పోలీసుల కాల్పుల్లో మావోయిస్టుల మృతి | Three Maoists killed in Jharkhand | Sakshi
Sakshi News home page

పోలీసుల కాల్పుల్లో మావోయిస్టుల మృతి

Published Fri, Mar 24 2017 2:17 PM | Last Updated on Tue, Oct 9 2018 2:53 PM

Three Maoists killed in Jharkhand

రాంచీ:  జార్ఖండ్‌లో పోలీసులు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురెదురు కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. ఈ కాల్పులు శుక్రవారం మహమ్మద్‌గంజ్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని సిట్‌చువా గ్రామంలో జరిగాయి. మృత దేహాలను స్వాధీనం చేసుకొని, ఒకరిని అజయ్‌ యాదవ్‌గా గుర్తించామని పోలీసులు తెలిపారు. అజయ్‌పై రూ.10 లక్షల రివార్డు ఉందని చెప్పారు. వీరి వద్ద నుంచి ఒక ఏకే-47 తుపాకీ, ఏడు రైఫిల్స్‌ స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement