వారు దాడికి పాల్పడటంలో తప్పులేదు | They are not wrong in taking the attack | Sakshi
Sakshi News home page

వారు దాడికి పాల్పడటంలో తప్పులేదు

Published Sat, Jun 18 2016 1:40 AM | Last Updated on Sun, Sep 2 2018 5:24 PM

వారు దాడికి పాల్పడటంలో తప్పులేదు - Sakshi

వారు దాడికి పాల్పడటంలో తప్పులేదు

న్యూఢిల్లీ: తమ ముందే తల్లిదండ్రులను కొడుతున్న వారిపై పిల్లలు తిరగబడి దాడి చేయడం తప్పుకాదని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది. రాజస్థాన్‌కు చెందిన ఓ కేసును విచారిస్తున్న జస్టిస్ దీపక్ మిశ్రా, శివ కీర్తి సింగ్‌ల ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. తమ తల్లిదండ్రులను తీవ్రంగా కొట్టడడంతో ఇద్దరు సోదరులు ఇంటి పక్కవారిపై దాడికి పాల్పడ్డారు. వీరిని రాజస్తాన్ దోషులుగా తేల్చగా.. సుప్రీం కోర్టు విచారించి నిర్ధోషులేనని వెల్లడించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement