఆ తరువాత మృతదేహానికి నిప్పంటించింది. కాలిపోయిన మృతదేహాన్ని గోనె సంచిలో నింపి చెక్కపెట్టెలో దాచి పెట్టింది. ఆంచల్ కనిపించకపోవడంతో ఇతర కుటుంబ సభ్యులు శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు బాలిక ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. చివరకు ఇంటిని తనిఖీ చేయగా.. గోనె సంచిలో పెట్టిన చెక్కపెట్టెలో దాచిన మృతదేహం బయటపడింది. నేరం చేసినట్లు సవతి తల్లి అంగీకరించింది. సంఘటనా స్థలం నుంచి సేకరించిన సాక్ష్యాల ఆధారంగా పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. ఈ దారుణానికి ఒడిగట్టడానికి గల కారణాలు మాత్రం ఆమె పోలీసులకు వెల్లడించలేదు. -
గుండ్రాంపల్లి అబ్బాయి.. ఇండోనేషియా అమ్మాయి
చిట్యాల (నల్గొండ): చిట్యాల మండలంలోని గుండ్రాంపల్లి గ్రామానికి చెందిన యువకుడు నాగరాజు ఇండోనేషియా అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. వీరి వివాహం శుక్రవారం గుండ్రాంపల్లి గ్రామంలో జరిగింది. సీమ సాలయ్య–యాదమ్మ ప్రథమ కుమారుడు నాగరాజు హైదరాబాద్లో ఓ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. నాగరాజు పనిచేస్తున్న కంపెనీలోనే ఇండోనేషియాలో రిజ్కి నన్డా సఫిట్రి అనే యువతి కూడా పనిచేస్తోంది. వీరిద్దరికి ఫోన్లో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. ఇరువురు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. పెద్దల అంగీకారంతో హిందూ సంప్రదాయ పద్ధతిలో వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుని రిజ్కి నన్డా సఫిట్రిని నాగరాజుకు ఇండియాకు పిలిపించాడు. నాగరాజు స్వగ్రామం గుండ్రాంపల్లిలో శుక్రవారం వేద మంత్రాల సాక్షిగా ఇద్దరూ ఒక్కటయ్యారు. ఈ వివాహానికి కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. -
బాలికపై టీడీపీ నేత లైంగిక వేధింపులు
సాక్షి టాస్క్ఫోర్స్: కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత టీడీపీ నాయకుల ఆగడాలు రోజురోజుకూ పెచ్చుమీపోతున్నాయి. తామేమి చేసినా చెల్లుబాటు అవుతుందనే అహంకారంతో ఇష్టారాజ్యంగా రెచ్చిపోతున్నారు. తాజాగా.. ‘పచ్చ’నేత ఒకరు ఓ బాలికను మానసికంగా, లైంగికంగా వేధించాడు. తీవ్ర మనోవేదనకు గురైన ఆమె హెచ్చెల్సీ కాలువలో దూకి ఆత్మహత్య చేసుకుందామని నిర్ణయించుకుంది. ఇంతలో తల్లిదండ్రులు అప్రమత్తమై తమ కుమార్తెను కాపాడుకున్నారు. ఈ ఘటన అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గ పరిధిలోని కణేకల్లు మండలం యర్రగుంట గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. యర్రగుంటలో నిరుపేద కుటుంబానికి చెందిన బాలిక స్థానిక జెడ్పీ హైస్కూల్లో ఎనిమిదో తరగతి చదువుతోంది. అదే గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు ముక్కన్న సదరు బాలికపై కన్నేశాడు. వివాహితుడైనప్పటికీ ఉచ్ఛనీచాలు మరిచి నాలుగు నెలలుగా ఆమెను వేధించసాగాడు.ఇంటి నుంచి కిలోమీటరు దూరంలోని స్కూల్కు నడుచుకుంటూ వెళ్తుండగా తరచూ బాలిక వెంటబడేవాడు. ‘ఇలాంటివన్నీ నాకు నచ్చవు. నా వెంట పడొద్దు’ అని ఆ బాలిక చాలాసార్లు చెప్పినా వినలేదు. ఈ క్రమంలోనే శుక్రవారం ఉదయం బాలిక స్కూల్కు వెళ్తుండగా.. ‘నా వెంట రావడానికి నీకెంత కావాలి? చెప్పు.. డబ్బులు పడేస్తా’ అంటూ నీచంగా మాట్లాడాడు. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన ఆ విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. స్కూల్కెళ్లకుండా హెచ్చెల్సీ కాలువ వైపు వెళ్లింది. ఇది గమనించిన స్థానికులు తల్లిదండ్రులకు సమాచారమిచ్చారు. వారు వెంటనే అప్రమత్తమై అక్కడికి చేరుకున్నారు. స్కూల్కెళ్లకుండా ఇక్కడికెందుకు వచ్చావని ఆరా తీయగా.. జరిగిందంతా చెప్పి బోరున విలపించింది. నాలుగు నెలల నుంచి అతను వేధిస్తున్నాడని, స్కూల్ ఎక్కడ మాన్పిస్తారోనన్న భయంతో చెప్పలేకపోయానని, ఇప్పుడతని మాటలతో చచ్చిపోదామనుకున్నానని కన్నీరు పెట్టుకుంది. దీంతో తల్లిదండ్రులు జెడ్పీ హైస్కూల్ సమీపంలో ఉన్న ముక్కన్నను పట్టుకుని చితకబాదారు. అనంతరం గ్రామస్తులు అతన్ని ఊళ్లోకి తీసుకొచ్చి చెట్టుకు కట్టేసి కొట్టి పోలీసులకు అప్పగించారు.కామాంధుడికి పోలీసుల వత్తాసు?మరోవైపు.. కామాంధుడు టీడీపీ నాయకుడు కావడంతో అతన్ని ఎలాగైనా కాపాడాలని పోలీసులు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. టీడీపీ ముఖ్య నాయకుల ఒత్తిళ్లతో నిందితుని నుంచి కూడా కౌంటర్ ఫిర్యాదు తీసుకుని అతనిని రక్షించాలని చూస్తున్నట్లు తెలిసింది. -
ఆడపిల్ల పుడుతుందని భార్యను పుట్టింటికి పంపిన భర్త
అత్తాపూర్: ఆడపిల్ల పుడుతుందని గర్భవతిగా ఉన్న భార్యను పుట్టింటికి పంపించిన ఘటన అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..హసన్నగర్కు చెందిన అక్బర్ఖాన్కు ఐదేళ్ల క్రితం హుమేరా బేగంతో వివాహం జరిగింది. మొదటి సంవత్సరం ఒక ఆడపిల్లకు జన్మనిచి్చనప్పుడే ఆడపిల్లను కన్నావంటూ ఆమెపై దాడి చేశారు. ఆ సమయంలో బాధితురాలు రెయిన్బజార్ పోలీస్స్టేషన్లో అక్బర్ఖాన్తో పాటు అత్తమామలపై ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం ఆమె గర్భం దాల్చడంతో ఆడపిల్ల పుడుతుందేమోనన్న భయంతో హుమేరా బేగంను ఇంటి నుంచి వెళ్లగొట్టారు. దీనిపై బాధితురాలు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నారు. -
ఆకతాయిల వేధింపులు.. వీడియో వైరల్
చెన్నై: తమిళనాడుకు చెందిన ఓ ప్రాంతంలో జనవరి 26న సాయంత్రం సమయంలో ఓ యువతి తన స్నేహితులతో కలిసి కారులో తన ఇంటికి వెళుతోంది. సరిగ్గా యువతి కారు ఈస్ట్ కోస్ట్ రోడ్డు ముట్టుకాడు ఫ్లైఓవర్ మీదగా వెళుతోంది. ఆ సమయంలో ఓ ఎస్యూవీలో ప్రయాణిస్తున్న ఆకతాయులు యువతి కారును వెంబడించారు. యువతిని, ఆమె స్నేహితుల్ని వేధించేందుకు ప్రయత్నించారు. దీంతో అప్రమత్తమైన బాధితురాలు తన కారును వెనక్కి తిప్పించేందుకు ప్రయత్నించింది. అదే సమయంలో ఆకతాయిలో మరో కారును అడ్డుగా యువతి కారుకు అడ్డుగా పెట్టారు. ఈ ఘటన జరిగే సమయంలో కారులో ప్రయాణిస్తున్న యువతి స్నేహితురాలు వీడియో తీసింది. ఆ వీడియోలో సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఆకతాయిల నుంచి తప్పించుకొని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. వీడియోల్ని సైతం అందించింది. ఆకతాయిలు ప్రయాణిస్తున్న ఎస్యూవీ వాహనంపై అధికార డీఎంకే పార్టీ జెండా ఉండడం ఆగ్నికి ఆజ్యం పోసినట్లైంది. ఆ వీడియో క్లిప్లో డీఎంకే జెండా ఉన్న ఎస్యూవీ కారుకు మార్గానికి అడ్డుగా ఉండడం, ఓ వ్యక్తి యువతి వాహనం వైపు పరుగెత్తడం వంటి దృశ్యాల్ని మనం చూడొచ్చు. .Safety of women in TN has become a luxury many can’t afford . DMK flag is the icing on the cake . #ShameOnYouStalin pic.twitter.com/SYGC4aCMPp— karthik gopinath (@karthikgnath) January 29, 2025బాధితురాలు తన ఫిర్యాదులో.. తాను, తన స్నేహితులతో కలిసి కానత్తూరులోని తన ఇంటికి వెళుతుండగా రెండు కార్లు వెంబడించాయని, కార్లలో ఉన్న యువకులు తమతో వేధించేందుకు ప్రయత్నించడంతో పాటు గొడవపడ్డారని పేర్కొంది. ఇక ఘటన జరిగే సమయంలో తీసిన వీడియోపై ప్రతిపక్ష నేత పళనిస్వామి ప్రభుత్వంపై మండిపడ్డారు. డీఎంకే ప్రభుత్వ హయాంలో మహిళలు రాత్రిపూట తిరిగే హక్కును కోల్పోయారా? అని ప్రశ్నించారు. మహిళలపై నేరాలకు పాల్పడేందుకు అధికార పార్టీ జెండాకు లైసెన్స్ ఉందా? వెంటనే కేసు నమోదు చేయాలని కోరారు.మోటార్ సైకిళ్లతో సహా పెట్రోలింగ్ వాహనాల సంఖ్యను పెంచాలని, రాత్రి వేళల్లో గస్తీని పెంచాలని తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కె.అన్నామలై ప్రభుత్వాన్ని కోరారు. మరోవైపు, కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆకతాయిల్ని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. -
‘మమ్మీ బాయ్..’
ఫిలింనగర్: ‘మమ్మీ బాయ్..’ అంటూ తండ్రితో కలిసి ద్విచక్ర వాహనంపై స్కూలుకు బయలుదేరిన చిన్నారిని అక్రమంగా నగరంలోకి ప్రవేశించిన లారీ బలితీసుకుంది. తన కళ్లెదుటే కుమార్తె లారీ చక్రాల కిందపడి ఛిద్రం కావడాన్ని జీర్ణించుకోలేకపోయిన ఆ తండ్రి తల్లడిల్లిపోయాడు. ఈ హృదయవిదారకమైన ఘటన ఫిల్మ్నగర్ పోలీసుస్టేషన్ పరిధిలోని షేక్పేట ప్రధాన రహదారిలో మంగళవారం చోటు చేసుకుంది. షేక్పేట మై హోం రెయిన్ బో రెసిడెన్స్లో నివసించే గడ్డం హేమ సుందర్రెడ్డి కుమార్తె అథర్వి (10) మణికొండలోని ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్లో ఐదో తరగతి చదువుతోంది. ఎప్పటిలాగే మంగళవారం ఉదయం 8.00 గంటల సమయంలో హేమ సుందర్రెడ్డి తన కుమార్తెను స్కూల్లో దింపడానికి యాక్టీవా వాహనంపై బయలుదేరారు. వీరి వాహనం 8.10 గంటలకు షేక్పేటలోని ఆంజనేయస్వామి ఆలయం వద్దకు చేరుకుంది. అదే సమయంలో వెనుక వైపు నుంచి చక్కెర లోడ్తో వచి్చన లారీ హేమ సుందర్రెడ్డి నడుపుతున్న బైక్ను ఢీ కొట్టింది. ఈ ధాటికి తండ్రీకుమార్తె వాహనం పైనుంచి ఇద్దరు కిందపడ్డారు. అథర్వి లారీ వెళ్తున్న వైపు పడటంతో దాని వెనుక చక్రాలు ఆమె పైనుంచి వెళ్లాయి. దీంతో శరీరం ఛిద్రమై అక్కడికక్కడే చనిపోయింది. హేమ సుందర్రెడ్డికి ఎలాంటి గాయాలు కాలేదు. ఆ ప్రాంతంలోని రోడ్డంతా రక్తసిక్తమైంది. మరికొద్దిసేపట్లో కూతుర్ని స్కూల్ దగ్గర దింపాల్సి ఉండగా కళ్లెదుటే ఆమె రక్తపు మడుగులో పడి ఉండటాన్ని ఆయన జీరి్ణంచుకోలేకపోయారు. ఈ ప్రమాద విషయం తెలుసుకున్న అథర్వి కుటుంబీకులు ఘటనా స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు. ఫిల్మ్నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అనుమతి లేని వేళల్లో అక్రమంగా సిటీలోకి లారీతో ప్రవేశించి, చిన్నారి మృతికి కారణమైన లారీ డ్రైవర్ యాసిన్ ఖురేషిని అరెస్ట్ చేశారు. -
Mahakumbh 2025 : డస్కీ బ్యూటీ, ‘ఏంజలీనా జోలీ’ వైరల్ వీడియో
ప్రయాగ్రాజ్లో అత్యంత వైభవోపేతంగా సాగుతు మహాకుంభమేళా సాగుతోంది, పవిత్ర త్రివేణిసంగమానికి కోట్లదిమంది భక్తులు తరలివస్తున్నారు. భక్తజన సందోహం భక్తి పారవశ్యంతో ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను సంతరించు కుంటోంది. ఈ మేళాలో ఇప్పటికే దేశానికి చెందిన సాధువులతో పాటు, విదేశాలకుచెందిన సాధువులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. తాజాగా పూసల దండలు అమ్ముకునే అమ్మాయి ఇంటర్నెట్ను ఆకర్షిస్తోంది.ఇండోర్ నుండి మహాకుంభమేళాకు వచ్చిన యువతి నెట్టింట సంచలనంగా మారింది. ఆమె తేనె రంగు కళ్లతో డస్కీ బ్యూటీ వెలిగిపోతోంది. కోటేరు ముక్కు, చంద్రబింబం లాంటి మోము, తేజస్సుతో వెలిగిపోతున్న కళ్లు ‘మోనాలిసా’ ను తలపిస్తోంది. ఆమె ప్రశాంతమైన చిరునవ్వుతో, పొడవాటి, సిల్కీ, జడ జుట్టు అద్బుతమైన ఆమె సౌందర్యానికి మరింత వన్నెతీసుకొచ్చింది.దీంతో మేళాకు హాజరయ్యే ఫోటోగ్రాఫర్లు, వ్లాగర్లు, ఆమెతో సెల్ఫీలు , వీడియోల కోసం ఎగబడుతున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెటిజన్లను మంత్ర ముగ్దుల్ని చేస్తున్నాయి. సోషల్ మీడియాలో ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘మోనాలిసా ఆఫ్ మహాకుంభ్’, ‘ఏంజలీనా జోలీ’, ‘‘ఎంత అందమైన కళ్లు’’, ‘చాలా అందంగా ఉంది’ అంటూ వ్యాఖ్యానించారు. మరోవైపు ‘‘ఎందుకలా ఆమె వెంటపడుతున్నారు.. సిగ్గుచేటు" అంటూ మరికొంతమంది కమెంట్ చేశారు. (Maha Kumbh Mela 2025: ‘కండల బాబా’ స్పెషల్ ఎట్రాక్షన్, ఎవరీ బాహుబలి)కాగా ఈ ఏడాది మహాకుంభమేళాలో ఐఐటీ బాబా, విదేశీ బాబా,అందమైన సాధ్వి, కండల బాబా ఇలా చాలామంది విశేషంగా నిలుస్తున్నారు. ఏరోస్పేస్ ఇంజనీర్, ఐఐటీ బాంబే పూర్వ విద్యార్థి హర్యానాకు చెందిన అభయ్ సింగ్ సన్యాసి జీవితాన్ని స్వీకరించారు. అలాగే రష్యాకు చెందిన బాబా కండలు దీరిన దేహంతో మహాకుంభమేళాలో ఆకట్టుకున్నసంగతి తెలిసిందే.एक गरीब लड़की इंदौर(MP) से महाकुंभ आती है, मालाएं बेचती है और दिन के 2 से ढाई हजार कमा लेती है।ये मेले हमारी सांस्कृतिक पहचान ही नहीं बल्कि आर्थिक समृद्धि के भी प्रतीक हैं। pic.twitter.com/BGhwuFbm0D— 𝙼𝚛 𝚃𝚢𝚊𝚐𝚒 (@mktyaggi) January 17, 2025 పన్నెండేళ్లకు ఒకసారి జరిగే కుంభమేళా ఈ ఏడాది జనవరి 13 సోమవారం ప్రారంభమై ఫిబ్రవరి 26 వరకు జరగనుంది. మొత్తం 45 రోజులపాటు సాగే ఈ ఆధ్యాత్మిక వేడుకలో పవిత్రమైన త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు కోట్లాదిమంది తరలి వస్తున్నారు. इनसे मिलिए ये हैं महाकुंभ मेला में माला बेचने वाली वायरल गर्ल मोनालिसा.. इनकी आंखे बहुत सुंदर है.. इसको कहते हैं किस्मत बदलते देर नहीं लगती.. #महाकुम्भ_अमृत_स्नान #महाकुंभ2025 #MahaKumbhMela2025 pic.twitter.com/Et87nnpRql— 🌿🕊️RACHNA MEENA 🌿❤️ (@RACHNAMEENA34) January 18, 2025 -
మాయదారి గుండెపోటు : చిన్నారి ‘గుండెల్ని’ పిండేస్తున్న వీడియో
చిన్నారుల నుంచి పెద్దల దాకా గుండెపోటుతో సంభవిస్తున్న హఠాన్మరణాలు ఆందోళన రేపుతున్నాయి. ముఖ్యంగా ఇటీవలి కారణంలో చిన్నారుల గుండె సంబంధిత సమస్యలతో మరణిస్తుండటం కలచివేస్తోంది. తాజాగా మరో విషాద ఘటన చోటు చేసుకుంది. ఈసారి 8 ఏళ్ల బాలిక (School Girl) ప్రాణాలు కోల్పోవడం దిగ్భ్రాంతికి గురి చేసింది. గుజరాత్లోని అహ్మదాబాద్లోని (Ahmedabad) థల్తేజ్ ప్రాంతంలో శుక్రవారం ఈ విషాదం చోటు చేసుకుంది. ఈ దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో నమోదయ్యాయి.అహ్మదాబాద్లోని గార్గి రాణపరా(Gargi Ranapara) జేబార్ స్కూల్ ఫర్ చిల్డ్రన్లో గార్గి మూడో తరగతి చదువుతోంది. పాఠశాలకు వచ్చిన కొద్దిసేపటికే ఛాతీ నొప్పికి గురైంది. క్లాస్ రూమ్ వైపు నడుచుకుంటూ వెళ్తుండగా నొప్పి రావడంతో కాసేపు అక్కడే నిలబడింది. నొప్పితో బాధపడుతూనే అక్కడే ఉన్న కుర్చీలో కూర్చుంది. అంతే కొన్ని క్షణాల్లోనే కుప్పకూలిపోయింది. ఇది గమనించిన టీచర్లు ఆమెకు సపర్యలు చేశారు. బాలికను కాపాడేందుకు టీచర్లు సీపీఆర్ చేశారు. అయినా బాలికలో ఎలాంటి చలనం లేదు. వెంటనే దగ్గరలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించే సమయానికే బాలిక పరిస్థితి విషమించింది. వైద్యులు ఆమెను బతికించేందుకు తీవ్రంగా శ్రమించారు. వెంటిలేటర్పై ఉంచి చికిత్స అందించినా ఫలితం లేకపోయింది. గార్గి గుండెపోటుతో మరణించిందని వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను పాఠశాల ప్రిన్సిపల్ శర్మిష్ఠ సిన్హా వెల్లడించారు.గార్గి పాఠశాల ఆవరణలో కొంచెం అనారోగ్యంగా కనిపించిందని, కొద్దిసేపు కూర్చున్న వెంటనే కుప్పకూలిపోయిందని చెప్పారు. వెంటనే అప్రమత్తమైన టీచర్లు, విద్యార్థులు వెంటనే ఆమెకు సహాయం చేయడానికి ప్రయత్నించినా, ఆమెనుకాపాడలేకపోయామని విచారం వ్యక్తం చేశారు.మరోవైపు దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బాలిక గుండెపోటుకు గల కారణాలలపై అన్ని కోణల్లో దర్యాప్తు చేస్తున్నామని జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ నీరజ్ బడ్గుజర్ ప్రకటించారు.🚨HEART BREAKING A 8 year old girl , all of a sudden fell down and died in school. Video from Krnavati (Ahmedabad) , Gujarat.What is happening to kids and youngsters ?? Almost every week we see or hear such cases . Instead of blaming Covid vaccines , we need to get into the… pic.twitter.com/R66mcrOIK9— Amitabh Chaudhary (@MithilaWaala) January 10, 2025 > కాగా ముంబైకి చెందిన గార్గి, తన బంధువుల ఇంటిలో ఉంటూ అహ్మదాబాద్లో చదువుకుంటోంది. గతంలో పెద్దగా ఆరోగ్య సమస్యలు లేవని సమాచారం. ఇటీవల బెంగళూరులో కూడా ఇలాంటి సంఘటనే చోటు చేసుకుంది. ఎనిమిదేళ్ల బాలిక తేజస్విని పాఠశాల కారిడార్లో గుండెపోటుతో కుప్పకూలి ప్రాణాలు విడిచిన సంగతి తెలిసిందే.గుండెపోటు లక్షణాలుఛాతీ నొప్పి,ఊపిరి ఆడకపోవడంవికారం, చెమటలు పట్టడం చేతులు, వీపు లేదా దవడలో నొప్పి వంటివి సాధారణ లక్షణాలునోట్: గుండెలోని రక్త నాళాల్లో రక్త ప్రసరణకు అడ్డంకులు ఏర్పడటం, రక్తనాళాలు పూడుకుపోవడం, రక్తాన్ని గుండె సరిగా సరఫరా చేయలేకపోవడం తదితర కారణాల వల్ల గుండె పోటు వచ్చే అవకాశముందని వైద్యులు చెబుతున్నారు. అయితే, గుండె పోటు వెనుక చాలా కారణాలు ఉండొచ్చు. అందుకే ఏ చిన్న అనారోగ్యం వచ్చినా నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలి. మరీ ముఖ్యంగా జిమ్ చేస్తున్నాం కదా, ఆరోగ్యంగానే ఉన్నాం కదా అని అస్సలు అనుకోకూడదు. ఇటీవలి కేసులను దృష్టిలో ఉంచుకుని చిన్నపిల్లల్లో అయినా అనుమానిత లక్షణాలు కనిపిస్తే వైద్యులను సంప్రదించి కారణాలను రూల్ అవుట్ చేసుకోవడం చాలా అవసరం. -
ఎప్పటినుంచో ఐఏఎస్ కల..కానీ 13 ఏళ్లకే అనూహ్య నిర్ణయం
జీవితం ఎపుడు ఏ మలుపు తిరుగుతుందో ఎవరికీ తెలియదు. జీవితం పట్ల దృక్పథం మారి ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటాయి. దీన్నివిధి లిఖితం అంటారేమో. ఆగ్రాకు చెందిన 13 ఏళ్ల రాఖీ సింగ్ కథ వింటే ఎవరికైనా ఇలానే అనిపించకమానదు.ఆగ్రాకు చెందిన రాఖీ సింగ్ అనే బాలిక కేవలం 13 ఏళ్ల వయసులోనే ప్రాపంచిక ప్రపంచానికి దూరంగా బతకాలని నిర్ణయించుకుంది. దైవ మార్గంలో నడిచేందుకు సిద్ధమవుతోంది. అయితే ఈమె చిన్నప్పటినుంచీ ఐఏఎస్ అధికారి కావాలని కలలు కనేది. ప్రయాగ్రాజ్లోని మహాకుంభ్ శిబిరాన్ని ఆమె సందర్శించిన తరువాత ఆమె ఆలోచన మారిపోయింది. సాధ్విగా మారాలని నిశ్చయించుకుంది. ఆమె నిర్ణయానికి తల్లిదండ్రులు కూడా మద్దతుగా నిలిచారు. ఆమెను హృదయపూర్వకంగా సమర్థిస్తున్నామనీ, ఆశ్రమానికి తమ కుమార్తెను ఇష్టపూర్వకంగా ఇస్తున్నామని ప్రముఖ మహంత్ (మత నాయకుడు)తో తెలిపారు. ఈ కుంభమేళా తర్వాత మహంత్ కౌశల్ గిరి ఆశ్రమంలో భాగం అవుతుంది రాఖీ.ఎవరీ రాఖీ సింగ్ఆగ్రా జిల్లా దౌకి పట్టణానికి చెందిన వ్యాపారవేత్త సందీప్ సింగ్ ధాకార పెద్ద కుమార్తె రాఖీ. అఖారా సంప్రదాయం ప్రకారం ఆమె గౌరి అని పేరు పెట్టారు. జనవరి 19న 'పిండాన్' ఆచారాన్ని నిర్వహిస్తారు. ఆ తరువాత రాఖీ కుటుంబంలో ఇక భాగంగా ఉండదు. అఖారాలో సభ్యురాలిగా సాధ్విగా ఉంటుంది. ఆగ్రాలో నివసిస్తున్న ఆమె కుటుంబం, ప్రముఖ హిందూ సన్యాసులలో ఒకటైన జునా అఖారాకు చెందిన మహంత్ కౌశల్ గిరి మహారాజ్తో కనెక్ట్ అయినప్పుడు రాఖీ ప్రయాణం ప్రారంభమైంది.గత మూడేళ్లుగా,తమ గ్రామంలో మహంత్ కౌశల్ గిరి భగవత్ కథా సెషన్లు నిర్వహించారు. ఈ సమయంలో రాఖీ, ఆమె కుటుంబంతో సహా, అతని బోధనల ద్వారా తీవ్రంగా ప్రభావితమైంది. ఈ సెషన్లలో ఒకదానిలో రాఖీ తన గురు దీక్ష లేదా దీక్షను తీసుకుందట. అంతేకాదు ఆమె ఆధ్యాత్మిక మార్గానికి నాంది పలికింది ఆమె తల్లి రీమా సింగ్ . ఫలితంగా గౌరీ గిరిగా పిలువబడే రాఖీ పవిత్ర పరిత్యాగ ప్రక్రియ తరువాత కొత్త ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ప్రారంభించనుంది.కాగా 12 ఏళ్ల తర్వాత మహాకుంభ మేళా జనవరి 13 నుంచి మహా కుంభ మేళా జరగబోతోంది. ఈ మేళాకి ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్రాజ్లో భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ మహా కుంభ మేళా.. ఫిబ్రవరి 26 వరకూ జరుగుతుంది. దేశవ్యాప్తంగా వేర్వేరు అఖారాల నుంచి అఘోరాలు, స్వాములు, రుషులు వస్తూన్నారు. ముఖ్యంగా కొన్ని అఖారాలకు ప్రపంచవ్యాప్త గుర్తింపు ఉంది. అటల్ అఖారా, మహానిర్వాణి అఖారా, నిరంజని అఖారా, అశ్వాన్ అఖారా, జునా అఖారా ఇవన్నీ అలాంటివే. ఇవన్నీ మహా కుంభమేళాలో తమ క్యాంపులను ఏర్పాటు చేసుకున్న సంగతి తెలిసిందే. -
బాలిక ప్రాణం తీసిన సెంట్రింగ్ కట్టె
దొడ్డబళ్లాపురం: నిర్మాణదారుల నిర్లక్ష్యం తల్లిదండ్రుల కంటి దీపాన్ని బలిగొంది. పాఠశాల నుండి ఇంటికి తిరిగి వెళ్తున్న బాలిక తలపై సెంట్రింగ్కు వాడిన వెదురు కట్టె పడి చనిపోయిన బెంగళూరు వీవీ పురం పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. బాలిక తేజస్విని (15) రోజు మాదిరిగానే శనివారం సాయంత్రం ఇంటికి తిగిరి వెళ్తుండగా రోడ్డుపక్కన కొత్తగా నిర్మిస్తున్న కట్టడంపై నుండి సెంట్రింగ్ కట్టె తలమీద పడడంతో తీవ్రంగా గాయపడింది. ఆస్పత్రిలో చేర్పించగా సోమవారం మరణించింది. బాలిక తండ్రి సుధాకర్ రావ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వీవీ పురం పోలీసులు భవన ఇంజినీర్ను అరెస్టు చేసారు. కట్టడం యజమాని, అనుమతులు ఇచ్చిన బీబీఎంపీ అధికారులు, కాంట్రాక్టర్లపై కూడా కేసు నమోదు చేశారు. -
8వ తరగతి బాలికపై నలుగురు అత్యాచారం
కోనేరుసెంటర్(కృష్ణా జిల్లా) : రాష్ట్రంలో బాలికలపై లైంగిక దాడులకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. చిన్నారులు, వృద్ధులని కూడా చూడకుండా కామాంధులు చెలరేగిపోతున్నారు. తాజాగా మచిలీపట్నంలో శుక్రవారం రాత్రి ఎనిమిదో తరగతి విద్యార్థిపై నలుగురు యువకులు గ్యాంగ్ రేప్నకు పాల్పడిన ఘటనతో రాష్ట్రం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. పోలీసుల కథనం మేరకు వివరాలు.. కృష్ణా జిల్లా మచిలీపట్నం కాసానిగూడేనికి చెందిన బాలిక సమీపంలోని ఓ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతోంది. శుక్రవారం రాత్రి 7 గంటల సమయంలో బాలిక.. బయటకు వెళ్లిన తన తండ్రి వద్దకు వెళ్లి తిరిగి ఇంటికి వస్తుండగా రాజుపేటకు చెందిన తలాహ్, అతని స్నేహితుడు కలిసి బాలికను బెదిరించి బలవంతంగా బైక్పై ఎక్కించుకుని నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లారు. అప్పటికే అక్కడ మరో ఇద్దరు యువకులున్నారు. నలుగురు కలిసి బాలికను తీవ్రంగా హింసించి.. లైంగిక దాడికి పాల్పడ్డారు. బాలిక వారి నుంచి తప్పించుకుని పెద్దగా కేకలు వేయడంతో నలుగురు యువకులు అక్కడి నుంచి పారిపోయారు. తండ్రి వద్దకు వెళ్లిన బాలిక ఇంటికి రాకపోవటంతో కంగారుపడిన కుటుంబ సభ్యులు ఆమె కోసం గాలిస్తుండగా.. బాలిక ఏడుస్తూ వారికి ఎదురొచ్చింది. బాలిక తల్లి ఇనగుదురుపేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు నలుగురు యువకులపై పోక్సో కేసు నమోదు చేశారు. కాగా, పోలీసులు ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు జిల్లా ఎస్పీ గంగాధరరావు వెల్లడించారు. మైనర్పై పాస్టర్ లైంగిక దాడి కొండపల్లి(ఇబ్రహీంపట్నం) : బాలికపై పాస్టర్ లైంగిక దాడికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఎన్టీఆర్ జిల్లా కొండపల్లికి చెందిన బాలికకు తెలంగాణకు చెందిన పాస్టర్ వేముల కిరణ్ వరసకు మేనమామ అవుతాడు. కొండపల్లి వచ్చి ఇంట్లో ఎవరూ లేని సమయంలో పలుమార్లు కిరణ్ ఆ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఇటీవల కాలంలో బాలిక అనారోగ్యానికి గురవడంతో తల్లిదండ్రులు బాలికను ఆరాతీశారు. బాలిక అసలు విషయం చెప్పడంతో తల్లిదండ్రులు ఇబ్రహీంపట్నం పోలీస్స్టేషన్లో పాస్టర్పై ఫిర్యాదు చేశారు. పోలీసులు చికిత్స నిమిత్తం బాలికను విజయవాడ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాలిక అదృశ్యం గంగవరం: చిత్తూరు జిల్లా గంగవరం మండలం మల్లేరు గ్రామంలో కూలి పనులకు వెళ్లిన పెద్ద పంజాణి మండలం పెద్దారికుంట గ్రామానికి చెందిన ఓ బాలిక అదృశ్యమైన ఘటన శనివారం ఆలస్యంగా వెలుగు చూసింది. బాలిక తండ్రి తెలిపిన వివరాల మేరకు పెద్దపంజాణి మండలం పెద్దారికుంట గ్రామానికి చెందిన బాలిక (16) గతేడాది పదో తరగతితో చదువు నిలిపివేసింది. అప్పటి నుంచి తల్లితో కలిసి కూలి పనులకు వెళ్లేది. ఈ క్రమంలో గత గురువారం తల్లితో కలిసి ఇంటినుంచి గంగవరం మండలంలోని మల్లేరు వద్ద కూలి పనులకు వెళ్లింది. అలా పక్కకు వెళ్లొస్తానని తల్లితో చెప్పి వెళ్లిన బాలిక ఎంత సేపటికీ రాలేదు. ఆ విషయాన్ని బాలిక తల్లి తన భర్తతో చెప్పగా మల్లేరు గ్రామంలో విచారించారు. అయితే ఇదే గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు తమ కుమార్తెను ఎక్కడికో తీసుకెళ్లారని గ్రామస్తుల ద్వారా తెలుసుకున్నారు. దీంతో బాలిక తల్లిదండ్రులు పోలీస్స్టేషన్లో తమ కుమార్తె కిడ్నాప్నకు గురైందని ఫిర్యాదు చేశారు. దీనిపై మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
ఘోరం.. చిరుత దాడిలో నాలుగేళ్ల చిన్నారి మృతి
ముంబై : పూణే జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. చిరుత దాడిలో నాలుగేళ్ల చిన్నారి మృతి చెందింది. చిన్నారి మృతిని జిల్లా అటవీ శాఖ అధికారులు అధికారంగా ధ్రువీకరించారుపూణేలోని షిరూర్ తాలూకా పింపల్సుతి గ్రామానికి చెందిన రక్ష నిఖమ్ (4) ఇంట్లో ఆడుకుంటుంది. ఆ సమయంలో అకస్మాత్తుగా వచ్చిన చిరుత చిన్నారిని నోట కరుచుకుని స్థానిక చెరుకు తోటల్లోకి తీసుకెళ్లింది. చిరుత పులి రాకను గమనించిన తల్లి కాపాడండి అంటూ కేకలు వేసింది. సమాచారం అందుకున్న అటవీ శాఖ సిబ్బంది రక్ష కోసం గాలింపు చర్యలు చేపట్టారు.రెండు గంటల పాటు గాలింపు చర్యల అనంతరం చెరుకు తోటలో చిన్నారి జాడ దొరికింది. చిన్నారిపై చిరుత తీవ్రంగా దాడి చేసింది. ఈ దాడితో బాలిక తల,మొండెం వేర్వేరుగా కనిపించాయని అటవీశాఖ అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా జున్నార్ ఫారెస్ట్ డివిజన్ అధికారి మితా రాజ్హన్స్ మాట్లాడుతూ బాలికపై దాడి చేసిన చిరుతను పట్టుకోవడానికి ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్లు తెలిపారు. -
ఆమె నెగ్గింది.. అమ్మ గెలిచింది
‘మా అమ్మాయి దీక్ష అస్సాం సివిల్ సర్వీసెస్కు సెలెక్ట్ అయింది తెలుసా!’ అంటూ ఎంతోమందికి సంతోషంగా చెప్పుకుంటోంది బేబీ సర్కార్. దీక్ష పసిగుడ్డుగా ఉన్నప్పుడు బేబీ సర్కార్ను అత్త నిర్దాక్ష్యిణ్యంగా ఇంటి నుంచి వెళ్లగొట్టింది. అత్త దృష్టిలో బేబీ సర్కార్ చేసిన నేరం... ఆడపిల్లను కనడం!‘ఆడపిల్ల పుట్టింది’ అనే మాట చెవిన పడగానే ఆ అత్త అగ్గి మీద గుగ్గిలం అయ్యింది. కోడలు బేబీ సర్కార్ను తిట్టడం మొదలుపెట్టింది. ఆ అత్త నలుగురు కొడుకులకూ ఆడపిల్లలు జన్మించారు. ‘ఎవరైతే ఏమిటి!’ అనుకోలేదు ఆమె. చిన్న కొడుకుకు ఎలాగైనా మగబిడ్డ పుడుతుందని ఆశించింది. అంతేనా...‘నువ్వు కూడా ఆడపిల్లనే కంటే ఇంటి నుంచి గెంటేస్తాను’ అని కోడలిని హెచ్చరించింది. అయితే ఆమె కోరుకున్నట్లు జరగలేదు. బేబీ సర్కార్ కూడా ఆడబిడ్డకు జన్మనిచ్చింది. కోపం తట్టుకోలేని అత్త కోడలిని ఇంటి నుంచి గెంటేసింది. ఇంత జరిగినా....‘అలా మాట్లాడడం తప్పమ్మా...ఇలా చేయడం తప్పమ్మా’ అంటూ బేబీ సర్కార్ భర్త నుంచి చిన్న పదం కూడా బయటికి రాలేదు.‘‘నా భర్త మా అత్తను వ్యతిరేకించలేదు. ‘మా అమ్మ ఏం చెప్పిందో అదే చేసింది. అమె చేసినదాంట్లో తప్పేం ఉంది’ అన్నట్లుగా మాట్లాడేవాడు’’ అని భర్త గురించి చెప్పింది అస్సాంలోని శ్రీభూమి జిల్లాకు చెందిన బేబీ సర్కార్. అత్త ఇంటి నుంచి గెంటేయడంతో తల్లిదండ్రుల ఇంటికి వెళ్లింది. కొంత కాలం తరువాత భర్త చనిపోయాడు. ఆ తరువాత అత్త చనిపోయింది. మరోవైపు చూస్తే తల్లిదండ్రుల ఇంట్లో ఉండడం కష్టంగా అనిపించింది. వారికే పూటగడవడం కష్టంగా ఉంది. దీంతో కూతురు దీక్షతో కలిసి అక్క బీజోయ ఇంట్లో ఉండేది. బీజోయ ఎల్ఐసీలో ఉద్యోగం చేసేది.అక్క డిప్రెషన్తో బాధ పడుతుండడంతో ఆమె కుటుంబాన్ని కూడా తానే చూసుకునేది. దీక్ష పదవతరగతి పూర్తి చేసేవరకు అక్క ఇంట్లోనే ఉంది. ఆ తరువాత తల్లీకూతుళ్లు ఒక అద్దె ఇంట్లోకి మారారు. కుమార్తె చదువు కోసం చిన్న చిన్న ఉద్యోగాలు చేయడం మొదలుపెట్టింది బేబీ సర్కార్. దీక్ష చదువు కోసం సర్కార్ అప్పు కూడా చేయాల్సి వచ్చేది. తల్లీకూతుళ్లు ఆచితూచి ఖర్చు చేస్తుండేవారు. ఒకవైపు సివిల్స్కు ప్రిపేర్ అవుతూనే మరోవైపు యూట్యూబ్ చానల్ మొదలుపెట్టింది దీక్ష. ఈ చానల్ ద్వారా వచ్చే ఆదాయం ఖర్చులకు ఉపయోగపడేది. అస్సాం సివిల్ సర్వీసెస్ పరీక్షలో దీక్ష విజయం సాధించడంతో తల్లీకూతుళ్ల కష్టాలకు తెరపడ్డట్లయింది.‘విజయాలు సాధించడం అనేది అబ్బాయిలకు మాత్రమే పరిమితం కాదని నా కుమార్తె విజయం నిరూపించింది’ అంటుంది బేబీ సర్కార్. ‘మా అమ్మ, పెద్దమ్మ కష్టాలు, త్యాగాల పునాదిపై సాధించిన విజయం ఇది. అమ్మ నా కోసం చాలా కష్టపడింది. ఎప్పుడూ నాతోనే ఉంటుంది. ఆమెకు ఎలాంటి కష్టాలు లేకుండా చూసుకుంటాను’ అంటుంది ట్రైనీ ఏసీఎస్ (అస్సాం సివిల్ సర్వీస్) ఆఫీసర్ అయిన దీక్ష. -
రేప్ చేసి, జననాంగంలో ఇనుప రాడ్ జొప్పించి...
వడోదర: గుజరాత్లో 11 ఏళ్ల బాలికపై ఒక 36 ఏళ్ల వలస కార్మికుడు దారుణ అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతేగాక జననాంగంలో ఇనుప కడ్డీ చొప్పించాడు! భరూచ్ జిల్లాలోని ఝగాడియా పారిశ్రామికవాడలో ఆదివారం జరిగిన ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలిక పరిస్థితి విషమంగా ఉంది. ఆమె కుటుంబం జార్ఖండ్ నుంచి వలసవచ్చింది. నిందితుడు విజయ్ పాశ్వాన్ బాలిక తండ్రితోపాటు పనిచేస్తున్నాడు. సమీప గుడిసెలో ఉంటూ బాలికను కిడ్నాప్చేసి ఘోరానికి పాల్పడ్డాడని పోలీసులు చెప్పారు. పొదల్లోకి తీసుకెళ్లి రేప్చేసి పారిపోయాడు. రక్తమోడుతూ బాలిక ఏడుస్తుండటంతో తల్లి చూసి ఆస్పత్రకి తరలించింది. నిందితుడిని సోమవారం అరెస్ట్ చేశారు. పోక్సో సెక్షన్ల కింది కేసు నమోదు చేశారు. బాలికను అతను గత నెలలోనూ రేప్ చేశాడని ప్రాథమిక విచారణలో తేలింది. -
బాలికపై సామూహిక లైంగిక దాడి
కొల్లూరు: ఓ బాలికను మభ్యపెట్టి సామూహిక లైంగిక దాడికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసుల కథనం మేరకు.. బాపట్ల జిల్లా కొల్లూరు మండలంలోని ఓ గ్రామానికి చెందిన 17 ఏళ్ల బాలిక కొల్లూరులోని ఓ దుస్తుల దుకాణంలో పని చేస్తుంది. గత నెల 26న రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో తన గ్రామానికి వెళ్లడానికి ఆటో కోసం వేచి ఉండగా, ఆవులవారిపాలెం శివారు క్రీస్తులంకకు చెందిన యువకుడు విప్పర్ల ప్రేమ్కుమార్ తన ద్విచక్ర వాహనంపై ఇంటి వద్ద దింపుతానని నమ్మించి ఎక్కించుకున్నాడు.కొల్లూరు కరకట్ట నుంచి దారి మళ్లించి దిగువున ఉన్న ఇటుక బట్టీల్లోకి తీసుకెళ్లి బెదిరించి లైంగికదాడికి పాల్పడ్డాడు. అంతేకాక తన స్నేహితులకు ఫోన్ చేసి పిలవడంతో బెజ్జం శ్యామ్కుమార్తో పాటు మరో యువకుడు అక్కడకు వచ్చారు. శ్యామ్కుమార్ బాలికను తన ద్విచక్ర వాహనంపై దింపుతానని మభ్యపెట్టి వేరే ఇటుక బట్టీలోకి తీసుకువెళ్లి అతను కూడా లైంగిక దాడికి పాల్పడ్డాడు. మరో యువకుడు వెంటనే వెళ్లిపోయాడు.అనంతరం బాలికను ఇటుక బట్టీలలోనే వదిలి వెళ్లడంతో రాత్రి సమయంలో కాలినడకన ఇంటికి చేరుకుంది. తల్లి లేని ఆ బాలిక జరిగిన అఘాయిత్యాన్ని తండ్రికి చెప్పుకునేందుకు భయపడింది. కొద్ది రోజులుగా బాలిక అనారోగ్యంతో ఉండడాన్ని గమనించిన తండ్రి తమ బంధువులకు చెప్పడంతో విషయం బయటపడింది. అనంతరం తండ్రి ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. బుధవారం రేపల్లె డీఎస్పీ ఎ. శ్రీనివాసరావు విచారణ చేపట్టారు. నిందితులు విప్పర్ల ప్రేమ్కుమార్, బెజ్జం శ్యామ్కుమార్ను అదుపులోకి తీసుకుని పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఘటన ప్రాంతాన్ని వేమూరు సీఐ రామాంజనేయులు, కొల్లూరు ఎస్ఐ జి. ఏడుకొండలు పరిశీలించారు. -
అలా ఎలా బ్రో..!
-
గాల్లో బాలిక ప్రాణాలు
లఖింపూర్ఖేరీ (యూపీ): ఆ 14 ఏళ్ల బాలిక జాతరకు వెళ్లింది. సరదాగా జెయింట్ వీల్ ఎక్కింది. అది కాస్తా పూర్తిగా పైకి వెళ్లాక 150 అడుగుల ఎత్తులో ఉండగా బాలిక ఉన్నట్టుండి అదుపు కోల్పోయింది. తన కేబిన్ నుంచి విసురుగా బయటికొచ్చింది. అయినా వీల్ ఆడకుండా తిరుగుతూనే ఉంది. దాంతో కిందనుంచి చూస్తున్న వాళ్లంతా హాహాకారాలు చేశారు. అంతటి విపత్కర పరిస్థితిలోనూ పాప చురుగ్గా స్పందించింది. క్యాబిన్ కిందివైపున్న మెటల్బార్ను గట్టిగా పట్టుకుంది. దాన్ని కరుచుకుని కదలకుండా ఉండిపోయింది. ఆపరేటర్లు హుటాహుటిన జెయింట్ వీల్ను ఆపేశారు. అది నెమ్మదిగా తిరుగుతుండగా బాలికను కిందకు వచ్చింది. వెంటనే తనను అందుకుని దించి కాపాడారు. 30 సెకన్లకు పైగా బాలిక మెటల్బార్ను పట్టుకుని గాల్లోనే వేలాడింది. ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేరీ సమీపంలో జరిగిన ఈ ఘటన తాలూకు వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. భద్రతా ప్రమాణాలు పాటించలేదంటూ అధికారులు జెయింట్ వీల్ను సీల్ చేశారు. -
వెరీగుడ్
-
రీలు చేసింది, క్షమాపణ చెప్పింది
-
బాలికపై సవతి తండ్రి లైంగికదాడి
అజిత్సింగ్నగర్ (విజయవాడసెంట్రల్): పదోతరగతి చదువుతున్న ఓ బాలికపై కన్నేసిన సవతి తండ్రి పలుమార్లు లైంగికదాడికి పాల్పడడంతో.. ఆ బాలిక రెండు వారాల క్రితం ఓ ఆడ శిశువుకు జన్మనిచ్చిన అమానవీయ ఘటన ఎన్టీఆర్ జిల్లా, విజయవాడలోని అజిత్సింగ్నగర్లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం మేరకు.. నగరంలోని 59వ డివిజన్ లూనాసెంటర్కు చెందిన మహిళ తన భర్తతో విభేదాలు రావడంతో పన్నెండేళ్ల కిత్రం అతనితో విడిపోయి కుమార్తెతో కలిసి విడిగా నివసిస్తోంది. అదే ప్రాంతానికి చెందిన అనంత శంకర్దాస్ ఆమెను పెళ్లి చేసుకున్నాడు. అప్పటి నుంచి మహిళ, ఆమె కుమార్తె, శంకర్దాస్ కలిసి నివసిస్తున్నారు. శంకర్దాస్ పెయింటింగ్ పనులు చేస్తుండగా.. ఆ మహిళ హౌస్కీపింగ్ పనులకు వెళ్తోంది. ప్రస్తుతం బాలిక (16) సింగ్నగర్లోని ఓ పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. బాలిక తల్లి హౌస్కీపింగ్ పనులకు ఇతర ఊర్లకు వెళ్లి అక్కడే పది, పదిహేను రోజులుండేది. నాలుగు నెలల క్రితం బాలిక తనకు కడుపులో బాగా నొప్పి వస్తోందని, వాంతులవుతున్నాయని తల్లికి చెప్పింది. దీంతో ఆమె బాలికకు వైద్య పరీక్షలు చేయించగా ఆమె గర్భవతి అని వైద్యులు ధృవీకరించారు. ప్రస్తుతం ఆరో నెల వచ్చిందని చెప్పడంతో ఆమె తన కుమార్తెను అప్పటి నుంచి స్కూల్కు పంపకుండా ఖమ్మంలోని తన బంధువుల ఇంటివద్దే ఉంచి వైద్య పరీక్షలు చేయిస్తోంది. బాలికను నిలదీయగా అమ్మా.. నువ్వు ఊరు వెళ్లినప్పుడల్లా శంకర్ దాస్ తనను బెదిరించి లైంగికదాడికి పాల్పడేవాడని చెప్పింది. దీంతో శంకర్దాస్ను నిలదీయగా అతడు అప్పటి నుంచి పరారీలో ఉన్నాడు. నవంబర్ 18న బాలిక ఆడ శిశువుకు జన్మనివ్వడంతో విషయం వెలుగులోకి వచ్చింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న శంకర్దాస్ కోసం గాలిస్తున్నారు. -
బాలికపై ఇంటర్ విద్యార్థి లైంగిక దాడి
తిరుపతి క్రైమ్: ఎనిమిదేళ్ల బాలికపై ఇంటర్ విద్యార్థి లైంగిక దాడికి పాల్పడిన ఘటన తిరుపతిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తిరుపతిలోని ఎంఆర్పల్లికి చెందిన ఇంటర్ విద్యార్థి బాలాజీ నగర్లోని కాలేజీలో చదువుకుంటూ అక్కడికి దగ్గర్లో ఉన్న అమ్మమ్మ ఇంట్లో ఉండేవాడు. వీరి ఇంటికి సమీపంలోనే బాలిక కుటుంబం నివసిస్తోంది. పదో తరగతి చదువుతున్న బాలిక అన్నతో సన్నిహితంగా ఉంటూ వారింటికి వచ్చిపోతూ ఉండేవాడు. పది రోజుల కిందట బాలికకు చాక్లెట్లు కొనిస్తానని చెప్పి అమ్మమ్మ ఇంటికి తీసుకువెళ్లాడు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో బాలిక నోట్లో గుడ్డలు కుక్కి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. విషయం ఎవరికైనా చెబితే మీ అమ్మానాన్నల్ని చంపేస్తానని బెదిరించడంతో బాలిక ఎవరికీ చెప్పలేదు. అలా బెదిరిస్తూ నాలుగుసార్లు బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఇటీవల బాలికకు జ్వరం, కడుపునొప్పి రావడంతో తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. లైంగికదాడి జరిగినట్లు వైద్యులు గుర్తించడంతో తల్లిదండ్రులు బాలికను ప్రశ్నించగా విషయం చెప్పింది.దీంతో తల్లిదండ్రులు ఎస్వీ యూనివర్సిటీ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడిని అరెస్టు చేసి పోక్సో కేసు నమోదుచేశారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా నగరంలో నివసించే రిటైర్డ్ డీఎస్పీ ఇంట్లో నిందితుడి అమ్మమ్మ పనిచేస్తుండటంతో అతను పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చి మధ్యవర్తిత్వం చేయడానికి ప్రయత్నించారు. బాలిక బంధువులు, కుటుంబీకులు దాడిచేసేందుకు ప్రయత్నించడంతో అక్కడి నుంచి వెనుదిరిగారు. -
AP: బాలికపై గ్యాంగ్ రేప్
సాక్షి టాస్క్ఫోర్స్: వైఎస్సార్ జిల్లా కమలాపురం నియోజకవర్గ పరిధిలో చింతకొమ్మదిన్నె మండలం సుగాలిబిడికి ప్రాంతానికి చెందిన ఓ మైనర్ బాలిక గ్యాంగ్ రేప్నకు గురైంది. బాలిక ఇంటికి సమీపంలో ఓ యువకుడితో ఒంటరిగా మాట్లాడుతుండగా నిందితుల్లో ఒకరు సెల్ఫోన్లో చిత్రీకరించాడు. ఆ వీడియో బాలికకు చూపి ఉదయ్కిరణ్, మరో ఇద్దరు మైనర్లు కలిసి బాలికను లొంగదీసుకుని అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన జరిగి దాదాపు నెల రోజులవుతోంది. నిందితులంతా కమలాపురం టీడీపీ ఎమ్మెల్యే అనుచరుల పిల్లలు కావడంతో ఈ దారుణం వెలుగులోకి రాకుండా తొక్కిపెట్టేశారు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఇంటికి వెళ్లి మొదట బేరసారాలు మొదలెట్టారు. ఆ తర్వాత వారిని భయపెట్టే యత్నం చేశారు. ఎట్టకేలకు గురువారం బాధితురాలి తండ్రి కడపలోని ‘దిశ’ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో కడప డీఎస్పీ వెంకటేశ్వర్లు, దిశ పోలీస్స్టేషన్ డీఎస్పీ రమాకాంత్లు సిబ్బందితో కలిసి విచారణ చేపట్టారు. వెంటనే నిందితులు ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. నిందితులపై చింతకొమ్మదిన్నె సీఐ శంకర్నాయక్ పొక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. నిందితులు పోలీసుల అదుపులో ఉన్నారని సమాచారం రావడంతో ఆఘమేఘాల మీద టీడీపీ నేతలు, కార్యకర్తలు పోలీసు అధికారులతో మాట్లాడేందుకు, నిందితుల తరఫున బాధితులతో రాజీ కుదిర్చేందుకు రోజంతా విఫలయత్నం చేశారు.మహిళపై హత్యాచారం» తల నుజ్జునుజ్జు » వైఎస్సార్ జిల్లా, కాశినాయన మండలంలో దారుణం » చెన్నవరం–పాపిరెడ్డిపల్లె మధ్య ఘటన » కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులుకాశినాయన (కలసపాడు): ఓ మహిళపై హత్యాచారం ఘటన వైఎస్సార్ జిల్లా, కాశినాయన మండలం, కత్తెరగండ్ల గ్రామ సమీపంలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. చాపాడు మండలం, ఖాదర్పల్లెకు చెందిన కరీమున్నీసా(32)–నజీర్ దంపతులు. కరీమున్నీసా ఎర్రచందనం వ్యవహారాల్లో సెటిల్మెంట్లు చేస్తుంటుంది. ఏపీతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ తిరుగుతూ ఉంటుంది. ఈ దంపతులకు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు. నజీర్ ఎర్రచందనం కేసులో జైలులో ఉన్నాడు. బుధవారం రాత్రి కరీమున్నీసా చెన్నవరం–పాపిరెడ్డిపల్లె మధ్య అనూహ్యంగా దారుణహత్యకు గురైంది. ఆమెను గుర్తు పట్టకుండా ఎవరో ముఖంపై బండరాళ్లతో దారుణంగా మోది హత్య చేశారు. మహిళ మృతదేహం ఉన్నట్లు మేకలకాపరులు గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు ఆమెపై సామూహిక లైంగికదాడి జరిగినట్టు గుర్తించారు. జిల్లా ఎస్పీ విద్యాసాగర్నాయుడు, మైదుకూరు డీఎస్పీ రాజేంద్రప్రసాద్, పోరుమామిళ్ల సీఐ శ్రీనివాసులు, కాశినాయన, పోరుమామిళ్ల ఎస్ఐలు హనుమంతు, కొండారెడ్డి, క్లూస్టీం అధికారులు గురువారం ఘటనా స్థలాన్ని పరిశీలించి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పోరుమామిళ్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు మాట్లాడుతూ కేసు దర్యాప్తు చేస్తున్నామని, నిందితులను త్వరలో పట్టుకుంటామని చెప్పారు. మహిళ తన స్వగ్రామం నుంచి ఫోన్ కాంటాక్ట్ ద్వారా ఘటనా స్థలానికి వచి్చనట్లు తెలిసిందని, ఈ దాషీ్టకాన్ని ఒకరు చేశారా లేక మరికొందరు కలిసి చేశారా అనేది విచారణలో తేలాల్సి ఉందని పేర్కొన్నారు. -
చిన్నారి ప్రాణాలు కాపాడిన వీధి కుక్కలు
భోపాల్: వీధి కుక్కలు చిన్నారుల ప్రాణాలను తీస్తున్నాయనే వార్తల మధ్య వీటికి భిన్నమైన వార్త వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని బెత్మాలో జరిగింది.కిడ్నాప్కు గురైన పదేళ్ల బాలికను వీధికుక్కలు కాపాడాయి. ఒక చిన్నారిని కిడ్నాప్ చేసేందుకు ఇద్దరు వ్యక్తులు బెత్మాలోని కాళీ బిలౌడ్ గ్రామానికి వచ్చారు. అయితే వీధి కుక్కలు ఆ చిన్నారిని రక్షించి, కిడ్నాపర్లు అక్కడి నుంచి పారిపోయేలా చేశాయి. ఘటన గురించి బాధిత బాలిక మేనమామ మాట్లాడుతూ తమ పదేళ్ల మేనకోడలు ఇంటిలో ఒంటరిగా ఉండగా, ఇద్దరు వ్యక్తులు ఇంట్లోకి చొరబడి ఆ చిన్నారిని ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించారన్నారు.అయితే దీనిని గమనించిన తమ వీధిలోని కుక్కలు ఆ ఇద్దరు వ్యక్తులపై దాడికి దిగాయన్నారు. దీంతో ఆ ఇద్దరు ఆగంతకులు అక్కడి నుంచి పారిపోయారన్నారు. అప్పడు ఆ చిన్నారి సమీపంలోని ఆలయంలోకి వెళ్లి దాక్కున్నదన్నారు. ఈ విషయమై స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. ఇది కూడా చదవండి: బతికుంటే కోర్టుకెళతా: సాధ్వి ప్రజ్ఞ -
ట్రంప్ మా నాన్న.. తెరపైకి పాక్ యువతి
ఇస్లామాబాద్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల్లో విజయం సాధించిన దరిమిలా పాకిస్తాన్ నుంచి ఓ ఆసక్తికర వార్త వైరల్గా మారింది. ఒక పాకిస్తానీ యువతి తాను ట్రంప్ కుమార్తెనంటూ మీడియాకు తెలిపింది. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది.ఆ వీడియోలో ఆ యువతి తాను ముస్లింనని చెబుతూ, తానే డొనాల్డ్ ట్రంప్ నిజమైన కుమార్తెనని పేర్కొంది. అయితే ఈ వీడియో ప్రామాణికతో పాటు ఆ యువతి మానసిక స్థితి గురించి ఇప్పటివరకు ఎటువంటి సమాచారం వెలుగులోకి రాలేదు. కాగా మీడియాతో మాట్లాడిన ఆ యువతి ఇంగ్లీషువాళ్లు ఇక్కడికి వచ్చినప్పుడు తనను చూసి ఆశ్చర్యపోతుంటారని తెలిపింది. తన కూతురిని బాగా చూసుకోలేకపోతున్నానని ట్రంప్ తన తల్లితో ఎప్పుడూ అంటుంటారని ఆమె పేర్కొంది. ఈ వీడియోను సోషల్ మీడియా ప్లాట్ఫారం ‘ఎక్స్’లో @pakistan_untold ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ వీడియోకు ఇప్పటివరకు 75 వేలకు పైగా వీక్షణలు దక్కాయి. కాగా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కమలా హారిస్ను ఓడించి, డొనాల్డ్ ట్రంప్ తిరిగి అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. Does @realDonaldTrump know he has children in Pakistan who speak Urdu & English in Punjabi? pic.twitter.com/anhRKbiLGo— Pakistan Untold (@pakistan_untold) November 6, 2024ఇది కూడా చదవండి: ‘డాన్ తిరిగొచ్చాడు’.. ప్రపంచ వార్తా పత్రికల్లో.. -
యువతిపై ప్రేమోన్మాది దాడి.. కత్తితో చేయి కోసి పరార్
సాక్షి,మెదక్జిల్లా: మెదక్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద దారుణం జరిగింది. సోమవారం(నవంబర్ 4) ఉదయం దివ్యవాణి అనే యువతిపై ప్రేమోన్మాది దాడి చేశాడు. కత్తితో చేయి కోసి పరారయ్యాడు. ఓపెన్ డిగ్రీ పరీక్షలకు కాలేజీకి వస్తుండగా ఘటన జరిగింది.యువతిపై దాడి చేసింది బెంగుళూరుకు చెందిన చేతన్ అనే యువకుడిగా గుర్తించారు. ప్రస్తుతం యువకుడు పరారీలో ఉన్నాడు.యువతిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్లోని ఆస్పత్రికి రిఫర్ చేసినట్లు సమాచారం. ఇదీ చదవండి: హాస్టల్లో ఉండడం ఇష్టం లేక ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య -
తిరుపతి: స్నాప్ చాట్లో పరిచయం.. బాలికపై లైంగిక దాడి
సాక్షి, తిరుపతి: నగరంలో దారుణం జరిగింది. ఓ ప్రైవేటు లాడ్జిలో బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డారు. తిరుపతిలోని ఓ విద్యాలయంలో 9వ తరగతి చదువుతున్న బాలికపై ఓ యువకుడు లైంగిక దాడి చేశాడు.చెన్నై ఓ హోటల్లో పని చేస్తున్న ఓ యువకుడు ఆన్లైన్ స్నాప్ షాట్ ద్వారా బాలిక పరిచయమైంది.బాలిక ప్రవర్తనను గమనించిన తల్లిదండ్రులు విషయం ఆరా తీయగా విషయం బయటపడింది. యువకుడిని పశ్చిమగోదావరి జిల్లా తాళ్లపూడి మండలం, మలకపల్లి గ్రామానికి చెందిన సతీష్ (22)గా గుర్తించారు. జరిగిన ఘటనపై బాలిక తల్లిదండ్రులు అలిపిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నిందితుడిపై ఫోక్సోకేసు నమోదు చేసిన పోలీసులు రిమాండ్కు తరలించారు. -
బాలిక హత్యకేసులో ఐటీ దంపతుల అరెస్టు
సేలం: బాలికను కొట్టి చంపి, సూట్ కేస్లో పెట్టి సేలం జిల్లా సంగగిరిలో పడవేసిన ఐటీ దంపతులను పోలీసులు మంగళవారం భువనేశ్వర్లో అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే.. సేలం జిల్లా సంగగిరి సమీపంలోని వైకుందం ప్రాంతంలో రోడ్డు పక్కన గత సెప్టెంబర్ 30వ తేదీ అనుమానాస్పదస్థితిలో ఒక సూట్కేసు కనిపించింది. సంగగిరి పోలీసులు తనిఖీ చేయగా అందులో 15 ఏళ్ల బాలిక మృతదేహం కనిపించింది. పోలీసులు పంచనామా నిర్వహించారు. సంగగిరి పోలీసులు కేసు నమోదు చేసి టోల్ గేట్ మార్గంలో వెళ్లిన కార్లను తనిఖీ చేశారు. అప్పుడు బెంగళూరులోని ఐటీ సంస్థలో పని చేస్తున్న దంపతులకు చెందిన కారుపై వారికి అనుమానం కలిగింది. ఆ కారు నంబర్ ఆధారంగా విచారణ జరిపారు. అందులో ఆ కారు ఒడిశా రాష్ట్రంలోని భువనేశ్వర్కు చెందిన అభినేష్ సాహు, అతని భార్య అశ్విన్పట్టిల్కు చెందినదని తెలిసింది. దీంతో పోలీసులు ఆ దిశగా విచారణ చేపట్టారు. ఆ కారు అభినేష్ సాహు, అశ్విన్పట్టిల్ దంపతులు బెంగళూరు ఐటీ సంస్థలో పని చేస్తున్నట్లు గుర్తించారు. వారికి ఐదేళ్ల కుమార్తె ఉండడంతో ఆ పాపను చూసు కోవడం పని మనిషి అవసరమైంది. దీంతో రాజస్థాన్ రాష్ట్రం, జైపూర్, ముండమన్ ప్రాంతానికి చెందిన సుమైనా (15) బాలిక ఒడిశాలో ఉన్న అనాథ ఆశ్రమంలో పెరుగుతూ వచ్చింది. ఆ ఆశ్రమాన్ని అభిషేక్ సాహు తండ్రి నడుపుతున్నారు. దీంతో సుమైనాను ఇంటి పని కోసం అభిషేక్ సాహు బెంగళూరుకు తీసుకువచ్చినట్టు తెలిసింది. ఆ బాలిక సరిగ్గా పని చేయలేదని, చిన్నారికి పెట్టే ఆహారం తింటున్నట్టు ఆరోపిస్తూ బాలికను వేధింపులకు గురిచేసినట్టు తెలిసింది. ఈ క్రమంలో ఒక రోజు వేడి నీళ్లు తీసుకురమ్మన్ని కోరగా, ఆ బాలిక వేడినీళ్లు ఇచ్చిన సమయంలో అశ్విన్పట్టిల్పై పడిందని, దీంతో తీవ్ర ఆవేశానికి గురై ఆ బాలికపై దాడి చేయడంతో ఆమె మృతి చెందినట్టు తెలిసింది. దీంతో ఆ బాలిక మృతదేహాన్ని సూట్ కేస్లో పెట్టి సేలం జిల్లా సంగగిరి ప్రాంతంలో వారు పడవేసి వెళ్లినట్టు తేలింది. దీంతో పోలీసులు అభినేష్ సాహును గత 26వ తేదీ అరెస్టు చేసిన పోలీసులు మంగళవారం అశ్విన్పట్టిల్ను అరెస్టు చేసినట్టు బుధవారం వెల్లడించారు. -
బాలికపై లైంగిక వేధింపులు.. మణిపూర్లో మళ్లీ ఉద్రిక్తత
చురాచంద్పూర్: మణిపూర్లో మరోమారు ఉద్రిక్తత నెలకొంది. చురాచంద్పూర్ జిల్లాలోని టుయుబాంగ్ సబ్ డివిజన్లో 11 ఏళ్ల బాలికపై లైంగిక వేధింపుల ఘటన చోటుచేసుకున్న దరిమిలా ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి.ఈ ఘటనకు నిరసనగా బుధవారం బంద్ నిర్వహించారు. పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉన్నందున, ఇండియన్ సివిల్ డిఫెన్స్ కోడ్ 2023లోని సెక్షన్ 163 ప్రకారం సబ్ డివిజన్లో నిషేధాజ్ఞలు విధించినట్లు అధికారులు తెలిపారు. దీని ప్రకారం ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది గుమిగూడడంపై నిషేధం విధించారు.కుకీ-జోమి గ్రామ వాలంటీర్లు పిలుపునిచ్చిన బంద్ కారణంగా మార్కెట్లు, దుకాణాలు, పాఠశాలలు మూతపడ్డాయని, ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడిందని అధికారులు తెలిపారు. ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు బంద్ చేపట్టారు. బంద్ మద్దతుదారులు ట్యూబాంగ్ మార్కెట్ వద్ద రోడ్డు మధ్యలో పాత టైర్లతో సహా వ్యర్థ పదార్థాల కుప్పను తగులబెట్టారు. బాలిక కుటుంబ సభ్యులు అక్టోబర్ 21న ఫిర్యాదు చేయడంతో, నిందితుడైన దుకాణం యజమానిని పోలీసులు అరెస్టు చేశారు. అతనిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బాలిక ఏవో వస్తువులు కొనుగోలు చేసేందుకు నిందితుని దుకాణానికి వెళ్లిన సందర్భంలో ఈ ఘటన చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న స్థానికులు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలిపారు. నిందితులు ఆ దుకాణ యజమాని ఇంట్లో ఆశ్రయం పొందారని స్థానికులు ఆరోపిస్తున్నారు.ఇది కూడా చదవండి: ఈ ఐదు నగరాల్లో.. మిన్నంటే దీపావళి సంబరాలు -
బాబూ నీ పాలన ఇలానే ఉంటే ఇక తిరుగుబాటే
-
పెళ్లి చేస్తారా? చస్తారా : 13ఏళ్ల బాలిక గలాటా
బషీరాబాద్: పదహారేళ్ల బాలిక తాను ప్రేమించిన యువకుడితో వివాహం చేయాలని తల్లితో గొడవకు దిగింది. ఇప్పుడే పెళ్లి ఏంటని తల్లి మందలించడంతో.. నేరుగా తాను ఇష్టపడ్డ యువకుడి ఇంటికి వెళ్లింది. వివరాలు ఇలా ఉన్నాయి.. బషీరాబాద్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక ఎనిమిదో తరగతి చదివి, ప్రస్తుతం టైలరింగ్ చేస్తోంది. ఇదే ఊరికి చెందిన ప్రశాంత్(21) అనే యువకుడితో ప్రేమలో పడింది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇదే విషయాన్ని సదరు బాలిక గత మంగళవారం తల్లి లక్ష్మికి తెలియజేసింది. దీంతో ‘తండ్రిలేని బిడ్డవు.. ఇంకా నీకు పెళ్లి వయసు రాలేదు.. కొంత కాలం ఆగు బిడ్డా’ అని సముదాయించింది. ఇది నచ్చని బాలిక తల్లితో వాగ్వాదానికి దిగింది. నువ్వు చేయకపోతే నేనే చేసుకుంటా అని చెప్పి ప్రశాంత్ ఇంటికి వెళ్లింది. ఈ ఘటనతో అబ్బాయి కుటుంబ సభ్యులు సైతం నిర్ఘాంతపోయారు. బాలిక తల్లి చైల్డ్లైన్ 1098కు కాల్ చేసి జరిగిన విషయం చెప్పింది. బుధవారం ఉధయం బషీరాబాద్ పోలీస్ స్టేషన్కు వెళ్లి తన కూతురు పెళ్లిని అడ్డుకోవాలని కోరింది. తన బిడ్డను మందలిస్తే ప్రశాంత్ తనను బెదిరించాడని ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై జిల్లా బాలల హక్కుల పరిరక్షణ విభాగం లీగల్ అధికారి నరేష్, ఎస్ఐ గఫార్ సిబ్బందితో యువకుడి ఇంటికి వెళ్లి విచారణ జరిపారు. అనంతరం పోలీసులు ప్రశాంత్ను పీఎస్కు తీసుకెళ్లి కౌన్సెలింగ్ ఇచ్చారు. బాల్య వివాహం చెల్లదని, చట్టప్రకారం శిక్షార్హులవుతారని హెచ్చరించారు. పద్దెనిమిదేళ్లు ఏళ్లు నిండిన తర్వాత అదే యువకుడితో పెళ్లి చేస్తామని బాలికకు భరోసా ఇచ్చారు. అప్పటి వరకు చదువుకోవాలని వికారాబాద్లోని సఖి కేంద్రానికి తరలించారు. -
బాధిత బాలికకు న్యాయం జరిగేనా?
పిఠాపురం/సాక్షి, అమరావతి: పిఠాపురంలో సంచలనం రేపిన బాలిక అత్యాచార ఉదంతంలో కూటమి నేతలు తమ పార్టీ నేతను కాపాడే ప్రయత్నం చేస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అత్యాచారానికి పాల్పడినట్లు కేసు నమోదైన పిఠాపురానికి చెందిన టీడీపీ నేత, ఆ పార్టీ పిఠాపురం పట్టణ అధ్యక్షురాలు దుర్గాడ విజయలక్ష్మి భర్త డి.జాన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే వర్మ మంగళవారం ప్రకటించారు. నైతిక బాధ్యత వహించాల్సిన నిందితుడి భార్యపై మాత్రం పార్టీ తరఫున ఏ చర్యలూ తీసుకోకుండా ఆమెకు అండగా ఉంటామన్నట్లు వ్యవహరించడంపై పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇది కేవలం కంటితుడుపు చర్య మాత్రమేనని, జనాలను నమ్మించడానికి వేసిన ఎత్తుగడగా పలువురు పేర్కొంటున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్కళ్యాణ్ తన సొంత నియోజకవర్గంలో తమ కూటమిలో పార్టీకి చెందిన నేత అరాచకానికి పాల్పడితే బాధితురాలికి న్యాయం చేస్తాం అంటూ ఒక ప్రకటన ఇచ్చి చేతులు దులుపేసుకున్నారు. తన ప్రకటనలో ఎక్కడా టీడీపీకి చెందిన నేతగా పేర్కొనకపోగా చట్టం తనపని తాను చేసుకుపోతుంది అన్న ధోరణిలో అధికారులను ఆదేశించాం అంటూ పేర్కొనడంపై ప్రజాసంఘాలు మండిపడుతున్నాయి. నిందితుడిని పట్టుకున్నాం: ఎస్పీ విక్రాంత్ పాటిల్ పిఠాపురంలో ఒక బాలికపై టీడీపీ నేత అత్యాచారం చేసిన కేసులో నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. ఆయన మంగళవారం పిఠాపురం పట్టణ పోలీసు స్టేషన్ను పరిశీలించారు. ఎస్పీ మాట్లాడుతూ బాలికపై అత్యాచారం చేసిన నిందితుడు తమ అదుపులో ఉన్నట్లు చెప్పారు.ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదు: పవన్ కళ్యాణ్పిఠాపురం పట్టణానికి చెందిన మైనర్ బాలికపై మాధవపురం చెత్త డంపింగ్ వద్ద అఘాయిత్యం జరిగిందని తెలిసి చాలా బాధ కలిగిందని ఉప ముఖ్యమంత్రి పవన్కళ్యాణ్ పేర్కొన్నారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ ఘటన గురించి తెలిసిన వెంటనే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలికను పరామర్శించి మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని మంగళవారం ప్రకటన విడుదల చేశారు. -
పిఠాపురంలో బాలికపై టీడీపీ నేత అత్యాచారం
పిఠాపురం: కాకినాడ జిల్లా పిఠాపురంలో 16 ఏళ్ల బాలికపై తెలుగుదేశం పార్టీ నాయకుడు సోమవారం అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలికను ఆటోలో ఊరి శివారుకు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. బాలిక బంధువు ఫిర్యాదుపై పిఠాపురం పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. పిఠాపురానికి చెందిన దుర్గాడ జాన్ టీడీపీ నేత. ఆయన భార్య దుర్గాడ విజయలక్ష్మి మాజీ కౌన్సిలర్, ప్రస్తుతం టీడీపీ పట్టణ అధ్యక్షురాలు.ఆటో డ్రైవర్ జాన్ మరో మహిళతో కలిసి సోమవారం సాయంత్రం పట్టణంలోని స్టేట్ బ్యాంకు వద్ద ఉన్న ఓ బాలికను మాయమాటలు చెప్పి ఆటో ఎక్కించుకున్నారు. పిఠాపురం శివారు మాధవపురం సమీపంలోని డంపింగ్ యార్డు వద్దకు తీసుకెళ్లి అక్కడ మహిళను కాపలాగా పెట్టి, బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు.బాలిక అపస్మారక స్థితికి చేరుకోవడంతో ఆమెను తిరిగి ఆటోలో ఎక్కిస్తుండగా డంపింగ్ యార్డులో ప్లాస్టిక్ బాటిళ్లు ఏరుకునే వారు జాన్ను, మహిళను పట్టుకున్నారు. వారిని పోలీసులకు అప్పగించారు. పోలీసులు బాధితురాలిని పిఠాపురం ప్రభుత్వాస్పత్రిలో చేర్చారు. జాన్ను కేసు నుంచి తప్పించాలంటూ టీడీపీ నేతలు పోలీసులపై ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. అయితే బాధితురాలి బంధువులు ఆందోళనకు సిద్ధపడడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. -
కాగితాలకు ఉన్న విలువ ప్రాణాలకు లేదా?
సాక్షి, అమరావతి / పుంగనూరు: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబబునాయుడు కాగితాలకు ఇచ్చిన విలువ రాష్ట్రంలో ప్రజల భద్రతపట్ల.. మరీ ముఖ్యంగా మహిళలు, బాలికల రక్షణకు ఇవ్వడంలేదనడానికి పుంగనూరులో ఏడేళ్ల ముస్లిం బాలిక హత్యోదంతం మరో నిదర్శనం. అగ్నిప్రమాదంలో నాలుగు ఫైళ్లు తగలబడితే తీవ్రంగా స్పంచించిన చంద్రబాబు.. రాష్ట్రంలో బాలికలు, మహిళలను అపహరించుకుని పోయి అత్యాచారాలు చేస్తున్నా, హత్యలకు తెగబడుతున్నా పట్టించుకోవడంలేదు. సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారిక హోదాతో కూడిన బాధ్యతతోనే కాదు.. కనీసం మానవతా దృక్పథంతో కూడా స్పందించకపోవడంపట్ల సర్వత్రా ఆగ్రహం వెల్లువెత్తుతోంది. రాజకీయ కక్షలు, వేధింపులకు ఇస్తున్న ప్రాధాన్యం, ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు దు్రష్పచారాలకు కేటాయిస్తున్న సమయంలో పదో వంతు కూడా బాలికలు, మహిళల రక్షణకు ఉపయోగించడం లేదని చిత్తూరు జిల్లా పుంగనూరులో ముస్లిం బాలిక అశ్వియ అంజుమ్ విషాదాంతం రుజువు చేస్తోంది. రెండు నెలల క్రితం ముచ్చుమర్రిలో వాసంతి తప్పిపోయిందన్నా బాబు సర్కారు పట్టించుకోలేదు. చివరకు మృతదేహాన్ని కూడా అప్పచించలేక వాసంతి చనిపోయిందని ఓ మాట తల్లిదండ్రులకు చెప్పేసి ప్రభుత్వం తప్పించుకొంది. తమ కుమార్తె కనిపించడంలేదంటూ పుంగనూరుకు చెందిన ముస్లిం కుటుంబం మూడు రోజులు వేనోళ్ల వేడుకొన్నా బాబు ప్రభుత్వంలో కదలిక లేదు. మూడు రోజుల తర్వాత బాలిక మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పజెప్పి అయిందనిపించేసుకుంది. రాష్ట్రంలో ఇన్ని దారుణాలు జరుగుతున్నా సీఎం చంద్రబాబు కనీసం పట్టించుకోవడంలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీస స్పందన లేని చంద్రబాబు చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో ముస్లిం బాలిక అశ్వియ అంజుమ్ను అపహరించి హత్య చేసినా ఆయన కనీసం స్పందించకపోవడం ప్రజలను విస్మయానికి గురిచేస్తోంది. చిన్నారి విషాదాంతంపై ఆయన ఇప్పటి వరకు స్పందించనే లేదు. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ప్రమాదవశాత్తూ అగ్ని ప్రమాదం సంభవించి కొన్ని కాగితాలు కాలిపోతే చంద్రబాబు చేసిన రాద్ధాంతం అంతా ఇంతా కాదు. ఆ ఉదంతాన్ని రాజకీయ ప్రయోజనాలకు వాడుకునేందుకు వైఎస్సార్సీపీపై దు్రష్పచారం చేశారు. అంతేకాదు డీజీపీ ద్వారకా తిరుమల రావు, సీఐడీ అదనపు డీజీ రవిశంకర్ అయ్యన్నార్ను వెంటనే ప్రత్యేక హెలికాప్టర్లో మదనపల్లి పంపించారు. రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియానూ అక్కడికి పంపారు. ఎలాగైనా వైఎస్సార్సీపీ నేతలపై అక్రమ కేసులు బనాయించాలని ఒత్తిడి చేశారు. కానీ పుంగనూరులో ఏడేళ్ల బాలిక అంజుమ్ను ఆగంతకులు అపహరించుపోతే ముఖ్యమంత్రిగా కనీసం స్పందించలేదు. డీజీపీతో మాట్లాడలేదు. సత్వరం స్పందించి బాలికను సురక్షితంగా తీసుకురావాలని జిల్లా ఎస్పీకీ చెప్పలేదు. అసలు ఆ విషయాన్నే పట్టించుకోలేదని అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. తిరుపతిలోనే ఉన్నా.. స్పందించని పవన్ ఎన్నికలకు ముందు వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో 34 వేలమంది బాలికలను అపహరించారని దు్రష్పచారం చేసి, మహిళల రక్షణ పట్ల పెద్ద పెద్ద ఉపన్యాసాలిచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. గత మూడు నెలలుగా రాష్ట్రంలో యథేచ్ఛగా బాలికలు, మహిళల అపహరణ, అత్యాచారాలపై మౌనవత్రం పాటిస్తున్నారు. కళ్లెదుట జరుగుతున్న ఘోరాలపై స్పందించడమే లేదు. నంద్యాల జిల్లా ముచ్చిమర్రులో వాసంతి కిడ్నాప్, హత్య ఉదంతంపై పవన్ పోలీసు శాఖను ప్రశ్నించలేదు. చిత్తూరు జిల్లా పుంగనూరులో ముస్లిం బాలిక అంజుమ్ అపహరణ, హత్యకు బాధ్యత తీసుకోవడంలేదు. బుధ, గురువారాల్లో తిరుపతిలోనే ఉన్న ఆయన.. సమీపంలోని పుంగనూరులో జరిగిన దారుణాన్ని పట్టించుకోలేదని ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. చిన్నారి అంజుమ్ హత్యపై ముస్లింల ఆగ్రహం చిన్నారి అశ్వియ అంజుమ్(7) కిడ్నాప్, హత్యపై ముస్లింలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆరు రోజులు గడుస్తున్నా నిందితుల ఆచూకి కనుగొనలేకపోయారని మండిపడ్డారు. శుక్రవారం నమాజ్ అనంతరం అంజుమన్ కమిటీ ఆధ్వర్యంలో వేలాది ముస్లింలు నిరసన ప్రదర్శన నిర్వహించారు. జాతీయ పతాకాన్ని పట్టుకుని అశ్వియ ఫోటోలను ప్రదర్శిస్తూ ఎంబిటి రోడ్డులోని మదీన మసీదు నుంచి తూర్పు మొగసాల, సుబేదారు వీధి, పోస్టాఫీసు వీధి, నాగపాళెం, ఇందిరా సర్కిల్, పోలీస్స్టేషన్ మీదుగా గోకుల్ సర్కిల్ చేరుకున్నారు. అక్కడ సమావేశమై చిన్నారి హత్య కేసులో నిందితులను వెంటనే పట్టుకొని, ఉరితీయాలని డిమాండ్ చేశారు. చిన్నారి కుటుంబానికి రక్షణ కల్పించాలని కోరారు. ముస్లింల నినాదాలతో పట్టణం దద్దరిల్లింది. ముస్లింల ప్రదర్శనతో జాతీయ రహదారిపై ట్రాఫిక్ స్తంభించింది. -
Kolkata: విమానం ప్రయాణంలో విషాదం
ఇరాక్ నుంచి చైనా వెళ్తున్న విమానంలో విషాదం చోటు చేసుకుంది. ఓ టీనేజీ ప్రయాణికురాలు అస్వస్థతకు గురై సీటులోనే కుప్పకూలిపోగా.. విమానాన్ని కోల్కతాలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. అయితే.. ఆస్పత్రికి తరలించేలోపు ఆ బాలిక కన్నుమూసింది. ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రతినిధి వెల్లడించిన వివరాల ప్రకారం.. మృతురాలు బాగ్దాద్ సర్ చినార్ ప్రాంతానికి చెందిన డెరన్ సమీర్ అహ్మద్(16). మరో ఇద్దరు కుటుంబ సభ్యులతో కలిసి ఆమె ఏఐ 473 విమానంలో చైనా గువాంగ్జౌకు వెళ్తోంది. అయితే బుధవారం అర్ధరాత్రి దాటాక.. హఠాత్తుగా ఆమె అస్వస్థతకు గురైంది.దీంతో విమానాన్ని దారి మళ్లించి అరగంటకు కోల్కతా నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఎయిర్పోర్ట్లో దించారు. ఎయిర్పోర్ట్ నుంచి ఆమెను ఏఏఐ ఆంబులెన్స్లో హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె చనిపోయిందని వైద్యులు ప్రకటించారు. ఈ ఘటన తర్వాత గురువారం అర్ధరాత్రి మిగతా ప్రయాణికులతో విమానం తిరిగి బయల్దేరింది. ఈ ఘటనపై అసహజ మరణంగా కోల్కతా బాగౌతి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. పోస్టుమార్టం పూర్తి అయ్యాక.. మృతదేహాన్ని ఆమె బంధువులకు అప్పగిస్తామని అధికారులు తెలిపారు. -
నీడనిచ్చే చెట్టుకే తిట్లు
బొమ్మనహళ్లి: బెంగళూరులో కొంతమంది చిల్లర ప్రవర్తన ఆ వర్గాలకు చెందిన అందరికీ చెడ్డ పేరు తెచ్చేలా ఉంటోంది. పైగా వారు చదువుకుని ఉన్నత వర్గాలకు చెందినవారు కావడం గమనార్హం. ఇక్కడ ఉపాధి, ఉద్యోగాలు పొంది జీవితంలో ముందుకు సాగుతూ, పైగా రెచ్చగొట్టేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేవారి వల్ల సమాజంలో కలతలు వస్తున్నాయి. మేం వెళ్లిపోతే బెంగళూరు ఖాళీ అని.. ఉత్తర భారత ప్రాంతాలకు చెందిన తాము బెంగళూరుకు రాకపోతే బెంగళూరు మొత్తం ఖాళీ గా ఉంటుంది. ఇక్కడి నుంచి తాము వెళ్లిపోవాలని అంటూ ఉంటారు. మేం వెళ్లిపోతే ఇక్కడ ఏమీ ఉండదు. మీకు ఆదాయం రాదు. పీజీ హాస్టళ్లు, పబ్లు వెలవెలబోతాయి అని సుగంధ శర్మ అనే మహిళ రెచ్చగొట్టే పోస్టులు పెట్టింది. బెంగళూరుకు వలస వచ్చిన సుగంధ శర్మ.. బెంగళూరు గురించి, ఇక్కడి ప్రజల గురించి ఇన్స్టాలో చులకనగా వీడియోలు, రీల్స్ చేసింది, దానిని చూసిన కన్నడ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాజిక కార్యకర్తలు, రచయితలు వంటివారు ఆమె చేష్టలను ఖండించారు. మొదట మీరు మా బెంగళూరును వదిలి వెళ్ళండి, నగరం ఎలా ఖాళీ అవుతుందో చూస్తాము అని అనేకమంది ఆమెకు ఘాటుగా సమాధానాలిచ్చారు. ఆమెపై తీవ్ర ఆగ్రహం కన్నడ పోరాట సంఘం నాయకుడు రూపేష్ రాజన్న, ఆప్ నాయకులు ఆమె ప్రవర్తనపై మండిపడ్డారు. ఆమె పనిచేసే కంపెనీకి ఫిర్యాదు చేశారు. విద్వేషాలను రెచ్చగొడుతోందని కోరమంగళ పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది. వేలాది మంది నుంచి తీవ్ర నిరసనలు రావడంతో సుగంధ శర్మ దిగివచ్చింది. ఐ లవ్ బెంగళూరు అని మరో వీడియో పోస్టు పెట్టి ప్రజల కోపాన్ని చల్లబరిచే యత్నం చేశారు. కంపెనీ, పోలీసులు ఆమెపై కఠిన చర్యలు తీసుకుని ఇటువంటివి పునరావృతం కాకుండా చూడాలని నెటిజన్లు డిమాండ్ చేశారు. -
లైంగిక దాడి కేసులో బతికున్నంతకాలం జైలు
ఏలూరు (టూటౌన్): కుమార్తె వరుస అవుతున్న ఇద్దరు బాలికలపై లైంగికదాడికి పాల్పడిన మారుతండ్రికి బతికున్నంతకాలం యావజ్జీవ కా రాగార శిక్ష విధిస్తూ ఏలూరు పోక్సో కోర్టు జడ్జి ఎస్.ఉమాసునంద సోమవారం తీర్పు చెప్పారు. నిందితుడికి సహకరించిన బాలికల తల్లికి కూడా బతికున్నంతకాలం యావజ్జీవ కారాగార శిక్ష వి ధించారు. పెదపాడు మండలం వట్లూరు గ్రామానికి చెందిన పుట్ట విజయలక్ష్మి ఫణిరూప (38)కు ఇద్దరు కుమార్తెలున్నారు.విజయలక్ష్మి ఫణిరూప అదే గ్రామానికి చెందిన పుట్ట సతీష్ పవన్కుమా ర్ (42)ను రెండో పెళ్లి చేసుకుంది. ఈ క్రమంలో విజయలక్ష్మి ఫణిరూప ఇద్దరు కుమార్తెలపై సతీష్ పవన్కుమార్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఇందుకు ఆమె కూడా సహకరించింది. ఇద్దరు బాధితుల్లో ఒక బాలిక 2023 జూలై 12న ఇచి్చన ఫిర్యాదు మేరకు ఏలూరు మహిళా పోలీస్స్టేషన్ సీఐ ఇంద్ర శ్రీనివాసరావు కేసు నమోదు చేశారు. నిందితులు పుట్ట సతీష్ పవన్కుమార్, పుట్ట విజయలక్ష్మి ఫణిరూపను జూలై 14న అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు.విచారణలో పుట్ట సతీష్ పవన్కుమార్, పుట్ట విజయలక్ష్మి ఫణిరూపలపై నేరం రుజువు కావడంతో వారు బతికున్నంతకాలం జీవిత ఖైదు శిక్షతోపాటు రూ.18 వేలు జరిమానా విధిస్తూ ఏలూరు పోక్సో కోర్టు జడ్జి తీర్పు చెప్పారు. ప్రధాన నిందితుడికి సహకరించిన షేక్ సత్తార్, బీఎస్కే నాగూర్ హుస్సేన్ వలీ, దూబచర్ల వీణకు రెండేళ్లు జైలు శిక్ష విధించారు. బాధితులకు ఒక్కొక్కరికీ రూ.10 లక్షలు పరిహారం అందజేయాలని ఆదేశాలు ఇచ్చారు. -
నిద్రలో నడుస్తూ అడవిలోకి...!
అమెరికాలో లూసియానా రాష్ట్రంలోని వెబ్స్టర్ పారిస్కు చెందిన ఓ పాపకు నిద్రలో నడిచే అలవాటుంది. శనివారం రాత్రి ఇంట్లో పడుకున్న బాలిక మరునాడు ఉదయం ఇంట్లో కనిపించలేదు. నిద్రలో నడుస్తూ కాస్త దూరం ఎటైనా వెళ్లిందేమోనని తల్లిదండ్రులు చుట్టుపక్కలంతా వెదికారు. ఎక్కడా కనిపించకపోవడంతో మర్నాడు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఇంటి చుక్కపక్కల సీసీటీవీ కెమెరాలన్నింటినీ జల్లెడ పట్టారు. కనీసం బూట్లు లేకుండా బాలిక సమీపంలోని అడవుల్లోకి నడిచి వెళ్తూ ఓ కెమెరాకు చిక్కింది. వెంటనే గాలింపు చేపట్టారు. చిన్నారి నడిచి వెళ్లిన ప్రాంతమంతా జల్లెడ పట్టారు. ట్రాకింగ్ డాగ్స్, డ్రోన్లతో పాటు చివరికి హెలికాప్టర్ను కూడా రంగంలోకి దించారు. విషయం తెలిసి వందలాది మంది స్వచ్ఛందంగా ముందుకొచ్చి వెదుకులాటకు దిగారు. పోలీసులు, ప్రభుత్వ ఏజెన్సీలతో పాటు ప్రైవేటు సంస్థలు కూడా సెర్చ్ ఆపరేషన్లో పాల్గొన్నాయి. చివరకు రాత్రి 11 గంటల వేళ రోడ్డుకు సమీపంలో అడవిలో చిన్నారిని ఓ డ్రోన్ థర్మల్ ఇమేజింగ్ ద్వారా కనిపెట్టింది. అప్పటికి ఒక రోజు గడిచినా చిన్నారి ఇంకా గాఢనిద్రలోనే ఉండటం విశేషం! పోలీసులు, తల్లిదండ్రుల పిలుపులతో ఉలిక్కిపడి లేచింది. నెమ్మదిగా ఏడుపందుకుంది. తల్లిదండ్రులు ఊరడించడంతో మెల్లిగా తేరుకుంది. ఈ దృశ్యాలు అందరినీ కదిలించాయి. ‘అడవిలో, వణికించే చలిలో ఆ చిన్న పాప ప్రశాంతంగా నిద్రపోతూ దొరికిన క్షణాలు హృదయాలను కదిలించాయి. సాంకేతిక పరిజ్ఞానం ఇలా సామాజిక ప్రయోజనానికి ఉపయోగపడటం నిజంగా బాగుంది’ అంటూ నెటిజన్లు సంబరపడుతున్నారు. -
విదేశీయుల్లా ఉన్నారంటూ బాలికలకు వేధింపులు
ఘాజీపూర్: ఉత్తరప్రదేశ్లో మరో ఘోరం చోటుచేసుకుంది. ఘాజీపూర్ జిల్లాలోని ఒక కాన్వెంట్ స్కూల్ మేనేజర్ ఏడవ తరగతి విద్యార్థినిని వేధించిన ఉదంతం మరువకముందే మరో ఘటన చోటుచేసుకుంది.ఘాజీపూర్ జిల్లాలోని మహమ్మదాబాద్ గోహ్నా ప్రాంతంలోని ఒక ఇంటర్ కాలేజీ మేనేజర్పై అదే కాలేజీలో చదువుకుంటున్న బాలికల తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధిత బాలికలు 10వ తరగతి చదువుతున్నారు. ఆ విద్యార్థినులిద్దరినీ ఒక్కొక్కరిగా పిలిచిన మేనేజర్ మీరు భారతీయులుగా కనిపించడం లేదని, విదేశీయులుగా ఉన్నారంటూ కామెంట్ చేశాడని సమాచారం. ఆ తర్వాత వారిని వేధింపులకు గురిచేశాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.తన మైనర్ కుమార్తెతో పాటు తమ గ్రామానికి చెందిన మరో వ్యక్తి మైనర్ కుమార్తె బర్జాలాలోని తిజియా దేవి ఇంటర్ కాలేజీలో 10వ తరగతి చదువుతున్నారని, సెప్టెంబర్ 13న వీరిద్దరినీ కాలేజీ మేనేజర్ వినోద్ యాదవ్ తన ఛాంబర్లోకి పిలిచి వేధించాడని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ మేనేజర్ వీరిద్దరినీ ఒక్కొక్కరిగా పిలిచి, చేతులు పట్టుకుని ఆటపట్టిస్తూ నువ్వు భారతీయురాలిలా కాకుండా విదేశీయురాలిలా కనిపిస్తున్నావంటూ కామెంట్ చేశాడన్నారు. అయితే ఆ విద్యార్థినులు నిరసన తెలపడంతో మేనేజర్ వారిని కులం పేరుతో దుర్భాషలాడాడని బాధిత బాలిక తండ్రి ఆరోపించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.ఇది కూడా చదవండి: HYD: నర్సింగ్ విద్యార్థినిపై హత్యాచారం? -
దివ్యాంగ బాలికపై లైంగిక దాడి.. ఆపై ఆత్మహత్య
ఎన్పీకుంట: దివ్యాంగ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తి.. ఆపై తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన శ్రీసత్యసాయి జిల్లా ఎన్పీకుంట మండలం సారగుండ్లపల్లిలో జరిగింది. కదిరి డీఎస్పీ శ్రీలత, రూరల్ సీఐ నాగేంద్ర కథనం ప్రకారం... సారగుండ్లపల్లికి చెందిన పి.జనార్దన (36) తన భార్యను పుట్టినిల్లు అయిన తనకల్లు మండలం కొక్కంటిక్రాస్లో వదిలి ఆదివారం రాత్రి స్వగ్రామానికి బైక్పై తిరుగు పయనమయ్యాడు. మార్గమధ్యంలోని కొత్తమిద్ది గ్రామంలో వినాయక మండపం వద్ద రాత్రి 8 గంటల సమయంలో ఆడుకుంటున్న దివ్యాంగురాలైన 17 ఏళ్ల బాలికను కంపచెట్లలోకి లాక్కెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. అక్కడే ఉన్న చిన్న పిల్లలు కేకలు వేయడంతో పారిపోయాడు. బాధితురాలి తండ్రి స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో జనార్దనపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అతని ఆచూకీ కోసం పోలీసులు బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు. అయితే..జనార్దన తన స్వగ్రామంలో నిర్మాణంలో ఉన్న తన ఇంట్లోని వంట గదిలో ఉరి వేసుకుని మృతి చెంది ఉండటాన్ని సోమవారం ఉదయం తల్లి గమనించింది. కుమారుడి మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ ఎన్పీకుంట పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. విచారణలో భాగంగా పోలీసులు మృతుడిని పరిశీలించగా చేతికి, వేలుకు ఇంకు అంటి ఉండటాన్ని గమనించి ఘటన స్థలంలో వెతకగా సూసైడ్నోట్ లభించింది. తన మృతికి ఎవరూ కారణం కాదని అందులో రాసి ఉన్నట్లు ధ్రువీకరించారు. ఇరువురి ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసి విచారణ చేపట్టారు. -
‘ఇన్స్టా’ స్నేహితుడు.. 20 రోజులు నిర్బంధించాడు!
సాక్షి, హైదరాబాద్: సోషల్మీడియా ద్వారా పరిచయమైన ఓ యువకుడు నిర్మల్ జిల్లా, భైంసాకు చెందిన బాలికను ట్రాప్ చేశాడు. 20 రోజుల క్రితం నగరానికి రప్పించి ఓ హోటలో నిర్బంధించి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఎట్టకేలకు ధైర్యం చేసిన బాధితురాలు తన కుటుంబీకులకు సమాచారం ఇవ్వడంతో వారు ఆదివారం నగరానికి చేరుకున్నారు. హైదరాబాద్ షీ–టీమ్స్ను ఆశ్రయించడంతో బాలికను రక్షించారు. నిందితుడిపై నారాయణగూడ పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెలితే..భైంసాకు చెందిన బాలికకు నగరానికి చెందిన యువకుడితో ఇన్స్టాగ్రామ్ యాప్ ద్వారా పరిచయం ఏర్పడింది. కొన్నాళ్లు స్నేహం నటించిన అతగాడు ఆమెను పూర్తిగా నమ్మించాడు. చివరకు తన అసలు రూపం బయటపెట్టి సదరు యువకుడు 20 రోజుల క్రితం బాలికను బెదిరించాడు. దీంతో భయపడిన బాలిక తల్లిదండ్రులకు చెప్పకుండా నగరానికి వచ్చేసింది. ఆమెను కలుసుకున్న అతను నారాయణగూడలోని ఓ లాడ్జికి తీసుకువెళ్లి గదిలో నిర్భంధించాడు. బాలికపై పదేపదే అఘాయిత్యానికి ఒడిగట్టాడు. అతడి బెదిరింపులకు భయపడిన ఆమె మిన్నకుండిపోయింది. చివరకు ఆదివారం ధైర్యం చేసిన బాలిక తల్లిదండ్రులకు ఫోన్ చేసి తన పరిస్థితిని వివరించింది. వాట్సాప్ ద్వారా కరెంట్ లోకేషన్ షేర్ చేసింది. హుటాహుటిన నగరానికి వచి్చన బాలిక తల్లిదండ్రులు షీ–టీమ్స్ను ఆశ్రయించారు. తక్షణం రంగంలోకి దిగిన షీ–టీమ్స్ నారాయణగూడలోని లాడ్జిపై దాడి చేసి బాలికను రెస్క్యూ చేశారు. తల్లిదండ్రులను చూసిన బాలిక ఉద్వేగానికి గురైంది. సదరు యువకుడిపై బాలిక తల్లిదండ్రులు నారాయణగూడ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. విద్యార్థినికి ఆన్లైన్లో వేధింపులు..మరో కేసులో ఓ విద్యార్థినిని ఆన్లైన్లో వేధిస్తున్న సహ విద్యార్థులకు షీ–టీమ్స్ చెక్ చెప్పింది. బాధిత యువతి పంజగుట్ట పరిధిలోని ఓ ప్రముఖ అకాడమీలో విద్యనభ్యసిస్తున్నారు. అదే అకాడమీకి చెందిన కొందరు పోకిరీలు ఆన్లైన్లో, సోషల్మీడియా ద్వారా యువతిని రకరకాలుగా వేధించారు. దీనిపై ఆమె వాట్సాప్ ద్వారా షీ–టీమ్స్కు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన అధికారులు వారిని గుర్తించడంతో పాటు పంజగుట్ట ఠాణాలో కేసు నమోదు చేయించారు. ఈ పోకిరీలతో పాటు అకాడమీ నిర్వాహకులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. విద్యనభ్యసిస్తున్న యువతుల భద్రత కోసం మరిన్ని చర్యలు తీసుకోవాల్సిందిగా నిర్వాహకులకు స్పష్టం చేశారు. -
బంగ్లాదేశ్ నుంచి తల్లీకూతుర్ల చొరబాటు.. బీఎస్ఎఫ్ కాల్పులు.. బాలిక మృతి
న్యూఢిల్లీ: బంగ్లాదేశ్లో షేక్ హసీనా ప్రభుత్వం పడిపోయిన తరువాత అక్కడి హిందువులతో సహా ఇతర మైనారిటీలపై దాడులు జరుగుతున్నాయి. దీంతో అక్కడి మైనారిటీలు భారత్లోకి చొరబడేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా త్రిపురలోని అంతర్జాతీయ సరిహద్దు వద్ద బంగ్లాదేశ్కు చెందిన 13 ఏళ్ల హిందూ బాలికతో పాటు ఆమె తల్లి భారత్లోకి చొరబడేందుకు ప్రయత్నించారు. ఈ సమయంలో వారిని అడ్డుకునేందుకు బీఎస్ఎఫ్ జవానులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఆ బాలిక మృతిచెందింది.ఢాకా ట్రిబ్యూన్ తెలిపిన వివరాల ప్రకారం సంఘటన జరిగిన 45 గంటల తర్వాత బీఎస్ఎఫ్ ఆ బాలిక మృతదేహాన్ని బోర్డర్ గార్డ్ బంగ్లాదేశ్ (బీజీబీ)కి అప్పగించింది. ఆమెను 13 ఏళ్ల స్వర్ణ దాస్గా గుర్తించారు. కాగా చట్టపరమైన ప్రక్రియలను పూర్తి చేసిన తర్వాత మృతదేహాన్ని బాలిక కుటుంబానికి అప్పగించామని కులౌరా పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ బినయ్ భూషణ్ రాయ్ తెలిపారు.త్రిపురలో ఉంటున్న తమ సోదరుడిని కలిసేందుకు స్వర్ణ, ఆమె తల్లి అక్రమంగా భారత్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. వీరికి స్థానిక బ్రోకర్లు సహకారం అందించారు. వారు భారత సరిహద్దుకు చేరుకున్నప్పుడు వారిని వారిస్తూ బీఎస్ఎఫ్ సిబ్బంది కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో స్వర్ణ అక్కడికక్కడే మృతిచెందగా ఆమె తల్లి ప్రమదం నుంచి తృటిలో తప్పించుకుంది. ఈ విషాద ఘటనపై సరిహద్దు ప్రాంతంలోని ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్నాయి. -
Bihar: కలుషిత నీరు తాగి బాలిక మృతి.. 9 మంది విద్యార్థులు అస్వస్థత
నలంద: బీహార్లోని నలంద జిల్లాలోగల కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో కలుషిత నీరు తాగి ఒక బాలిక మృతి చెందగా, 9 మంది బాలికలు అస్వస్థతకు గురయ్యారు. మృతిచెందిన బాలిక పాఠశాల విద్యార్థిని కాదని, పాఠశాలలోని తన స్నేహితురాలిని కలిసేందుకు వచ్చిందని నలంద జిల్లా అధికారులు చెబుతున్నారు. కలుషిత నీరు తాగి అనారోగ్యం బారినపడిన మరో 9 మంది బాలికలను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. కాగా నీటి నమూనాను అధికారులు పరీక్షల నిమిత్తం పంపారు.నలంద జిల్లా మేజిస్ట్రేట్ శశాంక్ శుభాంకర్ మంగళవారం మాట్లాడుతూ పాఠశాల ఆవరణలోని ఆర్ఓ సిస్టమ్ దగ్గర నీటిని తాగిన కొంతమంది బాలికలు వాంతులు, కడుపునొప్పితో బాధపడ్డారన్నారు. వెంటనే వారిని ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందించామమన్నారు. అయితే చికిత్స పొందుతూ ఓ బాలిక మృతి చెందిందని తెలిపారు. అస్వస్థతకు గురైన తొమ్మిది మంది విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందన్నారు. పాఠశాలలోని ఆర్ఓ వ్యవస్థను సక్రమంగా నిర్వహించడం లేదని తమ దృష్టికి వచ్చిందని, దానిలోని నీటి నమూనాలను టెస్టింగ్ కోసం పంపించామన్నారు. పాఠశాల వార్డెన్పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని జిల్లా యంత్రాంగం ఆదేశించింది. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు అతన్నిఅధికారులు సస్పెండ్ చేశారు. -
Gujarat: మూడేళ్ల బాలికపై అత్యాచారం.. నిరసనకారుల విధ్వంసం
గుజరాత్లో మరో అత్యాచార ఘటన చోటుచేసుకుంది. వల్సాద్ జిల్లా ఉమర్గావ్లో మూడేళ్ల బాలికపై లైంగిక దాడి జరిగింది. ఈ ఘటన గురించి తెలుసుకున్న స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. వెంటనే నిందితుని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ విధ్వంసం సృష్టించారు.రంగంలోకి దిగిన పోలీసులు మహారాష్ట్రలోని పాల్ఘర్కు చెందిన నిందితుడు గులాం ముస్తఫాను అరెస్టు చేశారు. అతనిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటన జరిగిన ప్రాంతంలో నిరసనకారులు పలు వాహనాలకు నిప్పుపెట్లారు. మరికొన్ని వాహనాలను ధ్వంసం చేశారు. అయితే పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.వల్సాద్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ) డాక్టర్ కరణ్రాజ్ వాఘేలా ఉమర్గావ్ పోలీస్ స్టేషన్ వెలుపల ఆందోళకు దిగినవారిని శాంతింపజేశారు. కేసును ఫాస్ట్ట్రాక్ కోర్టులో విచారించాలని హోంమంత్రి ఆదేశించారని ఎస్పీ తెలిపారు. కాగా ఈ ఘటన గురించి తెలుసుకున్న స్థానికులు పెద్ద సంఖ్యలో రాత్రిపూట పోలీసు స్టేషన్ను చుట్టుముట్టి, బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అక్కడున్న వాహనాలను ధ్వంసం చేశారు. -
బాలికపై అత్యాచారం.. కాల్పుల్లో నిందితునికి గాయాలు
ఉత్తరప్రదేశ్లో మరో అత్యాచార ఉదంతం వెలుగు చూసింది. డియోరియా జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. 41 ఏళ్ల వ్యక్తి ఏడేళ్ల బాలికపై అత్యాచార నేరానికి పాల్పడ్డాడు. బాధిత బాలిక పాల ప్యాకెట్ కొనేందుకు ఇంటికి సమీపంలోని దుకాణానికి వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగిందని అదనపు పోలీసు సూపరింటెండెంట్ దీపేంద్ర నాథ్ చౌదరి తెలిపారు. నిందితుడు దుకాణదారునికి తెలిసినవాడేనని పోలీసులు తెలిపారు. బాధిత బాలిక ఆర్తనాదాలు విన్న స్థానికులు ఆ చిన్నారిని కాపాడి, ఈ విషయాన్ని పోలీసులకు తెలిపారు.ఈ ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసు సూపరింటెండెంట్ సంకల్ప్ శర్మ తెలిపారు. స్థానిక బీజేపీ ఎమ్మెల్యే శలభ్ మణి త్రిపాఠి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను డిమాండ్ చేశారు. కాగా అత్యాచార నిందితుడు సైఫుల్లాను పోలీసులు అరెస్టు చేసేందుకు వెళ్లగా, అతడు తప్పించుకుని పారిపోయే ప్రయత్నం చేశాడు. వెంటనే పోలీసులు అప్రమత్తమై, ఎన్కౌంటర్ జరిపారు. పోలీసులు నిందితుని కాలిపై కాల్పులు జరిపారు. తరువాత నిందితుని నుంచి పిస్టల్, కాట్రిడ్జ్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించిన పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
‘అమ్మాయిపై చెయ్యేస్తే నపుంసకుడిని చెయ్యాలి’
దేశంలో అత్యాచార ఘటనలు తరచూ చోటుచేసుకుంటున్నాయి. ఇటువంటి ఉదంతాలపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి ప్రభుత్వాల నిర్లక్ష్యమే కారణమంటూ పలువురు విమర్శిస్తున్నారు. తాజాగా మహారాష్ట్రలోని బద్లాపూర్ మరో అత్యాచారం ఉదంతం వెలుగు చూసింది.ఈ ఘటనకు కారకులైన వారిపై మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆడపిల్లలపై చేయివేసే వారిని నపుంసకులుగా మార్చాలని ఆయన అన్నారు. ఇలాంటి పనులు చేసేవారికి చట్టం ఉన్నదనే భయాన్ని కల్పించాలని, అప్పుడు ఎవరూ తప్పుడు పనులకు పాల్పడరని అజిత్ పవార్ అన్నారు.యావత్మాల్లో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన బద్లాపూర్ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలపై నేరాలకు పాల్పడే ఏ ఒక్కరినీ తమ ప్రభుత్వం వదిలిపెట్టబోదన్నారు. ఇటువంటి నేరాలకు కఠిన శిక్షలు విధించాలని కోరుతూ రూపొందించిన బిల్లును మోదీ ప్రభుత్వం రాష్ట్రపతి ముర్ముకు పంపిందన్నారు. ఇది చట్టరూపం దాల్చి, అమలులోకి వస్తే మహిళలకు మరింత న్యాయం జరుగుతుందన్నారు. -
ఆగని అఘాయిత్యాలు.. ట్యూషన్ నుంచి వస్తుండగా బాలికను అడ్డగించి
పశ్చిమబెంగాల్ రాజధాని కోల్కతాలో వైద్యురాలిపై జరిగిన హత్యాచారానికి నిరసనగా దేశవ్యాప్తంగా ఆందోళనలు రోజురోజుకీ ఉధృతమవుతున్నాయి. ఈ ఉదంతంపై ఆగ్రహాజ్వాలలు రగులుతున్న నేపథ్యంలో దేశంలో ఎక్కడో ఒక్క చోట చిన్నారులు, మహిళలపై అఘాయిత్యాలు వెలుగుచూస్తుండటం ఆందోళన రేపుతోంది. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో లైంగిక వేధింపుల ఘటనలు చోటుచేసుకున్నాయి. వీటిని మరువకముందే తాజాగా అస్సాంలో మరో విద్యార్థినిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన సంఘటన వెలుగులోకి వచ్చింది.అస్సాంలో 14ఏళ్ల బాలికపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. నాగావ్ జిల్లాలో గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది. బాలిక ట్యూషన్ అనంతరం సైకిల్పై ఇంటికి బయల్దేరింది. దారిలో ముగ్గురు వ్యక్తులు ఆమెను అడ్డగించి సమీపంలోని చెరువు వద్దకు లాక్కెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆమెను రోడ్డు వద్ద వదిలేసి అక్కడి నుంచి పారిపోయారు. రోడ్డుపై వివస్త్రగా పడి ఉన్న బాలికను స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు.ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. సగం అపస్మారక స్థితిలో ఉన్న బాలికను రక్షించి జిల్లాలోని డింగ్ మెడికల్ ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు పేర్కొన్నారు. ముగ్గురు వ్యక్తులు తనపై సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు మైనర్ పోలీసులకు తెలపడంతో కేసు నమోదు చేసుకొని నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఈ ఘటనకు నిరసనగా నేడు విద్యార్ధి సంఘాలు స్థానిక ప్రాంతంలో బంద్కు పిలుపునిచ్చాయి. నిందితులను గుర్తించి వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. -
ఈ అమ్మాయి జీనియస్.. 16 ఏళ్లకే రూ.100 కోట్ల కంపెనీ
సాధారణంగా 16 ఏళ్ల వయస్సులో పిల్లలు పదో తరగతి పూర్తి చేసి తర్వాత ఏం చదవాలో నిర్ణయించుకునే పరిస్థితిల ఉంటారు. కానీ ఈ అమ్మాయి అలా కాదు.. అప్పటికే కోట్లాది రూపాయల కంపెనీని స్థాపించింది. చిన్న వయసులోనూ అద్భుత విజయాలు సాధించవచ్చిన నిరూపించింది. స్ఫూర్తిదాయకమైన ఆ జీనియస్ అమ్మాయి విజయగాథ గురించి ఈ కథనంలో తెలుసుకుందాం..ప్రాంజలి అవస్తీ అమెరికాలో ఉంటుంది. ఆమె 11 సంవత్సరాల వయస్సులో భారత్ నుంచి ఫ్లోరిడాకు వచ్చింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో అత్యంత పరిజ్ఙానాన్ని, నైపుణ్యాన్ని సంపాదించిన ఆమె 16 సంవత్సరాల వయస్సులోనే 2022లో తన ఏఐ స్టార్టప్, డెల్వ్ డాట్ ఏఐ (Delv.AI)ని స్థాపించింది. ఆమె వినూత్న ఆలోచనలు, అంకితభావం తన స్టార్టప్ను అతి తక్కువ సమయంలోనే అస్థిరమైన ఎత్తులకు చేర్చాయి. ప్రస్తుత దీని విలువ రూ. 100 కోట్లు.రెండేళ్లు కంప్యూటర్ సైన్స్, గణితాన్ని అభ్యసించిన తరువాత, అవస్తి 13 సంవత్సరాల వయస్సులో ఫ్లోరిడా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ రీసెర్చ్ ల్యాబ్స్లో ఇంటర్న్షిప్ చేసింది. ఈ సమయంలోనే ఆమె మనసులో డెల్వ్ డాట్ ఏఐ ఆలోచన మొలకెత్తింది. మెషీన్ లెర్నింగ్ ప్రాజెక్ట్లలో పనిచేసిన ప్రాంజలి డేటాపై విస్తృతమైన పరిశోధన చేసింది. అనేక సమస్యలను పరిష్కరించడానికి ఏఐ కీలకమని గ్రహించింది.డెల్వ్ డాట్ ఏఐ సంస్థ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో డేటా ఎక్స్ట్రాక్షన్ మెరుగుపరచడం, డేటా సిలోస్ను తొలగించడం చేస్తుంది. ఆన్లైన్ కంటెంట్ పెరుగుదలకు సంబంధించిన ఖచ్చితమైన సమాచారాన్ని యాక్సెస్ చేయడంలో రీసెర్చర్లకు సహాయం చేస్తుంది. గతేడాది ప్రాంజలి స్టార్టప్కు రూ.3.7 కోట్ల నిధులు వచ్చాయి. ప్రస్తుతం ఈ కంపెనీ విలువ రూ.100 కోట్లకు పైగా ఉంది. 10 మంది ఉద్యోగులు దాకా ఇక్కడ పనిచేస్తున్నారు. -
అయోధ్యలో బాలికపై గ్యాంగ్రేప్..నిందితుడి దుకాణాల కూల్చివేత
అయోధ్య: అయోధ్యలో 12 ఏళ్ల బాలికపై గ్యాంగ్రేప్నకు పాల్పడి నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మొయీద్ ఖాన్ అనే వ్యక్తి దుకాణ సముదాయాన్ని జిల్లా అధికా రులు గురువారం కూల్చి వేశారు. పురాకలంధర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భదర్సానగర్లో మొయీద్ ఖాన్ బేకరీ నడుపుతున్నాడు. మొయీద్తోపాటు అతడి పనిమనిషి రాజు ఖాన్ ఓ బాలికపై రెండునెలల క్రితం అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దురాగతాన్ని వారు వీడియో తీశారు.బాలిక గర్భం దాల్చినట్లు తేలడంతో జూలై 30న పోలీసులు మొయీద్ ఖాన్ను అరెస్ట్ చేశారు. ఆగస్ట్ 3న అతడు నడిపే బేకరీని నేలమట్టం చేశారు. చెరువు స్థలం కబ్జా చేసి దానిని నిర్మించినట్లు అధికారులు అంటున్నారు. తాజాగా, గురువారం మొయీద్ ఖాన్కు చెందిన దుకాణ సముదాయాన్ని కూల్చి వేశారు. దానిని ప్రభుత్వ స్థలంలో నిర్మించాడన్నారు. ఆ సమయంలో భవనం ఖాళీగానే ఉందని చెప్పారు. కూల్చివేత సందర్భంగా ఆ ప్రాంతంలో భారీగా పోలీసులను మోహరించారు. మొయీద్ ఖాన్ సమాజ్వాదీ పార్టీ సభ్యుడు, ఫైజాబాద్ ఎంపీ అవధేశ్ ప్రసాద్ అనుచరుడని బీజేపీ నేతలతోపాటు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆరోపిస్తున్నారు. -
ప్రేమ పేరుతో వంచన
హిందూపురం అర్బన్: శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మండలం గోళ్లాపురం గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు ఓ బాలిక (16)ను ప్రేమ పేరుతో లొంగదీసుకుని గర్భవతిని చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గోళ్లాపురం గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు రాజేష్ ఇటీవల జరిగిన అదే గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్త సతీష్ హత్య కేసులో ప్రధాన నిందితుడు. అతను ఈ కేసులో ప్రస్తుతం జైల్లో రిమాండ్లో ఉన్నాడు. రాజేష్ రిమాండ్కు వెళ్లకముందు గ్రామానికి చెందిన ఓ బాలికను ప్రేమ పేరుతో నమ్మించాడు. శారీరకంగా లొంగదీసుకొని గర్భవతిని చేశాడు.రెండు రోజుల క్రితం బాలిక కడుపునొప్పిగా ఉందని తల్లిదండ్రులకు చెప్పడంతో కర్ణాటక రాష్ట్రం గౌరీబిదనూరు ఆస్పత్రికి తీసుకెళ్లి చూపించారు. వైద్యులు పరీక్షించి ఆమె గర్భవతి అని తేలి్చ.. అక్కడి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు బాలికను అక్కడి ఐసీడీఎస్ అధికారులకు అప్పగించారు. చిక్బళ్లాపుర ఎస్పీ కార్యాలయం నుంచి కేసును సోమవారం హిందూపురం అప్గ్రేడ్ పోలీస్స్టేషన్కు బదలాయించారు. దీంతో అప్గ్రేడ్ సీఐ ఆంజనేయులు బాధిత బాలికను గౌరీబిదనూరు నుంచి హిందూపురం తీసుకువచ్చి స్థానిక ప్రభుత్వాస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించారు. ఆమె గర్భిణి అని నిర్ధారణ కావడంతో రాజే‹Ùపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. -
చాక్లెట్లు కొనుక్కొని ఇంటికి వెళ్తుండగా..
సైదాబాద్: షాపులో చాక్లెట్లు కొనుక్కొని ఇంటికి వెళుతున్న మైనర్ బాలికను ఓ కామాంధుడు ఇంట్లోకి పిలిచి లైంగిక దాడికి పాల్పడ్డాడు. వివరాలు... సైదాబాద్ పోలీసుస్టేషన్ పరిధిలోని ఒక కాలనీలో నివసించే ఓ కుటుంబానికి చెందిన బాలిక(10) ఈ నెల 11న కిరాణషాపులో చాక్లెట్లు కొనుక్కొని ఇంటికి వెళుతోంది. బాలిక ఇంటికి సమీపంలో నివసించే ఓ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి(58) ఆమెను ఇంట్లోకి తీసుకెళ్లి లైంగికంగా వేధించాడు. దాంతో భయపడిన బాలిక తప్పించుకొని ఏడుస్తూ ఇంటికి చేరుకుంది. ఏం జరిగిందని తల్లి అడగటంతో విషయం బయట పడింది. నెల రోజుల క్రితం కూడా ఇంటి వద్ద తాను ఆడుకుంటుండగా అతడు ఇంట్లోకి పిలిచి అసభ్యంగా ప్రవర్తించాడని తల్లికి చెప్పింది. వెంటనే బాలిక తల్లి అతని ఇంటికి వెళ్లి నిలదీయగా ఎదురుదాడి చేశాడు. ఈ ఘటనపై అదే రోజు సైదాబాద్ పోలీసులను బాలిక తల్లి ఆశ్రయించగా నిందితుడితో రాజీ చేసుకోవాలని సూచించినట్లు తెలుస్తోంది. రెండురోజులపాటు పోలీసుస్టేషన్ చుట్టూ తిరిగినా కేసు నమోదు కాలేదు. బాధితురాలి తండ్రి ఒక పోలీస్ ఉన్నతాధికారి వద్ద వంటమనిషిగా పనిచేస్తున్నాడు. ఆయనకు విషయం చెప్పగా సైదాబాద్ పోలీసులకు ఫోన్ చేసినట్లు సమాచారం. దాంతో తప్పనిసరి పరిస్థితుల్లో పోలీసులు ఈ నెల 13న నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేశారు. అయితే నిందితుడి భార్య, కూతురు తమను తిట్టారని, ఎక్కడికి వెళ్లి ఫిర్యాదు చేసుకుంటారో చేసుకోండని బెదిరించారని బాధితురాలి తల్లి ఫిర్యాదులో పేర్కొంది. -
బాలికపై టీచర్ అత్యాచారం.. చికిత్స పొందుతూ మృతి
పశ్చిమబెంగాల్ రాజధాని కోల్కతాలో వైద్యురాలిపై జరిగిన హత్యాచారానికి నిరసనగా దేశవ్యాప్తంగా ఆందోళనలు రోజురోజుకీ ఉధృతమవుతున్నాయి. ఈ ఉదంతంపై ఆగ్రహాజ్వాలలు రగులుతున్న నేపథ్యంలో మరికొన్ని చోట్ల సైతం చిన్నారులు, మహిళలపై అత్యాచార ఘటనలు వెలుగుచూస్తుండటం ఆందోళన రేపుతోంది.తాజాగా ఉత్తరప్రదేశ్లో ఓ కామాంధుడి దాహానికి బాలిక బలైపోయింది. 14 ఏళ్ల మైనర్పై ఓ కీచక టీచర్ అత్యాచారానికి ఒడిగట్టాడు. అయితే బాధితురాలు 20 రోజులు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తాజాగా ప్రాణాలు విడిచింది. రాష్ట్రంలోని సోన్భద్ర జిల్లాలోని దుద్ది గ్రామంలో ఈ ఘటన జరిగింది. నిందితుడు విశాంబర్ ఇంకా పరారీలో ఉండటం గమనార్హం.బాధితురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు పాఠశాలలో స్పోర్ట్స్ ఇన్స్ట్రక్టర్గా పనిచేస్తున్నాడు. గతేడాది డిసెంబర్ 30న ఓ స్పోర్ట్స్ ఈవెంట్లో పాల్గొనేందుకు బాలికను పిలిచాడు. అనంతరం ఆమెను తన ఇంటికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే బాలిక భయపడి ఎవరికీ ఈ విషయం చెప్పలేదు. ఘటన తర్వాత ఆమె ఆరోగ్యం క్రమంగా క్షీణించింది.ఆమెను ఛత్తీస్గఢ్లోని బంధువుల వద్దకు పంపగా.. అక్కడ ఆమెకు చికిత్స అందించినప్పటికీ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడలేదు. దీంతో బాధితురాలు మౌనం వీడి తనకు జరిగిన విషయాన్ని అత్తకు చెప్పడంతో ఆమె ఆస్పత్రిలో చేర్చింది. అనంతరం కుటుంబ సభ్యులు నిందితుడిని నిలదీయగా.. అతడు వారికి రూ. 30 వేలు ఇచ్చి ఈ విషయం ఎవరికి చెప్పవద్దని బెదిరించాడు.దీంతో కుటుంబ సభ్యులు భయపడి ఘటనపై అధికారులకు ఫిర్యాదు చేయలేదు. అయితే బాధితురాలి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆమె తండ్రి జూలై 10న పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఉత్తరప్రదేశ్లోని బల్లియాకు చెందిన విశాంబర్పై కేసు నమోదు చేశారు. బాలికను వారణాసిలోని బనారస్ హిందూ యూనివర్శిటీ ఆసుపత్రిలో చేర్చి వైద్యం అందిస్తున్నారు. అయితే చికిత్స పొందుతూ మంగళవారం అర్థరాత్రి మరణించింది.మరోవైపు నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు అతడిని పట్టుకునేందుకు రెండు బృందాలను ఏర్పాటు చేశారు. త్వరలోనే నిందితుడిని పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.ఇదిలా ఉండగా కోల్కతాలో వైద్యురాలి హత్యాచార ఘటనకు నిరసనగా నేడు దేశ వ్యాప్తంగా వైద్యులు, వైద్య సిబ్బంది, వైద్య విద్యార్ధులు ఆందోళనలు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో కోల్కతా, ఢిల్లీ, హైదరాబాద్ సహా ప్రధాన నగరాల్లో వైద్యులు నిరసనకు దిగారు. ఆదివారం ఉదయం 6 గంటల వరకు వైద్యుల నిరసన కొనసాగనుంది. డాక్టర్ల ఆందోళనలతో ఓపీ సేవలు నిలిచిపోయాయి. -
పాప సేఫ్ ... అబిడ్స్ కిడ్నాప్ కథ సుఖాంతం
-
అబిడ్స్ లో చిన్నారి కిడ్నాప్ కలకలం
-
అనకాపల్లిలో 20 ఏళ్ల యువతి కిడ్నాప్, రేప్
-
అయ్యయ్యో! బార్బీకి ఏమైంది?!
కంగారు పడకండి. బార్బీకి ఏం కాలేదు. బార్బీ స్ట్రాంగ్ గర్ల్. ఈసారి ఇంకో స్ట్రాంగ్ గర్ల్ రూపంలో అవతరించిందంతే. ఆ రూపమే.. ‘‘బ్లైండ్ డాల్’’! చూపు లేని బొమ్మ!! ఆ..! చూపు లేక΄ోవటం శక్తి అవుతుందా? ఎందుక్కాదూ? చూపు లేక΄ోవటం, చూడలేక΄ోవటం వేర్వేరు కదా. చూపు ఉండీ పక్క మనిషి నిస్సహాయతను పట్టించుకోని వాళ్లకు ఏం శక్తి ఉన్నట్లు? చూపు లేకున్నా సాటి మనిషి హృదయాన్ని అర్థం చేసుకోగలిగిన వాళ్లకు ఏం శక్తి లేనట్లు? బార్బీ.. అమ్మాయిల మనసెరిగిన బొమ్మ. డాక్టర్ బార్బీకి.. మెడిసిన్ చదవాలని కలలు కనే అమ్మాయిల మనసు తెలుసు. ఆస్ట్రోనాట్ బార్బీకి.. అంతరిక్షంలో పరిశోధనలు చేయాలని ఉవ్విళ్లూరే అమ్మాయిల ఆశలకు ఎన్ని రెక్కలు ఉంటాయో తెలుసు. నల్లజాతి బార్బీకి.. రంగు కారణంగా నల్ల జాతి మహిళలు ఎదుర్కొంటున్న తీవ్ర వివక్ష ఎలా ఉంటుందో తెలుసు. ఇంకా.. మిస్ యూనివర్శ్ బార్బీ, ప్రెసిడెంట్ బార్బీ, పైలట్ బార్బీ, వీల్ చెయిర్ బార్బీ, ప్రోస్థెటిక్ లెగ్ బార్బీలన్నీ వివిధ వృత్తులు, ప్రవృత్తులు, స్థితి గతులకు ప్రతీకగా ఉండి, ఆడపిల్లలకు స్ఫూర్తిని, సహానుభూతిని అందిస్తున్నవే. 1959తో తొలి బార్బీ మార్కెట్లోకి వచ్చింది మొదలు ఇప్పటి వరకు 1000 రకాలకు పైగానే బార్బీ డాల్స్ అమ్మాయిలకు ఆత్మ బంధువులయ్యాయి. ఆ క్రమంలో తాజాగా ఆవిర్భవించిన కారణజన్మురాలే.. ‘‘బ్లైండ్ డాల్’’. కారణ జన్మురాలా! అవును. కారణ జన్మురాలే. బాలికల్ని మానసికంగా శక్తివంతుల్ని చేయాలన్నదే ఆ కారణం. మాటెల్ కంపెనీ తన ‘స్ఫూర్తిదాయకమైన మహిళలు’ సిరీస్లో భాగంగా 2021లో ‘హెలెన్ కెల్లర్’ రూపంలో బార్బీని తయారు చేసినప్పటికీ, ఫ్యాషనబుల్గా తెచ్చిన తొలి బ్లైండ్ బార్బీ మాత్రం ఇదే. అంధులైన వారిని కూడా కలుపుకుని ΄ోయేలా ఈ ‘బ్లైండ్ బార్బీ’ రూపోందింది. ఇందుకోసం బార్బీ బొమ్మల కంపెనీ ‘మాటెల్’.. ‘అమెరికన్ ఫౌండేషన్ ఫర్ బ్లైండ్’తో చేతులు కలిపింది. ఈ కొత్త బార్బీ డాల్ పింక్ శాటిన్ టీ షర్టు, పర్పుల్ ట్యూల్ స్కర్టు ధరించి ఉంటుంది. చేతిలో తెలుపు, ఎరుపు రంగుల స్టిక్ ఉంటుంది. పిల్లల్లో స్వీయ వ్యక్తీకరణను, ఆత్మదృఢత్వాన్ని పెంపొందించేందుకు బ్లైండ్ బార్బీని తెచ్చామని మాటెల్ కంపెనీ చెబుతోంది. అంతే కాదు, ఈ కొత్త బార్బీ ΄్యాకింగ్ కూడా విలక్షణంగా ఉంది. బాక్సు మీద బార్బీ అనే అక్షరాలను బ్రెయిలీ లిపిలో ముద్రించారు. బ్రిటన్ యువతి లూసీ ఎడ్వర్డ్స్ ఈ బొమ్మకు ప్రచారకర్త. ఆమె తన 11 ఏళ్ల వయసులో కుడి కంటి చూపు కోల్పోయారు. 17 ఏళ్ల వయసులో రెండో కంటి చూపు కూడా క్షీణించింది. ‘‘ఈ బొమ్మ నా సర్వస్వం. ఇది నా దగ్గర ఉంటే నేను ఒంటరినన్న భావనే నాలో కలగదు..’’ అంటున్నారు లూసీ తన చేతిలోని బ్లైండ్ బార్బీని హృదయానికి హత్తుకుంటూ. ఇంకోమాట.. ‘‘అయ్యయ్యో’’ అనిపించుకోవటంస్ట్రాంగ్ గర్ల్కి అస్సలు ఇష్టం ఉండదట. లూసీ అంటారు. -
13 రోజులకు పరామర్శకు వస్తారా?
పగిడ్యాల: మైనర్ బాలిక కుటుంబాన్ని ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.10 లక్షల చెక్ను అందజేయడానికి శుక్రవారం ముచ్చుమర్రికి వ చ్చిన మంత్రులకు భంగపాటు తప్పలేదు. ఘటన జరిగి 13 రోజులైన పరామర్శించడానికి మనస్సు రాలేదా? అంటూ సీపీఎం నేతలు, స్థానికులు మంత్రులను ప్రశ్నించారు. కేసును సీబీఐకి అప్పగించాలని, పోలీసుల వైఫల్యానికి నైతిక బాధ్యత వహిస్తూ హోం మంత్రి రాజీనామా చేయాలని సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు నాగేశ్వరరావు.. మంత్రి ఫరూక్ను కోరారు. దీంతో మంత్రి ఆగ్రహిస్తూ మాకు తెలుసంటూ చులకన భావంతో మాట్లాడారు. దీంతో సీపీఎం నాయకుల్లో ఒక్కసారిగా ఆవేశం కట్టలు తెంచుకుంది. ఘటన జరిగి 13 రోజులవుతున్నా ఇప్పటి వరకు మృతదేహాన్ని బాధిత తల్లిదండ్రులకు అప్పగించలేకపోయారని నిలదీశారు. దీంతో కమ్యూనిస్టులకు, మంత్రులకు మధ్య మాటామాటా పెరిగింది. ఇది గమనించిన పోలీసు ఉన్నతాధికారులు, రోప్ పార్టీ సిబ్బంది కమ్యూనిస్టులను కట్టడి చేసేందుకు యత్నించారు. సమాధానం చెప్పాలని, లేదంటే వాహనాలను కదలనిచ్చేది లేదని కమ్యూనిస్టులు స్వరం పెంచడంతో ఒక్కసారిగా తోపులాట జరిగింది.వెంటనే స్పందించిన రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్రెడ్డి సీపీఎం నాయకులకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. సీపీఎం నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రకటించిన రూ.10 లక్షల ఎక్స్గ్రేషియా కాకుండా రూ.25 లక్షలు చెల్లించాలని, కుటుంబంలో ఒకరికి శాశ్వత ఉద్యోగం, ఐదెకరాల భూమి ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. -
అంతా అధికార పార్టీ నేత అనుచరుడి పనే!
సాక్షి ప్రతినిధి కర్నూలు: ముచ్చుమర్రికి చెందిన బాలికపై అత్యాచారం, హత్య ఘటనకు సంబంధించి కొత్త విషయాలు వెలుగులోకొస్తున్నాయి. హత్యాచారానికి పాల్పడ్డ ముగ్గురు బాలురులో ఓ బాలుడి తాత.. ఆ నియోజకవర్గంలో అధికార పారీ్టకి చెందిన ఓ నాయకుడి కుటుంబం వద్ద నాలుగు దశాబ్దాలుగా పనిచేసేవాడని తెలుస్తోంది. 1994 ప్రాంతంలో ఆ నాయకుడికి ఫ్యాక్షన్లో అడ్డొచ్చిన కొందరిని ముక్కలు ముక్కలుగా చేసి అక్కడి చేపలకు, నీటి కుక్కలకు ఆహారంగా వేసేవాడని స్థానికులు చర్చించుకుంటున్నారు. అప్పట్లో మిస్సయిన వ్యక్తుల ఆచూకీ నేటికీ తెలియలేదని, అదే తరహాలోనే ఇప్పుడు బాలిక శవాన్ని కూడా ముక్కలు చేశారని స్థానికుల్లో ప్రచారం జరుగుతోంది.అయితే పోలీసు వర్గాలు మాత్రం శవాన్ని సంచిలో పడేసి రాయి కట్టడంతోనే దొరకలేదని చెబుతున్నారు. నిజానికి బాలిక పొట్ట కోయకుండా రాయి కట్టి పడేసినా శవం బయటకొస్తుందని కొందరంటున్నారు. బ్యాక్ వాటర్లో పడేయడంతో మొసళ్లు ఆహారంగా తీసుకుని ఉంటాయని కొందరు పోలీసులు భావిస్తున్నారు. అయితే అక్కడ మొసళ్లే లేవని గ్రామస్తులు చెబుతున్నారు. అందుకే మృతదేహం ఇక దొరకదు! ఈనెల 7న పాత ముచ్చుమర్రిలో ఐదో తరగతి చదువుతున్న తొమ్మిదేళ్ల బాలికపై ఆరో తరగతి బాలుడు, పదో తరగతి చదివే ఇద్దరు బాలురు అత్యాచారం చేశారు. ఆపై పాప ఎవరికైనా చెబుతుందేమోనని భయపడి వెంటనే పాప గొంతు నులిమి చంపేశారు. వీరిలో ఒకడు విషయాన్ని తండ్రికి చెప్పాడు. ఆయన మిగిలిన తల్లిదండ్రులతో కలిసి.. ఆ చిట్టితల్లిని గోనె సంచిలో వేసి, దానికి రాయి కట్టి కృష్ణానది బ్యాక్ వాటర్లో పడేశారు. పోలీసుల విచారణలో ఆ ముగ్గురి పిల్లల తండ్రులు చెప్పిన విషయం ఇది. అయితే చిన్నారిపై అత్యాచారం చేసింది నిజం.. చంపింది నిజమేగానీ, శవాన్ని మాయం చేసిన విధానంపై చెబుతోంది మాత్రం అబద్ధం. ఈ రెండు ఊర్లే కాదు. ఈ 12 రోజుల్లో ఆ నోటా, ఈ నోటా చర్చ జరిగి ఇప్పుడు కర్నూలు, నంద్యాల రెండు జిల్లాల్లో ఈ విషయం తీవ్ర చర్చనీయాంశమైంది. పాపను చంపి ముచ్చుమర్రి–హంద్రీ నది అప్రోచ్ చానల్లో పడేశారని మొదట చెప్పారు. ఆ తర్వాత ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం పంప్ హౌస్ వద్ద వేశామన్నారు. శవాన్ని తీసుకెళ్లి సంగమేశ్వరంలో వేశామని మరోసారి చెప్పారు. లేదు.. కొణి§ð ల శ్మశాన వాటికలో పూడ్చామన్నారు.. అయితే వీటిలో ఏదీ వాస్తవం కాదని కొత్త విషయం వెలుగు చూస్తోంది. ముగ్గురి బాలురలో ఒక బాలుడి తాత ఆధ్వర్యంలో బిడ్డను ముక్కలుగా నరికినట్లు తెలుస్తోంది. ముక్కలను బ్యాక్ వాటర్లో అక్కడక్కడా పడేసి ఉంటారని, నీటి కుక్కలు, చేపలు ఈ ముక్కలను తినేసి ఉంటాయని, అందుకే శవం దొరకడం లేదని.. మరో నెలైనా దొరకదని గ్రామస్తులు చెబుతున్నారు.ఎక్స్గ్రేషియా ఏది? సాక్షి, నంద్యాల: ముచ్చుమర్రిలో బాలిక హత్యాచారానికి సంబంధించి ఘటనలో బాలిక కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.10 లక్షల సాయం అందజేస్తామని హోం మంత్రి అనిత ప్రకటించారు. గురువారంతో మూడు రోజులవుతున్నా ఇంత వరకూ బాధిత కుటుంబానికి సాయం అందలేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో బాధితులకు పరిహారం ప్రకటిస్తే గంటల వ్యవధిలోనే జిల్లా అధికారులు ఆ సాయాన్ని అందించేవారు. సంబంధిత మంత్రులు లేదా జిల్లా కలెక్టర్ బాధితులను కలిసి భరోసా కల్పించేవారు. కానీ కూటమి ప్రభుత్వం స్పందిస్తున్న తీరుపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.పవన్, చంద్రబాబునోరు మెదపరేం? కర్నూలుకు చెందిన సుగాలి ప్రీతిపై తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో కొందరు అత్యాచారం చేసి హత్య చేశారు. ఈ ఘటనపై మొన్నటి ఎన్నికల ప్రచారం వరకూ పవన్ కళ్యాణ్ ఆవేశంతో ఊగిపోయేవారు. ఇప్పుడు టీడీపీతో పాటు తమ భాగస్వామ్యం ఉన్న ప్రభుత్వంలో పదేళ్ల బాలికపై అత్యాచారం చేసి, హత్య చేసి.. 12 రోజులుగా శవాన్ని కనపడకుండా చేస్తే ఆ ఘటనపై నోరెత్తలేదు. ముఖ్యమంత్రీ స్పందించలేదు. హోంమంత్రి ఇక్కడ పర్యటించనే లేదు. దీనికి కారణం బాలిక హత్యతో ముడిపడి ఉన్న కుటుంబానికి చెందిన వారు అధికార పార్టీకి చెందిన నేతల అనుచరులు కావడమేనని చెప్పుకొంటున్నారు. ఈ కేసులో చాలా సెక్షన్ల కింద బాలురు, వారి తండ్రులపై కేసులు నమోదు కావాల్సి ఉంటుందని.. అందువల్లే ఘటనను తేలిగ్గా తీసిపారేస్తున్నారని తెలుస్తోంది. -
ఆంధ్రా అబ్బాయి.. ఫిలిప్పీన్స్ అమ్మాయి
జి.కొండూరు (మైలవరం): ఆంధ్రా అబ్బాయి, ఫిలిప్పీన్స్ అమ్మాయి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. హిందూ సంప్రదాయం ప్రకారం ఈ వివాహం ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో జరిగింది. ఆదివారం జి.కొండూరు మండలం కుంటముక్కలలో రిసెప్షన్ నిర్వహించారు. గ్రామానికి చెందిన మైలవరపు కైలాసరావు కుమారుడు సతీష్కుమార్ ఆంధ్రా యూనివర్సిటీలో ఎమ్మెస్సీ పూర్తిచేసి పీహెచ్డీ నిమిత్తం బెల్జియం వెళ్లారు.అతడికి ఫిలిప్పీన్స్ నుంచి వచ్చి బెల్జియంలో ఎమ్మెస్సీ చదువుతున్న డోనా క్యూనో పరిచయమైంది. పరిచయం స్నేహంగా.. ప్రేమగా మూడేళ్లు సాగింది. పెద్దల అంగీకారంతో వారిద్దరు మైలవరంలోని కోదండ రామాలయంలో కుటుంబసభ్యుల సమక్షంలో హిందూ సంప్రదాయం ప్రకారం వేదమంత్రాల నడుమ వివాహం చేసుకున్నారు. ఆదివారం కుంటముక్కలలో బంధుమిత్రులు, స్నేహితులు, గ్రామస్తుల సమక్షంలో రిసెప్షన్ నిర్వహించారు. -
ముచ్చుమర్రిలో బాలిక అదృశ్యంపై వీడని మిస్టరీ
సాక్షి, నంద్యాల: నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం ముచ్చుమర్రిలో తొమిదేళ్ల మైనర్ బాలిక ఆచూకీపై మిస్టరీ వీడలేదు. చిన్నారి అదృశ్యమై ఎనిమిది రోజులు గడుస్తున్నా కేసులో పురోగతి కనిపించడం లేదు. బాలిక ఆచూకీలో ప్రభుత్వం వైఫల్యంపై వాల్మీకి, ప్రజాసంఘాలు,మహిళా సంఘాల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాయి.అత్యాచారం చేసి, చంపేశామని అనుమానిత ఇద్దరు పది, ఒకరు ఆరో తరగతి విద్యార్థులు చెబుతుండటంతో రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైన ఈ ఘటనపై కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు నోరు మెదపకపోవడం పట్ల స్థానికులు మండిపడుతున్నారు. మహిళా హోంమంత్రి సైతం ఈ విషయంలో చొరవ చూపకపోవడం పట్ల గ్రామస్తులు నిప్పులు చెరుగుతున్నారు.మరోవైపు బాలిక మిస్సింగ్పై పోలీసులు సంఘమేశ్వరం, మల్లాల తదితర ప్రాంతాల్లో గాలింపు చేపడుతున్నారు. ముచ్చమర్రిలో కేసును దర్యాప్తు చేసేందుకు భారీ మొత్తంలో పోలీసులు మొహరించారు. -
ప్రేమోన్మాది ఆత్మహత్య
రాంబిల్లి (అచ్యుతాపురం): తన ప్రేమను నిరాకరించి, జైలుకు పంపిందనే పగతో 14 ఏళ్ల బాలికను ఐదురోజుల క్రితం హతమార్చిన ప్రేమోన్మాది చివరకు శవమై కనిపించాడు. అతని మృతదేహం బాలిక ఇంటి సమీపంలోని గడ్డిదుబ్బుల్లో లభ్యమైంది. అనకాపల్లి జిల్లా, రాంబిల్లి మండలం, కొప్పుగొండుపాలెంలో బద్ది దర్శిని(14) అనే బాలికను ఈనెల 6వ తేదీ రాత్రి కశింకోట మండలానికి చెందిన సురేశ్ గొంతు కోసి హతమార్చాడు. ప్రేమ పేరుతో వేధిస్తున్న అతనిపై దర్శిని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోక్సో కేసు పెట్టి అరెస్టు చేశారు. బాలికను రాంబిల్లి మండలంలో అమ్మమ్మ ఇంట చదివిస్తున్నారు. బెయిల్పై వచ్చిన సురేశ్, తనను జైలుకు పంపిందన్న కక్షతో దర్శినిని హతమార్చాడు. ఘటనా స్థలంలో వదిలి వెళ్లిన లేఖలో ‘ఇద్దరం కలిసి ఉండాలి.. లేదా ఇద్దరం చనిపోవాలి’ అని పేర్కొన్నాడు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన కొద్దికాలానికి జరిగిన ఈ ఘటన రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు 12 బృందాలను ఏర్పాటు చేశారు. ఈక్రమంలో గురువారం బాలిక ఇంటికి సుమారు రెండు వందల మీటర్ల దూరంలో కొండలాంటి ప్రాంతంలో గడ్డిదుబ్బుల మాటున సురేశ్ శవమై కనిపించాడు. బుధవారం సాయంత్రం అక్కడికి సమీపంలోని రైతులకు దుర్వాసన వచ్చింది. అప్పటికే చీకటి పడటంతో మరుసటిరోజు ఉదయం పరిశీలించగా కుళ్లిపోయిన స్థితిలో ఉన్న ఓ యువకుని మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పరవాడ డీఎస్పీ సత్యనారాయణ, సీఐ నర్సింగరావు నేతృత్వంలోని బృందం శవాన్ని పరిశీలించి లభించిన ఆధారం మేరకు సురేశ్గా నిర్థారించారు. ఆత్మహత్యకు పాల్పడ్డాడని తెలిపారు. సురేశ్ జేబులో కొంత నగదు, రాసిన లేఖ జిరాక్స్ కాపీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలిస్తున్న సమయంలో ఆ వాహనాన్ని దర్శిని కుటుంబీకులు అడ్డుకున్నారు. తమ కుమార్తెకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే... బెయిల్పై బయటకు వచ్చిన వ్యక్తికి సంబంధించిన వివరాలను పోలీసులు వెల్లడించి, బాలిక కుటుంబాన్ని అప్రమత్తం చేస్తే ఇటువంటి దురాగతం జరిగేది కాదనే విమర్శలు వినిపిస్తున్నాయి. నిందితుడు మళ్లీ బాలిక వెంట పడుతున్నట్టు ఆమె కుటుంబ సభ్యులు రాంబిల్లి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిసిందని, దీనిపై వారు ఎలాంటి చర్యలు తీసుకున్నారని ఘటన జరిగిన మర్నాడు అనకాపల్లిలో హోంమంత్రి అనితను విలేకరులు ప్రశ్నించగా, అలాంటిది జరిగినట్టు తన దృష్టికి రాలేదని, అదే నిజమైతే సంబంధిత పోలీస్ సిబ్బందిపై చర్యలు చేపడతామని చెప్పారు. చివరకు రాంబిల్లి ఎస్ఐ ముకుందరావును బుధవారం వీఆర్పై పంపారు. ఇంత జరిగినా బాలిక కుటుంబాన్ని హోం మంత్రి పరామర్శించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
నల్గొండలో యువతి దారుణం
-
దుమ్మురేపిన అమ్మాయి.. ఆనంద్ మహీంద్ర ప్రశంసలు
‘అమెరికాస్ గాట్ టాలెంట్’ షోలో పాల్గొన్న భారతీయ సంతతి అమ్మాయిని ప్రశంసిస్తూ ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. రియాలిటీ షోలో ఫ్లోరిడాకు చెందిన ప్రనిస్కా మిశ్రా తన అద్భుతమైన తన గాప్రతిభతో న్యాయ నిర్ణేతలను ఆకట్టుకుంటోంది. దీంతో "అవును, అమెరికాకు నిజంగానే టాలెంట్ ఉంది. కానీ అది చాలా వరకు భారతదేశం నుండే వస్తోంది అంటూ ఆనంద్ మహీంద్రా 'అమెరికాస్ గాట్ టాలెంట్'లో పాల్గొన్న ప్రనిస్కాను పొగడ్తలతో ముంచెత్తారు. దీంతో ఇది వైరల్గా మారింది. టీనా ఐకానిక్ సాంగ్ 'రివర్ డీప్ మౌంటైన్ హై' పాటతో అక్కడున్న వారినందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది మన భారతీయ బాలిక. దీంతో సూపర్ మోడల్ హెడీ క్లమ్ నుండి గోల్డెన్ బజర్ను కూడా అందుకోవడం విశేషం. అంతేకాదు ఆమె స్టేజ్మీదకు వచ్చి ప్రనిస్కాను ఆత్మీయంగా హగ్ చేసుకుంది. ఆ తరువాత ఆమె తండ్రి ఇలా కాసేపు ఉద్విగ్న క్షణాలతో నిండిపోయింది వేదిక. ఇంతలో వీడియో కాల్ ద్వారా ప్రనిస్కా అమ్మమ్మ లైన్లోకి రావడంతో అక్కడి వాతావరణం అటు ఆనందం, ఇటు భావోద్వేగంతో నిండిపోయింది.What on earth is going on??For the second time, within the past two weeks, a young—VERY young—woman of Indian origin has rocked the stage at @AGT with raw talent that is simply astonishing. With skills acquired in indigenous American genres of music. Rock & Gospel. Pranysqa… pic.twitter.com/2plEj8EXVs— anand mahindra (@anandmahindra) July 8, 2024 భూమిపై ఏమి జరుగుతోంది? రెండు వారాల్లో ఇది రెండోసారి. భారతీయ సంతతికి చెందిన చిన్నఅమ్మాయి తన టేలంట్తో షేక్ చేసింది అంటూ ఆనంద్ మహీంద్ర స్పందించారు. అలాగే అమ్మమ్మ వీడియో కాల్ చూడగానే కన్నీళ్లు వచ్చాయంటా ఆయన రాసుకొచ్చారు. -
ప్రేమోన్మాది ఘాతుకం
రాంబిల్లి: ఒక మృగాడి పైశాచికానికి బాలిక బలైంది. పోలీస్ యంత్రాంగం బెయిల్పై బయటకు వచ్చిన వ్యక్తికి సంబంధించిన వివరాలను వెల్లడించి బాలిక కుటుంబీకుల్ని అప్రమత్తం చేస్తే ఇటువంటి దురాగతం జరిగి ఉండేది కాదు. దీనికి సంబంధించిన వివరాలు.. కశింకోట మండలానికి చెందిన జె.సురేశ్ అదే ప్రాంతానికి చెందిన బద్ది దర్శిని(14)ని వేధించేవాడని బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు ఇవ్వడంతో పోక్సో కేసు నమోదు చేసి జైలుకి పంపారు. బాలికను వాళ్ల అమ్మమ్మ ఇంటి వద్దకు పంపించి చదివిస్తున్నారు. రాంబిల్లి మండలం కొప్పిగొండుపాలెంలో ఉంటూ రాంబిల్లి ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న దర్శిని శనివారం యధావిధిగా పాఠశాలకు వెళ్లి సాయంత్రం ఇంటికి చేరుకుంది. బెయిల్పై వచ్చి అప్పటికే మాటు వేసి ఉన్న సురేశ్ వేట కొడవలితో బాలిక మెడ నరికి హతమార్చాడు. తనపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిందని కక్ష పెంచుకున్న సురేశ్ ఈ దురాగతానికి పాల్పడ్డాడని భావిస్తున్నా రు. డీఎస్పీ సత్యనారాయణ, సీఐ నర్సింగరావు, ఎస్ఐ మన్మధరావులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు పరారు కావడంతో అతని కోసం గాలిస్తున్నారు. ఈ ఘటనతో రాంబిల్లి మండలంతోపాటు ఉమ్మడి విశాఖ జిల్లా ఉలిక్కిపడింది. -
స్వయం ప్రకటిత బౌద్ధ గురువు బమ్జాన్కు పదేళ్ల జైలు
బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో నేపాల్కు చెందిన స్వయం ప్రకటిత బౌద్ధ గురువు రామ్ బహదూర్ బమ్జాన్కు కోర్టు పదేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ కేసులో తీర్పునిచ్చిన సర్లాహి జిల్లా కోర్టు న్యాయమూర్తి జీవన్ కుమార్ భండారీ నిందితునికి జైలు శిక్షతో పాటు రూ. 5 లక్షల జరిమానా కూడా విధించారు.వివరాల్లోకి వెళితే బాలికను లైంగిక వేధింపులకు గురిచేసిన ఈ కేసులో బమ్జాన్ సహచరులు జీత్ బహదూర్ తమాంగ్, జ్ఞాన్ బహదూర్ బమ్జాన్లు నిర్దోషులుగా విడుదలయ్యారు. బమ్జాన్ ప్రస్తుతం జలేశ్వర్ జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నాడు. 2024, జనవరి 9న ఖాట్మండులోని బుధ్ నీటకంఠలో నేపాల్ సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో బృందం బమ్జాన్ను అరెస్టు చేసింది.2020 ఫిబ్రవరి 6న సర్లాహి జిల్లా కోర్టు అతనిపై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఆ తర్వాత బమ్జాన్ పరారయ్యాడు. 2016, ఆగస్టు 4న అతని ఆశ్రమంలో అనీ (నన్)గా ఉంటున్న 15 ఏళ్ల బాలిక.. బమ్జాన్ తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆరోపించింది. 2020 ఫిబ్రవరి 23న బాధితురాలు తనకు మైనారిటీ వచ్చిన వచ్చిన తరువాత బమ్జాన్పై పోలిసులకు ఫిర్యాదు చేసింది. ఇదేవిధంగా మరికొందరు బమ్జాన్పై హత్య, కిడ్నాప్, లైంగిక వేధిపుల ఆరోపణలు చేశారు. 2005లో ఆహారం, నీరు, నిద్ర లేకుండా ధ్యానం చేసిన కారణంగా బమ్జాన్ వెలుగులోకి వచ్చాడు. ఈ నేపధ్యంలోనే అతనికి బుద్ధ బాయ్ అనే పేరు వచ్చింది. -
నేరేడ్మెట్లో బాలికపై గ్యాంగ్ రేప్.. 10 మంది అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: నేరేడ్మెట్లో తీవ్ర సంచలనం సృష్టించిన బాలిక గ్యాంగ్ రేప్ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ కేసులో కీలక సూత్రధారులైన నరేష్, విజయ్లతో పాటు మరో 8 మందిని పోలీసులు అరెస్టు చేశారు.ఈ నెల 22న కాచిగూడ నుంచి 12 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసిన నిందితులు.. కూల్డ్రింక్లో గంజాయి కలిపి తాగించారు. బాలిక మత్తులోకి వెళ్లిన తర్వాత నిర్మానుష్యప్రాంతానికి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్టు పోలీసులు తెలిపారు. -
మద్యం మత్తులో యువతి.. వీడియో షేర్ చేసిన బీజేపీ నేత
దేశంలోని కొందరు యువతీయువకులు మత్తుకు బానిసలుగా మారి తమ కెరియర్ను నాశనం చేసుకోవడమే కాకుండా, తల్లిదండ్రులను కష్టాలపాలు చేస్తున్నారు. మత్తుపదార్థాల తీసుకోవడం వలన జరిగే హాని గురించి అటు ప్రభుత్వం, ఇటు స్వచ్ఛంద సంస్థలు ఎన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహించినా ఆశించినంత ఫలితం కనిపించడంలేదు. తాజాగా పంజాబ్లోని అమృత్సర్లో మద్యం మత్తులో రాత్రివేళ రోడ్డుపై జోగుతున్న ఓ యువతికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది. ఈ వీడియో అమృత్సర్లోని మోహక్పురా పోలీస్ స్టేషన్ పరిధిలోని జీటీ రోడ్డులో చిత్రీకరించారు. ఈ వీడియో వైరల్ అయిన నేపధ్యంలో మత్తుమందులను అరికట్టడంలో విఫలమైన ప్రభుత్వంపై విమర్శలు చెలరేగుతున్నాయి.ఈ వీడియోను బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంజీందర్ సింగ్ సిర్సా తన ‘ఎక్స్’ హ్యాండిల్లో షేర్ చేశారు. పంజాబ్లో డ్రగ్స్ సమస్యను నివారించడంలో ఆప్ ప్రభుత్వం విఫలమయ్యిందని ఆరోపించారు. మంజీందర్ సింగ్ షేర్ చేసిన వీడియోలో రాత్రివేళ రోడ్డుపై ఒక యువతి మద్యం మత్తులో ఊగిపోతూ కనిపిస్తుంది. ఆమె సరిగా నిలబడలేక పోవడాన్ని కూడా వీడియోలో చూడవచ్చు. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లో రాష్ట్రాన్ని మత్తుమందుల నుంచి విముక్తి చేస్తామని ప్రకటించిందని, ఇప్పుడు ఆ మాటనే విస్మరించిందని సుజీందర్ సింగ్ ఆరోపించారు. This late night video of Amritsar of a young girl high under Drugs shows the failure of @AAPPunjab Govt! What have you done to Punjab, CM @bhagwantmann Ji?You came to power promising elimination of drugs in 3 months but now your own party people are involved in this!Drug… pic.twitter.com/QdIADuRsZS— Manjinder Singh Sirsa (@mssirsa) June 24, 2024 -
బాలికపై లైంగిక దాడి కేసులో పదేళ్ల జైలు
విజయవాడస్పోర్ట్స్: ఐదేళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో నిందితుడికి పదేళ్ల జైలుశిక్ష విధిస్తూ విజయవాడ పోక్సో కోర్టు ఇన్చార్జ్ న్యాయమూర్తి తిరుమల వెంకటేశ్వర్లు సోమవారం తీర్పు చెప్పారు. వివరాలిలా ఉన్నాయి. ఇబ్రహీంపట్నం ప్రాంతానికి చెందిన మహిళకు, నున్న గ్రామానికి చెందిన వ్యక్తితో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు సంతానం. భర్తతో మనస్పర్థల కారణంగా ఆమె పిల్లలను తీసుకుని ఇబ్రహీంపట్నంలోని పుట్టింట్లో ఉండేది.కొన్నాళ్ల తరువాత భర్త వచ్చి తన ఐదేళ్ల పెద్ద కుమార్తెను నున్నలోని తన ఇంటికి తీసుకెళ్లాడు. అయితే ఇంట్లో ఎవరూ లేని సమయంలో వాంబేకాలనీకి చెందిన 20 ఏళ్ల కుంచాల దుర్గారావు అలియాస్ తమ్మిశెట్టి దుర్గారావు అలియాస్ దుర్గా ఆ పాపను డాబాపైకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. మరుసటి రోజు పాపకు స్నానం చేయిస్తుండగా మర్మాంగాల వద్ద ఇన్ఫెక్షన్ రావడాన్ని గమనించిన తల్లి ఆరా తీయగా దుర్గారావు చేసిన అత్యాచారం బయటపడింది.వెంటనే పాపను చికిత్స నిమిత్తం విజయవాడలోని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. పాపపై అత్యాచారం జరిగినట్లు వైద్యులు నిర్ధారించడంతో పాప తల్లి ఇచి్చన ఫిర్యాదు మేరకు 2019 ఏప్రిల్ ఆరో తేదీన నున్న పోలీసులు కేసు నమోదు చేసి 2020 ఆగస్టు 12వ తేదీన నిందితుడు దుర్గారావును అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చారు. నేరం రుజువు కావడంతో నిందితుడు దుర్గారావుకు కఠిన కారాగార శిక్షతో పాటు రూ.10 వేల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. -
మియాపూర్: వీడిన బాలిక హత్య కేసు మిస్టరీ
సాక్షి,హైదరాబాద్: మియాపూర్లో సంచలనం రేపిన బాలిక హత్య కేసును పోలీసులు చేదించారు. బాలిక మర్డర్ కేసులో ఆమె తండ్రే హంతకుడని పోలీసులు తేల్చారు. సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు ఈ కేసును విచారించారు. బాలిక మిస్సింగ్ మిస్టరీ వారం రోజుల తర్వాత వీడింది. తండ్రిపై అనుమానంతో తమదైన తీరులో పోలీసులు దర్యాప్తు చేశారు. బాలిక తండ్రి బానోతు నరేష్ పోర్న్ వీడియోలు చూస్తూ చెడు అలవాట్లకు బానిసయ్యాడు.తన కోరిక తీర్చాలంటూ బాలికపై తండ్రి ఒత్తిడి తెచ్చాడు. అమ్మకు చెప్తానని బాలిక గట్టిగా అరవడంతో కోపంతో కన్న కూతురిని హతమార్చాడు. నడిగడ్డ తండా సమీపంలోని పొదల్లోకి తీసుకువెళ్లి జుట్టు పట్టుకుని నేలకేసి కొట్టి హత్య చేశాడు. బాలిక చనిపోయిందా లేదా అని చూసేందుకు హత్య జరిగిన ప్రదేశానికి నిందితుడు తిరిగి వెళ్లినట్లు గుర్తించారు. -
Fathers Day 2024: కన్నా... నేనున్నా
తల్లి ఎదురుగా ఉంటే ఎంతమంది ఉంటే మాత్రం ఏమిటి? సంప్రదాయ నృత్య దుస్తులు ధరించిన అమ్మాయి భయం భయంగా స్టేజీ ఎక్కింది. ఎదురుగా ఎంతోమంది జనం. తన వైపే చూస్తున్నారు. ‘భయపడవద్దు’ అన్నట్లుగా సైగ చేసింది తల్లి. అంతేకాదు...మ్యూజిక్ స్టార్ట్ కాగానే డ్యాన్స్ స్టెప్స్ను ఆటిస్టిక్ కుమార్తెకు చూపెట్టడం మొదలుపెట్టింది. స్టేజీ ముందు ఉన్న తన తల్లిని నిశితంగా గమనిస్తూ అందంగా, అద్భుతంగా డ్యాన్స్ చేసింది ఆ అమ్మాయి. ‘స్పెషల్–నీడ్స్ చిల్డ్రన్ ఆలనా పాలనకు ఎంతో ఓపిక, అంకితభావం కావాలి. అవి ఈ తల్లిలో కనిపిస్తున్నాయి’ అని నెటిజనులు స్పందించారు. అపర్ణ అనే యూజర్ ‘ఎక్స్’లో పోస్ట్ చేసిన ఈ వీడియో వైరల్ అయింది. -
చైతన్య పథం
ఐక్యరాజ్య సమితి ‘గర్ల్ అప్’ మూవ్మెంట్కు ఇండియా కంట్రీ మేనేజర్ అయిన అదితి అరోరా ఆ సంస్థ ద్వారా మహిళల మానసిక ఆరోగ్యం నుంచి ఉపాధి అవకాశాల వరకు ఎన్నో అంశాలపై పని చేస్తోంది. ‘స్టోరీ టెల్లింగ్’లో శిక్షణ ఇస్తోంది. మహిళలపై జరిగే హింసకు వ్యతిరేకంగా ΄పోరాడుతోంది. ‘పీరియడ్ ΄పావర్టీ’ని దృష్టిలో పెట్టుకొని అవగాహన కార్యమ్రాలు నిర్వహిస్తోంది. మహిళా సాధికారత, మానసిక ఆరోగ్యానికి సంబంధించిన అంశాలలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్న అమెరికాకు చెందిన ‘జస్ట్ ఏ గర్ల్ ఇంక్’ స్వచ్ఛంద సంస్థతో కలిసి పనిచేస్తోంది....ప్రపంచవ్యాప్తంగా 130 దేశాలలో ఎంతోమంది మహిళలను నాయకులుగా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పొషించింది ‘గర్ల్ అప్’.‘ప్రపంచాన్ని మార్చే అద్భుత శక్తి అమ్మాయిలకు ఉంది’ అంటున్న అదితి అరోరా వారి హక్కుల గురించి అవగాహన కార్యక్రమాలు చేపడుతోంది. ఆత్మవిశ్వాసాన్ని పెంపోందిస్తోంది. స్కిల్ డెవలప్మెంట్ ద్వారా కొత్త అవకాశాల ప్రపంచంలోకి తీసుకు వెళుతోంది.‘గర్ల్ అప్ ఇండియా’ ద్వారా దేశవ్యాప్తంగా లింగ సమానత్వం, సామాజిక మార్పుపై ఎన్నో అవగాహన సదస్సులు నిర్వహిస్తోంది అదితి.యువతలో ఎంతోమందిని చేంజ్మేకర్స్గా తీర్చిదిద్దింది.పాలిటికల్ సైన్స్ చదువుకున్న అదితి కాలేజీ రోజుల నుంచి మహిళా హక్కులు, స్త్రీ సాధికారతకు సంబంధించిన అంశాలపై పని చేస్తోంది. జెనీవాలో చదువుతున్నప్పుడు ‘జెండర్ అండ్ మైన్ యాక్షన్’ పోగ్రాంలో భాగంగా మందు పాతర బాధిత దేశాలలో మహిళల భద్రత కోసం పనిచేసింది.‘గర్ల్ అప్’ పనితీరు విషయానికి వస్తే సంస్థలో సిబ్బంది, కన్సల్టెంట్ల సంఖ్య చాలా తక్కువగా ఉన్నప్పటికీ దేశవ్యాప్తంగా వేగంగా విస్తరించడానికి అదేమీ అడ్డంకి కాలేదు. ‘ఓపెన్ టు ఎవ్రీ వన్’ అంటున్న ‘గర్ల్ అప్’ దేశంలోని వివిధ పాంతాలలోని వాలంటీర్లతో కలిసి పనిచేస్తోంది.తమలోని శక్తిని అమ్మాయిలు గుర్తించేలా కార్యక్రమాలు రూపోందిస్తోంది.విధాన నిర్ణయాలలో వారి అభిప్రాయాలకు అధికరపాధాన్యత ఇస్తోంది.‘లింగ సమానత్వం’ విషయంలో క్రియాశీలంగా పనిచేస్తోంది గర్ల్ అప్.‘అబ్బాయిలను ఒకరకంగా, అమ్మాయిలను ఒకరకంగా చూసే విధానంలో మార్పు రావాలి. లింగ సమానత్వానికి ఇదే తొలిమెట్టు. అమ్మాయిలు చదువులో తమ ప్రతిభను నిరూపించుకొని శక్తిమంతులు కావాలి. ఎవరికీ తీసిపోము అని నిరూపించాలి. లింగ సమానత్వం విషయంలో ΄పార సమాజం, విధాన నిర్ణేతలు, విద్యావేత్తల పాత్ర కీలకం’ అంటుంది అదితి.మనకు తెలియకుండానే పురుషాధిపత్య భావజాలం మనలో లీనమై ఉంటుంది. రకరకాల సందర్భాలలో అది వ్యక్తం అవుతుంటుంది. ‘ఇలాంటివి నివారించాలంటే ఏం చేయాలి?’ అనేదానిపై కూడా తన అభిప్రాయాలను ప్రకటించింది అదితి.‘శరీరం నుంచి దుస్తుల ఎంపిక వరకు మహిళలు ఏదో ఒక సందర్భంలో కామెంట్స్ రూపంలో హింసను ఎదుర్కొంటున్నారు’ అంటున్న అదితి తాను కూడా అలాంటి హింస బాధితురాలే. ‘కామెంట్స్ విని బాధపడడం కాకుండా అలాంటి కామెంట్స్ మళ్లీ వినిపించకుండా చేయాలి’ అంటుంది అదితి.‘మార్పు సాధ్యపడదు’ అనేది నిరాశావాదం.‘తప్పకుండా సాధ్యపడుతుంది’ అనేది శాస్త్రీయ ప్రాతిపదికపై ఏర్పడిన ఆశావాదం.మార్పు రావడానికి కొంత సమయం పడుతుంది. ఆ సమయం త్వరగా రావడానికి ‘గర్ల్ అప్’లాంటి సంస్థలు, అదితిలాంటి వ్యక్తులు క్షేత్రస్థాయిలో చేస్తున్న కార్యక్రమాలు కీలకం అవుతాయి.‘నిన్న నువ్వు ఏమిటో తెలుసుకొనే జ్ఞాపకం నీలో ఉన్నట్లే రేపు నువ్వు ఏమిటో నిరూపించుకునే జ్ఞానం, శక్తి నీలో ఉన్నాయి’ అంటుంది అదితి అరోరా.దిశానిర్దేశంలింగ సమానత్వం, స్త్రీవాదం గురించి మాట్లాడడానికి స్కూల్స్, కాలేజీలకు వెళుతుంటుంది అదితి అరోరా. విద్యార్థుల మనసుల్లో దాగున్న ఎన్నో సందేహాలు ఆ సమయంలో బయటికి వస్తాయి. వాటికి సమాధానం ఇవ్వడమే కాదు దిశానిర్దేశం కూడా చేస్తుంది అదితి అరోరా. ఎన్నో బడులు, కాలేజీలలో గర్ల్ అప్ క్లబ్లను ఏర్పాటు చేసింది. ప్రతి క్లబ్లో అయిదుగురు సభ్యులతో పాటు ప్రెసిడెంట్, వైస్–ప్రెసిడెంట్, సెక్రెటరీలు ఉంటారు. నిర్దిష్టమైన అంశాలపై ఈ క్లబ్ల కోసం వర్క్షాప్లు కూడా నిర్వహించింది. అయితే కొన్ని విద్యాసంస్థలు మాత్రం ‘ఇలాంటి విషయాలు అమ్మాయిలకు ఎందుకు’ అన్నట్లుగానే వ్యవహరించాయి. వారి ధోరణితో ఎప్పుడూ నిరాశపడలేదు అదితి. -
తొమ్మిదేళ్ల బాలికతో దేవదేవుని వివాహం
రాయదుర్గంటౌన్: అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో శ్రీప్రసన్న వేంకటరమణస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం శ్రీవారి కల్యాణం తొమ్మిదేళ్ల బాలికతో అంగరంగ వైభవంగా నిర్వహించారు. దాదాపు ఆరు దశాబ్దాల నుంచి ఇక్కడ కొనసాగుతున్న విశిష్ట సంప్రదాయంలో భాగంగా అరవ తెగకు చెందిన బాలికతో దేవదేవుని కల్యాణం జరిపించారు. స్వామి వారిని వివాహమాడిన ఆ బాలికకు సుగుణ æసంపన్నుడైన భర్త లభిస్తాడని భక్తుల నమ్మకం. ఏటా బ్రహ్మోత్సవాల్లో భాగంగా పద్మశాలి వంశం అరవ తెగకు చెందిన బాలికతో శ్రీవారికి పెళ్లి చేసే సంప్రదాయం ఇక్కడ కొనసాగుతోంది.ఈ ఏడాది రాయదుర్గం పట్టణానికి చెందిన అరవ రమే‹Ù, జయమ్మ దంపతుల కుమార్తె మౌనికతో శ్రీవారి వివాహం జరిపించారు. పెళ్లి పెద్దలుగా శ్రీవారి తరఫున బ్రాహ్మణులు, ఆలయ పాలక కమిటీ సభ్యులు, పుర ప్రముఖులు వ్యవహరించారు. శనివారం ఉదయం మేళతాళాలతో పెళ్లి కూతురు అయిన పద్మావతి (మౌనిక)ని ఊరేగింపుగా మార్కండేయస్వామి ఆలయానికి తీసుకొచ్చారు. అక్కడ పెళ్లికూతురిని అలంకరించి కోటలోని శ్రీవారి సన్నిధి వరకు ఊరేగింపుగా తెచ్చారు. అనంతరం శ్రీవారి ఉత్సవ విగ్రహం ముందు కూర్చోబెట్టారు.వేద మంత్రోచ్ఛారణ మధ్య వివాహం జరిపించారు. అభిజిత్ లగ్న శుభపుష్కరాంశమునందు పురోహితులు మంగళసూత్రాన్ని బాలిక మెడకు తాకించి శ్రీవారి పక్కనే ఉన్న పద్మావతి ఉత్సవ విగ్రహానికి కట్టారు. పసుపు కొమ్ముతో ఉన్న మంగళసూత్రాన్ని బాలిక మెడలో తల్లి కట్టడంతో పెళ్లితంతు ముగిసింది. -
ప్రేమ పేరుతో యువకుడిని మోసం చేసిన యువతి
-
దీన్నే పిచ్చి అంటారు..మారండి ప్లీజ్! వైరల్ వీడియో
లేని పోని ప్రయోగాలకు పోతూ ప్రాణాలకు మీదకు తెచ్చుకుంటున్న ఘటనలు నిత్యం చూస్తూనే ఉన్నాం. తాజాగా వేగంగా కదులుతున్న ట్రైన్లోంచి ఒక బాలిక దూకేసిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్గా మారింది. విపరీత పోకడలతో సాహసాలు చేయొద్దని ఎంత చెప్పినా ప్రయోజనం ఉండటంలేదు అనడానికి ఈ ఘటనే ఉదాహరణ. ఒక బాలిక చాలా వేగంగా కదులుతున్న రైలు ద్వారం దగ్గర నిలబడి ఉంటుంది.. మెల్లిగా మెట్లు దిగుతూ సడెన్గా పట్టాలపైకి దూకేసింది. అయితే ఆమెను నివారించాల్సిన వారు వీడియో తీయడం విమర్శలకు తావిచ్చింది. ఇది కావాలనే చేశారా? లేదా ఆమె ఆత్మహత్యకు యత్నించిందా? ఎక్కడ జరిగింది? అనే ప్రశ్నలకు సమాధానం లేదు. అయితే ఆమె తీవ్ర గాయాలతో బతికే ఉందని మాత్రం కొంత మంది కమెంట్ చేశారు. Girl jumps from a running train expecting to get off like in Bollywood 🤦♂️🤦♂️🤦♂️ pic.twitter.com/5ktDKMus6o — Pagan 🚩 (@paganhindu) April 12, 2024 -
వారెవ్వా..నిఖిత : కోతులకు చుక్కలు చూపించింది.. దెబ్బకు!
పిల్లలు గాడ్జెట్స్ వాడకంలో భలే ఆసక్తి చూపిస్తూ ఉంటారు. మనం వాళ్లకి సరైన పద్ధతిలో నేర్పించా లేగానీ, టెక్నాలజీని చాలా తొందరగా నేర్చుకుంటారు. సమయానికి వాడుతారు కూడా. యూపీలో జరిగిన ఒక సంఘటన చూస్తే మీరూ నిజం అంటారు. ప్రమాదకర పరిస్థితిలో ఏమాత్రం భయపడకుండా ఓ అమ్మాయి స్మార్ట్గా వ్యవహరించింది. తనను తాను కాపాడుకోవడమే కాదు , నెలల వయస్సున్న చెల్లెల్ని కూడా రక్షించు కుంది. ఉత్తరప్రదేశ్లోని బస్తీ జిల్లాలో నివసించే 13 ఏళ్ల నిఖిత కోతుల దాడినుంచి తన చెల్లాయిని కాపాడుకున్న తీరు విశేషంగా నిలిచింది. అసలు ఏం జరిగిందంటే... కుటుంబ సభ్యులు అంతా ఎవరి పనుల్లో వారు సందడిగా ఉన్నారు. ఇంతలో నిఖిత తన చెల్లిలితో ఆడుకుంటున్న సమయంలో ఇంట్లోకి కోతులు చొరబడ్డాయి. వంటగదిలోకి వెళ్లి, వంట సామాన్లు చిందరవందర చేసాయి. కొన్నింటిని విసిరి పారేసాయి. ఇది చాలదన్నట్టు చిన్నారిపై దాడికి ప్రయత్నించాయి. కుటుంబ సభ్యులంతా పై అంతస్థులో వేరే గదిలో ఉన్నారు. అయినా నిఖిత తల్లిని పిలవడానికి ప్రయత్నించింది. కానీ అవి మరింత రెచ్చిపోయాయి. ఇక్కడే నిఖిత తెలివిగా ఆలోచించింది. కోతిని భయపెట్టేలా కుక్కలా గట్టిగా మొరగాలని అలెక్సాను ఆదేశించింది. అంతే అమెజాన్ వాయిస్ అసిస్టెంట్ అలెక్సా పెద్దగా మొరిగే శబ్దాలు చేసింది. దీంతో కోతిని భయపడి పారిపోయింది. #WATCH | Uttar Pradesh: A girl named Nikita in Basti district saved her younger sister and herself by using the voice of the Alexa device when monkeys entered their home. Nikita says, "A few guests visited our home and they left the gate open. Monkeys entered the kitchen and… pic.twitter.com/hldLA0wvZS — ANI UP/Uttarakhand (@ANINewsUP) April 6, 2024 #WATCH | Nikita's mother says, "We were sitting in the room, the gate was open when the girl called me. When I came and saw that monkeys were in the kitchen and scaring her I called Nikita, and she used her mind and asked Alexa to play the sound of a dog. Because of that barking… pic.twitter.com/gzBGr3P004 — ANI UP/Uttarakhand (@ANINewsUP) April 6, 2024 “కొంతమంది అతిథులు మా ఇంటికి వచ్చారు, వారు గేటు తెరిచారు. దీంతో కోతులు వంటగదిలోకి ప్రవేశించి వస్తువులను విసిరి పారేశాయి. ఇద్దరమూ భయపడ్డాం. అప్పుడు కుక్క మొరిగే శబ్దాలను ప్లే చేయమని అలెక్సాను అడిగాను. అలెక్సా చేసిన శబ్దాలకు కోతులు భయపడి పారిపోయాయి” అని నిఖితా జరిగిన సంఘటనను ఏఎన్ఐతో వివరించింది. ఈ గలాటా అంతా వినబడి తానూ వచ్చాననీ, అలెక్సా చేసిన శబ్దాలకు కోతులు భయపడి పారిపోయాని నిఖిత తల్లి చెప్పింది. -
బాలికలు, మహిళలను వేధించే వారిని వదలం
మధురవాడ(భీమిలి): బాలికలు, మహిళలను ఇబ్బందులకు గురిచేసినా, వారి పట్ల అసభ్యంగా ప్రవర్తించినా అలాంటి వారిని వదిలే ప్రసక్తే లేదని, కఠిన చర్యలు తీసుకుంటామని ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ గజ్జల వెంకటలక్ష్మి హెచ్చరించారు. విశాఖ కొమ్మాది చైతన్య కళాశాలలో ఫ్యాకల్టీ లైంగిక వేధింపులకు విద్యార్థిని రూపశ్రీ మృతి చెందిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో విచారణ కమిటీ సభ్యులు, ఏపీ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ కేసలి అప్పారావుతో కలిసి బుధవారం ఆమె కళాశాలను సందర్శించారు. తరగతి గదులు, ల్యాబ్లు, హాస్టల్ భవనం, పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. తర్వాత అక్కడి ఇంజనీరింగ్, డిప్లమా ఫ్యాకల్టీ, సిబ్బందితో వేర్వేరుగా సమావేశమయ్యారు. మీ పిల్లలు ఈ పరిస్థితిలో ఉంటే ఇలానే వదిలేస్తారా? ఇక్కడ ల్యాబ్లో ఓ వ్యక్తి ఆడబిడ్డల పట్ల అంత దారుణంగా వ్యవహరిస్తున్నాడంటే వాడు మనిషా, పశువా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కళాశాల గుర్తింపు రద్దుకు సిఫార్సు అనంతరం వెంకటలక్ష్మి మీడియాతో మాట్లాడుతూ పిల్లలను తీర్చిదిద్దాల్సిన ఫ్యాకల్టీయే విద్యార్థులతో సభ్య సమాజం తలదించుకునేలా వ్యవహరించడం దారుణమన్నారు. విద్యా సంస్థకు ఉండాల్సిన కనీస నిబంధనలను ఈ కళాశాల పాటించడం లేదని తెలిపారు. చాలా చోట్ల సీసీ కెమెరాల్లేవని, ల్యాబ్లో మానిటరింగ్ సిస్టమ్ లేదన్నారు. ఉమెన్ ప్రొటెక్షన్ సెల్, రికార్డులు, ఐసీసీ కమిటీలు, యాంటీ ర్యాగింగ్ సిస్టం.. కనీసం కంప్లయింట్ బాక్స్ కూడా లేదన్నారు. కళాశాల గుర్తింపు రద్దుకు సిఫార్సు చేస్తున్నామన్నారు. హాస్టల్లో విద్యార్థులకు కల్పించే వసతులు, భోజనం వంటి విషయాల్లోనూ వివక్ష ఉందని, ప్రభుత్వం నుంచి ఫీజు వచ్చేవారికి నాణ్యమైన భోజనం లేదని, కనీసం మంచాలు కూడా లేవన్నారు. ప్రైవేటు ఫీజులు చెల్లించే వారికి అన్ని సౌకర్యాలూ కల్పించారని చెప్పారు. ఈ కేసులో ఇప్పటికే ఐదుగురు అరెస్ట్ అయ్యారని, ఇంకా విచారణ కొనసాగుతోందన్నారు. కాగా, రూపశ్రీ మృతిపై వెంకటలక్ష్మి పలు అనుమానాలు వ్యక్తం చేశారు. నాలుగో అంతస్తుపై నుంచి పడి మృతి చెందిన బాలిక శరీరంపై ఏ రకమైన దెబ్బలూ లేకపోవడం, ఒక బాలిక ఉదయం నుంచి రాత్రి వరకు కనిపించకున్నా పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడం వంటి ప్రశ్నలు ఎన్నో ఉన్నాయన్నారు. అనంతరం ఆందోళన శిబిరంలో ఉన్న రూపశ్రీ తల్లిదండ్రులను పరామర్శించి.. న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. కమిషన్ సభ్యురాలు గెడ్డం ఉమ, ఏపీఎస్సీపీసీ డైరెక్టర్ టి.ఆదిలక్ష్మి, మహిళా కమిషన్ డైరెక్టర్ ఆర్.సుజి, ఏయూ లా కాలేజి ప్రొఫెసర్ విజయలక్ష్మి, మహిళా కమిషన్ లీగల్ కౌన్సిలర్ పూజితయాదవ్ తదితరులు పాల్గొన్నారు. పూర్తి నివేదిక ఇవ్వండిసీఎస్, డీజీపీలకు ఎన్హెచ్ఆర్సీ ఆదేశం సాక్షి, న్యూఢిల్లీ: ఫ్యాకల్టీయే లైంగికంగా వేధిస్తే ఇంకెవరికి చెప్పను నాన్న.. అంటూ తండ్రికి మెసేజ్ చేసి ఆత్మహత్యకు పాల్పడిన బాలిక ఘటనపై నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్(ఎన్హెచ్ఆర్సీ) స్పందించింది. బాలిక ఆత్మహత్య ఘటనపై పూర్తి నివేదికను అందించాలంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలకు నోటీసులిచి్చంది. మార్చి 28న విశాఖపట్నం కొమ్మాదిలోని ‘చైతన్య ఇంజనీరింగ్’ కళాశాలలో డిపొ్లమా మొదటి సంవత్సరం చదువుతున్న రూపశ్రీ(16) లైంగిక వేధింపుల కారణంగా హాస్టల్ భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. తన ఫ్యాకల్టీయే లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు, ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానంటూ బెదిరిస్తున్నాడని తండ్రికి మెసేజ్లో తెలిపింది. ఈ ఘటనపై వార్తా పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా ఎన్హెచ్ఆర్సీ సుమోటాగా కేసు నమోదు చేసింది. నాలుగు వారాల్లో బాలిక ఆత్మహత్యకు గల కారణాలతో తమకు నివేదిక అందించాలంటూ సీఎస్, డీజీపీలను ఎన్హెచ్ఆర్సీ ఆదేశించింది. నివేదికతో పాటు రాష్ట్ర పోలీసు శాఖ జరిపిన ఇన్వెస్టిగేషన్ను కూడా తెలపాలంటూ సూచించింది. కాగా, బాలిక ఆత్మహత్యకు పాల్పడిన సంఘటనను పరిశీలిస్తే కొమ్మాదిలోని “చైతన్య ఇంజనీరింగ్’ కళాశాల యాజమాన్యమే కారణం అనే విషయం తెలుస్తోందంటూ ఎన్హెచ్ఆర్సీ పేర్కొంది. కాలేజీలో ఇంకెంతమంది విద్యార్థినిలు ఫ్యాకల్టీల లైంగిక వేధింపులకు గురవుతున్నారనే విషయాన్ని రాష్ట్ర పోలీసు శాఖ క్షుణ్ణంగా దర్యాప్తు చేయాలని సూచనలు చేసింది. విద్యార్థినులను వేధిస్తున్న వారిపై కేసులను సైతం నమోదు చేయాలని ఎన్హెచ్ఆర్సీ పేర్కొంది. -
పైజామా పార్టీలో కరీనా కపూర్ ధరించి డ్రెస్ ధర వింటే..నోరెళ్లబెట్టాల్సిందే
బాలీవుడ్ గ్లామరస్ హీరోయిన్ గా ఒకప్పుడు తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టార్ ఇమేజ్ ను సంపాదించుకున్న వారిలో కరీనా కపూర్ ఒకరు. 42 ఏళ్ళ వయసులో ఉన్నా కూడా ఇంకా తన ఫిట్నెస్ తో ఆశ్చర్యపరిస్తూనే ఉంటుంది. తన అందంతో ఎప్పటికప్పుడు ఫాలోవర్స్ను ఆకట్టుకునేలా ఫొటోలను షేర్ చేస్తుంటుంది. ఇక ఆమె వ్యక్తిగత జీవితానికి వస్తే..సైఫ్ అలీ ఖాన్ని పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లకు జన్మనిచ్చింది. అయినప్పటికి.. కుర్ర హీరోయిన్లకు తీసుపోని విధంగా గ్లామరస్ లుక్ని మెయింటెయిన్ చేయడం విశేషం. ఇక ఆమె నటించిన గర్ల్స్ గ్యాంగ్ ఆన్ గర్ల్ఫ్రెండ్స్ మూవీ మంచి సక్సెస్ని అందుకుని కరీనా కపూర్కి మంచి పేరుని తెచ్చిపెట్టింది. ఈ సినిమా సక్సెస్తో ఆమె ఖాతాలో మరో బ్లాక్ బాస్టర్ మూవీగా చేరడం విశేషం. ఈ నేపథ్యంలో కరీనా కపూర్ తన మూవీ సిబ్బందితో మూవీ సక్సెస్ని జరుపుకుంది. అందుకోసం జరిగిన పైజామా పార్టీలో కరీనా ప్రసిద్ధ కఫ్తాన్ గర్ల్ ఫర్ లైఫ్ బ్రాండ్డ్ పైజామాలో మెరిసింది. రాత్రి సమయంలో ధరించే సౌకర్యవంతమైన పైజామా ఇది. అందులో ఆమె ముఖానికి మేకప్ లేకుండా నేచురల్గా, వదులుగా ఉన్న జుట్టుతో ఆకర్షించింది. ఈ పైజామాలో ఆమె లుక్ అత్యంత నేచురల్గా మతిపోగొట్టేలా ఉంది. ఆమె తోపాటు కరిష్మా కపూర్, మలైకా అరోరా, అమృతా అరోరా మరియు మాలికా భట్లు కూడా తమదైన డిజైన్ వేర్లలో సందడి చేశారు. కానీ అంతమంది అందాల భామల్లో కరీనా దుస్తులు హైలెట్గా నిలవడమే గాక ప్రధాన ఆకర్షణగా ఆమె లుక్ కనిపించింది. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక కరీనా ధరించిన ఆ డ్రెస్ ధర ఏకంగా రూ. 1,78,006 పలుకుతుందట. ఈ డిజైన్వేర్ని ప్రింటెడ్ సిల్క్ క్రేప్ డి చైన్ కఫ్తాన్ అని పిలుస్తారట. నైట్ టైంలో సౌకర్యవంతంగా ధరించే పైజామా అంత ఖరీదా?.. అని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. అయినా కరీనా అంటే ఆ మాత్రం రేంజ్లో ధర ఉండాల్సిందే అని మరి కొందరూ కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Karisma Kapoor (@therealkarismakapoor) (చదవండి: ఐశ్వర్య అందమంతా చీరలోనే.. ధరెంతో తెలుసా?) -
గ్రామీణ యువతికి ఆరు నెలల్లో మూడు ప్రభుత్వ ఉద్యోగాలు
రాజస్థాన్లోని గ్రామీణ ప్రాంత యువతులు ప్రభుత్వ ఉద్యోగాల విషయంలో తాము యువకులకు ఏమాత్రం తక్కువకాదని నిరూపిస్తున్నారు. కేవలం ఆరు నెలల వ్యవధిలో మూడు ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన కల్పన దీనికి ఉదాహరణగా నిలిచారు. రాజస్థాన్లోని ఫతేపూర్ షెఖావతి పరిధిలోని రినౌ గ్రామానికి చెందిన కల్పనా బిర్దా ఒక సాధారణ రైతు కుటుంబానికి చెందిన యువతి. ఆమె తొలుత సీహెచ్ఎస్ఎల్లో క్లర్క్ ఉద్యోగం సంపాదించింది. తరువాత ఆడిటర్గా ఉద్యోగం దక్కించుకుంది. ఇప్పుడు సీజీఎస్టీలో ఇన్స్పెక్టర్ ఉద్యోగం చేజిక్కించుకుంది. కుటుంబంలోని ముగ్గురు అక్కాచెల్లెళ్లలో కల్పన పెద్దది. బనస్థలి విద్యాపీఠ్లో చదువు పూర్తి చేసింది. కాలేజీలో చదువుతున్నప్పుడే ప్రభుత్వ ఉద్యోగానికి ప్రిపేర్ అయ్యింది. కల్పన తండ్రి మహిపాల్ విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నాడు. ఆమె తల్లి పొలం పనులతో పాటు ఇంటిపనులకు కూడా చేస్తుంది. కల్పన ఇన్స్పెక్టర్గా ఎంపికకావడంతో వారి ఇంటిలో ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. కల్పన మీడియాతో మాట్లాడుతూ తాను పోటీపరీక్షల కోసం తొలుత ఢిల్లీలో కొన్ని రోజులు కోచింగ్ తీసుకున్నానని, ఆ తర్వాత ఇంట్లోనే చదువుకున్నానని తెలిపింది. చదువుతో పాటు ఎప్పటికప్పుడు రివిజన్ కూడా చేసుకునేదానినని, ఈ రివిజన్ కారణంగానే పోటీ పరీక్షల్లో విజయం సాధించగలిగానని తెలిపింది. -
నా కుమార్తెను వ్యభిచారంలోకి దించేందుకు నా ఫ్రెండ్ ప్రయత్నిస్తోంది
సాక్షి, అమరావతి: తన కుమార్తెను తన స్నేహితురాలు డబ్బు కోసం వ్యభిచార వృత్తిలో దించేందుకు ప్రయత్నిస్తోందని, తన కుమార్తెను తనకు అప్పగించేలా ఆదేశించాలని కోరుతూ రాయలసీమ ప్రాంతానికి చెందిన ఓ మహిళ కొంతకాలం క్రితం హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ వ్యాజ్యంపై జస్టిస్ దుర్గాప్రసాదరావు నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ఆ బాలికను తమ ముందు హాజరుపరచాలని పోలీసులను ఆదేశించింది. పోలీసులు ఆ బాలికను కోర్టు ముందు హాజరుపరచగా.. మంగళగిరి వద్ద ఉన్న ఉజ్వలా హోంలో ఉంచాలని పోలీసులను ధర్మాసనం ఆదేశించింది. ఆ బాలిక వ్యవహారంపై ప్రాథమిక విచారణ జరిపి, బాధ్యులపై కేసు నమోదు చేయాలంది. అంతేకాక ఈ కేసులో సదరు జిల్లా ఎస్పీని ప్రతివాదిగా చేర్చింది. అలాగే పిటిషనర్ తన స్నేహితురాలిగా పేర్కొన్న మహిళ కూడా కోర్టు ముందు హాజరయ్యారు. తాను కుట్టుపని చేసుకుంటూ జీవనం సాగిస్తుంటానని, ఆ బాలికను తాను అక్రమంగా నిర్భంధించలేదని ఆ మహిళ తెలిపారు. ఆ బాలిక తన వద్దకు వచ్చి మూడు నెలలు ఉందని, ఆ సమయంలో ఆ బాలికకు టైలరింగ్ నేర్పించానని తెలిపారు. అనంతరం హైకోర్టు ఈ వ్యవహారంలో ప్రభుత్వ వాదన వినాలని నిర్ణయించి అప్పుడు విచారణను వాయిదా వేసింది. విధానపరమైన నిర్ణయం తీసుకోవాలి.. ఇటీవల ఈ వ్యాజ్యం విచారణకు రాగా, రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ హాజరయ్యారు. ఆ బాలికను వ్యభిచార వృత్తిలోకి దించేందుకు ప్రయత్నించిన వారిపై పోలీసులు కేసు నమోదు చేశారని కోర్టుకు వివరించారు. బాధిత బాలిక సంరక్షణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ, నిస్సహాయ బాలికలు, మహిళలను మానవ అక్రమ రవాణాదారుల నుంచి కాపాడాలని, ఈ విషయంలో విధానపరమైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం చేసింది. అలాగే మానవ అక్రమ రవాణాదారుల ఉచ్చులో నుంచి బయటపడిన బాలికలు, మహిళల పునరావాసం కోసం కూడా చర్యలు తీసుకోవాలంది. ప్రస్తుతం చట్టంలో విటులను బాధితులుగా పేర్కొన్నారని, వాస్తవానికి వారిని నిందితులుగా పేర్కొనాల్సిన అవసరం ఉందని తెలిపింది. దీనిపై ఏజీ ఎస్.శ్రీరామ్ స్పందిస్తూ, మానవ అక్రమ రవాణాదారుల నుంచి బాలికలు, మహిళలను కాపాడే విషయంలో విధానపరమైన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. అలాగే పునరావాసం విషయంలో అన్ని చర్యలు తీసుకుంటామని నివేదించారు. సమగ్ర వివరాలతో విధానపరమైన నివేదిక సమర్పిస్తామన్నారు. దీంతో హైకోర్టు తదుపరి విచారణను ఏప్రిల్ 11కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ఉప్మాక దుర్గాప్రసాదరావు, జస్టిస్ మండవ కిరణ్మయి దర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. -
ఇదేం వ్యాధి.. తినకూడనివన్నీ లాగించేస్తోంది..
ఇలాంటి రుగ్మతలు రాకుండా ఉంటే బాగుండనిపించే భయానక వ్యాధులు కొన్ని ఉన్నాయి. ఆ వ్యాధి పరిస్థితి చూస్తే చాలా బాధగా అనిపిస్తుంది. వాటికి సరైన చికిత్స కూడా ఉండదు. ఇదేం కర్మ అనేంత విచిత్రమైన వ్యాధుల్లా ఉంటాయి. అలాంటి అరుదైన రుగ్మతతోనే మూడేళ్ల చిన్నారి బాధపడుతోంది. ఆమె పరిస్థితి ఎంత ఘోరంగా ఉందంటే..తల్లిదండ్రులకు నిత్యం ఆ చిట్టి తల్లిని పరివేక్షించలేక కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. అసలేం జరిగిందంటే.. బ్రిటన్కి చెందిన మూడేళ్ల వింటర్ హేర్నే ఆటిజం తోపాటు విచిత్రమైన మరోక వ్యాధితో బాధపడుతుంది. ఆమె తినకూడని వాటిని హాంఫట్ చేసేస్తుంది. అంటే ఆ చిన్నారి గోడలకు వేసే ప్లాస్టర్లు, సోఫా ఫోమ్, ఫోటో ఫ్రేమ్ల్లోని గ్లాస్లు వంటి వాటన్నింటిని తినేస్తుంది. గృహోపకరణ వస్తువులన్నీ తినేసే అరుదైన రుగ్మతతో బాధపడుతుంది. ఈ వ్యాధిని 'పికా'గా రోగ నిర్థారణ చేశారు వైద్యులు. దీని కారణంగా బాధితులు తినకూడని వాటిని తినేలా ప్రేరేపిస్తుందని చెప్పుకొచ్చారు వైద్యులు. ఇక్కడ ఈ చిన్నారి ఇలా సోఫా ఫోమ్, ఫోటో ఫ్రేమ్ గ్లాస్లు తిన్నా ఆమెకు ఏం కాలేదని తన తల్లి చెబుతోంది. 'పికా' వ్యాధి అంటే.. పికా అనేది మానసిక ఆరోగ్య పరిస్థితి కారణంగా తలెత్తే ఒక విధమైన రుగ్మత. దీని కారణం ఆహారం కానీ వాటిని బలవంతంగా మింగడం, తినడం వంటివి చేస్తారని నిపుణులు చెబుతున్నారు. ఇది పిల్లల్లో చాలా సాధారణం. ఒక్కోసారి ప్రమాదం కాకపోయిన మరికొన్నిసార్లు తీవ్రమవుతుందని చెప్పారు. అయితే ఈ పరిస్థితికి చికిత్స కేవలం బాధితుల జీవనశైలిలో కొద్ది కొద్ది మార్పులతో ఓపికగా వారిని మార్చడమే అని చెబుతున్నారు. అయితే ఈ పికా వ్యాధి ఏ వయసులోనైనా సంభవిస్తుందట. ఎవరికైనా కూడా రావొచ్చని చెబుతున్నారు. ఎలాంటి వారికి వస్తుందంటే.. చిన్నపిల్లలు-ముఖ్యంగా ఆరు ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్నవారు గర్భిణి స్త్రీలు మానసిక ఆరోగ్య పరిస్థితులతో బాధపడుతున్నారు-అంటే ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్, మేధో వైకల్యాలు లేదా స్కిజోఫ్రెనియా ఎలా ప్రభావితం చేస్తుందంటే. తినకూడని వాటిని తినేలా ప్రేరేపిస్తుంది. దీంతో గట్టి పదార్థాలను కొరకడంతో దంతాలు దెబ్బతింటాయి. ఒక్కోసారి అవి విషపూరితం కావొచ్చు లేదా అరగక జీర్ణ సంబంధ సమస్యలు ఎదుర్కొనే పరిస్థితి రావొచ్చు. ఎందువల్ల వస్తుందంటే.. దేని కారణంగా పికా వ్యాధి వస్తుందనేందుకు కచ్చితమైన కారణాలు తెలియరాలేదని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ వ్యాధి వచ్చే ప్రమాదాన్ని పెంచే అంశాలను గురించి మాత్రం వెల్లడించారు. అవేంటంటే.. ఒత్తిడి, ఆందోళన ఆర్థిక పరిస్థితులు పోషకాహార లోపాలు మానసిక ఆరోగ్య పరిస్థితులు వైద్య పరిస్థితులు (చదవండి: 'ఉపవాసం' వల్ల గుండె జబ్బులు వస్తాయా? పరిశోధనలో షాకింగ్ విషయాలు) -
ఓటీటీలో హనుమాన్.. కన్నీళ్లు పెట్టుకున్న చిన్నారి...!
టాలీవుడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన హనుమాన్ కొత్త ఏడాదిలో రిలీజై బ్లాక్ బస్టర్గా నిలిచింది. చిన్న సినిమాగా వచ్చి సూపర్ హిట్ కొట్టింది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించిన ఈ చిత్రం ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో ప్రేక్షకులను అలరించిన హనుమాన్ ఓటీటీలోనూ దూసుకెళ్తోంది. అయితే ఈ సినిమాకు చిన్నపిల్లలు బాగా కనెక్ట్ అయ్యారు. హనుమాన్ విజువల్స్.. తేజ సజ్జా ఫర్మామెన్స్కు పిల్లలు ఫిదా అయిపోయారు. తాజాగా ఈ మూవీని వీక్షించిన ఓ చిన్నారి.. కన్నీళ్లు పెట్టుకుంది. హనుమాన్ చిత్రంలో కుస్తీ ఫైట్ సీన్ను చూసిన చిన్నారి బోరున ఏడ్చేసింది. దీనికి సంబంధించిన వీడియోను ఆ పాప తండ్రి ట్విటర్లో షేర్ చేశారు. ఈ వీడియోకు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ రిప్లై కూడా ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. Awww 🥹🤗 https://t.co/HlczCf7Ewx — Prasanth Varma (@PrasanthVarma) March 18, 2024 -
హాస్టల్ ముందు ఫ్రెండ్ ఓవరాక్షన్...యువతి ఆత్మహత్య
-
వీధి కుక్కల దాడిలో చిన్నారి మృతి
దేశ రాజధాని ఢిల్లీలోని తుగ్లక్ రోడ్ ప్రాంతంలో మూడు, నాలుగు వీధి కుక్కలు ఏడాదిన్నర బాలికను బలిగొన్నాయి. చుట్టుపక్కలవారు రక్షించే సమయానికే ఆ బాలిక తీవ్రంగా గాయపడింది. కుటుంబసభ్యులు బాధిత బాలికను సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు ఆ చిన్నారి మృతి చెందిందని నిర్ధారించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించిన పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. బాధిత బాలికను దివాన్షిగా గుర్తించారు. మృతురాలు దివాన్షి తుగ్లక్ లేన్లోని చమన్ ఘాట్ ప్రాంతంలో తన కుటుంబంతోపాటు ఉంటోంది. బాలిక తండ్రి రాహుల్ దుస్తులను ఇస్త్రీ చేస్తుంటాడు. ఈ ప్రాంతంలో వీధి కుక్కలు విపరీతంగా సంచరిస్తుంటాయని రాహుల్ సన్నిహితుడు వివేక్ కుమార్ తెలిపాడు. రాత్రి భోజనం చేశాక రాహుల్ కుటుంబ సభ్యులు బయటకు వచ్చారు. వారికి తమ కుమార్తె కనిపించలేదు. ఇంటికి కొంత దూరంలో రక్తపుమడుగులో ఆ చిన్నారి కనిపించింది. ఆ సమయంలో చిన్నారిపై వీధి కుక్కలు దాడి చేస్తున్నాయి. ఘటనాస్థలికి సమీపంలో డీజే ప్లే అవుతున్నదని స్థానికులు తెలిపారు. ఆ సందడిలో చిన్నారి ఆర్తనాదాలు ఎవరికీ వినిపించలేదు. చివరికి చుట్టుపక్కలవారు ఎలాగోలా కుక్కల బారి నుంచి ఆ చిన్నారికి విముక్తి కల్పించారు. విషయం తెలుసుకున్న జనం అక్కడ పెద్ద ఎత్తున గుమిగూడారు. ఇంతలో ఈ ఘటనపై ఎవరో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రజలను శాంతింపజేసి, బాధిత బాలికను సఫ్దర్జంగ్ ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు ఆ చిన్నారి మృతి చెందిందని నిర్ధారించారు. -
వేలెడంత.. బారెడంత..
ప్రపంచంలోనే అత్యంత పొడవైన అబ్బాయి.. అత్యంత పొట్టి అమ్మాయి.. ఇద్దరూ ఒకచోట చేరితే.. ఇదిగో ఇలా ఉంటుంది. ఇతడి పేరు సుల్తాన్ కోసెన్.. వయసు 41 ఏళ్లు.. టర్కీకి చెందిన కోసెన్ పొడవు ఏకంగా 8 అడుగుల 3 అంగుళాలు.. మరి ఈమె పేరు జ్యోతి ఆమ్గే.. వయసు 30 ఏళ్లు..ఇండియాకు చెందిన ఈమె పొడవు కేవలం రెండు అడుగులే. ఇద్దరి మధ్య తేడానే ఆరు అడుగులకన్నా ఎక్కువ. సుమారు ఆరేళ్ల కింద ఈజిప్ట్ పిరమిడ్ల దగ్గర ఈ ఇద్దరితో నిర్వహించిన ఫొటోషూట్ అప్పట్లో అందరి దృష్టినీ ఆకర్షించింది. మళ్లీ రెండు రోజుల కింద అమెరికాలోని కాలిఫోర్నియాలో మరో ఫొటో షూట్ కోసం వారిద్దరూ కలిశారు. అక్కడ తీసిన చిత్రాలే ఇవి. అకొండ్రోప్లాసియాగా పిలిచే లోపం వల్ల జ్యోతి ఎదుగుదల లేక మరుగుజ్జులా ఉండిపోతే.. పిట్యుటరీ గ్రంథిలో ట్యూమర్తో గ్రోత్ హార్మోన్ విపరీతంగా ఉత్పత్తయి కోసెన్ ఇలా భారీగా ఎదిగిపోయాడు. -
కళ్లు కలువ పువ్వుల్లా పెద్దవిగా ఉండాలంటే.. ఈ ఐ బ్యాండ్ ఉంటే చాలు!
అందానికి సహజ చిట్కాలు పాటించేవాళ్లు కొందరైతే.. మేకప్తో కవర్ చేసుకునేవారు మరికొందరు. అయితే ఏ పద్ధతి పాటించినా.. ముఖం కళగా, అందంగా కనిపించాలంటే.. కళ్లు ప్రత్యేకంగా అగుపించాలి. ఈ చిత్రంలోని సౌందర్య సాధనం కళ్లను అందంగా తీర్చిదిద్దుతుంది. ఇది కళ్లను పెద్దవిగా, కలువ పువ్వులా మారుస్తుంది. ఈ ఐ బ్యాండ్.. కళ్ల చుట్టూ ఉండే ప్రాంతాన్ని సాగదీసి.. ముఖానికి సొగసులు అద్దుతుంది. దీన్ని స్నానం చేస్తున్నప్పుడు కూడా సులభంగా ధరించొచ్చు. టీవీ చూస్తున్నప్పుడు.. ఇంటి పనులు చేసుకుంటున్నప్పుడు.. ల్యాప్టాప్ వర్క్ చేసుకునేటప్పుడూ చక్కగా వాడొచ్చు. చిత్రంలో చూపించినట్టుగా కేవలం 10 నిమిషాల పాటు కళ్లకు పెట్టుకుంటే చాలు. కళ్లు కలువల్లా ఆకర్షణీయంగా మారుతాయి. ఈ బ్యాండ్ లోపలివైపున 50కి పైగా చిన్న చిన్న పవర్ బాల్స్ అమరి ఉంటాయి. ఈ బ్యాండ్ని సులభంగా చెవులకు తగిలించుకుంటే.. కళ్లకు బిగుతుగా, పట్టినట్లుగా ఉంటుంది. దీని ధర 25 డాలర్లు. అంటే 2,074 రూపాయలు. (చదవండి: లీఫ్ ఆర్ట్: ఇంటికి సరికొత్త అలంకరణ తెచ్చే ఆర్ట్!) -
రూ. 90 వేలకు పసికందు విక్రయం.. కన్నతల్లిని మభ్యపెట్టి..
ఎనిమిది నెలల బాలికను రూ.90 వేలకు విక్రయించిన కేసులో జార్ఖండ్లోని రామ్గఢ్ పోలీసులు ఇద్దరు మహిళలు, ఒక యువకుడిని అరెస్టు చేశారు. పోలీసులు ఆ బాలికను స్వాధీనం చేసుకుని చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి అప్పగించారు. ఈ కేసులో అరెస్ట్ చేసిన నిందితులను పోలీసులు జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. రామ్గఢ్ పోలీస్ స్టేషన్లో ఆ బాలిక తండ్రి రాహుల్ సాహ్ని ఇచ్చిన ఫిర్యాదులో తాను ఆటో నడుపుతూ తన కుటుంబాన్ని పోషిస్తున్నానని తెలిపాడు. నాలుగు నెలల క్రితం రోడ్డు ప్రమాదంలో తన కాలు విరిగిందని, అప్పటి నుంచి ఇంట్లోనే ఉంటున్నానని పేర్కొన్నాడు. 2023, డిసెంబర్లో తన భార్య తమ ఎనిమిది నెలల కుమార్తె అనన్యతో కలిసి హజారీబాగ్లోని పుట్టింటికి వెళ్లిందని పేర్కొన్నాడు. అయితే 2024, ఫిబ్రవరి 11న తన భార్య ఇంటికి తిరిగి వచ్చినప్పుడు, తమ కుమార్తె అనన్య కుమారి ఆమెతో లేదని తెలిపాడు. బాలిక తండ్రి రాహుల్ సాహ్ని తన ఫిర్యాదులో తెలిపిన వివరాల ప్రకారం అతని భార్య పుట్టింటి నుండి తిరిగి వచ్చిన తరువాత.. ఆమెను కుమార్తె గురించి అడిగినప్పుడు.. కొన్ని రోజుల క్రితం రాహుల్ కుమార్ రామ్, రీటా దంపతులు తనను సంప్రదించారని.. వారు నీ భర్త కాలు విరిగిందని, మీ పరిస్థితి బాగోలేదని చెబుతూ , తమ కుమార్తెను వారికిస్తే జాగ్రత్తగా చూసుకుంటామని చెప్పారని, భర్త ఆరోగ్యం కుదుటపడ్డాక, కుమార్తెను తిరిగి తీసుకువెళ్లవచ్చని చెప్పడంతో ఆమె కుమార్తెను వారికి అప్పగించిందని తెలిపాడు. తన భార్య తమ కుమార్తె అనన్య కుమారిని రామ్ఘర్ టేకర్ స్టాండ్ దగ్గర ఆ దంపతులకు అప్పగించినట్లు రాహుల్ సాహ్ని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఆ తర్వాత భర్త.. భార్యను మందలించి, రాహుల్ కుమార్, రీటాదేవిలను సంప్రదించగా, వారు తాము ఆ చిన్నారిని రీనా కుమారి, గౌతమ్ కుమార్ రామ్ దంపతులకు రూ.90 వేలకు విక్రయించినట్లు తెలిపారు. రాహుల్ కుమార్, రీటా దేవిలు తన భార్యను ప్రలోభపెట్టి, ఆమె వద్ద నుంచి తమ కుమార్తెను తీసుకుని.. రీనా కుమారి, గౌతమ్ కుమార్లకు అమ్మేశారని బాలిక తండ్రి ఆరోపిస్తున్నాడు. రీనా కుమారి, గౌతమ్ కుమార్ రామ్లు రాహుల్ కుమార్ రామ్కు బంధువులు. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని ఆ బాలికను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం బాలికను తండ్రికి అప్పగించారు. ఈ కేసులో ముగ్గురు నిందితులను జైలుకు తరలించారు. అయితే ఆ బాలికను ఆమె తల్లే విక్రయించిందా? లేక ఇతరులు బాలిక పెంపకం సాకు చూపి, ప్రలోభాలకు గురిచేసి విక్రయించారా? అనే కోణంలో విచారణ జరుగుతోంది. ప్రస్తుతం ఈ కేసులో ఒక నిందితుడు పరారీలో ఉండడంతో అతడిని పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. -
ఐన్స్టీన్ను మించిన తెలివున్నా.. ఆమెకు తీరని ఆవేదన?
ఆ అమ్మాయి.. ప్రముఖ శాస్త్రవేత్తలు ఐన్స్టీన్, స్టీఫెన్ హాకింగ్స్కు మించిన తెలివితేటలు కలిగినది. ఆమె ఐక్యూ 161 పాయింట్లు. ఇంతటి ప్రతిభావంతురాలైన ఆమెకు చదువు చెప్పలేక ఉపాధ్యాయులే సతమతమవుతున్నారట. ఇంగ్లండ్లోని స్లోఫ్కు చెందిన మహ్నూర్ చీమా(17)తన తొమ్మిదేళ్ల వయసులో పాకిస్తాన్ నుంచి కుటుంబంతోపాటు బ్రిటన్కు వచ్చింది. ఈ సమయంలో ఆ చిన్నారి తన ప్రతిభను చూపినప్పటికీ ఉపాధ్యాయులు పైతరగతికి ప్రమోట్ చేయలేదు. బెర్క్షైర్లోని కోల్న్బ్రూక్ చర్చ్ ఆఫ్ ఇంగ్లండ్ ప్రైమరీ స్కూల్ ఉపాధ్యాయులు తాను క్లాస్ వర్క్ను అందరికన్నా త్వరగా పూర్తి చేసినప్పటికీ, పై క్లాస్కు వెళ్లేందుకు అనుమతించలేదని, పైగా అదనంగా గణితాన్ని అభ్యసించాలని ఆదేశించారని చీమా తెలిపింది. ఆమె లాంగ్లీ గ్రామర్ స్కూల్కి మారినప్పుడు, జీసీఎస్ఈ పరీక్షలకు కూర్చోకుండా నిరుత్సాహపరిచారని చీమా ఆరోపించింది. అయితే చీమాపై ఒత్తిడి అధికంగా ఉందని, దానికి గుర్తుగా ఆమె కళ్లకింద నల్లని వలయాలు ఏర్పడ్డాయని ఉపాధ్యాయులు చెబుతున్నారు. అయితే ఆమె తల్లిదండ్రులు తమ చిన్నారి తెలివితేటలకు తగిన విద్యను అందించేందుకే యూకే వచ్చామని తెలిపారు. మహ్నూర్ చీమా మీడియాతో మాట్లాడుతూ తన మాదిరిగా ప్రతిభ కలిగిన చాలామంది విద్యార్థులు ఉన్నారని, అయితే వారి సామర్థ్యాన్ని ఎవరూ గుర్తించడం లేదని, ఫలితంగా వారి ప్రతిభ వృథా అవుతున్నదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. తాను ప్రతిభావంతులైన పలువురు విద్యార్థులతో మాట్లాడానని, వారు కూడా తనలానే నిరాశతో ఉన్నారని అమె పేర్కొంది. ప్రతిభావంతులైన విద్యార్థులకు చేయూతనందించాల్సిన బాధ్యత విద్యాసంస్థలపై ఉందని, బ్రిటీష్ విద్యావ్యవస్థలో గణిత బోధన చాలా నెమ్మదిగా సాగుతున్నదని, బ్రిటన్లోని 11 ఏళ్ల విద్యార్థులకు నిర్వహించే పరీక్షలను పాకిస్తాన్లో మూడవ సంవత్సరం పిల్లలు పూర్తి చేయగలరని చీమా వ్యాఖ్యానించింది. చీమా తన జీసీఎస్ఈలో 33 నైన్లు సాధించింది. ఇది అత్యధిక స్కోర్. అలాగే తాను ఉంటున్న ప్రాంత పరిధిలోని పలు పాఠశాలల ప్రవేశ పరీక్షలకు హాజరై, మూడు కౌంటీలలో అగ్రస్థానంలో నిలిచింది. చీమా కుటుంబం పాకిస్తాన్లోని లాహోర్ నుండి 2006లో యూకేకి తరలివచ్చింది - ఆమె తండ్రి, ప్రముఖ న్యాయవాది. తల్లి ఆర్థికశాస్త్రంలో రెండు డిగ్రీలు సాధించారు. జాతీయ గణిత ఛాంపియన్గా నిలిచిన 14 ఏళ్ల సోదరి కూడా ఆమెకు ఉంది. ప్రస్తుతం చీమా..హెన్రిట్టా బార్నెట్ స్కూల్లో విద్యనభ్యసిస్తోంది. చీమాకు స్విమ్మింగ్తో పాటు గుర్రపు స్వారీ చేయడమంటే కూడా ఎంతో ఇష్టం. -
అంధులకు కోసం స్మార్ట్ గాగుల్స్.. 14 ఏళ్ల బాలికల ఆవిష్కరణ!
కేరళలోని నలుగురు బాలికలు అంధులకు ఉపయోగపడే స్మార్ట్గాగుల్స్ని రూపొందించారు. వాళ్లు దాన్ని తమ పాఠశాల్లో అంధురాలిగా ఉన్న సహ విద్యార్థిని దృష్టిలో ఉంచుకుని రూపొందించినట్లు పేర్కొన్నారు. నీతి అయోగ్లో భాగంగా అటల్ ఇన్నోవేషన్ మిషన్ ఉన్నత పాఠశాలల్లో విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికి తీసేందుకు వేదికగా ఏర్పాటు చేస్తున్న అటల్ టింకరింగ్ ల్యాబ్లో దీన్ని ప్రదర్శించారు బాలికలు. ఈ ఆవిష్కరణ మూడో స్థానం దక్కించుకోవడమే గాక అందరీ దృష్టిని ప్రముఖంగా ఆకర్షించడం విశేషం. ఆపిల్ వంటి దిగ్గజ కంపెనీలు ఈ ఆలోచనకు శ్రీకారం చుట్టునున్న నేపథ్యంలో పాఠశాల విద్యార్థులు ఒక అడుగు ముందేసి ఇలాంటి గాగుల్స్ని రూపొందించాలనుకోవడం అందర్నీ సభ్రమాశ్చర్యాలకు గురి చేసింది. ఆ బాలికలు ఎలా రూపొందించారు? ఈ ఆలోచనకు మార్గదర్శకం చేసిందెవరూ..? తదితర విశేషాల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం!. కేరళలోని సెయింట్ మేరిస్ కాన్వెంట్ గర్ల్స్ హయ్యర్ సెకండరీ స్కూల్లో 9వ తరగతి చదువుతున్న విద్యార్థులు స్మార్ట్ గాగుల్స్ని రూపొందించారు. ఈ నమునాను హన్నా రీతు సోజన్, ఆన్సిలా రెజి, ఆన్లిన్ బిజోయ్, అంజెలినా అనే నలుగురు బాలికలు రూపొందించారు. ఈ స్మార్ట్ గాగుల్ అల్ట్రా సోనిక్ సెన్సార్లను ఉపయోగించింది రూపొందించారు. అందువల్ల వీటిని ధరించిన అంధ వ్యక్తులకు ఎదురుగా ఉన్న అడ్డంకులను గుర్తించి బజర్ ద్వారా వారిని ముందుగా హెచ్చరిస్తుంది. ఆ బాలికలు ఈ స్మార్ట్ గ్లాస్ నమునాని త్రిసూర్లోని సెయింట్ పాల్స్ హయ్యర్ సెకండరీ స్కూల్ అటల్ టింకరింగ్ లాబొరేటరీ(ఏటీఎల్) తొలి వార్షికోత్సవం సందర్భంగా ప్రదర్శించారు. ఈ ఏటీఎల్ని నీతి అయోగ్లో బాగంగా అటల్ ఇన్నోవేషన్ మిషన్ ఉన్నత పాఠశాల్లలో ఏర్పాటు చేసింది. ఇలాంటి ల్యాబరేటరీలను దేశవ్యాప్తంగా ఉన్న ఉన్నత పాఠశాలల్లో సుమారు పదివేలకు పైగా ఏర్పాటు చేసింది అటల్ ఇన్నోవేషన్ మిషన్. ఈ ల్యాబరేటరీలను పాఠశాల విద్యార్థుల్లోని సృజనాత్మక ఆలోచన వెలికితీసి, ప్రోత్సహించే ఉద్దేశ్యంతో ఏర్పాటు చేసింది. అంతేగాదు ముఖ్యంగా విద్యార్థుల్లో డిజైన్ మైండ్సెట్, కంప్యూటేషనల్ థింకింగ్, అడాప్టివ్ లెర్నింగ్, ఫిజికల్ కంప్యూటింగ్ వంటి నైపుణ్యాలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ఈ ల్యాబరేటరీలను ఏర్పాటు చేసింది. ఈ మేరకు సదరు బాలికలు మాట్లాడుతూ..తాము రూపొందించిన స్మార్ట్ గాగుల్ బేసిక్ మోడల్ అని, దీన్ని మరింతగా మెరుగుపర్చేలా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నామని వివరించారు. రేబాన్ వంటి పెద్ద పెద్ద కంపెనీలు ఇలాంటి ఆలోచనలతో ఉన్నట్లు తెలుసని అన్నారు. అయితే అవి అత్యంత ఖరీదైనవి, అందరికీ అందుబాటులో ఉండదని చెబుతున్నారు. ఆ సమస్యకు చెక్పెట్టేలా, చౌకగా, పర్యావరణ హితంగా రూపొందించాలనేది తమ లక్ష్యం అని ఆ బాలికలు పేర్కొన్నారు. ఇక ఈ ఏటీఎల్ ప్రోగ్రాంలో లెర్నర్ లింక్స్ ఫౌండేషన్ అనే ఎన్జీవో ద్వారా నియమించబడిన ఒక మెంటర్ ఆయా విద్యార్థులకు మార్గనిర్దేశం చేస్తాడు. ఈ ఏటీఎల్ ప్రోగ్రాంలో మొత్తం మూడు వేర్వేరు పాఠశాలకు చెందిన విద్యార్థులు అభివృద్ధి చేసిన 20కి పైగా ప్రాజెక్టులు ప్రదర్శించగా, వాటిలో మొదటి మూడు ప్రాజెక్ట్లు ప్రత్యేక అవార్డులను పొందాయి. అందులో ఈ స్మార్ట్ గాగుల్స్ ప్రాజెక్ట్ మూడవ స్థానాన్ని దక్కించుకుంది. కాగా, కేరళలోని ఏటీఎల్ ల్యాబ్ ఒప్పో ఇండియా భాగస్వామ్యంతో ఏర్పాటయ్యింది. ఈ మేరకు ఏటీఎల్ కార్యక్రమంలో ఒప్పో ఇండియా పబ్లిక్ అఫైర్స్ వైస్ ప్రెసిడెంట్ వివేక్ వశిష్ఠ మాట్లాడుతూ..ఆ యువ విద్యార్థుల అంకితభావం, కృషికి ముగ్దుడినయ్యానన్నారు. వారి నుంచి ఎంతో ప్రేరణ పొందానని చెప్పారు. దృష్టిలోపం ఉన్న తమ తోటి విద్యార్థి పట్ల వారు కనబర్చిన సానుభూతి వారిలోని సృజనాత్మక శక్తిని బయటకు వచ్చేలా చేయడమేగాక ఈ ఆవిష్కరణకు నాంది పలికేలా చేయడం నిజంగా గొప్ప విషయమంటూ ఆ బాలికలను ప్రశంసించారు వివేక్ వశిష్ట. (చదవండి: చెమట, స్టెరాయిడ్స్ బాధలతో సొంత కాస్మొటిక్ బ్రాండ్: ఈమె తొలి గ్రామీ విన్నర్ కూడా!) -
అమ్మాయి ఆరోగ్యానికి ఏడు పరీక్షలు
ఆడపిల్లలు ఆరోగ్యంగా పెరగాలి. అన్ని రంగాల్లో ప్రతిభ చూపాలి.వారికి వద్దు ఆటంకాలు. వారిపై వద్దు చిన్నచూపు.ఇదే ‘నేషనల్ గర్ల్ చైల్డ్ డే’ సందేశం.అయితే యుక్త వయసుకు వచ్చిన బాలికలకు చాలామంది తల్లిదండ్రులు ఆరోగ్య పరీక్షలు చేయించరు.వైద్యనిపుణులు మాత్రం ఎదిగే వయసులోని ఆడపిల్లలకు తప్పనిసరిగా ఆరోగ్య పరీక్షలు చేయించాలంటున్నారు.‘జాతీయ బాలికా దినోత్సవం’ సందర్భంగా తల్లిదండ్రులు ఆడపిల్లలకు ఇవ్వాల్సిన కానుక ఈ ఆరోగ్య పరీక్షలే. ఆడుతూ పాడుతూ ఉన్నంత మాత్రాన మన ఇంటి ఆడపిల్లలకు శారీరకంగా ఏవో కొన్ని పోషక విలువల లోటుపాట్లు ఉండకపోవు. అయితే చాలామంది తల్లిదండ్రులు వాటిని నిర్థారణ చేసుకోరు. నిజానికి బాలికలు అనేక శారీరక సవాళ్లను ఎదుర్కొంటారు. యుక్తవయస్సు వచ్చిన తర్వాత శారీరక మార్పులకు లోనవుతారు. పోషకాహార లోపంతో బాధపడే బాలికల్లో కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి. అందుకే వారి ఆరోగ్య పరిస్థితిని అంచనా వేసేందుకు, లోపాలను సరి చేసుకునేందుకు కొన్ని పరీక్షలు తరచూ చేయించాలంటున్నారు వైద్య నిపుణులు. బాలికల సమగ్ర వికాసాన్ని సందేశంగా ఇచ్చే ‘నేషనల్ గర్ల్ చైల్డ్ డే’ సందర్భంగా తప్పక ఈ పరీక్షలను చేయించడమే ఆడపిల్లలకు ఇచ్చే అసలైన కానుక అవుతుంది. కంప్లీట్ బ్లడ్ పిక్చర్ (సీబీపీ): బాలికల్లో రక్తహీనత సర్వసాధారణం. పూర్తి రక్త గణన (íసీబీపీ) పరీక్ష చేయించడం వల్ల రక్తహీనత ఉందో లేదో తెలుస్తుంది. సీబీసీ పరీక్ష ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, ప్లేట్లెట్స్ కౌంట్ గురించి చెబుతుంది. ఇన్ఫెక్షన్లు ఏమైనా ఉన్నా సీబీపీ పరీక్ష తెలియచేస్తుంది. బాలికల్లో అలసట, బరువు తగ్గడం, జ్వరం, బలహీనత వంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటే అసలు కారణం తెలియడానికి సీబీపీ చేయించడం మంచిది. ఐరన్ప్రొఫైల్: ఐరన్ లోపం వల్ల రక్తహీనత వంటి వ్యాధులు వస్తాయి. శరీరం తగినన్ని ఎర్ర రక్త కణాలను ఉత్పత్తి చేయనప్పుడు సాధారణంగా రక్తహీనత వస్తుంది. సరైన ఆహారం, ఐరన్ సప్లిమెంట్లు, ఐరన్ స్థాయులను క్రమం తప్పకుండా పర్యవేక్షించడం ద్వారా ఈ పరిస్థితిని (ఐరన్ లోపాన్ని) సమర్థంగా అధిగమించవచ్చు. విటమిన్ప్రొఫైల్ టెస్ట్స్: ఉత్సాహకరమైన శారీరక ఆరోగ్యానికి విటమిన్లు చాలా అవసరం. విటమిన్ప్రొఫైల్ టెస్ట్స్ వల్ల విటమిన్ల లోపం ఏదైనా ఉంటే తెలుస్తుంది. విటమిన్ బి12 జీవ క్రియలకు అత్యంత ముఖ్యమైనది. ఆ విటమిన్ లోపం ఉంటే వైద్యుని సలహాతో దానిని పూరించే సప్లిమెంట్స్ ఇప్పించాలి. విటమిన్ డి లోపంతో ఎముకలపై ప్రభావం పడుతుంది. శరీరంలో డి విటమిన్ తగ్గకుండా ఉదయపు ఎండ తగిలేలా చూడటం, వైద్యుల సూచనతో సప్లిమెంట్స్ తీసుకోవడం చేయాలి. ఆడపిల్లలు కండరాల బలహీనత, అలసట, ఎముకల్లో నొప్పిని ఎదుర్కొంటుంటే విటమిన్ల టెస్ట్ తప్పక చేయించాలి. మూత్ర పరీక్ష: మైక్రోస్కోప్ ద్వారా చేసే మూత్రపరీక్ష ఏవైనా ఇన్ఫెక్షన్స్ ఉంటే తెలియచేస్తుంది. బాలికల్లో పొత్తి కడుపు నొప్పి, మూత్రవిసర్జనలో ఇబ్బందులు, మూత్రంలో రక్తం, మంట వంటి లక్షణాలు కనిపిస్తే మూత్ర పరీక్ష చేయించాలి. ఒక్కోసారి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఉన్నా సింప్టమ్స్ కనిపించకపోవచ్చు. అందువల్ల ఒకసారి ఈ పరీక్ష చేయించడం మంచిది. మల పరీక్ష: ఎదిగే వయసు పిల్లలు మల విసర్జన రోజువారీ చేయకపోయినా, మల విసర్జనలో ఇబ్బంది పడుతున్నా, తరచూ విరేచనాలవుతున్నా లేదా కడుపు నొప్పితో ఇబ్బంది పడుతున్నా అదేం పెద్ద విషయం కాదన్నట్టు నిర్లక్ష్యం చేయకూడదు. మల పరీక్ష చేయించాలి. దానివల్ల జీర్ణ వ్యవస్థకు సంబంధించిన ఏవైనా ఇన్ఫెక్షన్లు ఉంటే తెలుస్తుంది. కంటి పరీక్ష: టీనేజ్ పిల్లలకు తప్పనిసరిగా చేయించాల్సిన పరీక్ష ఇది. ఈ వయసులో హ్రస్వదృష్టి వచ్చినా, దీర్ఘదృష్టి వచ్చినా పిల్లలు దానిని గుర్తించకనే కంటికి శ్రమ ఇచ్చి రోజువారి పనులను, చదువును కొనసాగిస్తారు. కాని కంటి పరీక్ష వల్లే దృష్టిలోపం తెలుస్తుంది. ఈ వయసులో గుర్తించకుండా దృష్టిలోపం కొనసాగితే తర్వాత కాలంలో కంటి నరాలకు సంబంధించిన సమస్యలు వస్తాయి. అందుకని కంటి పరీక్ష తప్పదు.హార్మోనల్ వర్కప్ టెస్ట్: ఆడపిల్లల్లో ఈడేరడం ఆలస్యం అవుతుంటే ఈ టెస్ట్ చేయించడం తప్పనిసరి. దీనివల్ల పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్, థైరాయిడ్ పని తీరు, అడ్రినల్ గ్రంథి పనితీరు తదితరాలు తెలుస్తాయి. దీనివల్ల యుక్తవయసుకు జాప్యం ఎందుకో తెలుస్తుంది. సరి చేయ వీలవుతుంది. -
30 ఏళ క్రితం పోయిన బ్యాగ్ మళ్లీ యజమాని చెంతకు..!
కొందరికి వస్తువులు పోతే మళ్లీ వాళ్లకు దొరికే సీన్ లేదు. ఇంకొందరూ ఎంద అదృష్టవంతులంటే పోయిన వస్తువు కనీసం జీవిత చరమాంకలో అయిన కంటపడి సర్ప్రైజ్ చేస్తుంది. చూసిన వాళ్లకు కూడా ఇలాంటి అదృష్టం మాకు ఉంటే బావుండనని అనిపిస్తుంది. అలాంటి ఘటనే యూకేకి చెందిన మహిల విషయంలో చోటు చేసుకుంది. ఏం జరిగిందంటే?..యూకేకి చెందిన మహిళ ఆడ్రీ హే 30 ఏళ్ల క్రితం హ్యాండ్ బ్యాగ్ని పోగొట్టుకుంది. అప్పుడు ఆమె బ్యాగ్ని ఓ దుండగడు ఎత్తుకుపోయాడు. బహుశా అతను పోతుపోతూ..పక్కనే ఉన్న డోన్ నదిలోకి విసిరేశాడు కాబోలు . అది అనుకోకుండా కొట్టుకుంటు ఒడ్డుకు వచ్చి ఇసుకలో కూరుకుపోయింది. అయితే అనుకోకుండా చాలా ఏళ్ల తర్వాత 11 ఏళ్ల మైసీ కౌట్స్ అన చిన్నారి తన తల్లిదండ్రులతో ఆ డాన్ నది వద్దకు వచ్చినప్పుడూ ఆ బ్యాగ్ కంటపడింది. ఆ చిన్నారి పొరపాటున ఆ పాత బ్యాగ్పై పొరపాటున పడుతుంది. వెంటనే అమ్మ నీకు ఈ కొత్త బ్యాగ్ కావాలా అంటూ కౌట్స్ ఆ బ్యాగ్ని అందుకుంది. అంతేగాదు అందులో ఏమున్నాయా? అని ఆసక్తిగా చూసేసింది కూడా. అందులో కొన్ని పెన్నులు, నాణేలు, లిప్స్టిక్, చెవిపోగులు, కీ, ట్యాబ్లెట్లు ఉన్నాయి. దీంతో ఆమె అమ్మ నాన్నా ఆ బ్యాగ్ ఎవరో పోగొట్టకున్నారో? అని సదరు యజమాని గురించి ఏదైనా ఆధారం దొరకుతుందని ప్రతి ఇంచు గాలించి వెతికారు. ఆ చిన్నారి తల్లి కిమ్కు అందులో కొన్ని కార్డులు కనిపించాయి. వాటిపై 1993 అని ఉంది. అంటే ఇది చాలా ఏళ్లుగా నీటిలో ఉందన్నమాట. అంటే ఆ వ్యక్తి చనిపోయారా? బతికే ఉన్నారా? అన్ని కాస్త గాభర పడింది. ఆ తర్వాత ఆ బ్యాగ్ గురించి వివరాలన్నీ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. వెంటనే ఆడ్రీ అనే వృద్ధ మహిళ స్పందించి అది తన బ్యాగే అని 30 ఏళ్ల క్రితం పోయిందని తెలిపింది. ఆ రోజు బ్యాగ్ని తన ఆఫీస్ డెస్క్ కింద పెట్టి బయటకు వెళ్లి తిరిగి వచ్చేటప్పటికీ పోయిందని చెప్పుకొచ్చింది. తాను పోలీస్ కంప్లైయింట్ కూడా ఇచ్చానని నాటి సంఘటనను వివరించింది. అందులో 240 పౌండ్లు(రూ. 20,000) ఉన్నాయని చెప్పుకొచ్చింది. అయితే ఆ దొంగ ఆ డబ్బులు తీసుకుని ఈ బ్యాగ్ని నీటిలోకి విసిరేసినట్లున్నాడు కాబోలు అని ఆండ్రి అంది. ఎట్టకేలకు ఆండ్రీకి తాli పోగొట్టుకున్న బ్యాగ్ ఆమె చెంతకే చేరింది. ఇప్పుడు ఆమె వయసు 81 ఏళ్లు. బహుశా రాసి పెట్టి ఉంటే ఎంతకాలనికైనా తిరిగి రావడం అంటే ఇదే కదా!. కానీ ఆ బ్యాగ్ని యజమానికి అందించిన కిమ్ సోషల్ మీడియా శక్తిని చూసి తెగ మెచ్చుకుంటుంది. ఇవాళ ఇదే లేకపోతే ఇలాంటి ఎన్నో అద్భుతాలు జరిగేవా? చూడగలమా? అంటోంది ఆ చిన్నారి తల్లి కిమ్. (చదవండి: మనిషి నిద్రపోతుంటే..ఆత్మ లక్ష్యం కోసం ఎంత దూరమైన వెళ్తుందా? ఇది సాధ్యమా?) -
HYD: నాన్న కాదు.. నయ వంచకుడు!
మహిళలపై అత్యాచారాలు రోజురోజుకు ఎక్కువవుతున్నాయి. చిన్నాపెద్దా తేడా లేకుండా కొందరు మృగాళ్లలా ప్రవర్తిస్తున్నారు. వావి-వరుసలు మరిచి అత్యాచారాలకు తెగబడుతున్నారు. ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు చేసి కఠిన శిక్షలు విధించినా కీచకుల ఆగడాలకు అడ్డుకట్టపడటం లేదు. హైదరాబాద్లోని జీడిమెట్లలో ఇలాంటి అమానవీయ ఘటనే వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్: హైదరాబాద్ జీడిమెట్లలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. కన్నతండ్రే కసాయిగా మారి కూతురుపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని చెప్పినా తల్లి ఏ మాత్రం పట్టించుకోలేదు. దీంతో ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన స్నేహితునికి బాధితురాలు దగ్గరైంది. ఈ క్రమంలో ఉద్యోగం ఇప్పిస్తానని తీసుకెళ్లిన ఓ యువకుడు కూడా బాలికను చిత్రహింసలకు గురిచేశాడు. బీహర్కు చెందిన ఓ కుటుంబం కుత్బుల్లాపూర్ లో నివాసం ఉంటున్నారు. వారికి ముగ్గురు పిల్లలు. కుమార్తె(18) తొమ్మిదో తరగతి వరకు చదువుకుంది. కుటుంబీకులు కరోనా కారణంగా చదువు మాన్పించడంతో ఇంటి వద్దే ఉంటోంది. కొంతకాలంగా తండ్రి లైంగికంగా వేధించసాగాడు. పలుమార్లు అత్యాచారం చేసి.. ఎవరికీ చెప్పొద్దంటూ భయపెట్టాడు. ఈ విషయం తల్లికి చెప్పినా ప్రయోజనం లేకపోయింది. గతేడాది దీపావళికి బిహార్కు వెళ్లివస్తుండగా.. రైలులో అదే రాష్ట్రానికి చెందిన యువకుడు సంతోష్ పరిచయమయ్యాడు. ఇద్దరూ ఇన్స్టాగ్రామ్లో చాట్ చేసుకున్నారు. అతడు బడంగ్పేట గాంధీనగర్లో ఉంటున్నట్లు చెప్పాడు. వారి పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఈ క్రమంలో గత నెల 26న సంతోష్ కలవాలని కోరడంతో యువతి సికింద్రాబాద్ వెళ్లింది. ఇద్దరు కలిసి ఎన్టీఆర్ గార్డెన్, ట్యాంక్బండ్ ప్రాంతాల్లో తిరిగారు. అనంతరం అతడు కుత్బుల్లాపూర్లో ఆమె ఇంటి వద్ద వదిలి వెళ్లిపోయాడు. చెప్పకుండా బయటకు వెళ్లినందుకు కొడతారనే భయంతో ఆమె తిరిగి సికింద్రాబాద్ స్టేషన్కి పారిపోయింది. అక్కడ రవి అనే వ్యక్తి ఫోన్ తీసుకొని సంతోష్కు ఫోన్చేసింది. రవి సాయంతో సంతోష్ వద్దకు వెళ్లింది. మరుసటిరోజు ఇంటికి వెళ్లాలని ఆమెకు ప్రేమికుడు చెప్పాడు. తిరుగు ప్రయాణంలో ఇంటికి వెళ్లకుండా తనకు ఉద్యోగం ఇప్పించాలని వెంట వచ్చిన రవిని కోరడంతో.. అతడు అమీన్పూర్లో తన గదికి తీసుకెళ్లాడు. ఈ నెల 29న మద్యం మత్తులో రవి ఆమెపై లైంగిక దాడి చేశాడు. రవి చిత్రహింసలు భరించలేక ఆమె సికింద్రాబాద్కు పారిపోయింది. కుటుంబీకులకు ఫోన్చేసి సికింద్రాబాద్ స్టేషన్ రావాలని చెప్పింది. వారు రావడంతో జరిగిన విషయం వివరించింది. తల్లిదండ్రులు జీడిమెట్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే.. దర్యాప్తులో పోలీసులకు తన తండ్రి చేసిన అఘాయిత్యాన్ని కూడా ఆ బాలిక వివరించింది. దీంతో బాలిక తండ్రితో పాటు ఆ యువకునిపై పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు చెప్పారు. ఇదీ చదవండి: నాన్నా.. నేనేం పాపం చేశాను! -
కీచక టీచర్.. విశాఖ స్పెషల్ పోక్సో కోర్టు సంచలన తీర్పు
సాక్షి, విశాఖపట్నం: విశాఖ స్పెషల్ పోక్సో కోర్టు సంచలన తీర్పు వెలువరించింది మైనర్పై అత్యాచారానికి పాల్పడిన నిందితునికి 25 ఏళ్ల జైలు శిక్ష విధించింది. పవిత్రమైన ఉపాధ్యాయుడి స్థానంలో ఉండి.. పదో తరగతి చదువుతున్న బాలికపై పలు మార్లు లైంగిక దాడికి పాల్పడిన జనకేశ్వరరావుకి 25 ఏళ్లు జైలు శిక్షతో పాటు, 50 వేల రూపాయలు జరిమానాను కోర్టు విధించింది. విశాఖలోని నాలుగోవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో 2020 ఏడాదిలో ఈ ఘటన చోటు చేసుకుంది. పూర్తి ఆధారాలతో కేసును పోలీసులు దర్యాప్తు చేశారు. బాధితురాలికి 4 లక్షల 50 వేల రూపాయలు నష్ట పరిహారం ఇవ్వాలని విశాఖ స్పెషల్ పోక్సో కోర్టు తీర్పు చెప్పింది. బాధితులకు న్యాయం జరిగేలా వాదనలు వినిపించిన స్పెషల్ పోక్సో పీపీ కరణం కృష్ణకి బాధితులు ధన్యవాదాలు తెలిపారు. ఇదీ చదవండి: సినిమా స్టోరీలా.. పరువు హత్య -
పార్లేజీ పాప మాయం! సర్ప్రైజ్ ఇచ్చిన బిస్కెట్ కంపెనీ
ప్రముఖ బిస్కెట్ల తయారీ కంపెనీ పార్లే గురించి మనందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఆ కంపెనీ బిస్కెట్ ప్యాకెట్లపై ఉండే పాప బొమ్మ బాగా పాపులర్. అయితే పార్లేజీ కంపెనీ ఉన్నట్టుండి సర్ప్రైజ్ ఇచ్చింది. తమ పార్లే జీ బిస్కెట్ ప్యాకెట్ కవర్పై పాప బొమ్మను మార్చేసింది. ఆ స్థానంలో ఓ ఇన్ఫ్లుయన్సర్ ఫొటోను తీసుకొచ్చింది. అయితే పార్లేజీ ఇదంతా చేసింది ఇన్స్టాగ్రామ్ పేజీలో. జెరాన్ జే బున్షా అనే ఇన్ఫ్లుయన్సర్ పోస్ట్ చేసిన ఓ వైరల్ వీడియోకు స్పందనగా పార్లేజీ.. తమ బిస్కెట్ ప్యాకెట్పై ఆయన ఫొటో ఉన్నట్లు రూపొందించి షేర్ చేసింది. తాజాగా జెరాన్ జే బున్షా పార్లేజీపై తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఓ వీడియో పోస్ట్ చేశారు. ‘ఒక వేళ మీరు పార్లే ఓనర్ను కలిస్తే ఏమని పిలుస్తారు.. పార్లే సర్, మిస్టర్ పార్లే అనా లేక పార్లే జీ అనా?’ అంటూ అయోమయంలో ఉన్నట్లు వీడియో రూపొందించి షేర్ చేశారు. ఈ వీడియో వైరల్గా మారింది. అధిక సంఖ్యలో వ్యూవ్స్, కామెంట్లు వచ్చాయి. చివరికి పార్లే కంపెనీ కూడా స్పందించింది. బిస్కెట్ ప్యాకెట్పై ఆ ఇన్ఫ్లుయన్సర్ ఫొటోను వేసినట్లుగా చిత్రాన్ని రూపొందించి తమ ఇన్స్టా పేజీలో పోస్ట్ చేసింది. View this post on Instagram A post shared by Parle-G (@officialparleg) -
పీరియడ్ నొప్పిని భరించలేక ఆ మాత్రలు వేసుకుంది! అంతే..
మహిళలకు రుతుక్రమం సమయంలో కడుపు నొప్పి సహజంగానే వస్తుంది. కొందరికీ మరీ ఎక్కువగా సమస్యాత్మకంగా ఉంటుంది. కొద్దిమందిలో మొదటి రెండు రోజులు తట్టుకోలేని నొప్పి ఉంటుంది. ఆ తర్వాత అంతా నార్మల్ అయిపోతుంది. ఆ టైంలో పెయిన్ తట్టుకోలేకపోతే వైద్యుల సూచించిన లేదా నొప్పి ఉపశమించే మందులను వాడుతుంటారు మహిళలు. అలానే ఇక్కడొక అమ్మాయి కూడా మాత్రలు వేసుకుని ప్రాణాలు పోగొట్టుకుంది. ఈ విషాద ఘటన యూకేలో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే..యూకేకి చెందిన 16 ఏళ్ల విద్యార్థిని లైలా అనే అమ్మాయి పిరియడ్ నొప్పి భరించలేక అల్లాడిపోయింది. దీంతో ఆమె స్నేహితులు ఆ నొప్పి తగ్గాలంటే గర్భనిరోధక మాత్రలు వేసుకోవాలని సూచించారు. లైలా వారి చెప్పినట్లే నవంబర్ 25 నుంచి ఆ టాబ్లెట్లు వేసుకోవడం ప్రారంభించింది. అంతే ఆ ట్యాబ్లెట్లు వాడిన మూడు వారాల తర్వాత నుంచి ఆమెకు తలనొప్పి వంటి అనారోగ్య సమస్యలు మొదలయ్యాయి. క్రమేణ పరిస్థితి సీరియస్గా మారిపోయింది. డిసెంబర్ 5 నుంచి తీవ్రమైన వాంతులు అవ్వడం ప్రారంభమయ్యాయి. ఇక క్రమక్రమంగా పరిస్థితి విషమించడం మొదలైంది. ఆమె కడుపు నొప్పిని తాళ్లలేక పోవడంతో కుటుంబ సభ్యలు హుటాహుటీనా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఆమెకు కడుపులో ఏదైనా గడ్డ ఉందేమోనని అనుమానించారు. కానీ సీటీ స్కాన్లో వైద్యులకే దిమ్మతిరిగేలా అసలు విషయం బయటపడింది. కడుపు నొప్పి ..అంటే కడుపులో సమస్య అనుకుంటే అసలు సమస్య బ్రెయిన్లోనే ఉండటం వైద్యులనే ఆశ్చర్యపరచడమే గాక కలవరపరిచింది. ఆమె మెదడులో వేగంగా రక్తం గడ్డకడుతుండడాన్ని చూసి ఆశ్చర్యపోయారు. దీంతో వారు వెంటనే డిసెంబర్ 13న ఆ అమ్మాయికి ఆపరేషన్ చేశారు. అయితే ప్రయోజనం లేకుండాపోయింది. అప్పటికే పరిస్థితి విషమించడంతో ఆమె మృతి చెందింది. దీంతో ఒక్కసారిగా ఆమె కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఈ మేరకు వైద్యులు మాట్లాడుతూ..దయచేసి ఎవ్వరూ కూడా ఇలా ఆ మాత్రలు వేసుకుంటే త్గగుతుంది అనంగానే ఆమెలా అనాలోచితంగా వేసుకోవద్దు. ఒక వేళ అలా వేసుకోవాలనుకున్నా ముందు మీ పెద్దవాళ్లకు కూడా చెప్పండి. ప్రతి ఒక్కరి శరీరం విభిన్నంగా ఉంటుంది. మాత్రలు అందరీకి ఒకేలా రియాక్షన్ ఇవ్వవు. దీన్ని కూడా గుర్తించుకోవాలి. మన శరీర ఆరోగ్య పరిస్థితి, మనకున్న ఆహారపు అలవాట్లు అన్నింటిని పరిగణించి వైద్యులు మాత్రలు ఇస్తారు. ఒక్కొసారి డాక్టర్లు ఇచ్చినవే మనకు ఇబ్బందిగా మారిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి దయచేసి ఇలా తెలిసిన మాత్రలో లేక ఎవరో చెప్పారనో ఎలాంటి మందులు తీసుకోవద్దు. కోరి ప్రాణాల మీదకు తెచ్చుకుని కుటుంబసభ్యులకు తీరని ఆవేదనను మిగల్చకండి అని చెబుతున్నారు వైద్యులు. (చదవండి: తొమ్మిది పదుల వయసులో మాస్టర్ డిగ్రీ పూర్తి చేసిన బామ్మ!) -
పెళ్లి కుదిరింది! ఫోన్ మాట్లాడొద్దని తల్లి బెదిరించడంతో.. యువతి
నిర్మల్: తల్లి మందలించిందని యువతి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన సోమవారం మండలంలోని దేవునిగూడెం గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్సై ప్రభాకర్రెడ్డి వివరాల ప్రకారం.. మండలంలోని దేవునిగూడెం గ్రామానికి చెందిన పానుగంటి గంగవ్వ–పోషన్నలకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు. తండ్రి గతంలో మృతిచెందడంతో తల్లి గంగవ్వనే కుటుంబాన్ని పోషిస్తుంది. ఇటీవల పెద్ద కూతురు సాత్విక(22) పెళ్లి కుదిరింది. గత కొద్ది రోజులగా తరుచుగా ఫోన్లో మాట్లాడుతుండడంతో తల్లి ఆదివారం మందలించింది. దీంతో మనస్తాపానికి గురై పురుగుల మందు తాగింది. కుటుంబీకులు వెంటనే నిర్మల్లోని ప్రైవేట్ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతి చెందింది. మృతదేహన్ని ఖానాపూర్ ప్రభుత్వాస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసున్నట్లు తెలిపారు. ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com ఇవి చదవండి: బిస్కెట్ ప్యాకెట్ కొనుక్కొని వస్తుండగా.. ఘోర ప్రమాదం! -
పసివాడిని బావిలో తోసేసిన బాలిక.. తరువాత?
పిల్లలు తమ ఆటల్లో వినోదం కోసం చేయకూడని పనులు కూడా చేస్తుంటారు. ఒక్కోసారి వీటి పర్యవసానాలు ఊహకందని విధంగా ఉంటాయి. తాజాగా పిల్లల ఆటలకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీనిని చూసినవారంతా షాక్ అవుతున్నారు. ఈ వీడియో చూశాక పిల్లలను ఎప్పుడూ ఒంటరిగా వదలకూడదని, వారిని కనిపెట్టుకుని ఉండాలని ఎవరికైనా అనిపిస్తుంది. ఈ షాకింగ్ వీడియోలో ఒక బాలిక తన కంటే చిన్నవాడైన ఒక బాలుడిని ఎత్తుకుని బావిలోకి తోసేయడం కనిపిస్తుంది. ఈ వీడియో చైనాకు చెందినదని తెలుస్తోంది. ఈ వీడియో మొదట్లో ఇద్దరు పిల్లలు బావి దగ్గర ఆడుకోవడం కనిపిస్తుంది. ఆటల్లో భాగంగా ఆ బాలిక ఆ పిల్లాడిని ఎత్తుకుని బావి దగ్గరకు తీసుకువస్తుంది. తరువాత ఆ పిల్లాడిని బావిలో పడేస్తుంది. అయితే ఆ పిల్లాడు ఆ బావి గోడను పట్టుకుంటారు. దీనిని గమనించిన ఆ బాలిక.. బాలుని చేతులను గోడ నుంచి జరిపి బావిలోకి తోసేసింది. బావిలో పడిపోయిన బాలుడు ఏడుస్తున్నప్పటికీ అతడికి సాయం చేసేందుకు ఎవరూ రాకపోవడం వీడియోలో కనిపిస్తోంది. అయితే కొద్దిసేపటి తరువాత స్థానికులు ఆ బాలుని ఆర్తనాదాలు విని అతనిని కాపాడుతారు. The boy was rescued. God Bless. Parenting, parenting, parenting... pic.twitter.com/1LZZPznkwr — Uturn_Yturn 🦎 ♊️ (@Uturn_Yturn) November 27, 2023 ఇంటర్నెట్లో వైరల్గా మారిన ఈ వీడియో యూజర్లను కలిచివేసింది. ఈ వీడియోను సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ ఎక్స్లో @cctvidiots అనే ఖాతాతో షేర్ చేశారు. ఈ వీడియో చూసిన యూజర్లు రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు. ఇది కూడా చదవండి: తుపానులకు పేర్లు ఎందుకు? ఎవరు పెడతారు? -
చనిపోయిన 12 గంటలకు తిరిగి బతికిన చిన్నారి!
వైద్యులను దేవునితో సమానమని అంటారు. అయితే వారు కూడా మనుషులే అయినందున ఒక్కోసారి పొరపాటు పడుతుండవచ్చు. మెక్సికోలోని శాన్ లూయిస్ పొటోసికి చెందిన వైద్యుని పొరపాటుకు సంబంధించిన ఉదంతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మూడేళ్ల బాలిక చనిపోయినట్లు ఒక వైద్యుడు నిర్ధారించాడు. దీంతో ఆ చిన్నారి కుటుంబ సభ్యులు అంత్యక్రియలకు సన్నాహాలు మొదలుపెట్టారు. ఇంతలో ఆ బాలిక మేల్కొంది. మెక్సికోకు చెందిన కైమెలియా రోక్సానా కడుపు నొప్పితో బాధపడుతోంది. కుటుంబసభ్యులు బాలికను చికిత్స కోసం ఆసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స అనంతరం ఆ చిన్నారి మృతి చెందినట్లు వైద్యుడు నిర్థారించాడు. ఇది జరిగిన 12 గంటల తర్వాత ఒక అద్భుతం జరిగింది. ఆ బాలిక సజీవంగానే ఉందని తెలిసింది. కైమెలియా అంత్యక్రియలు జరుగుతున్నప్పుడు, ఆమె తల్లికి తన కుమార్తె బతికేవుందని అనిపించింది. దీంతో ఆమె శవపేటికను తెరవమని అక్కడున్నవారిని కోరింది. అయితే వారు అందుకు అంగీకరించలేదు. కాగా కొంతసేపటికి శవపేటికలో నుంచి బాలిక ఏడుపు వినిపించింది. వెంతనే దానిని తెరిచి, బాలికను బయటకు తీశారు. ఈ సంఘటన 2022, ఆగస్టు 17 న జరిగింది. దీంతో ఆ చిన్నారికి మరుజన్మ లభించిందని పలువురు పేర్కొన్నారు. అయితే ఆ బాలిక చనిపోయిందని వైద్యులు ఎందుకు ప్రకటించాల్సి వచ్చిందనే విషయానికొస్తే.. కడుపు ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న ఆ చిన్నారిని సాలినాస్ డి హిల్డాల్గో కమ్యూనిటీ ఆసుపత్రిలో చేర్చినప్పుడు, చికిత్స సమయంలో ఆమె గుండెచప్పుడు ఆగిపోయింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా బాలికలో చలనం రాకపోవడంతో చనిపోయిందని వైద్యులు ప్రకటించారు. అయితే ఆ బాలిక తల్లి ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోయింది. తన కూతురు చనిపోలేదని అంటూ గట్టిగా ఏడవసాగింది. అంత్యక్రియల ప్రక్రియ జరుగుతున్నప్పుడు ఆ బాలక తల్లి తన కుమార్తె శవపేటికలో వణుకుతున్నదని అక్కడున్నవారికి చెప్పింది. అయితే వారెవరూ నమ్మలేదు. ఆ బాలిక శవపేటికలో నుంచి ఏడుస్తూ, తన తల్లిని పిలవసాగింది. దీంతో శవపేటిక తెరవగా లోపల ఉన్న బాలిక సజీవంగా కనిపించింది. ఇది కూడా చదవండి: ప్రధానితో ముందుగానే వెళ్లిన విమానం.. 31 మంది ప్రయాణికులు విలవిల -
‘మామా.. హైదరాబాద్కు డిస్నీల్యాండ్ తీసుకొని రా’..కేటీఆర్కు చిన్నారి రిక్వెస్ట్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఐటీ, మున్సిపల్శాఖ మంత్రి కేటీఆర్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు. రాజకీయ అంశాలతోపాటు వర్తమాన విషయాలు, నెటిజన్లు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇస్తుంటారు. ఆపదలో ఉన్న వారికి కూడా సాయం అందిస్తుంటారు. ఓ పక్క ఎన్నికల హడావిడీలో బిజీ బిజీగా గడుపుతున్న కేటీఆర్.. తాజాగా ఎక్స్లో (ట్విటర్)ఓ చిన్నారి అడిగిన ప్రశ్నకు స్పందించారు. ‘కేటీఆర్ మామా.. హైదరాబాద్కు డిస్నీ ల్యాండ్ తీసుకొని రా ప్లీజ్’ అంటూ ఓ చిన్నారి తన కోరికను తెలిపింది. ఈ వీడియోను ఆమె తండ్రి సురేంద్ర వినాయకం ట్విట్టర్లో పోస్టు చేశారు. ఈ వీడియోపై మంత్రి కేటీఆర్ స్పందించారు. ‘ప్రామిస్ చేయలేను కానీ బేటా.. తీసుకువచ్చే ప్రయత్నం అయితే చేస్తాను’ అంటూ సదరు చిన్నారికి రిప్లై ఇచ్చారు. ఈ పోస్టు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదిలా ఉండగా ఇటీవల ‘కేటీఆర్ తాతకు ఓటేస్తానంటూ’ అనన్య అనే ఓ చిన్నారి తల్లితో మారాం చేస్తూ మాట్లాడిన ముద్దు మాటలు అందర్నీ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. చదవండి: సర్వేల్లో నిజమెంత?.. తెలంగాణలో గెలుపెవరిది? Can’t promise Beta but will try my best 👍 https://t.co/YwWrgHwBNH — KTR (@KTRBRS) November 28, 2023 -
బందీల విడుదలపై ఐర్లాండ్ ప్రధాని ట్వీట్.. ఇజ్రాయెల్ ఫైర్
టెల్ అవీవ్: హమాస్ రెండో విడత 17 మంది బందీలను ఆదివారం విడుదల చేసింది. వీరిలో ఐర్లాండ్కు చెందిన తొమ్మిదేళ్ల బాలిక కూడా ఉంది. తమ దేశ బాలిక విడుదలపై ఐర్లాండ్ ప్రధాని లియో వరాద్కర్ చేసిన ట్వీట్ వివాదాస్పదంగా మారింది. ఈ ట్వీట్ను ఇజ్రాయెల్ తప్పుబట్టింది. తమ దేశ బాలిక ఎమిలి హ్యాండ్ విడుదల కావడంపై ఐర్లాండ్ ప్రధాని లియో వరాద్కర్ హర్షం వ్యక్తం చేశారు. తప్పిపోయిందుకున్న బాలిక తిరిగిరావడం ఆనందాన్ని కలిగించిందని ట్వీట్ చేశారు. బాలిక కుటుంబంతో కలిసినందుకు ఇది ఎంతో సంతోషకరమైన రోజుగా పేర్కొన్నారు. తమకు ఇది ఎంతో ఊరటను కలిగించిందని అన్నారు. అయితే.. ఐర్లాండ్ ప్రధాని లియో వరాద్కర్ ట్వీట్ను ఇజ్రాయెల్ తప్పుబట్టింది. బాలిక తప్పిపోయిందని పేర్కొనడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇజ్రాయెల్ దళాల ఒత్తిడితోనే బందీలను హమాస్ విడుదల చేసిందని స్పష్టం చేసింది. ఎమిలిని హమాస్ ఉగ్రవాదులు దాడి చేసి బందీగా అపహరించుకుపోయారని తెలిపింది. ఇజ్రాయెల్-హమాస్ మధ్య ఒప్పందంలో భాగంగా కాల్పులకు విరమణ ప్రకటించారు. 50 మంది బందీలను హమాస్ విడుదల చేయాలని ఒప్పందంలో అంగీకారానికి వచ్చారు. ఇందులో భాగంగా శుక్రవారం 24 మందిని హమాస్ విడుదల చేసింది. రెండో విడతగా 17 మందిని వదిలిపెట్టింది. ఇదీ చదవండి: Uttarakashi Tunnel Operation: ఉత్తరకాశీ సొరంగం రెస్క్యూ ఆపరేషన్లో సైన్యం ఎంట్రీ -
హైదరాబాద్: స్కూల్ బస్సు కింద పడి మూడేళ్ల చిన్నారి మృతి
సాక్షి, హైదరాబాద్: జవహర్ నగర్లో విషాదం చోటుచేసుకుంది. స్కూల్ బస్సు కింద పడి మూడేళ్ల చిన్నారి మృతి చెందింది. జవహర్ నగర్ పీఎస్ పరిధిలో ఆనంద్ నగర్ ఎక్స్ సర్వీస్ మెన్ కాలనీలో ఘటన జరిగింది.. సోదరుడికి తోడుగా స్కూల్ బస్సు వద్దకు వచ్చిన చిన్నారి భవిష్య.. ప్రమాదవశాత్తు రచన గ్రామర్ హైస్కూల్ బస్సు ముందు చక్రాల కింద పడింది. బస్సు డ్రైవర్ ప్రవీణ్ నిర్లక్ష్యమే కారణమని స్థానికులు భావిస్తున్నారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
తెలంగాణ ఎన్నికల బరిలో బర్రెలక్క.. నామినేషన్ దాఖలు
నాగర్కర్నూల్: రెండేళ్ల కిందట సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయిన బర్రెలక్క గుర్తుందా?. డిగ్రీ చదివి తాను బర్రెలు కాసుకుంటున్నానని వీడియో ద్వారా తెగ వైరల్ అయ్యిందామె. ఆ వీడియోలోని బర్రెలక్క అలియాస్ శిరీష మళ్లీ వార్తల్లోకి ఎక్కింది. ‘‘హాయ్ ఫ్రెండ్స్.. నేను మీ బర్రెలక్కను డిగ్రీ చేసాను. ఫ్రెండ్స్ ఉద్యోగ నోటిఫికేషన్ లేక మా అమ్మను అడగి బర్రెలు కొన్నాను ఫ్రెండ్స్. ఎన్ని డిగ్రీలు చేసిన సర్టిఫికేట్లు వస్తున్నాయి తప్ప ఉద్యోగాలు వస్తలేవు ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ అంటూ సోషల్ మీడియాలో ఒకప్పుడు ఊపు ఊపిన వీడియో అది. ఆమె ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోతోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని శిరీష నిర్ణయించుకుంది. ఈ మేరకు కొల్లాపూర్(నాగర్ కర్నూల్) నియోజకవర్గం నుంచి నామినేషన్ వేసింది కూడా. నిరుద్యోగుల తరపున పోరాడటం కోసమే తాను పోటీ చేస్తున్నానని ఈ సందర్భంగా శిరీష ప్రకటించుకుంది. ప్రజలకు ఇవ్వడానికి తన దగ్గర డబ్బు లేదని ప్రచారం చేయడానికి అంత సమయం లేదని అందరిని కలవకపోవచ్చు అందుకే ఈ వీడియో ఫ్రెండ్స్ అంటూ సోషల్ మీడియాలో వదిలింది. ప్రస్తుతం ఆ వీడియో కాస్త వైరల్గా మారింది. View this post on Instagram A post shared by Barrelakka Siri (@princes_siri_barrelakka) View this post on Instagram A post shared by Barrelakka Siri (@princes_siri_barrelakka) View this post on Instagram A post shared by Telugu Scribe (@telugu_scribe) -
ఛత్తీస్గఢ్ చిన్నారికి ప్రధాని మోదీ లేఖ
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ తన చిత్రం గీసిన చిన్నారికి కృతజ్ఞతలు తెలుపుతూ ప్రత్యేకంగా లేఖ రాశారు. గురువారం ప్రధాని మోదీ ఛత్తీస్గఢ్లోని కాంకేర్లో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు. ఆ సమయంలో ఆకాంక్ష అనే చిన్నారి తన చిత్రం గీసి తీసుకువచ్చింది. ప్రధాని మోదీ ఆ చిన్నారిని గమనించి, వేదికపైకి పిలిపించుకున్నారు. వివరాలడిగి ఆమె ప్రతిభను మెచ్చుకున్నారు. శనివారం చిన్నారి ఆకాంక్షకు ఆయన ఒక లేఖ రాశారు. నేటి బాలికలే దేశ ఉజ్వల భవిత అని పేర్కొన్నారు. నువ్వు తీసుకువచ్చిన స్కెచ్ నాకు చాలా బాగా నచ్చింది. నాపై నువ్వు చూపిన అభిమానం, ప్రేమకు ధన్యవాదాలు. నీకు ఎల్లప్పుడూ నా ఆశీస్సులు ఉంటాయి. భవిష్యత్తులో నువ్వు విజయాలు సాధించాలని కోరుకుంటున్నా. రాబోయే 25 ఏళ్లు మీలాంటి చిన్నారులకు ముఖ్యమైన రోజులు కానున్నాయి. ఈ కాలంలో ముఖ్యంగా దేశయువతతోపాటు మీలాంటి పుత్రికలు భారత్ కలలను నెరవేరుస్తారు. దేశ భవిష్యత్తుకు కొత్త దిశను అందిస్తారు’అని ప్రధాని ఆ లేఖలో పేర్కొన్నారు. -
అద్భుతం.. ఆ బ్యాలెన్స్
-
ఆంటీ ల్యాప్టాప్ ఇవ్వకపోతేనేం.. చిట్టితల్లి ఏం చేసిందో చూడండి!
ఆంటీ తనకు ల్యాప్టాప్ ఇవ్వడానికి నిరాకరించడంతో ఒక చిట్టి తల్లి తానే స్వయంగా ల్యాప్టాప్ను తయారు చేయాలని నిర్ణయించుకుంది. ఈ ఉదంతాన్ని నేహా అనే యూజర్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ చిన్నారి కార్డ్బోర్డ్తో తయారు చేసిన ‘హ్యాండ్మేడ్’ ల్యాప్టాప్ ఫొటోను నేహా షేర్ చేశారు. నేహా క్యాప్షన్లో ఇలా రాశారు ‘నా మేనకోడలు నన్ను ల్యాప్టాప్ కావాలని అడిగింది. నేను నిరాకరించడంతో, మూడు గంటల పాటు శ్రమపడి, ల్యాప్టాప్ తయారు చేసుకుంది’ నేహా షేర్ చేసిన ఫోటోలో ల్యాప్టాప్ ఆకారంలో కత్తిరించిన కార్డ్బోర్డ్ కటౌట్ కనిపిస్తుంది. దానిపై స్కెచ్ పెన్తో గీసిన కీబోర్టు చిహ్నాలు కనిపిస్తాయి. కాగా ఈ హోమ్మేడ్ ల్యాప్టాప్లో ‘గేమ్స్’, ‘జూమ్’, ‘లైక్’, ‘రైట్’, ‘సెలెక్ట్’ మొదలైన ఆప్షన్ బటన్లు కనిపిస్తాయి. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో త్వరగా వైరల్గా మారింది. 2,52,000కు పైగా వీక్షణలను దక్కించుకుంది. సోషల్ మీడియా యూజర్స్ ఆ చిన్నారి సృజనాత్మకతను ప్రశంసిస్తున్నారు. ఒక యూజర్ ‘ఈ ల్యాప్టాప్ ఉత్తమమైనది. విండోస్ ఎప్పటికీ స్థిరంగా ఉంటాయి’ అని రాశారు. మరొకరు ‘ఈ ల్యాప్ టాప్ కీబోర్డ్లో చాలా ఎక్కువ ఆప్షన్లు ఉన్నాయి. ఇది ఖచ్చితంగా మరింత మెరుగ్గా పని చేస్తుంది’ అని పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: ‘బంగ్లా’లో డెంగ్యూ విధ్వంసం.. వెయ్యి దాటిన మృతులు! My niece asked for my laptop and i said no so she spent 3 hours making her own laptop😭 pic.twitter.com/Bb7EK7BN97 — Neha (@LadyPeraltaa) October 1, 2023 -
ప్రపంచ అందగత్తెల వ్యాలీ ఎక్కడుంది? వారి దీర్ఘాయువు సీక్రెట్ ఏమిటి?
ప్రపంచంలోనే అత్యంత అందమైన అమ్మాయిలు ఏ ప్రాంతంలో ఉన్నారనే టాపిక్ ప్రస్తావనకు వచ్చినప్పుడు పాకిస్తాన్లోని ఒక ప్రదేశం చర్చకు వస్తుంది. అందుకే ఆ ప్రదేశం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ప్రాంతంలోని మహిళలు 80 ఏళ్ల వయసులో కూడా యవ్వనంగా, ఎంతో అందంగా ఆకట్టుకునేలా కనిపిస్తారు. అందుకే ఇక్కడి అమ్మాయిలను అత్యంత అందగత్తెలుగా భావిస్తారు. దీనికితోడు మంచి ఆరోగ్యం కారణంగా ఇక్కడి మహిళలు 60 ఏళ్లు దాటిన తరువాత కూడా తల్లులయ్యే సామర్థ్యాన్ని కలిగివుంటున్నారు. ఈ ప్రదేశం మరెక్కడో కాదు మన పొరుగుదేశమైన పాకిస్తాన్లో ఉంది. దీని పేరు హుంజా వ్యాలీ. ఇక్కడి స్త్రీలు ఎంతో అందగత్తెలుగా పేరొందారు. వారి క్రమశిక్షణతో కూడిన జీవనశైలి కారణంగా ఇక్కడి మహిళలు 100 సంవత్సరాలకు పైగా జీవిస్తున్నారు. ఇక్కడ ప్రజలు చాలా అరుదుగా అనారోగ్యానికి గురవుతుంటారు. దీనికి కారణం ఇక్కడ ప్రవహించే నదిలో ఆరోగ్యాన్ని పెంపొందించే ఖనిజాలు ఉన్నాయి. ఈ కారణంగానే ఇక్కడి ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని చెబుతారు. హుంజా వ్యాలీ ప్రజలు మధ్యాహ్నం ఒకసారి, రాత్రిపూట మాత్రమే ఆహారం తీసుకుంటారు. దీనికితోడు ఇక్కడ ప్రజలు ఇక్కడివారినే వివాహం చేసుకుంటారు. ఇక్కడి ప్రజలు వ్యవసాయం చేస్తారు. వ్యవసాయంలో రసాయనాలు వాడకుండా స్వచ్ఛమైన ఆహారాన్ని ఉత్పత్తి చేసి, దానినే తింటారు. ప్రపంచంలోని ఆయుర్దాయం ఎక్కువగా ఉండే ప్రదేశాలను బ్లూ జోన్లు అంటారు. హుంజా వ్యాలీ కూడా బ్లూ జోన్ పరిధిలోకే వస్తుంది. ఇక్కడి ప్రజలు మాంసాహారానికి దూరంగా ఉంటారు. ఇది కూడా చదవండి: సింగపూర్ ట్రిప్కు ఐఆర్సీటీసీ బడ్జెట్ ప్యాకేజీ -
మనిషికేమైంది..?
ఉజ్జయిని: ఈ వారం మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో, దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన రెండు వేర్వేరు ఉదంతాలు మన సమాజం ఉనికిని ప్రశ్నిస్తున్నాయి. ఇక్కడ మానవత్వం ఉందా, కన్నుమూసిందా అన్న సందే హాన్ని రేకెత్తిస్తున్నాయి. ఉజ్జయిని నగర వీధుల్లో మొన్న సోమవారం ఉదయం ఒంటిపై సరైన బట్టలు కూడా లేకుండా నెత్తురోడుతున్న పన్నెండేళ్ల బాలిక తనను కాపాడాలంటూ ఇల్లిల్లూ తిరిగి విన్నవించుకున్నా ఒక్కరంటే ఒక్కరు స్పందించలేదు. ఇలా రెండున్నర గంటలు గడిచి ఆమె స్పృహ కోల్పోయి రోడ్డుపై పడిపోగా ఒక ఆశ్రమం నుంచి బయటికొస్తున్న యువకుడు గమనించి చొరవ తీసుకున్నాడు. తన పైపంచె తీసి కప్పి ఆమెను ఆసుపత్రిలో చేర్చి పోలీసులకు సమాచారం అందించాడు. ఆమెపై అత్యంత దారుణంగా అత్యాచారం జరిగిందని వైద్య పరీక్షలో తేలింది. బహుశా ఆ యువకుడు కూడా స్పందించకపోయి వుంటే రక్తస్రావంతో ఆమె మరణించేది కూడా. ఎందుకంటే అత్యాచారం చేసిన దుర్మార్గుడు ఆమె అవయవాలను తీవ్రంగా గాయపరిచాడు. గర్భాశయానికైతే అత్యవసరంగా శస్త్ర చికిత్స చేయాల్సి వచ్చింది కూడా. దశాబ్దం క్రితం ఢిల్లీలో నిర్భయ అనుభవించిన నరక యాతననే ఈ బాలిక కూడా చవిచూసింది. తాను ఉజ్జయిని ఎలా చేరిందో చెప్పలేని స్థితిలో ఉంది. బాలిక తప్పిపోయిందని అంతక్రితం ఆమె తాత సాత్నాలో ఫిర్యాదు చేశాడంటున్నారు. ఉజ్జయినికి 720 కిలోమీటర్ల దూరంలోని సాత్నా నుంచి ఆ బాలికను తరలించిందెవరు అన్నది ఇంకా తేల్చాల్సి వుంది. ఘటనకు సంబంధించి ప్రధాన నిందితుడితోపాటు మరో అయిదు గురిని అరెస్టు చేశారు. దేశ రాజధాని నగరంలో మంగళవారం జరిగిన ఉదంతం కూడా అమాను షమైనది. ప్రసాదం దొంగిలించాడన్న అనుమానంతో మతిస్థిమితం లేని ఒక ముస్లిం యువకుణ్ణి అందరూ ఏకమై కరెంటు స్తంభానికి కట్టి, తీవ్రంగా కొట్టి ప్రాణం తీశారు. ఒంటినిండా గాయాలతో తీవ్ర రక్తస్రావమై అతను మరణించాడని శవపరీక్షలో తేలింది. ఈ ఉదంతంలో అరెస్టయిన ఏడు గురూ పాతికేళ్ల లోపువారే కాగా, అందులో ఒకడు మైనర్. ఈ రెండు ఉదంతాల్లోనూ సమాజం ప్రేక్షక పాత్ర వహించింది. బాధితులను ఆదుకోవాలన్న స్పృహ లేకుండా ప్రవర్తించింది. ఉజ్జయిని నగరానికి ఉజ్వల చరిత్ర వుంది. ఒకనాడది వైభవోపేతంగా వర్ధిల్లిన సాంస్కృతిక కేంద్రం. క్రీస్తుపూర్వం నాలుగో శతాబ్దంలో మౌర్య చంద్రగుప్తుడి విశాల సామ్రాజ్యంలో భాగం. తన తండ్రి బిందుసారుడి కాలంలో అశోకుడు స్వయంగా పర్యవేక్షించిన ప్రాంతం. నాలుగో శతాబ్దంలో రెండో చంద్రగుప్త విక్రమాదిత్యుడి రాజధాని. అది కాళిదాస మహాకవీంద్రుడు నడయాడిన నేల. అక్కడే శూద్రకుడు, ధన్వంతరి, వరరుచి, వరాహమిహిరుడు, బ్రహ్మగుప్తుడు వంటివారు వివిధ శాస్త్రాల్లో ఉద్దండ పండితులుగా ప్రఖ్యాతి గడించారు. అంతటి గొప్ప చరిత్ర కలిగినచోట పట్టపగలు నగర వీధుల్లో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ ఒక బాలిక కాపాడమని అర్థిస్తే ఆడ, మగ అందరూ తలుపులేసుకున్నారంటే... పదో పరకో ఇచ్చి తమ అపరాధ భావనను కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నించారంటే ఎలాంటి వారికైనా మనసు వికలమవుతుంది. రోడ్డు ప్రమాదాలు జరిగి నప్పుడు బాధితులను ఆసుపత్రికి తరలించటానికీ, కనీసం పోలీసులకు ఫోన్ చేసి చెప్పటానికీ ఎవరూ ముందుకు రాకపోవటం తరచు గమనిస్తూనే ఉంటాం. చట్టపరమైన ఇబ్బందుల్లో చిక్కుకుంటామనీ, కోర్టుల చుట్టూ తిరగాల్సివస్తుందనీ ఇప్పటికీ అనేకులు వెనకడుగేయటం కనబడుతూనే ఉంటుంది. కానీ అర్ధనగ్న స్థితిలో ఆపన్నహస్తం కోసం ఎదురుచూసిన బాలికకు వైద్య సాయం అందేలా చూడటం సంగతి అటుంచి కనీసం ఒంటిని కప్పుకోవటానికి బట్టలిచ్చేందుకు కూడా ఎవరూ సిద్ధపడకపోవటం దిగ్భ్రాంతి కలిగిస్తుంది. ఈ అమానవీయతకు సీసీ టీవీ కెమెరాలు సాక్ష్యంగా నిలిచాయి. సమాజం మొత్తాన్ని కాపలా కాయటం ఏ ప్రభుత్వానికైనా అసాధ్యమన్నది వాస్తవం. లక్షల్లో జనాభా ఉండేచోట వందల్లో మాత్రమే రక్షకభటులుంటారు. అయితే ఉన్న ఆ కొద్దిమందీ కూడా కొన్ని సందర్భాల్లో నేరగాళ్లకు సాయపడుతున్నారనీ, రాజకీయ ప్రాపకం కోసం చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారనీ ఆరోపణలు ఎదుర్కొంటూనే ఉన్నారు. రెండున్నర గంటలపాటు ఆ బాలిక ఎక్కడో మారుమూల పల్లెటూరులో కాదు... కేంద్రం స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేస్తున్న నగర వీధుల్లో అత్యంత దారుణమైన పరిస్థితుల్లో సంచరిస్తున్నప్పుడు ఒక్క కానిస్టేబులైనా ఆమెను గమనించి ఆదుకోలేకపోవటం పోలీసుల పనితీరును పట్టిచూపిస్తోంది. ఇక గోవధ జరిగిందనో, జరగబోతున్నదనో అనుమానంతో కొందరు దుండగులు మారణాయుధాలతో దాడిచేసి చంపుతున్న ఉదంతాల్లో నేరగాళ్లకు ప్రభుత్వాల ఆశీస్సులుంటున్న సంగతి బహిరంగ రహస్యం. కానీ సమాజం ఏమై పోతోంది? పట్టపగలు కళ్లెదుట జరుగుతున్న దురంతాలపై కూడా కనీస స్పందన కొరవడటం, సహానుభూతి వ్యక్తం కాకపోవటం ఏమిటి? ఎన్నికల్లో ఓటేయటంతోనే పౌరులుగా తమ బాధ్యత తీరిందని జనం అనుకుంటున్నారా? కుల మత చట్రాల్లో, రాజకీయ రొదలో కూరుకుపోయి మనుషు లుగా తమ నైతిక బాధ్యతను విస్మరిస్తున్నారా? ఎవరికి వారే ప్రశ్నించుకోవాలి. ఆపత్సమయాల్లో మానవీయతను ప్రదర్శించటం, సహానుభూతి వ్యక్తపరచటం, బాధితులకు అండగా నిలవటం మనుషుల కనీస లక్షణాలని తెలుసుకోలేని సమాజం శవప్రాయమైనది. అలాంటిచోట ఎవరికీ రక్షణ ఉండదు. సమాజం సంఘటితంగా ఉన్నప్పుడే, అన్యాయాన్ని ప్రశ్నించే తత్వాన్ని ఒంటబట్టించు కున్నప్పుడే ఇలాంటి దురంతాలకు అడ్డుకట్ట పడుతుంది. ఇదీ చదవండి: అర్ధనగ్నంగా రక్తమోడుతూ -
బాలికపై పాశవికం.. ఆర్మీ మేజర్ దంపతుల వికృత చేష్టలు
అసోం: ఓ బాలికపై ఆర్మీ మేజర్, ఆయన భార్య వికృత చేష్టలకు పాల్పడ్డారు. ఇంట్లో పనిచేసే పదహారేళ్ల బాలికను పాశవికంగా వేధింపులకు గురిచేశారు. బాలిక శరీరంపై ఎక్కడ చూసిన కాల్చిన వాతలు కన్పించాయి. పళ్లు ఊడిపోయాయి. ముక్కు, నాలుక భాగాల్లో బలమైన దెబ్బలు కనిపించాయి. ఆ బాలికను దాదాపుగా నగ్నంగా ఉంచుతున్నారని పోలీసులు తెలిపారు. ఇంట్లో పనులు చేయిస్తూనే గత ఆర్నెళ్లుగా వేధింపులకు గురిచేసినట్లు పోలీసులు తెలిపారు. ఆహారం సరిగా ఇవ్వకుండా బాలికను బక్కచిక్కిపోయేలా చేశారు. ఆహారం కూడా చెత్తకుప్పలో నుంచి ఏరుకుని తినేలా చేసి పాశవిక ఆనందాన్ని పొందినట్లు బాధితురాలు పోలీసులకు తెలిపింది. నగ్నంగా ఉంచి రక్తం వచ్చేలా కొట్టేవారని వెల్లడించింది. గదిలో బందించి క్రూరంగా హింసించేవారని బాధితురాలు పేర్కొంది. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేశారు పోలీసులు. నిందితుడు ఆర్మీలో మేజర్గా పనిచేస్తున్నారు. హిమాచల్ ప్రదేశ్లో విధులు నిర్వహిస్తున్నారు. అసోం నుంచి వెళ్లినప్పుడు ఓ బాలికను ఇంట్లో పనిచేయడానికి తీసుకువెళ్లారు. హిమాచల్ ప్రదేశ్ నుంచి అసోంకి తిరిగివచ్చిన క్రమంలో బాలిక తన కుటుంబాన్ని కలిసింది. ఈ క్రమంలో విషయాన్ని తెలుసుకున్న బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పదహారేళ్ల వయసులో ఉన్న తన కూతురును వృద్ధురాలిగా మార్చేశారని ఆవేదన వ్యక్తం చేసింది. ఇదీ చదవండి: అమానవీయం.. రోడ్డుపై అత్యాచార బాధితురాలు, సాయం కోరినా కనికరించని వైనం -
‘లోకల్’లో యువతి ‘బెల్లీ’ డాన్స్.. పోలీసులకు నెటిజన్ల ఫిర్యాదు!
ముంబై లోకల్ ట్రైన్లో ఓ యువతి బెల్లీ డ్యాన్స్ చేస్తున్న వీడియో ఇన్స్టాగ్రామ్లో వైరల్ అవుతోంది. ముంబైలోని సాండ్హర్స్ట్ రోడ్- మస్జిద్ స్టేషన్ల మధ్య సాగుతున్న రైలు ప్రయాణం మధ్యలో ఈ వీడియో రికార్డ్ అయినట్లు తెలుస్తోంది. ఈ ఫుటేజీ చూసిన నెటిజన్లు పలు విధాలుగా తమ స్పందనను తెలియజేస్తున్నారు. ఈ వీడియో ముంబై పోలీసుల దృష్టిలో పడింది. ఆ యువతి లోకల్ ట్రైన్లో అసభ్యకర రీతిలో బెల్లీ డ్యాన్స్ చేస్తున్నదని పలువురు కామెంట్ చేస్తున్నారు. ఈ వీడియోను పలువురు సోషల్ మీడియాలో ముంబై పోలీసులను ట్యాగ్ చేస్తున్నారు. ఈ నేపధ్యంలో ముంబై పోలీసులు ఆ యువతిపై చర్యలు చేపట్టేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ సంఘటన ముంబైలోని లోకల్ రైళ్లలో దిగజారుతున్న పరిస్థితికి దర్పణం పడుతున్నదని పలువురు ఆరోపిస్తున్నారు. ఇది కూడా చదవండి: 5 దారుణ అల్లర్లు.. దేశాన్ని వణికించి, రక్తపాతాన్ని సృష్టించి.. Entertainment Now Belly Dancing inside Mumbai Local Train. It seems #MumbaiLocal Trains are the most happening place..to showcase talent. Locations seems to be @Central_Railway between Sandhurst Road & Masjid stations.@drmmumbaicr @RailMinIndia @RailMinIndia pic.twitter.com/LI1vFchnHw — मुंबई Matters™ (@mumbaimatterz) September 19, 2023 -
ఈఎస్ఐ ఆసుపత్రిలో అత్యాచారానికి పాల్పడ్డ యువకుడి అరెస్ట్
హైదరాబాద్: ఈఎస్ఐ ఆసుపత్రిలో ఓ రోగి సోదరిపై అత్యాచారానికి పాల్పడిన యువకుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లిఫ్ట్లో ఆమెను బలవంతంగా తీసుకువెళ్లి అత్యాచారం చేశాడు షాబాద్ అనే యువకుడు. మూడు రోజుల నుంచి పరారీలో ఉన్న షాబాద్ను ఎస్ఆర్ నగర్ పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. తన సోదరుడి చికిత్స కోసం కర్ణాకట నుంచి ఈఎస్ఐ ఆసుపత్రికి యువతి రాగా, అక్కడ ఈ దారుణం చోటు చేసుకుంది. కర్ణాటకకు చెందిన 19 ఏళ్ల యువతి.. సోదరుడు జారి పడిపోవడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఈ క్రమంలోనే అతన్ని నగరంలోని ఈఎస్ఐ ఆసుపత్రిలో చేర్పించారు. అతడికి సాయంగా ఉండేందుకు అతని సోదరి ఆసుపత్రికి రాగా, క్యాంటీన్లో పని చేసే షాబాద్ ఆమెపై కన్నేశాడు. ఆమెతో మాటలు కలుపుతూ పరిచయం పెంచుకున్నాడు. అయితే ఆమె లిఫ్ట్లో వెళుతున్నప్పుడు బలవంతంగా రెండో అంతస్తులోని చీకటి ప్రదేశానికి వెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. -
బాలిక ఉసురుతీసిన పోకిరీలు
అంబేడ్కర్నగర్(యూపీ): సైకిల్పై వెళ్తున్న బాలికను వేధించేందుకు బైక్పై వచ్చిన ఇద్దరు ఆకతాయిలు ప్రయత్నించారు. దుపట్టాను లాగేయడంతో ఆమె అదుపుతప్పి సైకిల్పై నుంచి పడిపోయింది. ఆ వెనుకే మరో యువకుడు ఆమెను బైక్తో ఢీకొట్టి చంపేశాడు. ఒళ్లుగగుర్పొడిచే ఈ ఘటన యూపీలోని అంబేడ్కర్నగర్లో చోటుచేసుకుంది. బర్హి అయిదిల్పూర్కు చెందిన నయన్శీ పటేల్(17) ఇంటర్ చదువుతోంది. శుక్రవారం సాయంత్రం సైకిల్పై ఇంటికి వెళుతోంది. వేగంగా బైక్పై వచ్చిన ఆకతాయిలు ఆమె దుపట్టాను లాగడంతో అదుపుతప్పి కిందపడి పోయింది. ఆ వెనుకే బైక్పై వచ్చిన మరో యువకుడు ఆమె మీదుగా బైక్ను పోనిచ్చాడు. తీవ్రగాయాలతో బాలిక చనిపోయింది. ఈ అమానుషానికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు సెహబాజ్, అర్బాజ్, ఫైసల్ అనే వారిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులను ఆదివారం ఆస్పత్రికి తీసుకెళ్తుండగా పారిపోయేందుకు యత్నించారు. పోలీసుల కాల్పుల్లో ఇద్దరికి గాయాలయ్యాయి. మరొకరు పారిపోయేక్రమంలో కిందపడి కాలు విరగ్గొట్టుకున్నాడు. సదరు పోకిరీలు తన కూతుర్ని వేధిస్తున్నారంటూ వారం క్రితమే పోలీసులకు తెలిపినట్లు తండ్రి సభజీత్ వర్మ తెలపడంతో స్టేషన్ హౌస్ ఆఫీసర్ రితేశ్ పాండేను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. -
సెల్ఫోన్ వాడొద్దన్నందుకు బాలిక ఆత్మహత్య
హైదరాబాద్: సెల్ఫోన్ ఎక్కువగా వాడుతున్నావని, ఇది మంచిది కాదని తల్లిదండ్రులు మందలించగా మనస్థాపానికి గురై కూతురు ఆత్మహత్య చేసుకున్న ఘటన బంజారాహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాలివీ... వెస్ట్బెంగాల్కు చెందిన సంజీబ్ మండల్ ఎలక్ట్రీషియన్ గా పనిచేస్తూ బంజారాహిల్స్ రోడ్ నెం. 10లోని నూర్నగర్లో కుటుంబంతో కలిసి అద్దెకుంటున్నాడు. ఆయన కూతురు ఇషికా మండల్(13) స్థానిక ప్రైవేట్ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నది. ఎప్పటిలాగే శుక్రవారం సాయంత్రం స్కూల్ నుంచి వచి్చన ఆమె బెడ్రూమ్లోకి వెళ్లి సెల్ఫోన్ను అదే పనిగా చూస్తున్నది. పలుమార్లు మందలించినా ఇషికా ఫోన్చూడటం మాత్రం మానడం లేదు. తల్లిదండ్రులు ఈ విషయంలో కూతురిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పది నిమిషాల తర్వాత తన గదిలోకి వెళ్లిన ఇషికా ఫ్యాన్కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. తండ్రి ఇచి్చన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
ఇనుపరేకు బాక్సులో యువతి మృతదేహం.. సీసీటీవీ ఫుటేజీలో నిందితుడు!
ఉత్తరప్రదేశ్లోని బదోహీ జిల్లాలో ఇటీవల పోలీసులకు ఒక ఇనుపరేకు బాక్సులో 16 ఏళ్ల యువతి మృతదేహం లభ్యమయ్యింది. దీంతో ఆమె ఎవరు? ఆమెను హత్య చేసింది ఎవరు? అనేదానిపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఒక మల్టీనేషనల్ కంపెనీలో సేల్స్మ్యాన్గా పనిచేస్తున్న ఉపేంద్ర శ్రీవాస్తవ ఈ యువతిని హత్య చేశాడని పోలీసుల దర్యాప్తులో వెల్లడయ్యింది. మృతురాలితో గతంలో ఉపేంద్రకు అఫైర్ నడిచిందని, అయితే ఆమె మరొక యువకునితో సన్నిహితంగా ఉంటుండంతో ఉపేంద్ర ఆమెను హెచ్చరించాడని పోలీసుల విచారణలో తేలింది. ఆమె ఉపేంద్ర మాటలను పట్టించుకోకపోవడంతో ఇద్దరి మధ్య వివాదం చెలరేగింది. ఈ నేపధ్యంలో ఉపేంద్ర ఆమెను హత్య చేశాడు. తరువాత బజారుకు వెళ్లి, ఒక ఐరన్ బాక్సు కొనుగోలు చేశాడు. ఆమె మృతదేహాన్ని ఆ బాక్సులో ఉంచి, దానిని బైక్కు కట్టి 40 కిలోమీటర్ల దూరంలోని అడవిలో ఆ బాక్సును వదిలేసి వచ్చాడు. ఈ సంగతి ఇక పోలీసులకు తెలియదని ఉపేంద్ర భావించాడు. అయితే అతను ఊహించని విధంగా పోలీసులు అతనిని పట్టుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఉపేంద్ర శ్రీవాస్తవ తాను ఉంటున్న ఇంటికి సమీపంలోని 16 ఏళ్ల యువతితో పరిచయం పెంచుకున్నాడు. తరువాత వారిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. ఈ నేపధ్యంలో ఉపేంద్ర వారణాసిలోని మహామాన్పురి కాలనీలో ఒక ఇల్లు అద్దెకు తీసుకున్నాడు. దానిలో వారిద్దరూ ఉండసాగారు. సాయంత్రం కాగానే ఎవరి ఇళ్లకు వారు వెళ్లిపోయేవారు. ఇంతలో ఉపేంద్రకు ఆ యువతి ఎవరితోనే మాట్లాడుతున్నదనే అనుమానం వచ్చింది. ఆమెను ఈ విషయమై నిలదీశాడు. దీంతో ఇద్దరిమధ్య వివాదం నెలకొంది. ఈ నేపధ్యంలో ఆగ్రహానికి గురైన ఉపేంద్ర ఆమెను గొంతునొక్కి హత్య చేశాడు. తరువాత ఆమె మృతదేహాన్ని బాక్సులో పెట్టి, దానిని బైక్కు కట్టి వారణాసికి 40 కిలోమీటర్ల దూరంలోని బదోహీ నేషనల్ హైవే మీదుగా లాలానగర్ సమీపంలోని అడవులలోకి తీసుకెళ్లాడు. అక్కడ బాక్సును కిందకు దించి, బైక్ ట్యాకులోని పెట్రోల్ బయటకు తీసి, దానితో బాక్సుకు నిప్పంటించాడు. ఇలా చేయడం ద్వారా తన నేరాన్ని ఎవరూ గ్రహించలేరని ఉపేంద్ర భావించాడు. అయితే స్థానికులు ఈ అనుమానాస్పద బాక్సును గమనించి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ యువతి మృతదేహాన్ని పోస్టుమార్టంనకు తరలించి, కేసు దర్యాప్తు ప్రారంభించారు. దీనిలో భాగంగా పోలీసులు హైవేలోని సీసీటీవీ కెమెరా ఫుటేజ్లను పరిశీలించారు. వాటిలో నిందితుడు తన బైక్కు ఈ బాక్సును కట్టి ప్రయాణిస్తున్న దృశ్యం కనిపించింది. బైక్ నంబర్ ఆధారంగా పోలీసులు నిందితుడు ఉపేంద్ర శ్రీవాస్తవ్ను అరెస్టు చేశారు. అతని దగ్గరి నుంచి బైక్ స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు విచారణలో నిందితుడు తన నేరాన్ని ఒప్పుకున్నాడు. పోలీసులు తదపరి చర్యలు చేపడుతున్నారు. ఇది కూడా చదవండి: ఆ భారత యువరాణి బ్రిటన్లో మహిళల కోసం ఎందుకు పోరాడారు? -
ఆమె చేతిలో ‘భర్త కావాలి’ బోర్డు.. 30 నిముషాల్లో మారిన సీన్!
ఎవరైనాసరే తనకొక జీవిత భాగస్వామి కావాలని, సుఖదుఃఖాల్లో తోడుగా నిలవాలని కోరుకుంటారు. అయితే అందరికీ తగిన జీవిత భాగస్వామి లభించడం అంత సులభంకాదు. అనువైన జీవిత భాగస్వామిని దక్కించుకునేందుకు కొంత శ్రమించాల్సి వస్తుంది. ఇందుకోసం కొందరు డేటింగ్ యాప్లను ఆశ్రయిస్తుంటారు. అయితే ఒక యువతి దీనికి భిన్నంగా కొత్త పద్ధతిని అనుసరించింది. అమెరికాలో రెండేళ్లుగా సింగిల్గా ఉంటున్న బ్యూటీ ఇన్ఫ్లుయెన్సర్ కరోలినా గీట్స్ భర్తను ఎన్నుకునేందుకు కొత్తగా ప్రయత్నించింది. కరోలీనాకు మంచి భార్త కావాలట. ఇందుకోసం ఆమె తన చేతులతో ఒక బోర్డు పట్టుకుని రోడ్డుపై నిలుచుంది. ఆ బోర్డుపై ‘భర్త కోసం వెదుకుతున్నాను’ అని రాసివుంది.ఈ బోర్డు పట్టుకుని ఆమె పట్టణంలో తిరుగుతోంది. సోహో పట్టణానికి చెందిన గీట్స్ మీడియాతో మాట్లాడుతూ తాను ఒక సైన్ బోర్టుపై ‘భర్త కోసం వెదుకుతున్నాను’ అని రాసి దానిని పట్టుకుని, పట్టణంలో తిరగాలని నిర్ణయించుకున్నానని తెలిపింది. టిండర్, హింజ్ లాంటి డేటింగ్ యాప్ల ద్వారా కొందరు పురుషులతో స్నేహం చేసి, వాళ్లెవరూ నచ్చక తన టైమ్ వృథా చేసుకున్నానని ఆమె తెలిపింది. అందుకే ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకున్నానని పేర్కొంది. ఆమె పట్టణంలోని రోడ్లపై ఈ బోర్టు పట్టుకుని తిరుగుతుండగా 30 నిముషాల అనంతరం ఒక వ్యక్తి ఆమెకు తారసపడ్డాడు. దీంతో వారు ఫోన్ నంబర్లు ఇచ్చిపుచ్చుకున్నారు. అనంతరం గీట్స్ మీడియాతో మాట్లాడుతూ భర్త కోసం వెదుకుతూ రోడ్డు మీదకు వచ్చిన 30 నిముషాలకు తనకు ఫలితం కనిపించిందని, ఇకపై తాము ఒకరికొకరు తెలుసుకోవాల్సి ఉందని, ఇప్పుడంతా కొత్తగా ఉందని, ఈ పరిచయం ఎక్కడికి దారితీస్తుందో చూడాలని అన్నారు. ఇది కూడా చదవండి: ఇంటి తవ్వకాల్లో పురాతన బాక్సు.. తెరిచి చూడగానే.. -
సాఫ్ట్వేర్ చిన్నారి! ఏకంగా వీడియో గేమ్లనే రూపొందిస్తోంది!
సాఫ్ట్వేర్ చిన్నారిప్రపంచమంతా టెక్నాలజీతోపాటు పరుగులు పెడుతోంది. అందుకే చిన్నా..పెద్దా తేడా లేకుండా అంతా స్మార్ట్ ఫోన్ల నుంచి కంప్యూటర్ల దాకా అన్నీ అవలీలగా వాడేస్తున్నారు. సాఫ్ట్వేర్ ఇంజినీర్లు కోడింగ్ ద్వారా వివిధ రకాల అప్లికేషన్లు, గేమ్లు తయారు చేస్తుంటారు. సాఫ్ట్వేర్ ఇంజినీర్లలో కొంతమంది మాత్రమే వీటిని తయారు చేయగలరు. మిగతావారికి కోడింగ్ అంటే అర్థం కాని పెద్ద సబ్జెక్ట్గా చూస్తారు. అటువంటిది భారత సంతతికి చెందిన సీమర్ ఖురానా కోడింగ్ను మునివేళ్లతో పట్టి చకచక వీడియోగేమ్ను రూపొందించింది. అతిపిన్నవయసులో వీడియోగేమ్ రూపొందించి ప్రపంచంలోనే అతిపిన్న వయస్కురాలైన వీడియోగేమ్ డెవలపర్గా గిన్నిస్ రికార్డుల్లో నిలిచింది. కెనడాలోని ఆంటారియోలో నివసిస్తోన్న భారత సంతతికి చెందిన పరాస్ ఖురానా కూతురే సీమర్. చిన్నప్పటి నుంచి చాలా చురుకుగా ఉండే సీమర్ తన వయసు పిల్లలంతా వీడియోగేమ్లు ఆడుకుంటుంటే సీమర్ మాత్రం... తన సీనియర్లు చదివే పాఠాలు నేర్చుకోవడానికి ఆరాటపడేది. మ్యాథ్స్ అంటే మక్కువ ఎక్కువ ఉన్న సీమర్.. తన తరగతి కాకుండా పైతరగతి విద్యార్థులు చదివే లెక్కల పాఠాలు నేర్చుకోవాలనుకునేది. కానీ ఎవరూ నేర్పించేవాళ్లు కాదు. దీంతో యూట్యూబ్లో చూసి లెక్కలు నేర్చుకునేది. కిండర్ గార్డెన్ చదివే సీమర్ మూడోతరగతి లెక్కలు సులభంగా చేసేది. ఒకపక్క లెక్కలు చెబుతూనే కాగితాలతో క్రాఫ్ట్ తయారు చేసి ఆడుకుంటూ ఉండేది. ఇది గమనించిన సీమర్ తండ్రి కోడింగ్ క్లాసులను చూపించారు. కోడింగ్ నచ్చడంతో సీమర్ కోడింగ్ కూడా నేర్చుకోవడం మొదలుపెట్టింది. క్రమంగా కోడింగ్పై పట్టుసాధించేందుకు ప్రయత్నం మొదలు పెట్టింది. డాక్టర్ మాటలు విని... సీమర్ అక్క ఆరోగ్యం పాడవడంతో ఫ్యామిలీ డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లారు. అక్కను పరీక్షించిన డాక్టర్ జంక్ఫుడ్ని మానేయాలని చెప్పడంతో ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటూనే హెల్దీ, జంక్ఫుడ్ల గురించి వీడియో గేమ్ తయారు చేయాలనుకుంది. దీనికోసం వారానికి మూడు క్లాసులకు హాజరవుతూ ఏడాదిలోపే కోడింగ్ను క్షుణ్ణంగా తెలుసుకుంది. ఆ తరువాత ‘హెల్దీఫుడ్ ఛాలెంజ్’ పేరిట వీడియో గేమ్ను తయారు చేసింది. జంక్ ఫుడ్ వల్ల ఏర్పడే ముప్పు, ఆరోగ్యకరమైన, సమతుల ఆహారం ఎలా తీసుకోవాలో ఈ వీడియోగేమ్ వివరంగా చెబుతుంది. ఈ యాప్ను తయారు చేయడానికి స్కూలు అయిపోయిన తరువాత రోజుకి రెండు గంటలపాటు సమయాన్ని కేటాయించేది సీమర్. ఇలా తన పేరుని గిన్నిస్బుక్లో ఎక్కించుకుంది. వీడియో గేమ్లే కాదు... లెక్కలు, కోడింగ్తోపాటు డ్యాన్స్, జిమ్నాస్టిక్స్, కరాటేలు కూడా నేర్చుకుంటోంది.‘సీమర్స్ వరల్డ్’ పేరుమీద యూ ట్యూబ్ ఛానల్ నడుపుతూ తనకొచ్చే వివిధ రకాల ఆటల ఐడియాలను షేర్ చేస్తోంది. టాలెంట్కు వయసుతో సంబంధంలేదనడానికి సిసలైన ఉదాహరణగా నిలుస్తోంది సీమర్. చిచ్చర పిడుగుల్లాంటి పిల్లలు వయసు కంటే పెద్ద చదువులు చకచకా చదివేసి, డిగ్రీ పట్టాలు పొందేస్తుంటారు. అయితే అంతకన్నా చకచకా అడుగులు వేసింది సీమర్. డిగ్రీలు చదవడం కాదు... ఏకంగా వీడియో గేమ్నే రూపొందించింది ఈ ఆరేళ్ల సిసింద్రీ సీమర్ ఖురానా. (చదవండి: ఏడు నిమిషాలపాటు గుండె ఆగిపోయింది..వైద్యపరంగా 'డెడ్'! కానీ ఆ వ్యక్తి..) -
జ్వరం, జలుబే కదా అని తేలిగ్గా కొట్టిపారేయొద్దు!..అవే ఒక్కొసారి..
మనం సాధారణంగా చిన్నిపిల్లలకు వచ్చే దగ్గు, జలుబు, జ్వరం వంటి వ్యాధులను చాలా తేలిగ్గా తీసుకుంటాం. ట్యాబలెట్లు వేస్తున్నాం కదా తగ్గిపోతుందనుకుంటాం. చాలా సర్వసాధరణమైన వ్యాధిగానే భావిస్తాం. కొన్ని రకాల వ్యాధులు విజృంభించే క్రమంలో తొలి దశలో అలాంటి తేలికపాటి లక్షణాలనే చూపిస్తాయి. మనం తెలియక సాధారణమైన జ్వరంగా భావించి ఎప్పుడూ వాడే వాటినే వాడేస్తాం. కానీ మనం కంటిపాపల్లా కాపాడుకుంటున్న చిన్నారుల ప్రాణాలు పోయేంతవరకు కళ్లు తెరవవం. అచ్చం అలాంటి దురదృష్టకర ఘటన ఆస్ట్రేలియాలో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే..ఆస్ట్రేలియాలోని బాథర్స్ట్ నివాసి క్యాథీ అనే 5 ఏళ్ల చిన్నారి గత కొద్దిరోజులుగా జలుబుతో బాధపడుతోంది. ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యులు ఇచ్చిన మందులు క్రమం తప్పకుండా వాడుతున్నారు. కానీ క్యాథీ కోలుకోవడం మాని ఆరోగ్యం రోజురోజుకి క్షీణించడం ప్రారంభమైంది. దీంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు వైద్యులను సంప్రదించారు. సాధారణమైన జలుబే కదా అనే భావించారు. సరిగ్గా తినక జబ్బు పడుటుందని భావించి ఆస్పత్రిలో జాయిన్ చేశారు. తీరా జాయిన్ అయ్యాక కోలుకుందా అంటే.. లేకపోగా మరింత సీరియస్ అయ్యి మూసిన కన్ను తెరవకుండా శాశ్వత నిద్రలోకి వెళ్లిపోయింది. దీంతో తల్లిదండ్రులు ఒక్కసారిగా నిర్ఘాంతపోయారు. చిన్న జలుబు లాంటి ఫీవర్ ఇంతలా మా చిన్నారిని కోల్పోయేంత ప్రాణాంతక మారడం ఏమిటిని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. దీంతో వారు మరోసారి ఆమె హెల్త్ రికార్డును చెక్ చేయించి ఇది జలుబు మరేదైనా అని పలు ఆస్పత్రుల్లో ఎంక్వైయిరి చేయగా అసలు విషయం బయటపడింది. స్ట్రెప్ఏ అనే బ్యాక్టీరియా బారిన పడినట్లు గుర్తించారు వైద్యులు. దీని కారణంగానే మూడు రోజుల తర్వాత ఆమె గొంతును పూర్తిగా కోల్పోయిందన్నారు. ఆమె పరిస్థితి మరింత దిగజారి, శ్వాసతీసుకోలేని స్థితికి వచ్చాక మళ్లీ ఆస్పత్రిలో అడ్మిట్ చేసినట్లు తెలిపారు చిన్నారి తల్లిదండ్రులు. ఐతే వైద్య పరీక్షల్లో వైరల్ ఫీపర్ అని తేలింది దీంతో తాము తేలిగ్గా తీసుకున్నామని ఆవేదనగా చెబుతున్నారు చిన్నారి తల్లిదండ్రులు. ఇంటికి వచ్చకా చిన్నారి ఆరోగ్యం క్షీణించటం, పెదాలు నీలం రంగులోకి మారిపోవడం శ్వాసతీసుకోలేకపోవడం వంటి సమస్యలు తలెత్తినట్లు వివరించారు. ఎంతలా సీఆర్పీ చేసి బతికించేందుకు ప్రయత్నించిన ఫలితం లేకుండా పోయిందని కన్నీళ్లు పెట్టుకున్నారు తలిదండ్రులు. ఇంత చిన్నపాటి అనారోగ్యం తమ కూతురు ప్రాణాలను బలితీసుకోవడం జీర్ణించుకోలేక ఆ చిన్నారి శరీరాన్ని వైద్య పరీక్షలు నిర్వహించగా ఈ విషయం తెలిసింది. ఆమె గొంతు స్టెప్ఏ బ్యాక్టీరియా ఇన్షెక్షన్కు గురైందని ఇది చాలా రకాలు లక్షణాలతో సంకేతాలిస్తుందని, వైద్యులు కూడా ఒక్కోసారి ఇలాంటి కేసులను గుర్తించడంలో విపలమతుంటారని వివరణ ఇచ్చింది వైద్య బృందం. విచిత్రమేమిటంటే ప్రాణాలతో పోరాడి చనిపోయిన ఆ చిన్నారి ముగ్గురికి అవయవదానం చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వైద్యులు కాస్త సీరియస్గా తీసుకుని పవర్ఫుల్ యాంటీబయోటిక్స్ ఇచ్చి ఉంటే మా చిన్నారి మా కళ్ల ముందు ఆడుతూ తిరిగి ఉండేదంటూ వేదనగా చెప్పారు. అందువల్ల పేరెంట్స్ అందరూ చిన్నారులకు వచ్చి కొన్ని రకలా వైరల్ ఫీవర్లను తేలిగ్గా తీసుకోవద్దు. మీ కంటి పాపలను దూరం చేసుకుని శోకాన్ని కొనితెచ్చుకోవద్దని బాధిత తల్లిందండ్రులు ఆవేదనగా వేడుకుంటున్నారు. (చదవండి: గుడ్డు ఆరోగ్యానికి మంచిది కాదా..?) -
బహుముఖ ప్రజ్ఞాశాలి! ఒకటి రెండు కాదు!.. ఏకంగా 34 సబ్జెక్టుల్లో..
పదహారు సంవత్సరాల బ్రిటీష్–పాకిస్థానీ మహ్నూర్ ఛీమ లండన్లోని జనరల్ సర్టిఫికేట్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (జీసిఎస్ఈ) లెవెల్లో 34 సబ్జెక్లలో టాప్ గ్రేడ్ సాధించి రికార్డ్ సృష్టించింది. గణిత శాస్త్రం, ఖగోళశాస్త్రంలాంటి శాస్త్రాలు, ఫ్రెంచ్, లాటిన్... మొదలైన భాషలలో అద్భుతమైన ప్రతిభ చూపుతుంది మహ్నూర్. ఆమె ఎంచుకున్న 34 సబ్జెక్ట్లలో ఫిజిక్స్, కెమిస్ట్రీ, లిటరేచర్, ఫిల్మ్ స్టూడియోస్, సైకాలజీ... మొదలైన సబ్జెక్ట్లు ఉన్నాయి. ‘ఇది మహ్నూర్కు మాత్రమే పరిమితమైన విజయం కాదు. ఈతరంలో ఎంతోమందికి స్ఫూర్తినిచ్చే విజయం’ అని ట్వీట్ చేశారు పాక్ మాజీ ప్రధాని షెహబాజ్ షరీఫ్. ‘వైద్యురాలిగా పదిమందికి సేవ చేయాలి’ అనేది తన జీవిత ఆశయంగా చెబుతుంది మహ్నూర్. It is always very uplifting to meet bright young minds like Mahnoor Cheema. By securing A* in a wide range of subjects from Maths and Astronomy to French and Latin, Mahnoor has not only made all of us proud but also has also set a great example for our children. During the past… pic.twitter.com/ZAc3WCFL8k — Shehbaz Sharif (@CMShehbaz) September 4, 2023 (చదవండి: మీకు తెలుసా!..బ్రెడ్తో పాదాల పగుళ్లు మాయం!) -
తైవాన్ అమ్మాయి.. తెలుగింటి అబ్బాయి
సాక్షి, చల్లపల్లి(అవనిగడ్డ): ఎల్లలు ఎరుగని ప్రేమతో ఎంతో మంది విదేశీ వనితలు తెలుగింటి అబ్బాయిలను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. తాజాగా చల్లపల్లి గ్రామానికి చెందిన వేమూరి సాయిదినకర్, తైవాన్ దేశానికి చెందిన యూటింగ్ లియూ పెద్దల అనుమతితో ప్రేమ వివాహం చేసుకున్నారు. చల్లపల్లికి చెందిన మెడికల్ షాప్ నిర్వాహకుడు వేమూరి కిషోర్ కుమారుడు సాయి దినకర్ తైవాన్ దేశంలోని సించూ సిటీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పని చేస్తున్నారు. అక్కడే ఫిజియోథెరపిస్ట్ యూటింగ్ లియూతో ప్రేమలో పడ్డారు. వారిద్దరి వివాహానికి వరుడి తండ్రి కిషోర్, వధువు తండ్రి ఈషెంగ్ లియూ అంగీకరించారు. దీంతో ఈ నెల రెండో తేదీ ద్వారకా తిరుమలలో సాయి దినకర్, యూటింగ్ లియూ వివాహం తెలుగు సంప్రదాయంలో వైభవంగా నిర్వహించారు. సోమవారం ఘంటసాల మండలం దేవరకోటలో రిసెప్షన్ జరిగింది. ఈ వేడుకకు వధువు యూటింగ్ లియూ కుటుంబ సభ్యులు, బంధువులైన తైవాన్ దేశస్థులందరూ తెలుగు సంప్రదాయం ప్రకారం మహిళలు పట్టు చీరలు, పురుషులు పట్టు పంచెలు ధరించి ఆకట్టుకున్నారు. చదవండి: కోనసీమ: పిడుగు పాటుతో కుంగిన భూమి -
తమ్ముడికి రాఖీ కట్టేందుకు..ఓ చిన్నారి ఏం చేసిందో తెలుసా!
ఆత్మీయత.. ఆప్యాయత.. సోదరభావం.. భద్రత ఇవన్నీ మిళితమైన సెంటిమెంటే రాఖీ పండుగ. అందుకే అన్నకు చెల్లి... తమ్ముడికి అక్క రాఖీ కట్టి ఆశీర్వాదాలొకవైపు.. అండగా ఉంటా అనే భరోసా మరోవైపు.. ఇలా భిన్న పార్శ్వాలు కనిపించే సెంటిమెంట్ పండుగ రాఖీపౌర్ణమి. అయితే, రాఖీ పండుగను ప్రత్యేకంగా జరుపుకోవాలనుకున్న ఓ చిన్నారి.. కాస్త భిన్నంగా రాఖీని తానే స్వయంగా తయారు చేసిన కథే ఇది. పెద్దపెల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన మామిడి సహస్ర తల్లి ఇంట్లో ఎంబ్రాయిడరీ వర్క్ చేస్తూ ఉంటారు. అయితే, అమ్మతో పాటు కుట్లు, అల్లికలూ ప్రాక్టీస్ చేస్తున్న సహస్రకు ఓ ఆలోచన తట్టిందే ఆలస్యం.. ఓ క్లాత్ తీసుకుని దానిపై పూర్తిగా ఎంబ్రాయిడరీ వర్క్ తో ఆకట్టుకునేలా ఓ రాఖీగా మల్చింది. అంతేకాదు.. తమ్ముడు అని ఎంబ్రాయిడరీ చేసిన ఆ రాఖీని రేపు రాఖీ పున్నమ సందర్భంగా తన సోదరుడికి కట్టబోతోంది చిన్నారి సహస్ర. అలా సహస్ర ఐడియా షాపుకెళ్లి రాఖీ కొనుక్కోవాల్సిన అవసరం లేకుండా చేస్తూనే.. అందరికంటే భిన్నమైన రాఖీని తమ్ముడికి కట్టేందుకు కారణమైంది. (చదవండి: ఈ ఏడాది రాఖీ పండుగ ఎప్పుడు? ఆ టైంలోనే రాఖీ కట్టాలా!) -
ఐసీడీఎస్ వారి పెళ్లిపిలుపు
సాక్షి, కామారెడ్డి: ఊహ తెలియని వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయిన ఆ బాలికను మహిళా శిశు సంక్షేమ శాఖ అక్కున చేర్చుకుంది. కామారెడ్డిలోని బాలసదనంలో చేర్పించి విద్యాబుద్ధులు నేర్పించింది. ఆమెకు యుక్త వయసు రావడంతో అన్నీ పరిశీలించి, సంబంధం కుదిర్చారు. జిల్లా అధికారులే పెళ్లి పెద్దలుగా మారి ఆమెను పెళ్లిపీటలు ఎక్కించబోతున్నారు. ఈ అపురూప సన్నివేశం సోమవారం సదాశివనగర్ మండలంలోని ధర్మరావుపేట గ్రామంలో సోమవారం ఆవిష్కృతం కాబోతోంది. అలా జత కలిసింది.. చిన్నప్పుడే తల్లిదండ్రులు కోల్పోయి అనాథలయిన రూప, ఆమె చెల్లెలిని ఐసీడీఎస్ అధికారులు చేరదీసి, బాలసదనంలో చేర్పించారు. రూప పదో తరగతి పూర్తి చేశాక మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ కోర్సు చదివించారు. ఇటీవలే కోర్సు పూర్తి చేసింది. రూప చెల్లెలు ప్రస్తుతం పాలిటెక్నిక్ కోర్సు చదువుతోంది. ఇదే సమయంలో ధర్మారావుపేట గ్రామానికి చెందిన అనిల్ బతుకుదెరువు కోసం దుబాయ్ వెళ్లి వచ్చారు. ఆయనకు కుటుంబ సభ్యులు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఈ క్రమంలో బాలసదనంలో పెరుగుతున్న రూప గురించి ఎవరో చెప్పడంతో అధికారులతో మాట్లాడాడు. రూప, అనిల్ ఇరువురూ పరస్పరం ఇష్టపడడంతో అధికారులు పెళ్లి చేయడానికి నిర్ణయించారు. వరుడి వివరాలను క్షుణ్ణంగా పరిశీలించాక.. డాక్యుమెంటేషన్ ప్రక్రియనంతా పూర్తి చేశారు. ఆహ్వానించేది అధికారులే.. రూప, అనిల్ల వివాహం కోసం ‘మహిళా శిశు సంక్షేమ శాఖ’పేరుతో ఆహ్వాన పత్రిక ముద్రించారు. పత్రికలో పెళ్లి కూతురు, పెళ్లి కుమారుడి పేర్లు, వివరాలు, వివాహం జరుగు స్థలం పొందుపరిచారు. అధికారులే పెళ్లి పెద్దలుగా మారారు. కలెక్టర్ జితేష్ వి పాటిల్, జిల్లా సంక్షేమ అధికారి పి.రమ్య, డీసీపీవో జె.స్రవంతి, బాలసదనం సూపరింటెండెంట్ కే.సంగమేశ్వరి వివాహానికి అందరినీ ఆహ్వానిస్తున్నారు. నేడు వివాహం..: రూప, అనిల్ల వివాహం సోమవారం జరగనుంది. సదాశివనగర్ మండలంలోని ధర్మరావుపేట గ్రామంలోగల రెడ్డి సంఘ భవనం ఈ వివాహానికి వేదిక అవుతోంది. రూప పెళ్లికి జిల్లా స్థాయి అధికారులు, పలువురు ప్రజాప్రతినిధులు అండగా నిలుస్తున్నారు. వివాహ ఖర్చును పెళ్లి కొడుకే భరిస్తుండగా.. కావలసిన సామగ్రి, బంగారం, దుస్తులను అధికారులు సమకూరుస్తున్నారు. కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎస్పీ శ్రీనివాస్రెడ్డితో పాటు స్థానిక ఎమ్మెల్యే జాజాల సురేందర్ తదితరులు హాజరవుతారని ఐసీడీఎస్ అధికారులు తెలిపారు. -
మీర్పేట్ గ్యాంగ్రేప్ నిందితుల అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: మీర్పేట పోలీస్స్టేషన్ పరిధిలో జరిగిన అమానుషం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. నందనవనం కాలనీలో గంజాయి బ్యాచ్ 16 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాయి. అయితే.. ఈ కేసును రాచకొండ పోలీసులు ఛేదించారు. ఆరుగురి నిందితులను అరెస్ట్ చేశారు. అబేద్ లాల్ అనే రౌడీషీటర్తో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకోగా, మరో కీలక నిందితుడు పరారీలో ఉన్నట్లు రాచకొండ సీపీ చౌహన్ మీడియాకు వివరాలు వెల్లడించారు. బాలికను బెదిరించడంతో పాటు, దాడి చేసి అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితులు గంజాయి కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో ఏ1 అబేద్ బిన్ ఖాలీద్, ఏ2 తెహసీన్, ఏ3 మంకాల మహేష్ కీలక నిందితులు కాగా, వీరికి ఏ4 నర్సింగ్ ఏ5 అశ్రఫ్, ఏ6 ఫైజల్, ఏ7 ఇమ్రాన్ సహకరించారు. చదవండి: మీర్పేట గ్యాంగ్ రేప్ ఘటనపై గవర్నర్ దిగ్భ్రాంతి ఘాతుకం జరిగిందిలా.. హైదరాబాద్ లాల్బజార్కు చెందిన బాలిక(16) తల్లిదండ్రులిద్దరూ గతంలో చనిపోయారు. దీంతో రెండువారాల కిందట.. తన తమ్ముడితో(14)తో కలిసి మీర్పేటలోని ఓ కాలనీకి వచ్చారు. సమీప బంధువైన అక్క దగ్గర ఆశ్రయం పొందుతున్నారు. బాలిక దిల్సుఖ్నగర్లోని ఓ వస్త్ర దుకాణంలో పనిచేస్తోంది. తమ్ముడు ఫ్లెక్సీలు కట్టే పనిచేస్తుంటాడు. సోమవారం ఉదయం 9 గంటలకు బాలిక తన సోదరుడు, మరో ముగ్గురు చిన్నారులతో కలిసి ఇంట్లో ఉన్న సమయంలో ఎనిమిది మంది నిందితులు ఒక్కసారిగా ఇంట్లోకి చొరబడ్డారు. అప్పటికే గంజాయి మత్తులో ఉన్న ఆ బృందంలోని నలుగురు బాలిక మెడపై కత్తిపెట్టారు. భవనంలోని మూడో అంతస్తులోకి తీసుకెళ్లారు. మిగిలినవారు ఆమె తమ్ముడితోపాటు అక్కడే ఉన్న చిన్నారుల్ని బెదిరించారు. పైకెళ్లిన నిందితుల్లో ముగ్గురు బాలికను కత్తితో బెదిరిస్తూ ఒకరి తర్వాత ఒకరు అత్యాచారానికి పాల్పడ్డారు. విషయం తెలిసిన బాధితురాలి సోదరి మీర్పేట పోలీసుల్ని ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు వైద్య పరీక్షల అనంతరం బాలికను సఖి కేంద్రానికి తరలించారు. మొత్తం ఏడు బృందాలలో గాలింపు చేపట్టిన పోలీసులు ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులపై పోక్సో యాక్టు, సెక్షన్ 5జీ రెడ్విత్ 6 కింద కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. ప్రధాన నిందితుడు మంగళ్హాట్లో రౌడీషీటర్గా ఉన్నాడని సీపీ తెలిపారు. పారిపోయే క్రమంలో.. ‘‘ అష్రఫ్, చిన్నా, మహేశ్, తహిసీన్ అనే నలుగురు అత్యాచారానికి పాల్పడిన తర్వాత రేసుకోర్సు వెనకవైపు ఉన్న ఫైజల్, ఇమ్రాన్ దగ్గరికి వెళ్లారు. వారి మొబైల్స్ తీసుకొని రెండు మూడు కాల్స్ చేసుకొని డిలీట్ చేశారు. అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించారు. ఉమ్నాబాద్ వరకు వెళ్లిపోయారు. అక్కడ రెండు పోలీసు బృందాలు గస్తీ నిర్వహిస్తుండటం చూసి.. తిరిగి వెనక్కి వచ్చేశారు. హైదరాబాద్ నగరంపై వారికి పూర్తి అవగాహన ఉండటంతో వారిని పట్టుకోవడానికి మొత్తం 12 బృందాలను వినియోగించాం. ఈ క్రమంలో వివిధ చోట్ల వారు పోలీసులకు చిక్కారు.’’ చౌహాన్ మీడియాకు తెలిపారు. -
కాఫీ షాప్లో ప్రేమ.. 4 ఏళ్ల సహజీవనం.. యూపీ యువకునితో దక్షిణ కొరియా యువతి వివాహం!
ప్రేమకు హద్దులు లేవని చెబుతుంటారు. ఈ విషయాన్ని యూపీలోని షాజహాన్పూర్కు చెందిన ఒక యువకుడు రుజువు చేశాడు. సుఖ్జీత్ అనే ఈ యువకుడు నాలుగేళ్ల పాటు దక్షిణ కొరియాలో ఉద్యోగం చేశాడు. కాఫీషాపులో పనిచేస్తున్న సమయంలో అతను ఒక యువతి ప్రేమలో పడ్డాడు. తన ప్రియురాలితో మాట్లాడేందుకు దక్షిణ కొరియా బాషను నాలుగు నెలల్లో నేర్చుకున్నాడు. నాలుగేళ్ల తరువాత వారిద్దరూ వివాహం చేసుకున్నారు. వారిద్దిరి ప్రేమ ప్రయాణం ఎంతో ఆసక్తికరంగా సాగింది. మీడియాకు అందిన సమచారం ప్రకారం దక్షిణ కొరియాకు చెందిన కిమ్ బోహ్నీ అనే యువతి యూపీలోని పువాయా తహసీల్లోని ఒక గ్రామానికి చెందిన యువకుని సరసన వధువుగా మారింది. వరుడు సుఖజీత్ సింగ్ తండ్రి బల్దేవ్సింగ్ రైతు. అతని తల్లి హర్జిందర్ కౌర్ గృహిణి. సుఖజీత్ సింగ్ తమ్ముడు జగజీత్సింగ్ పొలంలో పనిచేస్తూ తండ్రికి చేదోడువాదోడుగా ఉంటాడు. 28 ఏళ్ల సుఖజీత్ సింగ్ నాలుగేళ్ల క్రితం ఉద్యోగవేటలో దక్షిణ కొరియా వెళ్లాడు. అక్కడి బుసాన్లోని ఒక కాఫీషాప్లో పనికి కుదిరాడు. అదే కాఫీషాప్లోని బిల్లింగ్ సెషన్లో దక్షిణకొరియాకు చెందిన 30 ఏళ్ల కిమ్ బోహ్ నీ పనిచేస్తోంది. సుఖజీత్ తెలిపిన వివరాల ప్రకారం కాఫీషాపులోనే వారి మధ్య ప్రేమ ఏర్పడింది. అయితే వారి ప్రేమకు భాష అడ్డంకిగా మారింది. దీంతో సుఖజీత్ నాలుగు నెలల్లో అక్కడి భాష నేర్చుకున్నాడు. అనంతరం ఇరు కుటుంబాల సమ్మతితో నాలుగేళ్లపాటు లివ్ ఇన్ రిలేషన్లో ఉన్నారు. అనంతరం ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. నాలుగు నెలల క్రితమే సుఖజీత్ సింగ్ తన ఇంటికి వచ్చాడు. రెండు నెలల క్రితం కిమ్ కూడా తన డిల్లీ స్నేహితురాలితో పాటు మూడు నెలల టూరిస్టు వీసాపై భారత్ వచ్చింది. ఆగస్టు 18న వారిద్దరూ పువాయాలోని గురుద్వారా నానక్ బాగ్లో వివాహం చేసుకున్నారు. సుఖజీత్ మీడియాతో మాట్లాడుతూ తన భార్య మూడు నెలల క్రితం భారత్ వచ్చిందని, ఆమె తమ గ్రామంలో ఉంటూ రెండు నెలలు అయ్యిందని తెలిపారు. ఇంకొక నెల రోజుల తరువాత ఆమె దక్షిణ కొరియా వెళ్లిపోతుందని, నెల రోజుల తరువాత తిరిగి భారత్ వస్తుందని, అప్పుడు తామిద్దం తిరిగి దక్షిణ కొరియా వెళ్లేలా ప్లాన్ చేసుకున్నామని తెలిపారు. ఇది కూడా చదవండి: అగ్రరాజ్యంలో మన ఇంజినీర్లు చేసే 12 పనులివే.. -
టాటా చెప్పి వెళ్లొస్తా మమ్మీ అని.. చివరికి తండ్రి ముందే
బనశంకరి(బెంగళూరు): బెంగళూరు నగరంలో ఘోరం జరిగింది. బీఎంటీసీ బస్సు మృత్యుశకటమై నాలుగు సంవత్సరాల బాలికను బలిగొంది. ఈ విషాద ఘటన కుమారస్వామిలేఔట్ పోలీస్స్టేషన్ పరిధిలో బుధవారం జరిగింది. ఉత్తరహళ్లి నివాసి ప్రసన్న సిస్కో కంపెనీలో పనిచేస్తున్నాడు. కుమార్తె పూర్వీరావ్ బెంగళూరు ఇంటర్నేషనల్ స్కూల్లో ప్రీకేజీ చదువుతోంది. బుధవారం ఉదయం స్కూల్కు వెళ్లేందుకు సిద్దమైంది. తల్లికి టాటా చెప్పి, వెళ్లోస్తా అని తండ్రి ప్రసన్న బైక్ ఎక్కింది. ఉత్తరహళ్లి మెయిన్రోడ్డు పద్మావతి సిల్క్షోరూమ్ వద్ద వేగంగా వచ్చిన బీఎంటీసీ బస్ బైక్ను ఢీకొంది. తండ్రీకుమార్తె కిందపడగా చిన్నారిపై బస్సు చక్రాలు వెళ్లాయి. ప్రమాదంలో బాలిక తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందింది. కుమారస్వామి లేఔట్ ట్రాఫిక్ పోలీసులు చిన్నారి మృతదేహాన్ని విక్టోరియా ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేపట్టారు. చదవండి వివాహేతర సంబంధం.. ముందే వార్నింగ్.. ప్రియుడు ఇంట్లోకి రాగానే.. -
ఒక్కగానొక్క కుమార్తె.. తిరుగు ప్రయాణంలో బైక్పై వస్తుంటే
సీతంపేట/బూర్జ(శ్రీకాకుళం): సీతంపేట ఏజెన్సీలోని గొయిది గ్రామ సమీపంలో సోమవారం ఓ బైక్, ఆటో ఢీనండంతో జరిగిన ప్రమాదంలో శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలం గుత్తవల్లికి చెందిన పైడి వసంతకుమారి (17) మృతి చెందింది. ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. గుత్తవల్లి పక్కగ్రామానికి చెందిన యువకుడు కూన వెంకటేష్, వసంతకుమారి బైక్పై సీతంపేట వచ్చారు. తిరుగు ప్రయాణంలో ద్విచక్రవాహనంపై ఇద్దరూ వెళ్తుండగా ఎదురుగా వస్తున్న ఆటో ఢీకొట్టడంతో గాయాలపాలవగా యువతి అపస్మారక స్థితికి చేరుకుంది. ఇద్దరినీ 108లో పాలకొండ ఏరియా ఆస్పత్రికి తరలించగా అప్పటికే యువతి మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. యువకుడు వెంకటేష్ ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఒక్కగానొక్క కుమార్తె మృతిచెందడంతో తల్లిదండ్రులు ఉమ, సత్యనారాయణ గుండెలవిసేలా రోదిస్తున్నారు. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఎ.నీలకంఠరావు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పాలకొండ ఏరియా ఆస్పత్రికి తరలించామన్నారు. -
ప్రియుడి కోసం రూ.2 వేల కోట్లు కాదనుకున్న గొప్ప ప్రేమికురాలు
ప్రేమ.. దీన్ని వర్ణించాలంటే కవులకు సైతం కలంలో సిరా సరిపోదు. ఇది చెప్పడం కంటే అనుభూతి చెంది తెలుసుకోవాల్సిందే. అయితే ఇటీవల యువతీయువకులు కొందరు ప్రేమ పేరుతో మోసాలు చేస్తున్న ఘటనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరొరకంగా చెప్పాలంటే ప్రస్తుతం ఇదే ట్రెండ్గా పాటిస్తున్నారు చాలామంది. అయితే ఓ యువతి మాత్రం మనీ కంటే తన మనసుకు నచ్చిన వాడే కావాలనుకుంది. కోట్ల ఆస్తి కంటే బాయ్ ఫ్రెండ్తో కలిసి ఉండడమే బెటర్ అనుకుంది. ఆస్తి కాదు.. అతనే ముఖ్యం వవరాల్లోకి వెళితే.. మలేషియాకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త ఖుకే పెంగ్, మాజీ మిస్ మలేషియా పౌలిన్ ఛై దంపతుల కుమార్తె ఏంజెలిన్. ఆమె పైచదువుల కోసం ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చేరింది. ఆ సమయంలో ఏంజెలిన్ జెడిడియా ఫ్రాన్సిస్ అనే యువకుడితో పరిచయం ఏర్పడి అది కాస్తా ప్రేమగా మారింది.కొన్నాళ్ల తర్వాత వారిద్దరూ వివాహ బంధంతో ఒకటిగా మారాలనుకున్నారు. ఇక్కడ వరకు సాఫీగా సాగిన వాళ్ల లవ్స్టోరీ ఇక్కడే బ్రేక్ పడింది. తన ప్రేమ విషయాన్ని ఏంజెలిన్ తన తల్లిదండ్రులకు చెప్పింది. అయితే జెడిడియా ధనవంతుడు కాదన్న కారణంగా ఆమె తండ్రి వాళ్ల పెళ్లికి అంగీకరించలేదు. అంతేకాకుండా తనను కాదని పెళ్లి చేసుకుంటే ఆస్తిలో చిల్లి గవ్వ కూడా దక్కదని తేల్చి చెప్పారు. దాంతో ఏంజెలిన్.. నాకు మీ ఆస్తిలో పైసా కూడా అవసరం లేదు, నేను ప్రేమించిన వాడితోనే నా జీవితం అంటూ ఏంజెలిన్ సుమారు రూ.2,484 కోట్ల ఆస్తిని వదులుకుంది. ప్రియుడే కావాలని అతడిని పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత తల్లిదండ్రులను వదిలి ప్రియుడితో కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభించింది. అప్పటి నుండి తన కుటుంబానికి దూరంగా జీవిస్తోంది. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీనిని చూసిన ప్రతి ఒక్కరు ఏంజెలిన్పై ప్రశంసలు కురిపిస్తూ కామెంట్లు పెడుతున్నారు. చదవండి ఒక్కరోజు పెళ్లికి లెక్కలేనంత డిమాండ్.. ఆనక వధువు ఏంచేస్తుందంటే.. -
ప్రియురాలికి చివరి కాల్ చేసి.. నేను పోతున్నా, నువ్వు పెళ్లి చేసుకో
దొడ్డబళ్లాపురం(బెంగళూరు): అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న యువకుడు చావు తథ్యమని తెలుసుకుని, ప్రియురాలికి వీడియో కాల్ చేశాడు, తన అంత్యక్రియలకు ఆహ్వానించిన కొంతసేపటికి ప్రాణం వదిలిన హృదయ విదారక సంఘటన నెలమంగలలో వెలుగు చూసింది. నెలమంగలకు చెందిన కిరణ్ అనే యువకునికి కొన్నిరోజుల కిందట కుక్క కరవడంతో పెద్దగా పట్టించుకోలేదు, దీంతో రేబిస్ వ్యాధి సోకింది. తల్లిదండ్రులు అతన్ని బెంగళూరు నిమ్హాన్స్ ఆస్పత్రిలో చేర్చగా బతకడం కష్టమని వైద్యులు నిర్ధారించారు. కిరణ్ ప్రియురాలికి వీడియో కాల్ చేసి.. తాను ఇక బ్రతకనని తన అంత్యక్రియలకు తప్పక రావాలని, మీ నాన్న చూపించిన యువకుడినే పెళ్లి చేసుకుని, పుట్టే బిడ్డకు నా పేరు పెట్టాలని కోరాడు. తరువాత కొన్ని గంటలకు అతడు చనిపోయాడు. ఆగస్టు 9న జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. చదవండి నిజాయితీకి నిలువుటద్దం కలాం: ఆ చెక్కను జిరాక్స్ తీసి, ఫ్రేమ్ కట్టించి -
ఫ్రీగా ఫోన్ అని ఆశ చూపి.. బాలికను గదిలోకి తీసుకెళ్లి
జైపూర్: ప్రజలకు సేవలందిస్తూ మంచిపేరుతో పాటు వార్తల్లో నిలుస్తుంటారు కొందరు ప్రభుత్వ ఉద్యోగులు. అయితే మరికొందరు మాత్రం లంచాలు, అక్రమాలు, మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడుతూ వార్తల్లో నిలుస్తున్నారు. ఈ తరహాలోనే ఓ ఉద్యోగి బాలికపై అత్యాచారాని పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన రాజస్తాన్లో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. రాజస్థాన్ ప్రభుత్వం మహిళలు, బాలికలకు ఉచితంగా మొబైల్ ఇస్తున్నట్లు ప్రకటించింది. ఈ క్రమంలో ప్రతి నగరంలో మొబైల్లను ఇచ్చేందుకు కేంద్రాలను కూడా ఏర్పాటు చేసింది. సునీల్ కుమార్ జన్గిడ్ అనే వ్యక్తి రాష్ట్ర ప్రజారోగ్య శాఖ ఇంజినీరింగ్ విభాగంలో క్యాషియర్గా పనిచేస్తున్నాడు. తోడాభిమ్ ప్రాంతానికి చెందిన బాలిక తన ఇంట్లో ఒంటరిగా ఉంది. అతని తల్లి ఏదో పని మీద బయటకు వెళ్ళింది, తండ్రి జైపూర్ వెళ్ళాడు. ఈ విషయం సునీల్కు తెలియడంతో బాలిక ఇంటికి వెళ్లాడు. రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా మొబైల్ ఇస్తోందని చెప్పి తనతో పాటు రావాలని చెప్పి.. ఆమెను తన వాహనంపై ఎక్కించుకుని దగ్గరల్లోని ప్రభుత్వ కార్యాలయానికి తీసుకెళ్లాడు. అక్కడ ఓ గదిలో బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం ఆమెను ఈద్గా మార్గంలో వదిలేశాడు. గాయాలతో ఇంటికి చేరుకున్న బాలిక తల్లిదండ్రులకు విషయం చెప్పడంతో వారు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. అత్యాచారాన్ని వ్యతిరేకించినందుకు క్యాషియర్ తనను కూడా కత్తితో పొడిచి గాయపరిచాడని బాలిక ఫిర్యాదులో పేర్కొంది. చదవండి వాడే కావాలి.. పెళ్లైన ప్రియుడితో బలవంతగా తాళి కట్టించుకున్న యువతి! -
వాడే కావాలి.. పెళ్లైన ప్రియుడితో బలవంతగా తాళి కట్టించుకున్న యువతి!
చెన్నై: ప్రియుడికి మరో యువతితో వివాహం జరిగిపోయింది. అయినా సరే పట్టుబటి అతనే కావాలంటే.. కిడ్నాప్ చేసి మరీ ప్రియుడితో తాళి కట్టించుకుంది ఓ యువతి. ఈ వింత ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. ఆమెకు సహకరించిన ముగ్గురు బంధువులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. చెన్నైలోని వేలచ్చేరికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ పార్థిబన్ తన కాలేజీ రోజుల్లో సౌందర్య అనే యువతిని ప్రేమించాడు. ఆమె కూడా అంగీకరించడంతో వీరి ప్రేమ కథ మొదలైంది. ఏడేళ్ల వరకు సాఫీగా వీరి లవ్ స్టోరీ.. మనస్పర్థలు రావడంతో విడిపోయారు. అయితే గత నెల 5వ తేదీన పార్తీబన్కు ఐటీలో పనిచేస్తున్న యువతితో వివాహమైంది. ఈ విషయం సౌందర్య తెలియడంతో పార్తిబన్ను మర్చిపోలేనని, అతన్నే వివాహం చేసుకుంటానని తన తల్లి, బంధువులతో చెప్పింది. ఆమె తల్లి ఉమ, బంధువులు రమేష్, శివకుమార్ సహాయంతో యువకుడిని కిడ్నాప్ చేయాలని ప్లాన్ చేశారు. శుక్రవారం యథావిధిగా కార్యాలయానికి వెళ్లిన పార్తీబన్ కారులో కిడ్నాప్ చేశారు. అతను తన చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే నేరుగా కాంచీపురంలోని ఆలయానికి తీసుకెళ్లి సౌందర్య మెడలో బలవంతంగా తాళి కట్టించారు. ఈ విషయం పార్తిబన్ భార్యకు తెలియడంతో.. భర్త కిడ్నాప్పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించారు. మాజీ ప్రియురాలు సౌందర్య, ఆమె బంధువులపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. చదవండి పింఛన్ ఇస్తామని తీసుకెళ్లి.. ఆపరేషన్ చేశారు -
హకీంపేట స్పోర్ట్స్ స్కూల్లో లైంగిక వేధింపులు.. ఓఎస్డీపై సస్పెన్షన్ వేటు
సాక్షి, హైదరాబాద్: మహిళలపై వేధింపులు, దాడులు అరికట్టాలని ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా.. ఫలితం మాత్రం ఆశించిన స్థాయిలో కనిపించడం లేదనే చెప్పాలి. ఢిల్లీ కేంద్రంగా రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ బుషన్ ఘటన మరువకముందే మరో బ్రిజ్ బుషన్ ఆగడాల వెలుగులోకి వచ్చాయి. తాజాగా తెలంగాణలో హకీంపేట్ స్పోర్ట్స్ స్కూల్ వ్యవహారం ప్రకంపనలు సృష్టిస్తోంది. హకీంపేట్ స్పోర్ట్స్ స్కూల్లో బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న అధికారి బండారం బట్టబయలైంది. అయితే అధికారులు మాత్రం దీనిపై పెద్దగా స్పందించడం లేదని.. లైంగిక వేధింపుల అధికారికి మంత్రి అండదండలు ఉన్నాయంటూ ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉండగా బాలికలపై వేధింపుల ఘటనను ఎమ్మెల్సీ కవిత సీరియస్గా తీసుకున్నారు. దీనిపై స్పందిస్తూ.. తక్షణమే సదరు అధికారిపై చర్యలు చేపట్టాలని, విచారణ జరిపి బాధితురాళ్లకు న్యాయం జరిపించాలని క్రీడా మంత్రి శ్రీనివాస్ గౌడ్ను కోరారు. ఈ మేరకు ట్వీట్ చేస్తూ మంత్రికి ట్యాగ్ చేశారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారి హరికృష్ణను సస్పెండ్ చేశామని, స్కూల్లో బాలికలపై లైంగిక వేధింపులపై ఉన్నతాధికారులతో పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి, నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పరిపాలనలో మహిళల పట్ల వేధింపులను ఏమాత్రం ఉపేక్షించబోము. ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్న వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. @raokavitha అక్క, ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారిని తక్షణమే సస్పెండ్ చేస్తాం. హకీంపేట స్పోర్ట్స్ స్కూల్ లో బాలికలపై లైంగిక వేధింపుల వార్తలపై ఉన్నతాధికారులతో పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి, నిందితులపై అత్యంత కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ గారి… https://t.co/O2rDflRUWU — V Srinivas Goud (@VSrinivasGoud) August 13, 2023 -
అన్నల మద్యం అలవాటుకు చెల్లెలు బలి.. సూసైడ్ నోట్లో మరో యువకుని పేరు?
ఉత్తరప్రదేశ్లోని కౌషాంబీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక బాలిక ఆత్మహత్య చేసుకుంది. పోలీసులకు ఆ బాలిక ఇంటిలో ఒక సూసైడ్ నోట్ లభ్యమయ్యింది. దానిలో ఆమె తాను సూసైడ్ చేసుకునేందుకు గల కారణాలను వివరించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆ బాలిక సోదరులు మద్యానికి బానిసగా మారి ఇంటిలోని వారిని ఇబ్బంది పెడుతుంటారు. ఈ ఇబ్బందులను భరించలేకనే వారి సోదరి ఆత్మహత్య చేసుకుంది. కౌషాంబీ పోలీస్ స్టేషన్ పరిధిలోని సెక్టార్-4లో ఉంటున్న ఆ బాలిక ఇంటిలో ఎవరూలేని సమయంలో ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వారికి ఆ ఇంటిలో మృతురాలు స్వయంగా రాసిన సూసైడ్ నోట్ లభ్యమయ్యింది. మద్యం మత్తుకు బానిసలైన సోదరులు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం 16 ఏళ్ల బాలిక తన తల్లి, ఇద్దరు సోదరులతో పాటు ఈ ప్రాంతంలో ఉంటోంది. ఆ బాలిక తండ్రి కొన్నేళ్ల క్రితమే మృతిచెందాడు. తల్లి ఇంటి భారాన్నిమోస్తోంది. ఆ బాలిక ఇద్దరు సోదరులు నిత్యం మద్యం మత్తులో మునిగితేలుతుంటారు. తల్లీకూతుర్లు ఈ విషయమై వారిని హెచ్చరించినా వారు తమ వ్యసనాన్ని విడిచిపెట్టలేదు. కొన్ని రోజుల క్రితం ఒక సోదరుడు ఏదో కేసులో జైలుకు వెళ్లాడు. తాజాగా ఆ బాలిక ఇంటిలో ఉన్న సోదరునికి తన ఫోను ఇచ్చి, మరమ్మతు చేయించి తీసుకురమ్మని చెప్పి బయటకు పంపింది. తల్లి కూడా పని కోసం వెళ్లింది. సూసైడ్ నోట్లో మరో యువకుని పేరు? ఇంటిలో ఎవరూలేని సమయం చూసుకుని ఆ బాలిక ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. దీనికి ముందు ఆమె ఒక సూసైడ్నోట్ రాసింది. దానిలో ఆమె తన సోదరులు మద్యానికి బానిస కావడంపై ఆవేదన వ్యక్తం చేసింది. అందుకే తాను సూసైడ్ చేసుకుంటున్నట్లు పేర్కొంది. కాగా ఆ బాలిక సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుంది. పెద్దగా చదువుకోకపోయినా ఆ బాలిక సూసైడ్ నోట్ను ఇంగ్లీషులో రాసింది. ఆ నోట్లో ఆమె ఒక యువకుని పేరు రాసింది. అతను తన సోదరుని స్నేహితుడని, తన మృతదేహాన్ని చూసేందుకు అతనికి అవకాశం కల్పించాలని కోరింది. కాగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించి, దర్యాప్తు ప్రారంభించారు. ఇది కూడా చదవండి: ఆగస్టు 14.. చాలామందికి జ్వరం?.. మీరూ ఆ జాబితాలో ఉన్నారా?.. పిచ్చెక్కిస్తున్న మీమ్స్! -
పురావస్తు తవ్వకాల్లో విచిత్ర అద్దం.. అది అట్టాంటి ఇట్టాంటిది కాదట!
ఇజ్రాయెల్లో ఒక విచిత్ర ఉదంతం వెలుగు చూసింది. ఇది సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఈ ప్రాంతానికి చెందిన 10వ తరగతి చదువుతున్న 17 ఏళ్ల యువతికి పురాతన అద్దం దొరికింది. ఇది 1500 ఏళ్ల క్రితం నాటిదని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ అద్దాన్ని పురాతన కాలంనాటి ప్రజలు తమపై చెడు దృష్టి పడకుండా ఉండేందుకు ఉపయోగించేవారని సమాచారం. హైఫాకు చెందిన ఆ అమ్మాయి పేరు అవివ్ వీజ్మన్. ఈ అమ్మాయి ఇజ్రాయెల్ యాంటిక్విటీస్ అథారిటీ చేపట్టిన పురావస్తు తవ్వకాల కార్యక్రమంలో పాల్గొంది. ఈ సమయంలో ఆమెకు అద్దం లభించింది. ఇజ్రాయెల్ విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ తవ్వకాల పనుల్లో 500 మంది విద్యార్థులు పాల్గొన్నారు. వారిలో అవివ్ వీజ్మన్ ఒకరు. పురావస్తు శాస్త్రానికి సంబంధించిన సమాచారాన్ని విద్యార్థులకు తెలియజేయడమే ఈ కార్యక్రమ లక్ష్యం. బైజాంటైన్ కాలం నాటి అద్దం ఈ అద్దం దొరికిన ప్రదేశానికి ఉష అని పేరు పెట్టారు. ఇది బైజాంటైన్ కాలం నాటిదని సమాచారం. ఇజ్రాయెల్ యాంటిక్విటీస్ అథారిటీ క్యూరేటర్ నెవిట్ పోపోవిచ్ తెలిపిన వివరాల ప్లేట్ మధ్యలో ఉన్న ఈ గాజు అద్దం 6వ శతాబ్దపు బైజాంటైన్ కాలం నాటి 'మ్యాజిక్ మిర్రర్'లో భాగమని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ అద్దం అంత్యక్రియలకు బహుమతిగా ఇచ్చినట్లు కూడా తెలుస్తోంది. భవనం గోడ నుండి బయటపడిన అద్దం తవ్వకాల్లో భాగంగా డిగ్గర్లు తమ పనిలో నిమగ్నమై ఉండగా, 17 ఏళ్ల అవియాకు ఆ అద్దం కనిపించింది. ఆమె దానిని సీనియర్ అధికారులకు చూపించింది. దానిని పరిశీలించిన అధికారులు అది1500 సంవత్సరాల నాటి అద్భుత అద్దం అని, దానిని చెడు దృష్టిని పోగొట్టుకునేందుకు ఉపయోగించేవారని తెలిపారు. ఇది దెయ్యాలు తరహా దుష్టశక్తులను దూరం చేస్తుందని నాటి కాలంలో నమ్మేవారట. దుష్టబుద్ధి కలిగినవారు ఈ అద్దంలో వారి ప్రతిబింబాన్ని చూసుకున్నప్పుడు, అద్దం యజమానిపై చెడు ప్రభావం ఉండదని నమ్మేవారట. అంత్యక్రియలకు బహుమతులుగా ఇలాంటి అద్దాలు ఇచ్చేవారని చరిత్ర చెబుతోంది. ఇది కూడా చదవండి: వింతజీవుల అకస్మాత్తు దాడులు.. గ్రహాంతరవాసులే అంటున్న జనం! -
తిరుమలలో ఆరేళ్ల బాలికను చంపేసిన చిరుత
-
తిరుమలలో విషాదం.. ఆరేళ్ల చిన్నారిని బలితీసుకున్న చిరుత
సాక్షి, తిరుమల: తిరుమలలో విషాద ఘటన చోటు చేసుకుంది. అలిపిరి నడకమార్గంలో చిన్నారిపై చిరుత దాడి చేసి చంపేసింది. వివరాల్లోకి వెళితే.. అలిపిరి నడక మార్గంలో తిరుమలకు వెళ్తుండగా.. శుక్రవారం రాత్రి ఆరేళ్ల చిన్నారి తప్పిపోయింది. ఈ క్రమంలో పాప తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. గాలింపు చర్యలు చేపట్టారు. అయితే శనివారం ఉదయం నరసింహ స్వామి ఆలయం వద్ద చిన్నారి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. చిన్నారి ఒంటిపై తీవ్ర గాయాలు కూడా ఉన్నాయి. కాగా నెల కిత్రం ఐదేళ్ల చిన్నారిపై పులి దాడి చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అదే ప్రాంతంలోనే రక్షితపై చిరుత దాడి చేయడం గమనార్హం. ఈ ఘటన తిరుమలలో కలకలం రేపుతోంది. చదవండి: Dr Radha Murder Case: డా.రాధా మర్డర్ కేసులో భర్తే హంతకుడు -
అంతా క్షణాల్లో జరిగిపోయింది.. సముద్రంలోకి జారి పడిన యువతి, చివరికి
ఏ నిమిషానికి ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. అందుకే బయట ప్రాంతాలకు వెళ్లి జాగ్రత్తగా ఉండాలని అంటుంటారు. ఏ మాత్రం ఆజాగ్రత్తగా ఉన్న ప్రాణాలకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. ఇటీవల ఓ యువతి తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకుని బయటపడింది. ఈ ఘటన యూకేలో చోటు చేసుకుంది. ప్రస్తుతం ఆ వీడియో నెట్టంట వైరల్గా మారింది. ఆ వీడియోలో కొందరు పీర్ స్లిప్వేపై ఆడుకుంటూ ఉంటారు. సముద్ర అలలు వస్తూ పోతూ ఉండగా వారు దాన్ని ఆనందిస్తూ ఉంటారు. అయితే ఇలాంటి చోట ఆటలే కాదు అజాగ్రతగా ఉన్నా ప్రమాదమే అని తెలియక వాళ్లు అక్కడ గంతులెస్తుంటారు. అకస్మాత్తుగా, ఊహించని విధంగా ఒక బలమైన కెరటం అందులోని ఓ యువతిని తాకింది. దీంతో ఆమె తన బ్యాలెన్స్ కోల్పోయి సముద్రంలోకి వెళ్లిపోయింది. ఒడ్డుకు వచ్చేందుకు ఎంతగానో ప్రయత్నించినప్పటికీ కెరటాల ధాటికి యువతి చేరుకోలేకపోతుంది. చివరికి ఆమెను కాపాడేందుకు సముద్రంలో ఎగసిపడుతున్న కెరటాలకు ఎదురెళ్లి ఓ వ్యక్తి బాలికను రక్షించగలిగాడు. ఈ ప్రమాదం నుంచి బయటక పడిన యువతికి స్వల్ప గాయలయ్యాయి. నార్త్ డెవాన్ కౌన్సిల్ అత్యవసర హెచ్చరికతో పాటు ట్విట్టర్లో ఈ వీడియోని షేర్ చేసింది. సముద్రం తీరం వద్ద అధిక ఆటుపోట్లు ఉన్నప్పుడు జాగ్రత్త వహించాలని ప్రజలను కోరింది. "సముద్రంలోని అలలు పరిస్థితులు బట్టి మారుతుంటాయ్.. కొన్ని సార్లు ప్రమాదకర స్థాయికి చేరుకుంటాయి,. కాబట్టి దయచేసి తీరం వెంబడి జాగ్రత్తగా ఉండాలంటూ సూచించింది. Sea conditions can be changeable and volatile, so please be mindful along the coast. This incident took place at Ilfracombe Harbour on Thursday evening and could have been much more serious were it not for quick-thinking members of the public. pic.twitter.com/TA7r9Itz83 — North Devon Council (@ndevoncouncil) August 8, 2023 -
చిన్నారి క్యాన్సర్ పెళ్లి కూతురు.. కథ వింటే కన్నీరాగదు!
క్యాన్సర్తో బాధపడుతున్న 11 ఏళ్ల బాలిక తాను చనిపోవడానికి ముందు తన పెళ్లి కల గురించి తల్లిదండ్రులకు తెలిపింది. ఆ మాట వినగానే తల్లిదండ్రులకు దు:ఖం తన్నుకొచ్చింది. అయితే వారు కుమార్తె చివరి కోరికను నెరవేరుస్తూ ఆమెకు అత్యంత ఘనంగా వివాహం జరిపించారు. ఈ ఘటన అమెరికాలోని నార్త్ కరొలినాలో జరిగింది. న్యూయార్క్ పోస్ట్ అందించిన సమాచారం ప్రకారం క్యాన్సర్ బాధిత బాలిక ఎమ్మా ఎడ్వర్డ్స్(11)కు డానియల్ మార్షల్ క్రిస్టోఫర్ ‘డీజే’ విలియమ్స్ జూనియర్తో వివాహం జరిగింది. ఎమ్మా.. లుకేమియా తోనూ బాధితురాలు. పెళ్లయిన 12వ రోజు ఆ బాలిక మృతి చెందింది. ఎమ్మా తల్లిదండ్రులకు తమ కుమార్తె లిమ్ఫోల్బా స్టిక్ లుకేమియా బాధితురాలని గత 2022లో తెలిసింది. ఇది క్యాన్సర్ మాదిరిగానే రక్తాన్ని, ఎముకలను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. ఈ వ్యాధి చిన్నారులకు సోకితే ఈ ప్రభావం అత్యధికంగా ఉంటుంది. అయితే తమ కుమార్తె క్యాన్సర్ను జయిస్తుందని తల్లిదండ్రులు భావించారు. అయితే వారి ఆశ అడియాశగానే మిలిగింది. వైద్య పరీక్షలో ఆమెకు క్యాన్సర్ ముదిరిపోయిందని, ఇక కొద్ది రోజుల మాత్రమే ఆమె బతికి ఉంటుందని వైద్యులు ఆ తల్లిదండ్రులకు తెలిపారు. అదే సమయంలో ఆ చిన్నారి తన పెళ్లి కల గురించి తల్లిదండ్రులకు తెలిపింది. తాను ‘డీజే’ను వివాహం చేసుకోవాలనుకుంటున్నానని చెప్పింది. దీంతో ఎమ్మా తల్లి ‘డీజే’ తల్లిదండ్రులతో మాట్లాడి, వారిద్దరి పెళ్లికి ఏర్పాట్లు చేసింది. పెళ్లి మాటలు మాట్లాడుకున్న రెండు రోజులకే ఎమ్మా, డీజేలకు ఘనంగా వివాహం జరిగింది. ఒక రోజు ఆ చిన్నారి ఉన్నట్టుంది స్పృహతప్పి పడిపోయింది. తల్లిదండ్రులు వెంటనే బాధిత చిన్నారిని ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు ఆమె కాలి ఎముకలకు కూడా క్యాన్సర్ వ్యాపించిందని వైద్యులు తెలిపారు. ఆ చిన్నారి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసింది. ఇది కూడా చదవండి: ఎయిర్క్రాఫ్ట్ నడుపుతూ 11 ఏళ్ల చిన్నారి.. పక్కనే మద్యం తాగుతూ తండ్రి.. మరుక్షణంలో.. -
ప్రేమ పెళ్లి.. భర్త నిద్రపోతుంటే రాత్రి లేచి
అన్నానగర్: కుణ్ణం సమీపంలో ప్రేమ వివాహం చేసుకున్న ఓ యువతి కుటుంబ కలహాలతో ఆదివారం రాత్రి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. వివరాలు.. పెరంబలూరు జిల్లా కుణ్ణం సమీపంలోని పుదువైట్టికుడి గ్రామానికి చెందిన దేవేంద్రన్ కుమారుడు దేవరాజ్ (28). పుదువెట్టికుడి సమీపంలోని కాడూరు గ్రామానికి చెందిన దురైరాజ్–ముత్తులక్ష్మి కుమార్తె సత్య(23)ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఏడాది వయసున్న కుమారుడు సంజీవ్ దేవ్ ఉన్నాడు. ఈ క్రమంలో దేవరాజ్, సత్య మధ్య తరచూ కలహాలు చోటు చేసుకునేవి. దీంతో మనస్తాపానికి గురైన సత్య, భర్త నిద్రపోతుంటే ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో ఫ్యాన్కు చీరతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న సత్య తల్లి ముత్తులక్ష్మి కుణ్ణం పోలీసులకు ఫిర్యాదు చేసింది. గుణ్ణం సబ్ ఇన్స్పెక్టర్ పిచ్చుమణి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తల్లి మృతితో ఏడాది కుమారుడిని చూసి అక్కడి వారు కంటతడి పెట్టారు. -
ఇల్లు శుభ్రం చేయలేదని మందలించడంతో.. ఇంట్లోకి వెళ్లి
తిరువళ్లూరు(చెన్నై): ఇంటిని శుభ్రం చేయలేదని తల్లి మందలించడంతో మనస్తాపం చెందిన కుమార్తె ఉరివేసుకుని ఆత్మహత్యకు యత్నించిన సంఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. తిరువళ్లూరు జిల్లా కడంబత్తూరు యూనియన్ పుదుపట్టు గ్రామానికి చెందిన సభాపతి(42) తిరువళ్లూరు కలెక్టర్ కార్యాలయంలో రికార్డు అసిస్టెంట్గా పని చేస్తున్నాడు. ఇతడికి భార్య కవియరసి పిల్లలు రాకేష్(16), దర్శినిక(15), సంజిత్(12) ఉన్నారు. ముగ్గురు పన్నూరులోని ప్రైవేటు పాఠశాలలో చదువుతున్నారు. కాగా గ్రామంలో ఆదివారం జాతర జరిగింది. ఈ క్రమంలో ఇంటిని శుభ్రం చేయాలని కుమార్తె దర్శినికను తల్లి కవియరసి ఆదేశించింది. అయితే దర్శినిక ఇంటిని శుభ్రం చేయకపోవడంతో తల్లి మందలించింది. దీంతో మనస్తాపం చెందిన దర్శినిక ఇంట్లో ప్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తండ్రి సభాపతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మప్పేడు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. చదవండి: ఐఏఎస్ కల నెరవేరక బ్యాంకు మేనేజర్ ఆత్మహత్య -
జైలు గోడ దూకి నేపాలీ యువతి పరార్..!.. ఆచూకీ చెబితే..
ఉత్తరాఖండ్లోని పిథోర్గఢ్ జిల్లా జైలులో ఎన్డీపీఎస్ యాక్ట్ సంబంధిత ఆరోపణలతో బందీగా ఉంటున్న నేపాలీ యువతి జైలు గోడ దూకి పారిపోయింది. దుస్తులతో తాడు తయారు చేసుకుని, దాని సాయంతో ఆ యువతి గోడ దూకి పారిపోయిందని పోలీసులు చెబుతున్నారు. ఆమెను పట్టుకునేందుకు 12 పోలీసు బృందాలు వివిధ ప్రాంతాల్లో గాలింపు చర్యలను ముమ్మరం చేశాయి. ఆమె నేపాల్ పారిపోయే అవకాశం ఉన్నందున సహస్త్ర సీమా బల్(ఎస్ఎస్బీ)సాయంతో పోలీసులు నేపాల్ సరిహద్దుల్లో చెకింగ్ కట్టుదిట్టం చేశారు. ఆచూకీ చెబితే రూ. 10 వేలు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పిథోర్గఢ్ పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో గల సీసీటీవీ ఫుటేజ్ల సాయంతో ఆ యువతిని వెదికిపట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అలాగే ఈ యువతి ఆచూకీ తెలిపిన వారికి రూ. 10 వేలు అందజేస్తామని తెలిపారు. పరారైన యువతిని పట్టుకునేందుకు సహకరించాలని పోలీసులు కోరుతున్నారు. మాదకద్రవ్యం తరలిస్తుండగా.. నేపాల్లోని దుమలింగ్ గ్రామానికి చెందిన అనుష్క ఉరఫ్ ఆకృతి(25)ని రెండున్నరేళ్ల క్రితం ధార్చులాలో రెండున్నర కిలోల చరస్ (మాదకద్రవ్యం)తరలిస్తుండగా ఎస్ఎస్బీ పట్టుకుంది. ఆమె విచారణలో ఉన్నందున ఆమెను పిథోర్గఢ్ జిల్లా జైలులో బందీగా ఉంచారు. ఆమె పరారైన నేపధ్యంలో జైలుతో పాటు మొత్తం పోలీసు శాఖలో కలకలం చెలరేగింది. దీంతో పోలీసు బృందాలు ఆమె కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టాయి. పోలీసులకు అందిన సమాచారం ప్రకారం పరారైన యువతి లింక్ రోడ్డు పరిధిలోని సీసీటీవీలో కనిపించింది. అక్కడి నుంచి ఆమె పాండే గ్రామం మీదుగా పరారవుతూ కనిపించింది. ఇది కూడా చదవండి: తెలుగు పోలీసు అధికారికి గుజరాత్లో అరుదైన గౌరవం -
మద్యం మత్తులో యువతి హల్చల్.. రోడ్డుపై గంట పాటు చుక్కలు చూపించింది
బనశంకరి(బెంగళూరు): మద్యం అలవాటు చాలా మందికి ఉంటుంది. కొందరు తాగిన తర్వాత గుట్టు చప్పుడు కాకుండా వారి ఇళ్లకు వెళ్తుంటారు. అయితే కొందరు మాత్రం కిక్కు ఎక్కువై రోడ్డు మీద నానా రభస చేస్తూ, ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తుంటారు. ఇటీవల ఈ తరహా ఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. అధికారులు వీరి మీద చర్యలు తీసుకున్నప్పటికీ అవి ఆశించినంత ఫలితాలను ఇవ్వడం లేదనే చెప్పాలి. తాజాగా ఓ యువతి పీకల దాకా మద్యం సేవించిన మత్తులో హల్చల్ చేసింది. ఈఘటన నగరంలో జరిగింది. మత్తులో తూలుతూ కాలినడకన వస్తున్న ఆమెను కొందరు వెళ్లి రక్షించే ప్రయత్నం చేయగా వారిని దుర్భాషలాడింది. ఆమెను ఎలాగైన సురక్షితంగా ఇంటిక పంపాలని రాత్రి విధుల్లో ఉన్న పోలీస్ సిబ్బంది ప్రయత్నం చేశారు. కానీ మహిళా పోలీసు సిబ్బంది లేనికారణంగా యువతిని ఆటోలో కూర్చోబెట్టడానికి ఇబ్బంది పడ్డారు. గంటపాటు ప్రయత్నించిన అనంతరం మరో యువతి సాయంతో ఆమెను ఇంటికి సురక్షితంగా తరలించారు. చదవండి హైదరాబాద్లో అమానుషం.. యువతి బట్టలిప్పి వివస్త్రను చేసిన కీచకుడు -
మణిపూర్ అల్లర్లలో దొరికిన ఆణిముత్యం
-
మాజీ లవర్కు ఫుడ్ ఆర్డర్.. జొమాటో ఇచ్చిన ట్విస్ట్ వేరే లెవల్
భోపాల్: ఆన్లైన్ పుడ్ డెలివరీ యాప్.. జొమాటో గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చేతిలో మొబైల్, అందులో యాప్ ఉంటే చాలు.. కేవలం ఒక క్లిక్తో కస్టమర్లు వద్దకే పుడ్ డెలివరీ చేస్తుంది. తాజాగా ఓ ఘటనపై జోమాటో సంస్థ స్పందించి ట్వీట్ చేయగా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారుతోంది. భోపాల్కు చెందిన అంకిత అనే యువతి తన మాజీ ప్రియుడి కోసం జోమాటోలో ఫుడ్ ఆర్డర్ చేసింది. ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది కానీ ఆ తర్వాత జొమాటో అనితకు ఊహించిన షాకిచ్చింది. అంకిత పెట్టిన పుడ్ ఆర్డర్లో క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ఎంచుకుంది. అనగా డెలివరీ అందుకున్న కస్టమర్ ఆ డబ్బులను చెల్లించాల్సి ఉంటుంది. అయితే అంకిత ఆర్డర్ పెట్టింది తన మాజీ లవర్ కోసం... అతనేమో ఆ ఆర్డర్ను క్యాన్సిల్ చేయాలని చెప్పాడు. ఇలా ఒక్కసారి కాదు.. రెండు సార్లు కాదు.. ఏకంగా మూడు సార్లు జరిగింది. దీంతో ఏకంగా జొమాటోనే జోక్యం చేసుకుంది. "భోపాల్కు చెందిన అంకితా దయచేసి మీ మాజీకి క్యాష్ ఆన్ డెలివరీపై పుడ్ పంపడం ఆపండి. ఇది మూడోసారి - అతను డబ్బులు చెల్లించేందుకు నిరాకరిస్తున్నాడు" అని ట్వీట్ చేసింది. దీంతో పాటు అదనంగా .."దయచేసి ఎవరైనా అంకితా ఖాతాలో క్యాష్ ఆన్ డెలవరీ బ్లాక్ చేసినట్లు చెప్పగలరు. ఆమె ఈ విషయం తెలియక 15 నిమిషాలకు ఒకసారి మళ్లీ ప్రయత్నిస్తోంది" అని తెలిపింది. కాగా ఈ పోస్ట్ వైరల్గా మారడంతో 9 లక్షల వ్యూస్, 12,000 లైక్లు, 855 రీట్వీట్లు వచ్చాయి.ఈ ట్వీట్పై నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తూ కామెంట్లు పెడుతున్నారు. కొందరు .. ఈ ఐడియా ఏదో బాగుందని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. Ankita from Bhopal please stop sending food to your ex on cash on delivery. This is the 3rd time - he is refusing to pay! — zomato (@zomato) August 2, 2023 చదవండి ఎవడ్రా నువ్వు.. ఇంత టాలెంటెడ్గా ఉన్నావ్.. ఏకంగా కాలేజ్కి -
రెండేళ్ల ప్రేమ, పెద్దలు కూడా ఒప్పుకున్నారు.. అంతలో ఊహించని ట్విస్ట్
క్రిష్ణగిరి(బెంగళూరు): ఇటీవల ప్రేమ వ్యవహారాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. అయితే వీటిలో కొందరు మాత్రం పెద్దలను ఒప్పించి పెళ్లి పీటల వరకు వెళ్లి దంపతులుగా మారుతున్నారు. చాలా మంది వారి ప్రేమకు మధ్యలోనే బ్రేకప్ చెప్పడమో లేదా మోసం చేయడమో వంటి ఘటనలే ఎక్కువ జరుగుతున్నాయి. అయితే కొందరు ఈ బాధను ఎలాగోఒకలా బయటపడుతుండగా.. మరికొందరు క్షణికావేశంలో ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. తాజాగా ప్రియుడు పెళ్లికి నిరాకరించడంతో యువతి ఆత్మహత్య చేసుకొన్న ఘటన సూళగిరి వద్ద జరిగింది. వివరాలు.. సూళగిరి తాలూకా ముదుగురికి సమీపంలోని బి. సింగిరిపల్లి గ్రామానికి చెందిన యల్లప్ప కూతురు యశోద (19), కడతూరు గ్రామానికి చెందిన ప్రదీప్లు గత రెండేళ్లుగా ప్రేమించుకొన్నారు. ఈ విషయం రెండు కుటుంబాలకు తెలిసి ఇద్దరికీ పెళ్లి చేయాలని తీర్మానించారు. ఇంతలో ప్రియుడు ప్రదీప్ ఈ పెళ్లి తనకు ఇష్టం లేదని చెప్పడంతో యువతి కుటుంబీకులు ఆందోళనకు గురయ్యారు. మోసపోయానని విరక్తి చెందిన యశోద మంగళవారం రాత్రి ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొంది. సూళగిరి పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ జరుపుతున్నారు. చదవండి: అమ్మకు బై చెప్పిన 5 నిమిషాల్లోనే.. -
బర్త్డే అని పిలవడంతో ప్రియురాలి ఇంటికి.. వంటగదిలో చూడగా షాకై గట్టిగా కేకలు..
చెన్నై: కోయంబత్తూరులో ప్రియురాలి పుట్టినరోజు వేడుకల కోసం ఆమె ఇంటికి వచ్చిన ఓ యువకుడు మంగళవారం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో షాక్కు గురైన ప్రియురాలు కూడా ఆత్మహత్యకు యత్నించడం కలకలం రేపింది. వివరాలు.. నీలగిరి జిల్లా మసినగుడి మేయర్ ప్రాంతంకి చెందిన శ్రీనివాసన్ కుమారుడు ప్రదీప్ (26). ఇతను మైసూరులోని ఓ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్నాడు. మసనకుడి లక్ష్మీనగర్ 2వ వీధికి చెందిన రమేష్ కూతురు కావ్య (26). ఈమె ప్రదీప్ స్కూల్ ఫ్రెండ్. వీరు గత 6 నెలలుగా ప్రేమించుకుంటున్నారు. కావ్య కోవై శరవణం పట్టి నెహ్రూ నగర్ 3వ రోడ్డులో అద్దెకు ఉంటూ బీలమెట్లోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. కావ్య పుట్టినరోజు సంబరాలు చేసుకోవడానికి ప్రదీప్ కావ్య ఇంట్లో బస చేశాడు. మంగళవారం ఉదయం కావ్య తన తల్లితో ఫోన్లో మాట్లాడేందుకు మేడపైకి వెళ్లింది. అనంతరం ఇంట్లోకి వెళ్లి చూడగా వంటగదిలో ప్రదీప్ ఉరివేసుకుని కనిపించాడు. దీంతో షాక్కు గురైన కావ్య కేకలు వేసింది. అనంతరం పక్కనే ఉన్నవారి సహాయంతో ప్రదీప్ను 108 సాయంతో ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే ప్రదీప్ మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. దీంతో కావ్య ఇంట్లోకి వెళ్లి ఉరివేసుకుని ఆత్మహత్యకు యత్నించింది. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు కావ్యను రక్షించి కోయంబత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. శరవణంపాటి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి భర్త కోసం త్యాగం.. ఇలాంటి అమ్మాయి భార్యగా వస్తే ఎంత బాగుంటుందో!