GVL Narasimha Rao
-
ఎంపీ సీటు కోసం GVL వదలని పట్టు.. బీజేపీ అధిష్టానంపై ఒత్తిడి..
-
పురందేశ్వరికి కొత్త ట్విస్ట్.. రూట్ మార్చిన జీవీఎల్!
సాక్షి, విశాఖపట్నం: ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ కూటమిలో కొత్త ట్విస్ట్లు చోటుచేసుకుంటున్నాయి. టికెట్ దక్కని కొందరు నేతలు అసంతృప్తితో రగిలిపోతున్నారు. తమకు టికెట్ దక్కించుకునేందుకు వీలున్న మార్గాలన్నింటినీ వెతుకుతూ పార్టీలకు షాకిస్తున్నారు. తాజాగా ఆ లిస్ట్లోకి బీజేపీ ఎంపీ, సీనియర్ నేత జీవీఎల్ నరసింహారావు కూడా చేరారు. కాగా, విశాఖ పార్లమెంట్ స్థానం విషయంలో జీవీఎల్ పట్టువిడవటం లేదు. ఎలాగైనా విశాఖ నుంచి పోటీ చేయాలని ఫిక్స్ అయ్యారు. అయితే, ఇప్పటికే విశాఖ సీటును టీడీపీ నేత భరత్కు ఇచ్చినప్పటికీ జీవీఎల్ మాత్రం ఇంకా ఆశలు వదులుకోలేదు. ఈ క్రమంలో తనకే టికెట్ దక్కేలా లాబీయింగ్కు దిగారు. తాజాగా, ఉత్తరాది నేతలో జీవీఎల్ మంతనాలు ప్రారంభించారు. అలాగే, ఉత్తరాది వ్యాపారులతో కూడా జీవీఎల్ సమావేశమయ్యారు. జీవీఎల్.. రూట్ మార్చి ఉత్తరాది నేతలతో చర్చించి బీజేపీ అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నారు. విశాఖ సీటు తనకే దక్కేలా వ్యూహరచన చేస్తున్నారు. మరోవైపు.. జీవీఎల్కు మద్దతుగా జన జాగరణ సమితి నిరసన కార్యక్రమాలు చేపట్టింది. ఈ క్రమంలో జీవీఎల్కు మద్దతుగా బీజేపీ నేతలు ఢిల్లీకి వెళ్లి జేపీ నడ్డాను కూడా కలవడంతో విషయం మరోసారి చర్చకు వచ్చింది. ఇదిలా ఉండగా.. ప్రచారంలో భాగంగా జీవీఎల్ షాకిలిస్తున్నారు. టీడీపీ నేత భరత్ ప్రచారానికి జీవీఎల్ దూరంగా ఉంటున్నారనే చర్చ నడుస్తోంది. టీడీపీ కార్యక్రమాలకు కూడా జీవీఎల్ వెళ్లడం లేదు. అంతేకాకుండా పురంధేశ్వరి, చంద్రబాబు తీరుపై జీవీఎల్ గుర్రుగా ఉన్నట్టు సమాచారం. -
బాబు బంధువును టెన్షన్ పెడుతున్న బీజేపీ నేత
సాక్షి, విశాఖపట్నం: విశాఖ లోక్సభ స్థానం విషయంలో టీడీపీ–బీజేపీ మధ్య పొత్తు పొసగడం లేదు. ఈ స్థానంపై బీజేపీ నేతలు పట్టువీడడంలేదు. సీటు కచ్చితంగా మార్చాలని.. లేకుంటే స్నేహపూర్వక పోటీకి సిద్ధమని చెబుతున్నారు. ఈ ఎంపీ సీటును ఆశించి బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు మూడేళ్లుగా పలు కార్యక్రమాలు చేపడుతున్నారు. ఆఖరి నిమిషం వరకు కూటమి పొత్తులో ఈ సీటు తనకే దక్కుతుందని ఎంతో ధీమాగా ఉన్నారు. అయితే అనూహ్యంగా లోకేష్ తోడల్లుడు, నటుడు బాలకృష్ణ చిన్నల్లుడు అయిన భరత్కు టీడీపీ తరఫున కేటాయించారు. ఈ పరిణామాన్ని జీర్ణించుకోలేని జీవీఎల్, ఆయన అనుచర వర్గం తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ వ్యవహారంలో చంద్రబాబుతో పాటు ఆయన వదిన, రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరిలు ఏకమై జీవీఎల్కు కాకుండా భరత్కు టికెట్ దక్కేలా చక్రం తిప్పారన్న భావనలో వీరున్నారు. విశాఖ బీజేపీలో బలంగా ఉన్న ఒక వర్గం కూటమిలో టీడీపీ అభ్యర్థి భరత్ను మార్చి ఆ స్థానంలో జీవీఎల్కు కేటాయించాలని కొన్నాళ్లుగా పట్టుబడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల విశాఖ బీజేపీ కార్యాలయం ఆవరణలో వీరు సమావేశమయ్యారు. భరత్ను మార్పు చేసి జీవీఎల్కు ఇవ్వని పక్షంలో విశాఖ లోక్సభ స్థానం నుంచి ఆయన స్నేహపూర్వక పోటీకి అనుమతించాలని తమ అధిష్టానాన్ని డిమాండ్ చేశారు. అనంతరం ఇదే విషయాన్ని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు కూడా లేఖ రాశారు. మార్చకపోతే సహకరించలేం.. రెండు రోజుల క్రితం బీజేవైఎం జాతీయ కార్యవర్గ సభ్యుడు వంశీయాదవ్, పార్టీ గాజువాక కనీ్వనర్ కరణంరెడ్డి నర్సింగరావు, మరికొందరు నాయకులు, విశాఖలో ఉంటున్న ఉత్తరాదికి చెందిన 20 మందికి పైగా ముఖ్య నాయకులు తాడోపేడో తేల్చుకోవడానికి ఢిల్లీకి పయనమై వెళ్లారు. వీరంతా శనివారం బీజేపీ ఏపీ వ్యవహారాల ఇన్చార్జి, జాతీయ ప్రధాన కార్యదర్శి సతీష్ పునియాను కలిశారు. విశాఖలో బీజేపీకి పట్టుందని, గతంలో ఎంపీ, ఎమ్మెల్యే స్థానాల్లో పార్టీ అభ్యర్థులే గెలుపొందారని సతీష్కు వివరించారు. జీవీఎల్ విశాఖలో ఉంటూ పార్టీ బలోపేతానికి మూడేళ్లుగా కృషి చేస్తున్నారని, బీజేపీ గెలిచే విశాఖ లోక్సభ సీటును గెలుపు అవకాశాల్లేని టీడీపీకి కేటాయించడం పార్టీ శ్రేణులు తీవ్ర నిరాశ, నిస్పృహలతో పాటు అసంతృప్తితో ఉన్నారని చెప్పారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి పార్టీ కోసం పాటు పడుతున్న జీవీఎల్కు కాకుండా ఆమె బంధువైన భరత్కు సీటు ఇప్పించుకున్నారని స్పష్టం చేశారు. టీడీపీ అభ్యర్థి భరత్ను మార్చి ఆ స్థానంలో బీజీపీ అభ్యర్థి జీవీఎల్కు ఇస్తే గెలుపు తేలికవుతుందని సతీష్కు చెప్పారు. లేనిపక్షంలో కూటమి టీడీపీ అభ్యర్థి గెలుపునకు తాము సహకరించబోమని స్పష్టం చేసినట్టు తెలిసింది. వీరి విజ్ఞప్తిని సావధానంగా విన్న సతీష్.. ఈ విషయాన్ని జాతీయ అధ్యక్షుడు నడ్డా దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.విశాఖ లోక్సభ సీటుపై తగ్గేదే లే అంటున్న బీజేపీ నాయకుల తీరుతో టీడీపీ అభ్యరి్థతో పాటు ఆ పార్టీ నాయకుల్లోనూ కలవరం రేకెత్తుతోంది. ఇప్పటికే పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు భరత్ ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉంటున్నారు. తమతో బీజేపీ శ్రేణులు కలిసి రావడం ప్రశ్నార్థకమేనని తేలడంతో టీడీపీ నాయకుల్లో ఆందోళన నెలకొంది. -
Visakha: కూటమిలో పోస్టర్ల కలకలం
విశాఖపట్నం, సాక్షి: అభ్యర్థుల్ని ప్రకటించినా.. కూటమిలో గొడవలు మాత్రం సర్దుమణగడం లేదు. మరికొన్ని చోట్ల అభ్యర్థుల్ని మార్చాల్సిందేననే డిమాండ్ బలంగా వినిపిస్తోంది. ఈ జాబితాలో విశాఖపట్నం పార్లమెంట్ స్థానం కూడా ఉంది. కూటమిలో భాగంగా విశాఖ ఎంపీ సీటు బీజేపీకి వెళ్తుందనే ప్రచారం మొదట్లో బాగా వినిపించింది. మాజీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు ఇక్కడి నుంచి పోటీ చేయడం ఖాయమనే భావించారంతా. కానీ, చంద్రబాబు పాచికతో ఈ సీటు టీడీపీకి వెళ్లింది. నారా లోకేష్ తన తోడల్లుడు భరత్కు సీటు ఇప్పించారు. దీంతో జీవీఎల్ నొచ్చుకున్నారు. అయినా విశాఖకు తన సేవలు అందిస్తానంటూ ఓ వీడియో ప్రకటన విడుదల చేశారు. అయితే ఈలోపు విశాఖలో పోస్టర్ల కలకలం రేగింది. జీవీఎల్కు సీటు కేటాయించాలంటూ జన జాగరణ సమితి పేరిట ఆంధ్రా యూనివర్సిటీ గేటుకు పోస్టర్లు అంటించారు. టీడీపీ-జనసేన-బీజేపీ తరఫు ఉమ్మడి అభ్యర్థి భరత్ విశాఖ కోసం ఏం చేశాడని.. జీవీఎల్ కనీసం పార్లమెంట్లో గళం వినిపించారని ఆ పోస్టర్ల సారాంశం. జీవీఎల్కు టికెట్ కేటాయించకపోవడం అన్యాయమని రాసి ఉంది అందులో. దీంతో కూటమిలో ఈ పోస్టర్లపై చర్చ జోరందుకుంది. -
ఎంపీ సీట్ పై జీవీఎల్ కామెంట్స్
-
పురంధేశ్వరి రాజకీయ క్రీడ.. బీజేపీ సీనియర్కు షాక్!
సాక్షి, విశాఖపట్నం: ఏపీలో కూటమి పొత్తుల్లో భాగంగా అసలు బీజేపీ నేతలకు బిగ్ షాక్లు తగులుతున్నాయి. తాజాగా సీట్ల కేటాయింపులో బీజేపీ సీనియర్ నేత జీవీఎల్కు ఎదురుదెబ్బ తగిలింది. చంద్రబాబు, పురంధేశ్వరి ఆడుతున్న ‘ఫ్యామిలీ’ రాజకీయ క్రీడలో జీవీఎల్కు నిరాశే ఎదురైంది. కాగా, ఏపీ కూటమిలో సీట్ల కేటాయింపుల్లో భాగంగా చంద్రబాబు, పురంధేశ్వరి ప్లానే వర్క్ అవుట్ అవుతోంది. చంద్రబాబు సూచనలనే పురంధేశ్వరి కూడా అమలు చేస్తున్నారు. చంద్రబాబు మాటను తూచా తప్పకుండా పురంధేశ్వరి అమలు చేస్తున్నారు. స్థానిక ఒరిజినల్ బీజేపీ నేతల మాటలను రాష్ట్ర బీజేపీ చీఫ్ పురంధేశ్వరి పట్టించుకున్న పాపాన పోలేదు. దీంతో, వారికి భంగపాటే ఎదురవుతోంది. తాజాగా మరోసారి పురంధేశ్వరి తన పంతం నెగ్గించుకున్నారు. బీజేపీ సీనియర్ నేత జీవీఎల్ నరసింహరావును కాదని విశాఖ సీటును టీడీపీ ఇచ్చేందుకే అంగీకరించారు పురంధేశ్వరి. అయితే, ఈరోజు టీడీపీ పార్లమెంట్ స్థానాలకు గాను చంద్రబాబు 13 మంది అభ్యర్థుల బాబితాను విడుదల చేశారు. ఇందులో భాగంగా విశాఖ ఎంపీ స్థానాన్ని బాలకృష్ణ అల్లుడు భరత్కు కేటాయించారు. ముందు నుంచీ విశాఖ సీటు తనకే వస్తుందనే నమ్మకంతో నిన్నటి వరకు జీవీఎల్ ప్రచారం కూడా చేసుకున్నారు. ఎన్నికల కోసం ప్లాన్ చేసుకుంటూ ముందుకు సాగారు. కానీ, ఊహించని విధంగా చంద్రబాబు రాజకీయ క్రీడలో జీవీఎల్కు నిరాశే ఎదురైంది. ఇక, జీవీఎల్కు సీటు ఇవ్వకపోవడంతో బీజేపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పురంధేశ్వరి వల్లే విశాఖ సీటు టీడీపీ వెళ్లిందని ఆరోపిస్తున్నారు. ఏలూరు స్ధానంపై ఆశలు పెట్టుకున్న బీజేపీ నేత గారపాటి చౌదరికి నిరాశే ఎదురైంది. ఏలూరు ఎంపీ స్ధానాన్ని యనమల అల్లుడు పుట్టా మహేష్ యాదవ్కి ఇచ్చిన చంద్రబాబు. అలాగే, హిందూపూర్ స్ధానం కోసం బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్దన్ రెడ్డి ఆశలు గల్లంతే అయ్యాయి. హిందూపూర్ పార్లమెంట్ స్ధానాన్ని పరిపూర్ణానందస్వామికి ఇవ్వాలని ఆర్ ఎస్ఎస్, వీహెచ్పీ విజ్ణప్తులని చంద్రబాబు పట్టించుకోలేదు. హిందూపూర్ స్ధానంలో టీడీపీ అభ్యర్ధిగా మాజీ ఎమ్మెల్యే బీకే పార్దసారధిని ప్రకటించారు. టీడీపీ లోక్సభ అభ్యర్థుల జాబితా ఇదే.. -
విశాఖ ఎంపీ సీటుపై వదిన–మరిది డ్రామా!
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: విశాఖ ఎంపీ సీటు విషయంలో అటు టీడీపీ ఇటు బీజేపీ పెద్ద డ్రామానే నడిపిస్తున్నాయి. పొత్తులు కడుతూనే వెనకాల నుంచి ఏ పార్టీ నుంచి ఎవరు పోటీచేయాలో నిర్ణయిస్తూ చక్రం తిప్పుతున్న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మరోసారి తమ పార్టీకి వెన్నుపోటు పొడుస్తున్నారని బీజేపీ నేతలు వాపోతున్నారు. అలాగే, విశాఖ ఎంపీ సీటు కోసం గత రెండేళ్లుగా పనిచేస్తున్న జీవీఎల్కు చెక్పెడుతూ పూర్వాశ్రమంలో టీడీపీలో పనిచేసిన సీఎం రమేష్కు ఆ స్థానం కేటాయించేలా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి పట్టుబట్టడం ఆ పార్టీలో చర్చనీయాంశమవుతోంది. మరోవైపు.. చంద్రబాబు కుటుంబానికే చెందిన భరత్ కాస్తా తనకు సీటు ఇవ్వకపోతే ఏమైనా చేసుకుంటానని.. దానికి మీదే బాధ్యత అని హెచ్చరించడంతో సీఎం రమేష్కు అనకాపల్లి సీటును కేటాయించేలా పురందేశ్వరి చక్రం తిప్పినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో గతంలో టీడీపీలో కీలకంగా వ్యవహరించి అప్పట్లో తనకు అనుకూలంగా ఉన్న వారికే ఇప్పుడు బీజేపీ సీట్లను కేటాయించేలా చక్రం తిప్పడంలో వదినకు మరిది (చంద్రబాబు) కూడా మద్దతిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు.. తనకు విశాఖ ఎంపీ సీటు కేటాయించకపోతే ఏ అఘాయిత్యానికి పాల్పడినా అందుకు మీరే బాధ్యులవుతారంటూ టీడీపీ నేత, లోకేశ్ తోడల్లుడు భరత్ స్పష్టంగా పేర్కొన్నట్లు తెలుస్తోంది. దీంతో అనకాపల్లి ఎంపీ సీటును సీఎం రమేష్కు కేటాయించేందుకు వీలుగా.. అందుకు జనసేన త్యాగం చేసేలా వదిన, మరిది చక్రం తిప్పుతున్నట్లు బీజేపీ శ్రేణులే అనుమానిస్తున్నాయి. మరోవైపు.. జనసేన నేతలు కూడా తమ పార్టీకి మొదట్లో ఇచ్చిన అరకొర సీట్లను సైతం అధినేత పవన్ వదలుకోవడాన్ని వారు తీవ్రంగా తప్పుపడుతున్నారు. మళ్లీ పాత రోజులే! మరోవైపు.. బీజేపీ శ్రేణుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. గతంలో పార్టీలో ఉన్న ఒక వృద్ధ నేత రాజకీయాలకు దూరంగా ఉండడంతో రాష్ట్రంలో బీజేపీ స్వయంగా ఎదిగేందుకు అవకాశం ఉంటుందని భావించామని.. కానీ, ఇప్పుడు పురందేశ్వరి రూపంలో మళ్లీ పార్టీని బొందలో పెట్టే కార్యక్రమం నడుస్తోందని ఆ పార్టీ శ్రేణులు బహిరంగంగానే పార్టీ కార్యాలయంలో వ్యాఖ్యానిస్తున్నారు. పార్టీ కోసం కష్టపడిన వారికి కాకుండా వలస నేతలకు సీట్లను కేటాయించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఇదే విషయాన్ని పార్టీ అధిష్టానానికి చెప్పేందుకు కొద్దిమంది సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. పార్టీ వ్యవహారాలను అలాంటి వారికి అప్పగిస్తే తిరిగి పార్టీని నామరూపాలు లేకుండా చేస్తారనే విషయాన్ని వివరించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ మేరకు వీరు పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డాకు లేఖ కూడా రాశారు. జీవీఎల్కు పురందేశ్వరి చెక్! ఇక విశాఖపట్నం ఎంపీ సీటు కోసం రెండేళ్లుగా జీవీఎల్ ప్రయత్నిస్తున్నారు. ఇందుకు అనుగుణంగా ఇక్కడ పలు కార్యక్రమాలు చేపట్టారు. వివిధ సమస్యల పరిష్కారం కోసం తన వంతు యత్నించారు. స్థానికంగా ఆయా వర్గాల్లో తనకంటూ ఒక వర్గాన్ని ఏర్పరచుకునే ప్రయత్నం చేశారు. ఒకవైపు స్టీలు ప్లాంటు ప్రైవేటీకరణపై కేంద్రం ముందడుగులు వేస్తుంటే.. కార్మికుల్లో వ్యతిరేకత రాకుండా వారితో చర్చలు జరిపి.. మధ్యేమార్గాలను సూచించాలంటూ సమావేశాలను నిర్వహించారు. ఈ పరిస్థితుల్లో జీవీఎల్కు సీటు రాకుండా పురందేశ్వరి చక్రం తిప్పినట్లు తెలుస్తోంది. వెనుకనుండి కథ మొత్తం చంద్రబాబు నడిపించారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మొన్నటివరకు జీవీఎల్ వైజాగ్లో ఏ కార్యక్రమాన్ని నిర్వహించినా తమ అనుకూల మీడియాలో రాకుండా టీడీపీ నేతలు జాగ్రత్తపడ్డారు. అంతేకాక.. జీవీఎల్కు వ్యతిరేకంగా కథనాలను కూడా ప్రచురించారు. ఇప్పుడు ఏకంగా సీటు రాకుండా చేయడంతో జీవీఎల్ వర్గం కూడా మండిపడుతోంది. -
ఎంపీ రిక్షా తొక్కిండు
-
‘విశాఖ స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రక్రియ నిలిచిపోయింది’
విశాఖ : విశాఖ స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రక్రియ నిలిచిపోయిందన్నారు బీజేపీ ఎంపీ జీవీఎల్. నరసింహారావు. స్టీల్ప్లాంట్ను ప్రభుత్వ రంగంలోనే నడపాలని చూస్తున్నట్లు పేర్కొన్నారు. ముడిసరుకు ఇచ్చేందుకు ఎన్ఎండీసీ సిద్ధంగా ఉందని ఎంపీ జీవీఎల్ తెలిపారు. అదే సమయంలో విశాఖ నుంచి వారణాసి ఎక్స్ప్రెస్ రైలు త్వరలోనే ప్రారంభం అవుతుందన్నారు. ‘విశాఖ నుంచి వారణాసికి ఎక్స్ప్రెస్ రైలు త్వరలోనే ప్రారంభం కానుంది. చాలా సందర్బాల్లో రైల్వే మంత్రిని కలిసి రైలు ఏర్పాటు చేయాలని కోరాం. రైల్వే బోర్డు నుంచి వారణాసికి ఎక్స్ప్రెస్ రైలు నడిపేందుకు ఆమోదం వచ్చింది. వారానికి రెండు రోజులు నడిపేందుకు అధికారులు నిర్ణయం తీసుకున్నారు. రానున్న రోజుల్లో దీన్ని రోజువారి రైలుగా నడిపే అవకాశం ఉంది. విజయదశమి లోపు ప్రారంభించాలని కోరాం’ అని తెలిపారు. చదవండి: ‘జైల్లో ఉంటే దోమలు కుట్టక.. రంభ, ఊర్వశి, మేనకలు కన్ను కొడతారా?’ -
ఏపీ బీజేపీలో టికెట్ వార్.. సీనియర్ల మధ్య సీటు పోటీ!
సాక్షి, విశాఖపట్నం: ఏపీలో బీజేపీ ఇద్దరు సీనియర్ల మధ్య టికెట్ వార్ నడుస్తోందా?. బీజేపీ హైకమాండ్ అక్కడ ఎవరికి టికెట్ ఇస్తుంది? అనే చర్చ కార్యకర్తలను టెన్షన్కు గురిచేస్తోంది. ఒకవైపు, తమ నేతను కార్యకర్తలు హైలైట్ చేస్తుండగా.. మరొకరికి గతంలో అక్కడి నుంచి గెలిచిన రికార్డు ఉంది. దీంతో, టికెట్ ఎవరికి ఇస్తారనేది కమలం పార్టీలో ఆసక్తికరంగా మారింది. ఇంతకీ వారద్దరూ ఎవరంటే.. విశాఖపట్నం నుంచి ఇద్దరు బీజేపీ సీనియర్ల మధ్య టికెట్ వార్ నడుస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుత బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు కొన్నాళ్లుగా విశాఖలో గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే జీవీఎల్ పుట్టినరోజు సందర్భంగా విశాఖలో ఆయన అభిమానులు బర్త్ డే వేడుకలను ఘనంగా ప్లాన్ చేశారు. విశాఖ సిటీ మొత్తం "GVL 4 VIZAG" పోస్టర్లు అంటించారు. విశాఖ అభివృద్ధి కోసం ఆయన పాటుపడుతున్నట్లుగా అభిమానులు అందులో పోస్టర్లలో పేర్కొన్నారు. అంతేకాకుండా.. ఇటీవల జీవీఎల్ కూడా విశాఖ అభివృద్ధిపైనే మాట్లాడుతుండటం గమనార్హం. ఈ నేపథ్యంలో విశాఖలో టికెట్ ఆయన టికెట్ ప్లాన్ చేస్తున్నారు. ఇక, ఏపీ బీజేపీకి కొత్తగా ప్రెసిడెంట్గా నియమితులైన దగ్గుబాటి పురంధేశ్వరి విశాఖ నుంచే పోటీ చేయాలని చూస్తున్నారు. పురంధేశ్వరి విశాఖ నుంచి పోటీకి పట్టుదలగా ఉన్నారు. గతంలో పురంధేశ్వరి విశాఖ నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఈనేపథ్యంలో ఆమె కూడా విశాఖ సీటు కోసం గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. ఈ నేపధ్యంలో బీజేపీ హై కమాండ్ కి విశాఖ సీటు అగ్ని పరీక్షగా మారుతుందని పొలిటికల్ విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో, ఎవరిని సీటు వరిస్తుందోనన్న సస్పెన్స్ చోటుచేసుకుంది. ఇది కూడా చదవండి: ప్రజలను గందరగోళానికి గురిచేయవద్దు.. ముందస్తు ఎన్నికలకు వెళ్లే ప్రసక్తి లేదు: సజ్జల -
మేము తగ్గాము అంతే... ఓడిపోలేదు 28 ఎంపీ సీట్లు మావే
-
రాష్ట్రంలో రాజకీయ వేట మొదలైంది
సాక్షి, విశాఖపట్నం: రాబోయే ఎన్నికలకు రాష్ట్రంలో రాజకీయ వేట మొదలైందని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అన్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్షా వివిధ రాష్ట్రాల్లో పర్యటిస్తూ బీజేపీ వైఖరిని స్పష్టం చేస్తున్నారని చెప్పారు. మంగళవారం ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడారు. ప్రధాని మోదీ పాలనపై పలు పార్టీలు దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. అందుకే ‘పార్టీల అసత్య ప్రచారం.. కేంద్ర సహకారం’ పేరుతో తమ పార్టీ ఇటీవల పుస్తకాన్ని ముద్రించిందని.. దీనిని అప్డేట్ చేసి త్వరలో విడుదల చేస్తామని చెప్పారు. ఈ పుస్తకంతో ఇంటింటికీ వెళ్లి వాస్తవాలను వివరిస్తామన్నారు. ఏపీకి కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందని ప్రశ్నిస్తున్న వైఎస్సార్సీపీ నాయకులకు కూడా ఈ పుస్తకంలో సమాధానం దొరుకుతుందన్నారు. విశాఖలో భూ కుంభకోణాలపై గత టీడీపీ, ప్రస్తుత వైఎస్సార్సీపీ ప్రభుత్వాలు వేసిన సిట్ నివేదికలను బహిర్గతం చేయాలన్నారు. వైఎస్సార్సీపీతో సహా ఏ పార్టీకి కూడా బీజేపీ అండగా లేదని చెప్పారు. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిపై సీబీఐ లేదా సిటింగ్ జడ్జితో విచారణ జరిపించాలి్సన అవసరముందన్నారు. దీనిపై ఎవరైనా కోర్టుకెళ్లి విచారణకు అభ్యర్థించవచ్చని.. ఇందులో కేంద్రం గానీ, బీజేపీ గానీ జోక్యం చేసుకోబోదన్నారు. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్రాజు మాట్లాడుతూ.. మార్గదర్శిపై రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు. సమావేశంలో బీజేపీ నాయకుడు మేడపాటి రవీంద్ర తదితరులు పాల్గొన్నారు. -
టీడీపీతో పవన్ పొత్తు అంశాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాం : జీవీఎల్
-
టీడీపీతో పవన్ కల్యాణ్ పొత్తు అంశాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాం
సాక్షి, విశాఖపట్నం: టీడీపీతో పవన్ కల్యాణ్ పొత్తు అంశాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు బీజేపీ రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు. పొత్తుపై తమ అధిష్టానమే అంతిమ నిర్ణయం తీసుకుంటుందన్నారు. ప్రస్తుతానికి బీజేపీ, జనసేన మాత్రం కలిసే ఉన్నాయని తెలిపారు. కర్ణాటకలో బీజేపీ ఓటమిపై విశ్లేషణ చేసుకుంటామన్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు లోక్సభ ఎన్నికలపై ఉండవని పేర్కొన్నారు. ఒక రాష్ట్రంలో ఫలితాలు మరొక రాష్ట్రంలో ప్రభావం చూపించవన్నారు. చదవండి: పవన్ శ్వాస, ధ్యాస బాబే -
ఫలితాలపై జీవీఎల్ రియాక్షన్
-
కాశీకి తెలుగు ప్రజలకు మధ్య ప్రాచీన సంబంధం ఉంది: మోదీ
లక్నో: శనివారం సాయంత్రం కాశీలో తెలుగు సంగమం - గంగా పుష్కర ఆరాధన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శ్రీ కాశీ తెలుగు సమితి గౌరవాధ్యక్షులు, బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు నేతృత్వం వహించారు. కాశీ తెలుగు సంగమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్గా పాల్గొని ప్రసంగించారు. 'కాశీకి తెలుగు ప్రజలకు మధ్య ప్రాచీన సంబంధం ఉంది. ఏపీ, తెలంగాణ భక్తులు అత్యంత ఆరాధన భావంతో ఉంటారు. తెలంగ్ స్వామిని కాశీలో నడుస్తున్న మహాశివుడు గా అభివర్ణిస్తారు. జిడ్డు కృష్ణమూర్తినీ ప్రజలు గుర్తుంచుకున్నారు. వేములవాడను దక్షిణ కాశీగా అభివర్ణిస్తారు. కాశీ మజిలీ కథలు తెలుగు ప్రజలతో మమేకమై ఉన్నాయి. ఇదంతా తరతరాలుగా భారత వారసత్వం. కాశీని ఎంతో అభివృద్ధి చేస్తున్నాం. వారణాసి - బెనారస్ మధ్య రోప్ వే నిర్మిస్తున్నాం. ఏపీలో ఏటి కొప్పాక బొమ్మలు ఎంతో ప్రసిద్ధి చెందాయి. గంగా పుష్కరాల సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు' అని మోదీ పేర్కొన్నారు. ఈ కర్యక్రమంలో నిర్వహించినవి.. ► ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త సామవేదం షణ్ముఖ శర్మ ప్రవచనం. ► వేద పండితుల ఆశీర్వచనం, వేదపారాయణం, స్త్రోత్ర పారాయణం. ► మానస సరోవర్ ఘాట్ వద్ద గంగా నదీ ఆరాధన, గంగా హారతి. చదవండి: సోలో సెయిలింగ్ రేస్లో చరిత్ర సృష్టించిన భారత ఇండియన్ నేవీ ఆఫీసర్ -
ఎన్నారైలు విదేశాల్లోనే ఓటు వేయొచ్చు.. వారి కోసం ప్రత్యేక పోస్టల్ బ్యాలెట్
ప్రవాస భారతీయ (ఎన్నారై) ఓటర్ల కోసం ఎలక్ట్రానిక్ ట్రాన్స్మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ సిస్టమ్ (ఈటీబీపీఎస్)ను అమలు చేసే ప్రతిపాదన పరిశీలనలో కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజీజు పేర్కొన్నారు. రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అడిగిన ప్రశ్నకు కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజీజు సమాధానమిస్తూ.. 1 జనవరి 2023 నాటికి ప్రజాప్రాతినిధ్య చట్టం 1950లోని సెక్షన్ 20A ప్రకారం విదేశాల్లో నివసిస్తున్న 1,15,696 మంది భారతీయ పౌరులు భారతీయ ఓటర్ల జాబితాలో ఓటర్లుగా నమోదు చేసుకున్నారని పేర్కొన్నారు. ఎన్నారై ఓటర్ల కోసం ఎలక్ట్రానిక్ ట్రాన్స్మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ విధానాన్ని అమలు చేయడానికి ఎన్నికల ప్రవర్తన నియమాలు 1961ను సవరించే ప్రతిపాదనను భారత ఎన్నికల సంఘం చేపట్టిందని న్యాయ మంత్రి కిరణ్ రిజీజు తెలిపారు. ప్రతిపాదన అమలులో ఉన్న లాజిస్టికల్ సవాళ్లను పరిష్కరించేందుకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖతో ఈ విషయం చర్చిస్తున్నట్లు చెప్పారు. విదేశీ ఓటర్లు వ్యక్తిగతంగా లేదా ప్రాక్సీ (నామినేటెడ్ ఓటరు) ద్వారా ఓటు వేయడానికి వీలుగా ప్రజాప్రాతినిధ్య (సవరణ) బిల్లు, 2018 పేరుతో భారత ఎన్నికల సంఘం సిఫార్సు చేసిన బిల్లును ఆగస్టు 9, 2018న లోక్సభలో ప్రవేశపెట్టి ఆమోదించినట్లు న్యాయ మంత్రి తెలిపారు. అయితే 16వ లోక్సభ రద్దు కారణంగా ఈ బిల్లు కూడా రద్దయిందని పేర్కొన్నారు. -
నాటు నాటు పాటకు ఆస్కార్.. రాజ్యసభలో ఎంపీ జీవీఎల్ ప్రశంసలు
న్యూఢిల్లీ: ఆర్ఆర్ఆర్ సినిమాలోని ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ అవార్డు లభించడంపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు రాజ్యసభలో ప్రస్తావించారు. నాటు నాటుకు ఆస్కార్ దక్కడం తెలుగు సినిమాకు ప్రత్యేక గుర్తింపుగా అభివర్ణించారు. దీనిపై మంగళవారం రాజసభలో జీవీఎల్ మాట్లాడుతూ.. ఆస్కార్ అవార్డులు భారతీయ సినిమాకు ముఖ్యంగా తెలుగువారికి ఒక చారిత్రాత్మక గుర్తింపు అని అన్నారు. ఆర్ఆర్ఆర్ చిత్రం వాస్తవానికి తెలుగు చిత్రం.. ఆస్కార్ అవార్డు పొందిన ‘నాటు నాటు’ పాట తెలుగు పాట అని రాజ్యసభ సభ్యులందరికీ గుర్తు చేశారు. ఆర్ఆర్ఆర్ సినిమా విజయం ఒక్కటి మాత్రమే కాదని, దాని దర్శకుడు రాజమౌళి బాహుబలి లాంటి చిత్రాన్ని కూడా తెరకెక్కించారని, ఇది అంతర్జాతీయ విజయాన్ని సాధించిందని ఎంపీ జీవీఎల్ అన్నారు. రాజ్యసభలో నామినేటెడ్ ఎంపీ విజయేంద్ర ప్రసాద్ ఈ చిత్రానికి రచయిత అని ప్రశంసించిన ఎంపీ జీవీఎల్.. ఆర్ఆర్ఆర్ టీమ్ మొత్తానికి అభినందనలు తెలిపారు. -
పెట్టుబడుల కోసం సీఎం జగన్ది మంచి ప్రయత్నం
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో పెట్టుబడుల కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంచి ప్రయత్నం చేస్తున్నారని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు చెప్పారు. విశాఖపట్నంలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ (జీఐఎస్) నిర్వహించడం ద్వారా పెట్టుబడులను ఆకట్టుకోవడానికి కృషి చేశారన్నారు. సోమవారం ఆయన విశాఖలోని బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఈ సమ్మిట్లో కుదుర్చుకున్న ఒప్పందాలు (ఎంవోయూలు) వాస్తవరూపం దాలిస్తే ఆంధ్రప్రదేశ్కు ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు. తద్వారా రాష్ట్రంలో భవిష్యత్తులో మరిన్ని పెట్టుబడులు వస్తాయని అభిప్రాయపడ్డారు. జీఐఎస్ నిర్వహణ భేష్: విష్ణుకుమార్రాజు విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ను గొప్పగా నిర్వహించారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే పి.విష్ణుకుమార్రాజు విలేకరుల సమావేశంలో కొనియాడారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం తొలిసారిగా నిర్వహించిన ఈ సదస్సులో రూ.13 లక్షల కోట్లకు పైగా విలువైన ఎంవోయూలు కుదుర్చుకోవడం, అంబానీ, కరణ్ అదానీ, జిందాల్ వంటి అతిరథులు పాల్గొనడం గొప్ప విషయమని చెప్పారు. రాష్ట్రానికి ఇంతమంది ప్రముఖ పారిశ్రామికవేత్తలు వచ్చారంటే మారుతున్న పరిస్థితులకు అద్దం పడుతుందన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చే వేళ రాజకీయ విమర్శలు సరికాదని చెప్పారు. విశాఖలో రోడ్ల అభివృద్ధి, నగర సుందరీకరణ అభినందనీయమన్నారు. -
జీవీఎల్కు పురందేశ్వరి కౌంటర్
-
బీజేపీ ఎంపీ జీవీఎల్కు పురంధేశ్వరి కౌంటర్
సాక్షి, విజయవాడ: ఎన్టీఆర్, వైఎస్సార్ పేర్ల విషయంలో బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు చేసిన వ్యాఖ్యలకు పురందేశ్వరి కౌంటర్ ఇచ్చారు. ఆ ఇద్దరు కాదు, ఆ మహానుభావులంటూ ట్వీట్ చేశారు. ఒకరు రూ.2కే కిలోబియ్యం, జనతా వస్త్రాలు, పక్కా గృహాలు ఇస్తే మరొకరు ఫీజు రీఎంబర్స్మెంట్, 108, ఆరోగ్యశ్రీ వంటి సేవలు అందించారని చెప్పారు. ఎన్డీఆర్, వైఎస్సార్ పేదలకు నిజమైన సంక్షేమం అందించారని కొనియాడారు. ఆ ఇద్దరు కాదు, ఆ మహానుభావులు — Daggubati Purandeswari 🇮🇳 (@PurandeswariBJP) February 17, 2023 చదవండి: 'టీడీపీ స్కెచ్.. నీ పంట దున్నెయ్ లీడర్ని చేస్తాం' -
మాటకు మాట
-
Kanna Lakshminarayana vs GVL Narasimha Rao: మాటకు మాట
-
సోము వీర్రాజుపై కన్నా వ్యాఖ్యలు సముచితం కాదు: జీవీఎల్
-
కన్నా లక్ష్మీనారాయణ రాజీనామా.. జీవీఎల్ రియాక్షన్ ఇదే
సాక్షి, అమరావతి: కన్నా లక్ష్మీనారాయణ వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు స్పందించారు. కన్నాకు బీజేపీ సముచిత స్థానం కల్పిందన్నారు. సోము వీర్రాజుపై ఆయన వ్యాఖ్యలు సరికాదన్నారు. రాజకీయ దురుద్దేశంతోనే కన్నా వ్యాఖ్యలు చేశారన్నారు. ‘‘అధిష్టానం చెప్పిన విధంగానే సోము వీర్రాజు నడుస్తున్నారు. ఆయన వ్యక్తిగతంగా ఏ నిర్ణయాలు తీసుకోలేదు. ఎంపీగా నా బాధ్యతకు లోబడే నేను పని చేశా’’ అని జీవీఎల్ పేర్కొన్నారు. కాగా, బీజేపీ సీనియర్ నేత, ఆ పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ బీజేపీకి గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. మీడియా సమావేశంలో తన రాజీనామాను ప్రకటించిన కన్నా.. సోము వీర్రాజుపై విమర్శలు గుప్పించారు. రాష్ట్ర బీజేపీలో పరిణామాలు కలచివేస్తున్నాయని, సోము వీర్రాజు అధ్యక్షుడైన తర్వాత పార్టీ పరిస్థితులు మారాయని ఫైర్ అయ్యారు. పార్టీలో కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని విమర్శలు గుప్పించారు. సోము వీర్రాజు వైఖరితోనే పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు కన్నా తెలిపారు. జీవీఎల్పై కూడా లక్ష్మీనారాయణ పరోక్ష విమర్శలు చేశారు. ఓవర్ నైట్ నేత కావాలని కొందరు ప్రయత్నిస్తున్నారంటూ దుయ్యబట్టారు. చదవండి: టీడీపీలో కల్లోలం.. కొనసాగుతున్న రాజీనామాల పర్వం -
మోదీ నాయకత్వంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్: జీవీఎల్
డాబాగార్డెన్స్/అల్లిపురం (విశాఖ దక్షిణ): ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలో భారతదేశం 2029–30 నాటికి ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని రాజ్యసభ సభ్యుడు, ఫైనాన్స్ స్టాండింగ్ కమిటీ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అన్నారు. కేంద్ర బడ్జెట్పై ఆదివారం నగరంలోని ఓ హోటల్లో నిర్వహించిన మేధావుల సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. కేంద్ర బడ్జెట్ అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసేలా ఉందన్నారు. ప్రపంచంలో 9వ పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్... మోదీ ప్రభుత్వం వచ్చాక ఐదో స్థానానికి ఎదిగిందన్నారు. ఈ బడ్జెట్లో రాష్ట్రాలకు రూ.3.8 లక్షల కోట్లు కేటాయించారని తెలిపారు. ఏపీకి కేంద్రం రూ.7 వేల కోట్ల నిధులు కేటాయించారని చెప్పారు. బీజేపీ నాయకులు విష్ణుకుమార్రాజు, లంకా దినకర్, మేడపాటి రవీంద్ర తదితరులు పాల్గొన్నారు. లోకేశ్ పాదయాత్రకు స్పందన లేదు టీడీపీ నాయకుడు లోకేశ్ పాదయాత్రకు ప్రజల నుంచి పెద్దగా స్పందన లేదని జీవీఎల్ నరసింహారావు అన్నారు. నాయకత్వం అనేది స్వయంగా ప్రకాశించాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర సచివాలయం అమరావతిలోనే ఉంటుందని, సీఎం క్యాంపు ఆఫీస్ రాష్ట్రంలో ఎక్కడైనా ఏర్పాటు చేసుకోవచ్చని, దానిపై ఎవరికీ అభ్యంతరం ఉండకపోవచ్చన్నారు. రాజధానిగా విశాఖను ముందుగానే నిర్ణయించి ఉంటే ఇంకా బాగుండేదని జీవీఎల్ అభిప్రాయపడ్డారు. -
ఆంధ్రా ప్రజలకు కేసీఆర్ క్షమాపణ చెప్పాలి: జీవీఎల్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్కు చెందిన పలువురు నేతలను బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్న క్రమంలో తెలంగాణ సీఎం కేసీఆర్పై బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ పార్టీలు ఏపీకి అవసరం లేదని స్పష్టం చేశారు. ఇక్కడి ప్రజలు కేసీఆర్ను ఎందుకు సమర్థించాలని ప్రశ్నించారు. ఆంధ్రా ప్రజలకు సీఎం కేసీఆర్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ‘తెలంగాణ పార్టీలు ఏపీకి అవసరం లేదు. తెలంగాణ ప్రజలే బీఆర్ఎస్ను ఛీ కొడుతున్నారు. ఏపీ ప్రజలు కేసీఆర్ను ఎందుకు సమర్థించాలి? ఏపీ ప్రజలను తిట్టినందుకు కేసీఆర్ను సమర్థించాలా? ఆంధ్రా వాళ్లను తరిమి తరిమి కొడతామన్నందుకు సమర్థించాలా? కోవిడ్ సమయంలో ఏపీ ప్రజలు వైద్యం కోసం వస్తే బోర్డర్లో అడ్డుకున్నావ్. ఆంధ్రాకు రావాల్సిన నీటిని సముద్రం పాలు చేస్తున్నావ్. పోలవరం ఎత్తు తగ్గించాలంటూ సుప్రీంను ఎందుకు ఆశ్రయించారు? రాష్ట్రాన్ని ఎడారిలా మార్చాలనుకున్న కేసీఆర్ ఏపీలో ఎలా రాజకీయం చేస్తారు? ఏపీకి రావాల్సిన నిధులను ఇంతవరకు రాకుండా చేశావ్. ఆంధ్రా ప్రజలకు కేసీఆర్ క్షమాపణ చెప్పాలి’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరహింహారావు. ఇదీ చదవండి: కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లోకి చేరికలు -
AP: జీవీఎల్కు మంత్రి అమర్నాథ్ చురకలు
సాక్షి, తాడేపల్లి: బీజేపీ నేత, రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావుకు, ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చురకలటించారు. విభజన హామీలపై అసలు జీవీఎల్కు అవగాహన ఉందా? అని నిలదీశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘విభజన హామీలపై జీవీఎల్ చర్చకు రావాలి. స్టీల్ ప్లాంట్కి బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తుందో ఆయన సమాధానం చెప్పాలి’’ అని నిలదీశారు. జీవీఎల్ తెగిన గాలిపటం లాంటి వ్యక్తి. ఏ పార్టీలో ఉంటారో కూడా తెలియని వ్యక్తి జీవీఎల్ అని గుడివాడ అమర్నాథ్ ఎద్దేవా చేశారు. -
అధికారం కోసం ఏపీ.. వ్యామోహం కోసం హైదరాబాద్: జీవీఎల్
-
చంద్రబాబుపై బీజేపీ ఎంపీ జీవీఎల్ ఘాటు వ్యాఖ్యలు
సాక్షి, అమరావతి: ‘హైదరాబాద్కు అది తెచ్చాం, ఇది తెచ్చామని గొప్పులు చెప్పుకోవడం కాదు.. మీరు ఐదేళ్లపాటు ముఖ్యమంత్రిగా ఉండి ఆంధ్రకు ఏం తెచ్చారో చెప్పండి.. కేంద్రం ఇచ్చిన సంస్థలు కాకుండా మీరేమి తెచ్చారో చెప్పండి’ అంటూ టీడీపీ అధినేత చంద్రబాబును బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు సూటిగా ప్రశ్నించారు. పార్టీ సహచరులతో కలిసి శనివారం విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్ను అద్భుతంగా అభివృద్ధి చేశానని చెప్పుకునే చంద్రబాబు ఆంధ్రప్రదేశ్కు ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉండి రాష్ట్రంలో ఐటీ అభివృద్ధికి ఆయన ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. ‘అధికారం పోగానే చంద్రబాబు హైదరాబాద్ ఎందుకు వెళ్లిపోయారు. ఏపీ అభివృద్ధిపట్ల శ్రద్ధలేదా.. అధికారం కావాలంటే ఆంధ్రా జనాన్ని వాడుకోవాలి.. అది అయిపోయాక హైదరాబాద్లో మీ ఆస్తులను పెంపొందించుకోవాలి. ఇదేనా మీ ఆలోచన. మీకు మీ ప్రాంతంపట్ల చిత్తశుద్ధిలేదు. హైదరాబాద్లో సొంత ఆస్తులు ఉన్నాయనే, సొంత వ్యాపారాలు ఉన్నాయనే, బలగం ఉందనో మీరు అక్కడే తిష్ట వేసుకుని కూర్చుంటున్నారు. మీకు హైదరాబాద్కు ఏం సంబంధం.. మీరు తెలంగాణలో రాజకీయాలు చేసుకోండి..’ అంటూ జీవీఎల్ ఘాటుగా వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఐటీ అభివృద్ధికి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఏం చర్యలు చేపడుతున్నారో చెప్పాలని, ఐటీ ఉద్యోగులందరూ వర్క్ ఫ్రం హోం చేస్తున్న ఈ తరుణంలో ఐటీ కంపెనీలకు రాయితీలిస్తే, వాటి కార్యాలయాలను ఇక్కడ ఏర్పాటుచేసే అవకాశముంటుందని జీవిఎల్ సూచించారు. చదవండి: (ఘనంగా కొండా విశ్వజిత్, రిషికల వివాహ రిసెప్షన్) -
గుజరాత్ లో దుమ్ము రేపుతున్న బీజేపీ
-
రాష్ట్రానికి చంద్రబాబు వల్లే శని పట్టింది: బీజేపీ ఎంపీ
సాక్షి, ప్రకాశం: టీడీపీ అధినేత చంద్రబాబుపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి చంద్రబాబు వల్లే శని పట్టిందని ఆసక్తికర కామెంట్స్ చేశారు. కాగా, ఎంపీ జీవీఎల్ శనివారం మీడియాతో మాట్లాడుతూ.. గత టీడీపీ హయంలో ఒక్క ప్రాజెక్ట్ అయినా పూర్తి చేశారా? అని ప్రశ్నించారు. పోలవరం నిర్మాణంలో గత ముఖ్యమంత్రి, ఇరిగేషన్ మంత్రిపై అనేక ఆరోపణలు ఉన్నాయి. రాష్ట్రానికి చంద్రబాబు వల్లే శని పట్టింది అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అంతకుముందు కూడా జీవీఎల్ నరసింహరావు.. చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. చంద్రబాబు వల్లే పోలవరం ఆలస్యమైందన్నారు. చంద్రబాబు మళ్లీ అధికారంలోకి వస్తే పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేస్తాననడం హాస్యాస్పదమన్నారు. టీడీపీ మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదన్నారు. చంద్రబాబు.. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి ఏ ఒక్క ప్రాజెక్ట్ నిర్మాణం చేశారో చెప్పాలన్నారు. -
చంద్రబాబుపై బీజేపీ ఎంపీ జీవీఎల్ షాకింగ్ కామెంట్స్
సాక్షి, విశాఖపట్నం: పోలవరం నిర్మిస్తామని కేంద్రం చెబితే.. మేమే నిర్మిస్తామని చంద్రబాబు తీసుకున్నారని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, పోలవరం ఆలస్యానికి చంద్రబాబే కారణమన్నారు. పోలవరం పేరుతో టీడీపీ నేతలు కమీషన్లు దండుకున్నారని దుయ్యబట్టారు. పోలవరంలో కమీషన్ల పేరుతో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందన్నారు. గతంలో ప్రధాని నరేంద్ర మోదీనే స్వయంగా పోలవరంలో అవినీతి జరిగిందని మాట్లాడిన విషయాన్ని జీవీఎల్ మరోసారి ప్రస్తావించారు. మళ్లీ చంద్రబాబు వస్తే పోలవరం పూర్తి చేస్తానంటూ మాట్లాడుతున్నారని, 14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు ఉత్తరాంధ్రలో సాగునీటి ప్రాజెక్టులు ఎందుకు నిర్మించలేదో సమాధానం చెప్పాలన్నారు. చంద్రబాబు తాను పుట్టిన రాయలసీమకు, సొంత జిల్లా చిత్తూరుకు ఎటువంటి మేలు చేయలేదన్న జీవీఎల్.. చంద్రబాబు మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదని తేల్చిచెప్పారు. రాయలసీమలో సాగునీటి ప్రాజెక్టులు చంద్రబాబు పాలనలో నిర్లక్ష్యం చేయబడ్డాయని జీవీఎల్ తెలిపారు. పోలవరంలో జరిగిన అవినీతిపై రాష్ట్ర ప్రభుత్వం విచారణ జరపాలని కోరారు జీవీఎల్. చంద్రబాబు ఓవరాక్షన్ కాగా, ఏలూరు జిల్లాలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఓవరాక్షన్ చేసిన సంగతి తెలిసిందే. రోడ్డుపై బైఠాయించి తననే అడ్డుకుంటారా అంటూ కొత్త డ్రామాకు తెరతీశారు. జిల్లా పర్యటనలో భాగంగా చంద్రబాబుకు అడుగడుగునా నిరసన సెగ తగలడంతో కొత్త నాటకాన్ని ప్లే చేయబోయారు. పోలవరాన్ని పరిశీలిస్తానంటూ బాబు హడావిడి చేశారు. పోలవరానికి వెళ్లేదారిలో బైఠాయించి పబ్లిసిటీ స్టంట్కు తెరలేపారు చంద్రబాబు.యాత్రలో అడుగడుగునా నిరసన సెగలు తగలడం వల్లే కొత్త నాటకాన్ని రక్తికట్టించే యత్నం చేశారు చంద్రబాబు. చదవండి: బాబోయ్.. ఇదేం ఖర్మరా!.. బాబు డొల్ల మాటలు.. ఇవీ వాస్తవాలు -
ఇతర పార్టీల పొత్తుకోసం పాకులాట.. మరి ఈ బిల్డప్ ఏంటి బాబు?
అమరావతి: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబును శ్రీరాముడితో పోలుస్తూ టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలను జీవీఎల్ ఖండించారు. ఈ క్రమంలోనే హిందువుల మనోభావాలను దెబ్బతీస్తే సహించేది లేదని హెచ్చరించారు.ఇతర పార్టీల పొత్తు కోసం పరితపిస్తూ ఈ బిల్డప్ ఏంటి? అని నిలదీశారు.చంద్రబాబు ఆరాటం లోక కళ్యాణం కోసం కాదని, లోకేష్ కళ్యాణార్థం అని అందరికీ తెలుసని ఎంపీ జీవీఎల్ ట్వీట్ చేశారు. భగవంతుడయిన శ్రీరాముడితో తమ నాయకుడు @ncbnతో పోలుస్తూ అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నాను. హిందువుల మనోభావాలను దెబ్బతీస్తే సహించేది లేదు. ఇతరపార్టీల పొత్తు కోసం పరితపిస్తూ ఈ బిల్డప్ ఏంటి? మీ నాయకుడి ఆరాటం "లోక"కళ్యాణం కోసం కాదు. "లోకేష్"కళ్యాణార్థం అని అందరికీ తెలుసు. — GVL Narasimha Rao (@GVLNRAO) November 20, 2022 -
మళ్లీ పాత కుంపటిలో పడాలనుకోవడం లేదు: టీడీపీపై జీవీఎల్ కామెంట్స్
సాక్షి, విజయవాడ: టీడీపీ పార్టీపై బీజేపీ రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాగా, జీవీఎల్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీలో అభ్రతభావం స్పష్టంగా కనిపిస్తోంది. తమ సొంత ప్రయోజనాల కోసమే రక్షించమని టీడీపీ కోరుతోంది. అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ నేతలు ప్రజలను పట్టించుకున్న పాపనపోలేదు. ఏపీలో నిజమైన ప్రతిపక్ష పాత్ర మేమే పోషించబోతున్నాము. ఏపీలో బీజేపీలో చేరిన టీడీపీ నేతలు సైతం.. టీడీపీకి భవిష్యత్తు లేదు. ఆ పార్టీ నాయకత్వం పూర్తిగా క్షీణించింది అంటున్నారు. ఎన్నికల్లో టీడీపీని కేవలం 23 స్థానాలకే పరిమితం చేశారంటే వారిపై ఎంత స్థాయిలో అసంతృప్తి ఉందో తెలుసుకోవచ్చు. ఏపీ ప్రజలు మళ్లీ పాత కుంపటిలోనే పడాలని కోరుకోవడం లేదంటూ వ్యాఖ్యలు చేశారు. -
అంధకారంలో టీడీపీ భవిష్యత్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో టీడీపీ రాజకీయ భవిష్యత్తు అంధకారంలో ఉందని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. అందుకే చంద్రబాబు అభద్రతా భావంతో మాట్లాడుతున్నారని చెప్పారు. గురువారం ఆయన విజయవాడలో విలేకరులతో మాట్లాడారు. జనసేన, బీజేపీతోనే కొనసాగుతుందని క్లారిటీ రావడంతో చంద్రబాబు నిరాశ, భయంతో వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. ‘తాను తప్ప వేరే ప్రత్యామ్నాయం లేకుండా చేస్తే, తన సినిమానే ఆడుతుందని చంద్రబాబు భావించాడు. ఇతరులు రంగంలో లేకుండా టీడీపీతో కలుపుకోవాలని ఆలోచించాడు. అది ఫలించ లేదు. అలా వైఎస్సార్సీపీని ఎదుర్కొనేందుకు వేసిన పాచిక పారలేదు. కచ్చితంగా భవిష్యత్తులో వైఎస్సార్సీపీకి ప్రత్యామ్నాయంగా బీజేపీ–జనసేన ఎదుగుతుంది’ అని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ బీజేపీతోనే కలిసి పోటీ చేయాలని తమ పార్టీ ఢిల్లీ పెద్దలు చెప్పారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తెలిపారు. ‘జనసేన బీజేపీతోనే కలిసి పోటీ చేస్తుంది. పవన్ కళ్యాణ్ మాతోనే ఉంటారు. ఉండాలి. కుటుంబ పార్టీ టీడీపీతో కలవొద్దని కేంద్ర పార్టీ నుంచి పవన్కు స్పష్టంగా ఆదేశాలు అందాయి. టీడీపీతో కలిసేది లేదని పవన్ కళ్యాణ్కు ఢిల్లీ పెద్దలు చెప్పారు. కుటుంబ రాజకీయాలకు మేం వ్యతిరేకం. పవన్ కళ్యాణ్ మాతోనే ఉండేలా ఒప్పిస్తాం. 2024 ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తాం’ అని స్పష్టం చేశారు. -
ప్రధానితో పవన్ భేటీపై జీవీఎల్ ఏం చెప్పారంటే..!
