టీడీపీ నేతలు నన్ను బెదిరించారు: బీజేపీ ఎంపీ | GVL Narasimha Rao Privilege Notice Against Tdp | Sakshi
Sakshi News home page

టీడీపీపై సభాహక్కుల ఉల్లంఘన నోటీసు

Published Mon, Jul 30 2018 6:35 PM | Last Updated on Fri, Aug 10 2018 9:52 PM

GVL Narasimha Rao Privilege Notice Against Tdp - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : టీడీపీ నేతలు తనను బెదిరించారని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు వారిపై సభాహక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చారు. రాజ్యసభలో ప్రసంగం అనంతరం టీడీపీ నేతలు ఖబడ్దార్‌ అంటూ తనని బెదిరించారని ఆయన నోటీసులో పేర్కొన్నారు. దీనికి సంబంధించిన వీడియోలను ఆధారాలుగా  రాజ్యసభ సెక్రటేరియట్‌కు సమర్పించారు. టీడీపీ వైఫల్యాలను ఎండగట్టడంతోనే తనను బెదిరించినట్లు జీవీఎల్‌ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు.

విభజన చట్టంపై అఫిడవిట్‌..
ఏపీ విభజన చట్టంపై కేంద్ర మానవ వనరుల శాఖ అఫిడవిట్‌ దాఖలు చేసింది. విభజన చట్టప్రకారం ఇప్పటికే ఏపీలో అనేక విద్యాసంస్థలు ఏర్పాటు చేశామని, సెంట్రల్‌ వర్సిటీకి ఇప్పటికే కేబినెట్‌ సూత్రపాయ ఆమోదం తెలిపిందని పేర్కొంది. గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని కూడా స్పష్టం చేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement