
జమ్ముకశ్మీర్లో స్వల్ప భూప్రకంపనలు
న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్లో ప్రకంపనలు సంభవించాయి. రాజధాని నగరమైన శ్రీనగర్తోపాటు రాష్ట్రమంతటా బుధవారం రాత్రి స్వల్పంగా భూమి కంపించింది. ఈ భూప్రకంపనలకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
దాదాపు నెలకిందట భారీ భూకంపం పాకిస్థాన్, ఆఫ్గనిస్థాన్ ను కకావికలం చేసిన సంగతి తెలిసిందే. గత నెల 26న వాయవ్య ఆఫ్గనిస్థాన్లో రిక్టర్ స్కేలుపై 7.5 తీవ్రతతో భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. ఈ భూకంపంతో ఆఫ్గనిస్థాన్ రాజధాని కాబూల్ అతలాకుతలమైంది. భూకంపం వల్ల పాకిస్థాన్లో 200 మంది, ఆఫ్గనిస్థాన్లో 33 మంది గాయపడ్డారు.