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన రాష్ట్ర అభివృద్ధి కోసమేనని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు తెలిపారు. పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ రూ.15వేల కోట్లతో రాష్ట్రంలో మౌలిక వసతుల కల్పనకు శ్రీకారం చుడుతున్నారని చెప్పారు. మోదీ విశాఖ పర్యటనలో ఎలాంటి రాజకీయ అంశాలు లేవని స్పష్టం చేశారు. పవన్ కల్యాణ్ బీజేపీతో మిత్రపక్షం అయినందునే ప్రధాని మోదీ మర్యాదపూర్వకంగా భేటీ అవుతున్నారని జీవీఎల్ నరసింహారావు తెలిపారు. చదవండి: (బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ను కలిసిన చికోటి ప్రవీణ్) -
విశాఖ రైల్వే జోన్ తధ్యం.. దుష్ప్రచారాన్ని నమ్మొద్దు
సాక్షి, విశాఖపట్నం: విశాఖ రైల్వే జోన్ విషయంలో వస్తున్న పుకార్లను, దుష్ప్రచారాన్ని నమ్మొద్దని చెప్తున్నారు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు. విశాఖ రైల్వే జోన్ రావడం లేదంటూ కొన్ని పత్రికల్లో వచ్చిన వార్తలను ఆయన ఖండించారు. ‘‘విశాఖ రైల్వే జోన్ రావడం తధ్యం. అందుకు అనుగుణంగా అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. కేంద్రం చర్యలు ఇప్పటికే ప్రారంభించింది.. రైల్వేజోన్కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. గత పార్లమెంటు సమావేశాల్లో నేను అడిగిన ప్రశ్నకు కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ సమాధానం కూడా ఇచ్చింది. ఈరోజు ఉదయం కూడా కేంద్ర రైల్వే బోర్డు ఛైర్మన్ వి కె త్రిపాఠీ మాట్లాడాను. కొన్ని పత్రికలు తప్పుడు వార్తలు రాస్తున్నాయి’’ అని జీవీఎల్ పేర్కొన్నారు. రైల్వే జోన్ ప్రక్రియ యధాతధంగా కొనసాగుతున్నదన్న ఎంపీ జీవీఎల్.. విశాఖ రైల్వే జోన్ పై వచ్చే ఎలాంటి పుకార్లను నమ్మొద్దంటూ ప్రజలకు మరోసారి విజ్ఞప్తి చేశారు. -
రైల్వే జోన్ విషయంలో తప్పుడు రాతలు రాస్తున్నారు : ఎంపీ జీవీఎల్
-
బీజేపీతో పొత్తు లేకపోతే.. కొన్ని పార్టీలకు భవిష్యత్తే లేదు: జీవీఎల్
సాక్షి, అమరావతి: బీజేపీతో పొత్తు లేకుంటే తమకు భవిష్యత్తు లేదని రాష్ట్రంలో కొన్ని రాజకీయ పార్టీలు భావిస్తున్నాయని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు పేర్కొన్నారు. విజయవాడలో సోమవారం బీజేపీ పదాధికారుల సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పొత్తుల విషయంలో మీడియాకు, కొన్ని పార్టీలకు గందరగోళం ఉందేమో గానీ తాము మాత్రం స్పష్టమైన విధానంతో సొంతంగా ఎదిగేలా ముందుకు వెళ్తామని చెప్పారు. ప్రధాని మోదీ పుట్టిన రోజు సందర్భంగా సెప్టెంబరు 17 నుంచి అక్టోబరు 2 మధ్య రాష్ట్ర వ్యాప్తంగా సభలు నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఫిబ్రవరిలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ పోటీ చేస్తుందని ప్రకటించారు. పోలవరం ప్రాజెక్టుపై మాట్లాడేవారు నిజాలు తెలుసుకోవాలని, నోటికి వచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. ‘వారసత్వ’ పార్టీలతో చేతులు కలపం రాష్ట్రంలో కుటుంబ వారసత్వం ఉండే రాజకీయ పార్టీలతో బీజేపీ కలిసే ప్రసక్తే లేదని పరోక్షంగా తెలుగుదేశం పార్టీని ఉద్దేశించి ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి, జాతీయ కార్యదర్శి సునీల్ దేవధర్ అన్నారు. సోమవారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో జనసేనతో మాత్రమే తమకు పొత్తు ఉందని చెప్పారు. టీడీపీ, వైఎస్సార్సీపీలకు సమానదూరం పాటిస్తున్నామన్నారు. -
అమిత్ షా, జూనియర్ ఎన్టీఆర్ భేటీపై క్లారిటీ ఇచ్చిన జీవీఎల్
సాక్షి, విశాఖపట్నం: కేంద్ర హోంమంత్రి అమిత్ షా, సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్తో కలిసి ఈ మధ్య హైదరాబాద్లోని నోవాటెల్లో లంచ్ చేశారు. అమిత్ షా బిజీ షెడ్యూల్ మధ్య జూనియర్ ఎన్టీఆర్తో భేటీ కావడంపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఈ భేటీపై తాజాగా బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు స్పందించారు. వారిద్దరి మధ్య జరిగిన భేటీలో కేవలం సినిమా అంశాలు మాత్రమే ప్రస్తావనకు వచ్చాయని తాను భావించడం లేదన్నారు. రాజకీయ అంశాలు కూడా వారి మధ్య ప్రస్తావనకు వచ్చే ఉంటాయన్నారు. వాస్తవంగా వారిద్దరి మధ్య ఏం జరిగింది అనేది వారివురిలో ఎవరో ఒకరు బయటకు చెప్తేనే తెలుస్తుందని జీవీఎల్ అన్నారు. చదవండి: (అమిత్ షా వారిద్దర్నీ కలవడమే హాట్ టాపిక్!) -
ఏపీ, తెలంగాణ అసెంబ్లీ సీట్ల పెంపుపై కేంద్రం క్లారిటీ
-
అసెంబ్లీ సీట్ల పెంపు కోసం ఆగాల్సిందే!: కేంద్రం
సాక్షి, న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాలు అసెంబ్లీ సీట్ల పెంపుపై కేంద్రం మరోసారి స్పష్టత ఇచ్చింది. 2026 వరకు వేచి చూడాల్సిందేనని కేంద్రం స్పష్టం చేసింది. ఈ మేరకు బీజేపీ ఎంపీ జీవీఎల్ అడిగిన ప్రశ్నకు బుధవారం సమాధానం ఇచ్చింది. ఏపీ, తెలంగాణ అసెంబ్లీ సీట్ల పెంపుపై కేంద్రం బుధవారం పార్లమెంట్లో సమాధానం ఇచ్చింది. అసెంబ్లీ స్థానాలు పెరగాలంటే.. రాజ్యాంగ సవరణ అవసరం. అంతవరకు సీట్ల సంఖ్యను పెంచలేమని కేంద్రం స్పష్టం చేసింది. విభజన చట్టంలోని సెక్షన్ 15కు లోబడి.. ఏపీలో 225, తెలంగాణలో 153 స్థానాలకు పెరుగుతాయని కేంద్రమంత్రి నిత్యానందరాయ్ సమాధానం ఇచ్చారు. ఏపీ, తెలంగాణ అసెంబ్లీ సీట్ల పెంపు జరగాలంటే 2026 జనాభా లెక్కల వరకు వేచి ఉండాలని కేంద్రం తెలిపింది. బీజేపీ ఎంపీ జీవీఎల్ ప్రశ్నకు కేంద్రం లిఖితపూర్వక సమాధానం ఇచ్చింది. కిందటి ఏడాది ఎంపీ రేవంత్ రెడ్డి సైతం ఇదే ప్రశ్నకు అడగ్గా.. ఇదే మంత్రి.. ఇదే సమాధానం ఇచ్చారు. చదవండి: 12వేల అడుగుల ఎత్తులో త్రివర్ణ పతాకం రెపరెపలు -
ఈజ్ ఆఫ్ సెల్లింగ్లో బీజేపీ టాప్
సాక్షి, విశాఖపట్నం: సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ (ఈవోడీబీ)లో ఏపీని మొదటి స్థానంలో నిలిపితే.. దేశంలోనే ప్రముఖ కర్మాగారాలను అమ్మకానికి పెడుతూ ఈజ్ ఆఫ్ సెల్లింగ్లో బీజేపీ నంబర్వన్గా ఉందని రాష్ట్ర పరి శ్రమలశాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ చెప్పారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఏపీ టాప్ ర్యాంక్పై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు చేసిన విమర్శలపై మంత్రి ఘాటుగా స్పందించారు. శుక్రవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడు తూ పారిశ్రామికవేత్తల అభిప్రాయాలు సేకరించి ఈ ర్యాంకులని ప్రకటిస్తే.. దాన్నికూడా తప్పుపట్టి జీవీఎల్ సెల్ఫ్గోల్ వేసుకున్నారన్నారు. ర్యాంకు ఇచ్చిందీ మీరే, విమర్శించేదీ మీరే అని అన్నారు. పారిశ్రామికరంగంలో కీలక మార్పులు తీసుకొస్తు న్న సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేయడం వారి విజ్ఞతకే వదిలి పెడుతున్నామన్నారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు 60 పరిశ్రమలను అమ్మించింది మీరు కాదా అని ప్రశ్నించారు. రాష్ట్రా నికి వేలకోట్ల పెట్టుబడులను తీసుకొస్తున్న సీఎం జగన్ గురించి మాట్లాడే అర్హత వారికి లేదన్నారు. స్టీల్ప్లాంట్ను మీ ప్రభుత్వం అమ్మాలని చూస్తుంటే ఎందుకు నోరు మెదపడంలేదని ప్రశ్నించారు. 2019 తరువాత రాష్ట్రంలో జరిగిన అన్ని ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఘన విజయం సాధించిందని, బీజేపీకీ ఎక్కడా డిపాజిట్లు కూడా రాలేదని మంత్రి చెప్పారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ 175 స్థానాల్లో పోటీచేసీ మళ్లీ డిపాజిట్లు పోగొట్టుకోవాలన్న సరదా ఉంటే అందుకు సిద్ధం కావాలని అన్నారు. -
ఆత్మకూరు ఉప ఎన్నికలో బీజేపీ పోటీ: ఎంపీ జీవీఎల్
