సాక్షి, ఆదిలాబాద్: జిల్లా బీజేపీ అధ్యక్షుడు పాయల్ శంకర్ను వెంటనే పార్టీ నుంచి తొలగించాలని జిల్లా బీజీపీ కార్యవర్గం సోమవారం డిమాండ్ చేసింది. జిల్లా కార్యవర్గ సభ్యురాలు సుహాసినిరెడ్డి ఆధ్యర్యంలో ఆదిలాబాద్ ప్రెస్క్లబ్లో మీడియా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సుహాసినిరెడ్డి మాట్లాడుతూ.. పాయల్ శంకర్ ఇతర పార్టీకి అమ్ముడు పోవటం వల్ల ఆదిలాబాద్ మున్సిపాలిటీ చేజారిందని ఆమె ఆరోపించారు. కేవలం మున్సిపల్ ఎన్నికలు మాత్రమే కాదు.. తన స్వార్థ ప్రయోజనాల కోసం జిల్లాలో పార్టీని బలహీనపరుస్తున్నాడని ఆమె మండిపడ్డారు. పాయల్ శంకర్ను వెంటనే జిల్లా అధ్యక్షుడి పదవీ నుంచి తొలగించి, సస్పెండ్ చేయాలని అధిష్టానాన్ని జిల్లా కార్యవర్గం డిమాండ్ చేసింది. లేదంటే ఆదిలాబాద్ జిల్లా బీజేపీ కార్యవర్గమంతా మూకుమ్మడిగా రాజీనామా చేస్తామని పార్టీ అధిష్టానానికి అల్టిమేటంజారీ చేసింది.
‘అతన్ని అధ్యక్ష పదవి నుంచి తొలగించాలి’
Published Mon, Jan 27 2020 4:14 PM
Advertisement
Advertisement
తప్పక చదవండి
- తెలంగాణలో జూడాల సమ్మె విరమణ
- రేణుకాస్వామిని హీరోను చేయడం ఆపండి.. దర్శన్కు యాంకర్ సపోర్ట్
- సిసోడియా అమాయకుడు, ఆయన్ను నిందించలేదు: కోర్టులో కేజ్రీవాల్
- ఏపీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ సప్లమెంటరీ ఫలితాలు విడుదల.. డైరెక్ట్ లింక్ ఇదే
- పొరపాటు దిద్దుకున్న నాగార్జున, వీడియో వైరల్
- మొన్న తనయుడు.. ఇప్పుడు తండ్రి.. అడ్వాన్స్గా రూ.4 కోట్లు!
- ఉన్నట్టుండి రూ. 33 కోట్ల జాక్పాట్ : గుండె ఆగినంత పనైందట!
- స్పీకర్ ‘ఎమర్జెన్సీ’ వ్యాఖ్యలతో లోక్సభలో దుమారం
- ప్రభాస్ 'కల్కి' సినిమా ప్రత్యేకతలు.. మీకు ఇవి తెలుసా?
- T20 World Cup 2024: పేలవ ఫామ్లో విరాట్.. సెమీఫైనల్లో అయినా పుంజుకుంటాడా..?
Advertisement