నెల్లూరు (బారకాసు): ఆత్మకూరు ఉప ఎన్నికల్లో బీజేపీ పోటీ చేయబోతున్నట్లు ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహరావు చెప్పారు. అభ్యర్థి ఎవరనేది తమ పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుందని తెలిపారు. గురువారం నెల్లూరులో జరిగిన పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో జనసేనతో కలసి పోటీ చేయబోతున్నాం తప్ప మరే పార్టీతోనూ పొత్తుపెట్టుకోబోమన్నారు. టీడీపీతో బీజేపీ పొత్తు ఉంటుందని చంద్రబాబు డ్రామాలాడుతున్నారని విమర్శించారు. ఇప్పటికే చంద్రబాబు బీజేపీ అధినాయకులతో మాట్లాడామని అబద్ధాలు చెబుతూ ప్రజల్ని మోసం చేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికలకు సమాయత్తం కావాలి: సోము వీర్రాజు ఏపీలో 2024లో జరగనున్న ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పార్టీ శ్రేణులకు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు పిలుపునిచ్చారు. గురువారం నెల్లూరులో నిర్వహించిన పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ప్రధాని మోదీ చేస్తోన్న పరిపాలన, ఆంధ్ర రాష్ట్రానికి చేస్తున్న సహాయ, సహకారాలను ప్రజలకు తెలియజేయాలని నేతలకు సూచించారు. ఈ సందర్భంగా బ్రాహ్మణక్రాకకు చెందిన బిజవేముల రవీంధ్రనాథ్రెడ్డి బీజేపీలో చేరారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు వాకాటి నారాయణరెడ్డి, మాధవ్, పార్టీ జాతీయ కార్యదర్శి సునీల్ దేవ్ధర్ తదితరులు పాల్గొన్నారు. -
ఏపీ బీజేపీ నేతలు అభివృద్ధికి అడ్డుపడుతున్నారు: మంత్రి వెల్లంపల్లి
-
ఇలాంటి సమయంలో కూడా టీడీపీ దిగజారుడు రాజకీయాలు మానట్లేదు: ఎమ్మెల్యే పార్థసారధి
-
‘జీవీఎల్ ఏపీ ప్రత్యేక హోదాను అడ్డుకుంటున్నారు’
సాక్షి, తూర్పుగోదావరి: కేంద్ర హోంశాఖ అజెండా నుంచి ఏపీ ప్రత్యేక హోదాను తొలగించడానికి కారణం బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు కారణమని రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ ధ్వజమెత్తారు. తెలుగువారై ఉండి ప్రత్యేక హోదాను జీవీఎల్ అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. ఈనెల 17న కేంద్ర హోంశాఖ సమావేశంలో తొలగించిన ప్రత్యేకహోదా అంశాన్ని చేర్చాలని మార్గాని భరత్ డిమాండ్ చేశారు. ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వాలని తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా చెప్పారని ఆయన గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్కు జరుగుతున్న అన్యాయంపై 22 మంది వైఎస్సార్సీపీ ఎంపీలు అనేకసార్లు పార్లమెంటులో మాట్లాడామని, ఎంపీ మాట్లాడటం వల్లే ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఆంధ్రాకు అన్యాయం జరిగిందని రాజ్యసభలో అన్నారని మార్గాని భరత్ ప్రస్తావించారు. ‘కోడలు మగబిడ్డను కంటానంటే అత్తగారు వద్దంటుందా అంటూ చంద్రబాబు మహిళల్ని అవహేళన చేశారు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం 2,100 కోట్లు రీయింబర్స్మెంట్ చెయ్యాల్సి ఉంది. ఏపీలో కొత్త జాతీయ రహదార్లు వేస్తున్నందుకు కేంద్రానికి ఎంపీ మార్గాని భరత్ కృతజ్ఞతలు తెలిపారు. -
అది ముగిసింది
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం)/ఆల్కాట్తోట(రాజమహేంద్రవరం రూరల్)/పాలకొల్లు సెంట్రల్: ప్రత్యేక హోదా అనేది ఇక ముగిసిన అధ్యాయమని, దానికి మించి దేశంలో ఏ రాష్ట్రానికీ ఇవ్వనన్ని నిధులు, ఇతర ప్రయోజనాలు ఆంధ్రప్రదేశ్కు కల్పిస్తున్నామని రాజ్యసభ సభ్యుడు, బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఏడేళ్లుగా రూ.లక్షల కోట్లు రాష్ట్రానికి అందజేస్తుంటే.. గత టీడీపీ, ప్రస్తుత వైఎస్సార్సీపీ ప్రభుత్వాలు వాటితో చేపట్టిన అభివృద్ధి పనులకు తమ పేర్లు, స్టిక్కర్లు అంటించుకుని తమవిగా ప్రచారం చేసుకుంటున్నాయని విమర్శించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని బీజేపీ కార్యాలయంలో కేంద్ర బడ్టెట్పై మేధావులతో ఆదివారం నిర్వహించిన చర్చా వేదికలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర విభజన సమస్యలపై కేంద్రం ఏర్పాటుచేసిన త్రిసభ్య కమిటీ అజెండాలో ప్రత్యేక హోదా అంశం పొరపాటున చేరిందని, ఆ అంశం అనవసరమైందని తర్వాత గుర్తించడంతో దానిని తొలగించాల్సి వచ్చిందని జీవీఎల్ చెప్పారు. ఈ అంశమే ప్రధానమైనది కదా అని ‘సాక్షి’ అడిగిన ప్రశ్నకు జీవీఎల్ స్పందిస్తూ.. ఏపీకి ప్రధానం కావచ్చునేమోగానీ, తెలంగాణకు అప్రధానమైనది కదా అని బదులిచ్చారు. సాక్షాత్తూ ప్రధానే రాష్ట్ర విభజనలో ఏపీకి అన్యాయం జరిగిందని, అనైతికంగా విభజన చేశారని అన్నప్పుడు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడంలో అభ్యంతరమేంటని విలేకరులు ప్రశ్నించగా.. ఇక ప్రత్యేక హోదా అనే అంశం లేనట్లేనన్నారు. రెండు రాష్ట్రాల మధ్య విద్యుత్ వినియోగ సమస్యలు, పన్నుల్లో వ్యత్యాసాలు, బ్యాంకుల్లో నగదు నిల్వలు, డిపాజిట్ల విభజన, పౌర సరఫరా సంస్థల మధ్య క్యాష్ క్రెడిట్, వనరుల అంతరం తదితర అంశాలపై ఆ త్రిసభ్య కమిటీ ప్రధానంగా చర్చిస్తుందని వివరించారు. రాష్ట్రం చేతుల్లోనే ‘కాపు రిజర్వేషన్’ అంతకుముందు.. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో మాజీ ఎంపీ చేగొండి హరిరామ జోగయ్యను జీవిఎల్ కలుసుకుని కాపు రిజర్వేషన్లపై ఆయనతో చర్చించారు. ఆ తర్వాత సాయంత్రం రాజమహేంద్రవరం ఏకేసీ కళాశాల రోటరీ రివర్ సిటీ హాలులో బీజేపీ రాష్ట్ర మేధావుల సెల్ కన్వీనర్ వడ్డి మల్లికార్జునరావు అధ్యక్షతన రాష్ట్ర కాపు కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బ్రిటీష్ కాలంనాటి కాపు రిజర్వేషన్ సమస్య పరిష్కారం రాష్ట్ర ప్రభుత్వాల చేతుల్లోనే ఉందన్నారు. ఈ సమస్యను కేంద్రం పరిధిలోకి నెట్టేసి రాష్ట్ర ప్రభుత్వాలు సమస్యను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం తనంతట తానుగా దీనిపై చర్య తీసుకోవచ్చన్నారు. కాపులకు ఓబీసీ రిజర్వేషన్లను వెంటనే అమలుచేయాలని జీవిఎల్ డిమాండ్ చేశారు. నాడు కాపులను చంద్రబాబు మోసం చేశారని, నేడు వైఎస్సార్సీపీ కూడా కాపులకు ఎలాంటి న్యాయం చేయలేదని ఆయన విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 15లోపు కాపు రిజర్వేషన్లను అమలుచేయాలని, లేదంటే ప్రజాగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించారు. కాపు రిజర్వేషన్ల అంశంపై తాను ఆరు నెలల నుంచి అధ్యయనం చేశానని చెప్పారు. న్యాయపరమైన చిక్కులు వచ్చినా రిజర్వేషన్లు అమలు చేయడంలో ఇబ్బందిలేదని, ఇందుకు తన వంతు సహకారం అందిస్తానని జీవీఎల్ చెప్పారు. -
అజెండాలోంచి హోదాను తీయిస్తే కానీ జీవీఎల్కు నిద్రపట్టలేదా: పేర్ని నాని
సాక్షి, విజయవాడ: విభజన చట్టంలోని సమస్యలపై న్యాయం చేయాలని అనేకసార్లు ప్రధానిని కలిసి సీఎం జగన్ కోరారు. కేంద్ర హోంశాఖ కమిటీ అజెండాలో మొదట ప్రత్యేక హోదాను చేర్చారు. అప్పుడు చంద్రబాబు, బీజేపీ నేతలు ఎందుకు మాట్లాడలేదు అంటూ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. ఈ మేరకు విజయవాడలో ఆయన మాట్లాడుతూ.. గోతికాడ నక్కల్లా చంద్రబాబు, బీజేపీ నేతలు కాచుకుని కూర్చున్నారు. చంద్రబాబు సలహా మేరకే జీవీఎల్ పట్టుబట్టి అజెండాలోంచి ప్రత్యేక హోదా అంశాన్ని తప్పించేశారు. ప్రత్యేక హోదాకు జీవం పోస్తే ఏపీలో బీజేపీ ఇంకా చచ్చిపోతుందనేదే జీవీఎల్ ఆలోచన. రాష్ట్రానికి మేలు జరగకుండా ఉండేందుకు జీవీఎల్ మంచి పాత్రే పోషిస్తున్నారు. చంద్రబాబు డైరెక్షన్లో జీవీఎల్ బాగా పనిచేస్తున్నారు. అజెండాలోంచి తీసేసిన తర్వాత దెయ్యాల్లా వేదాలు వల్లిస్తున్నారు. చదవండి: (రాజధాని రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం.. కేంద్రం అదే చెప్పింది: మంత్రి బొత్స) చంద్రబాబు, జీవీఎల్, సోమువీర్రాజుని ప్రశ్నిస్తున్నా. పదేళ్లు ప్రత్యేకహోదా ఇస్తామని 2014 మ్యానిఫెస్టోలో పెట్టారా లేదా చెప్పాలి. ఏపీ ప్రజలను వాగ్ధానాలతో మోసం చేశారా లేదా. ప్రత్యేక హోదాపై అప్పుడు ఇచ్చిన మాటను నిలబెడతారా.. చేతులెత్తేశారా. బీజేపీ పిల్లిమొగ్గలు వేసే పరిస్థితుల్లో ఉందా. దేశంలో కొన్ని రాష్ట్రాలు ప్రత్యేక హోదా ఫలాలు అనుభవిస్తున్నాయా లేదా. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం బీజేపీకి ఇష్టమా, లేదా..?. ఏపీపై బఠాని గింజంత చిత్తశుద్ధి ఉన్నా బీజేపీ నేతలు మా ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలి. ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టింది మీరా కాదా.. టీడీపీ సమాధానం చెప్పాలి. ప్యాకేజీ పేరుతో టోకుగా అమ్మేసింది మీరా కాదా. ప్రత్యేక హోదాను అజెండా నుంచి తీసేయగానే మాట్లాడుతున్న హీన సంస్కృతి టీడీపీది. హోల్సేల్గా హోదాను అమ్మేసి సాధించిన ప్యాకేజీ వల్ల ఏపీకి ఏం చేశారు. చదవండి: (కొత్త జిల్లాల్లో కార్యాలయాలన్నీ ఒకే చోటు: విజయ్ కుమార్) కేంద్ర హోంశాఖ కమిటీ అజెండాలో ప్రత్యేకహోదా పెట్టడం దేశ ద్రోహమా. ఎందుకు చంద్రబాబు, జీవీఎల్ పట్టుబట్టి అజెండా నుంచి తీయించేశారు. జీవీఎల్ ఎందుకు భయపడ్డాడు. ఏపీకి ఎప్పటికీ ప్రత్యేక హోదా ఇవ్వకూడదనేది బీజేపీ, టీడీపీ స్టాండా.. చెప్పాలి. జీవీఎల్కు ఎందుకంత ఆత్రం. అజెండాలోంచి హోదాను తీయిస్తే కానీ జీవీఎల్కు నిద్రపట్టలేదా. ప్రెస్ మీట్లు పెట్టి తిడుతున్న టీడీపీ నేతలు అజెండా ప్రకటించినపుడు ఏమైపోయారు. అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్, కనకమేడల ఏ కలుగులో దాక్కున్నారు. అజెండా నుంచి హోదాను తీసేయగానే ఎందుకు బయటికొచ్చారు. చంద్రబాబు ఏపీ ప్రజలకు తక్షణమే క్షమాపణ చెప్పాలి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో ఏపీ బాగుపడుతుందంటే జీర్ణించుకోలేకపోతున్నారు. ఈర్ష్య, అసూయలతో నీచరాజకీయాలు మానుకోవాలని టీడీపీ, ఏపీ బీజేపీ నేతలను హెచ్చరిస్తున్నాం' అని మంత్రి పేర్ని నాని అన్నారు. -
కేంద్ర ప్రభుత్వ కమిటీ ఎజెండా ఎందుకు మారింది?: అంబటి రాంబాబు
సాక్షి, అమరావతి: రాష్ట్ర విభజనకు సంబంధించి త్రిసభ్య కమిటీ పరిధిలోకి తీసుకువచ్చిన 9 అంశాలను మార్చాలని వెంటనే బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు చేసిన ప్రకటన ఆయన మనస్తత్వాన్ని సూచిస్తోంది అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. 'ఆంధ్రప్రదేశ్కు అనుకూలంగా కేంద్ర కమిటీ ఒక అంశాన్ని చేరిస్తే జీవీఎల్ ఎందుకంత హడావిడి పడి సుమోటోగా దాన్ని తీసివేయాలని చెప్పారో, ఎందుకు ఆయనకు అంత ఆత్రమో ఆయనే వివరణ ఇవ్వాలి. 9 అంశాల ఎజెండాలో ప్రత్యేక హోదా ఉండడాన్ని జీర్ణించుకోలేని తెలుగుదేశం పార్టీ దీన్ని స్వాగతిస్తున్నాం అన్న ప్రకటన కూడా చేయకపోవడం, చంద్రబాబు మొహం మాడిపోవడం చూస్తే బీజేపీలోని టీడీపీ వర్గం, ప్రత్యేకించి సుజనా చౌదరి, సీఎం రమేష్లు చంద్రబాబు ఆదేశాల మేరకు వెంటనే రంగంలోకి దిగి ఎజెండాను మార్పించారని స్పష్టమవుతుంది. చదవండి: (చంద్రబాబు మీరు చేసింది 420 పని అర్థం కావడం లేదా..?: జోగి రమేష్) అన్నింటికన్నా ముఖ్యంగా ప్రతి ఒక్కరూ గమనించాల్సిన అంశం ఏమిటి అంటే హోం మంత్రిత్వ శాఖ వేసిన కమిటీకి తన ఎజెండా ఏమిటో తనకే తెలియదా? తన అధికారాలు ఏమిటో తమకే తెలియదా? తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అధికారుల మధ్య ప్రత్యేక హోదా, రీసోర్సెస్ గ్యాప్ అన్నవి చర్చనీయ అంశాలు కాకపోయినా ఈ అంశాన్ని త్రిసభ్య కమిటీ నేరుగా ఏపీ అధికారులతో చర్చించవచ్చు కదా. మరి దాన్ని కూడా ఆపాలని ఎందుకు ప్రయత్నించారు?. ఆ కమిటీకి హోం మంత్రిత్వ శాఖకు సంబంధించిన జాయింట్ సెక్రటరీ నేతృత్వం వహిస్తున్నారు. వారికి తమ పరిధిలోకి వచ్చే అంశాలు, రాని అంశాలు ఏవో తెలియదని వెంటనే జీవీఎల్ రంగంలోకి దిగడం, ఆ వెంటనే బహిరంగంగా ప్రకటనలు చేయడం, ఆపైన కేంద్ర ప్రభుత్వ కమిటీ ఎజెండా మారిపోవడం ఈ మధ్యలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడి మౌనం ఇవన్నీ చూస్తుంటే... ఏం జరిగి ఉంటుందో అన్నది రాష్ట్ర ప్రజలంతా ఆలోచించాలి. చంద్రబాబు శకుని పాత్రపై, ఆయన పంపించిన మనుషుల శకుని పాత్రపై, పరిధులు మీరిన జీవీఎల్ ప్రకటనపై కచ్చితంగా చర్చ జరగాలి' అని అంబటి రాంబాబు అన్నారు. -
చంద్రబాబుపై బీజేపీ ఎంపీ జీవీఎల్ ఫైర్
సాక్షి, అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు ఫైర్ అయ్యారు. గతంలో చంద్రబాబు ఏం మాట్లాడారో ఒకసారి గుర్తు చేసుకోవాలని హితవు పలికారు. రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న పరిస్థితులపై కేంద్రం జోక్యం చేసుకోవాలని చంద్రబాబు కోరడంపై జీవియల్ మండిపడ్డారు. కేంద్రానికి రాష్ట్రంలో అడుగుపెట్టే అర్హత లేదని గతంలో చంద్రబాబు అన్నారని గుర్తు చేశారు. గతంలో చేసిన తప్పులను చంద్రబాబు ఒప్పుకోవాలని డిమాండ్ చేశారు. చదవండి: సీఎం జగన్ను చంద్రబాబు ఇంచుకూడా కదపలేరు: కొడాలి నాని -
2024లో టీడీపీ పోటీ చేస్తుందో లేదో..
సాక్షి, లక్ష్మీపురం (గుంటూరు): ఎన్నికల నుంచి తెలుగుదేశం పార్టీ పారిపోతుందని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. 2024 ఎన్నికల్లో టీడీపీ పోటీ చేస్తుందో లేదో చూడాలన్నారు. బద్వేలులో బీజేపీ పూర్తి శక్తి సామర్థ్యంతో పోటీ చేస్తుందన్నారు. గుంటూరు పట్టాభిపురంలోని రైల్వే డీఆర్ఎం కార్యాలయంలో శుక్రవారం ఎంపీ జీవీఎల్ నరసింహారావు మాట్లాడుతూ.. గుంటూరు రైల్వే డివిజన్ను మరింత అభివృద్ధి చేసేందుకు తన వంతుగా కృషి చేస్తానని, బెంచ్ల కోసం ఎంపీ నిధులనుంచి రూ.50 లక్షలు ఇచ్చామన్నారు. చదవండి: (బీజేపీకి కొత్త జాతీయ కార్యనిర్వాహక కమిటీ) -
ఏపీ సంక్షేమ పథకాలు సమర్థనీయమే
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు సమర్థనీయమేనని, ప్రజలందరికీ పథకాలు అందాలని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. ఆదివారమిక్కడ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 2019 ఎన్నికల ముందు రూ.వేల కోట్లు అప్పులు తెచ్చి పసుపు–కుంకుమగా పంచినప్పటికీ టీడీపీకి ఒరిగిందేమీలేదని ఎద్దేవా చేశారు. రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పథకాలు చేపట్టాలన్నారు. మేనిఫెస్టోలో పెట్టి హామీలు నెరవేర్చని ఓ రాష్ట్ర ప్రభుత్వానికి (ఏపీ కాదు) ఇటీవల ఢిల్లీ హైకోర్టు మొట్టికాయలు వేసిందన్నారు. ఆర్థిక స్థితిగతులు, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని నిధుల సమీకరణతో పథకాలు చేపట్టాలన్నారు. రాష్ట్రం విభజన నాటి నుంచి ఏపీ ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని జీవీఎల్ చెప్పారు. -
‘విభజన చట్టం ప్రకారమే కేంద్రం గెజిట్ నోటిఫికేషన్’
మంగళగిరి: విభజన చట్టం ప్రకారమే నీటి ప్రాజక్టులపై కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ప్రకటించిందని రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు చెప్పారు. మంగళగిరిలోని చేనేత వస్త్ర దుకాణాలను ఆదివారం సందర్శించిన ఆయన అనంతరం మీడియాతో మాట్లాడారు. రెండు రివర్ మేనేజ్మెంట్ బోర్డులు నిర్ణయాలు చేసే ముందు ట్రిబ్యునల్ ప్రతిపాదనకు అనుగుణంగానే పనిచేస్తాయన్నారు. ప్రాజెక్టులపై కేంద్ర పెత్తనం అన్నది అభూతకల్పనేనన్నారు. నీటి వివాదాలకు అడ్డుకట్ట వేసేందుకే కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చిందని, పార్టీలు రాజకీయ కారణాలతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నాయని విమర్శించారు. ప్రాజెక్టుల నిర్వహణ అనేది రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోనే ఉంటుందని, కేంద్రం జోక్యం చేసుకోదన్నారు. కొత్త ప్రాజెక్టుల అనుమతులు కోసం అయినా, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు అనుమతులు కావాలన్నా రెండు రాష్ట్రాల సీఎంలు, కేంద్ర జలశక్తి మంత్రి చర్చించుకుని అనుమతులు పొందొచ్చని జీవీఎల్ వివరించారు. -
తెలంగాణకు లబ్ధి చేకూర్చేందుకే టీడీపీ డ్రామా: జీవీఎల్
గుంటూరు మెడికల్/సత్తెనపల్లి: తెలంగాణకు లబ్ధి చేకూర్చడం కోసమే టీడీపీ జిల్లాల నేతలు నీటి వివాదంలో మరో వివాదాన్ని సృష్టిస్తున్నారనే అనుమానం కలుగుతుందని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు వెల్లడించారు. ప్రకాశం జిల్లా టీడీపీ నేతల వ్యవహార సరళే దానికి నిదర్శనమన్నారు. దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పష్టమైన విధానం ప్రకటించాలని డిమాండ్ చేశారు. శనివారం గుంటూరు, సత్తెనపల్లిలోని బీజేపీ కార్యాలయాల్లో జీవీఎల్ విలేకరులతో మాట్లాడారు. రెండు తెలుగు రాష్ట్రాల నీటి గొడవను పరిష్కరించేందుకే కేంద్ర ప్రభుత్వం చట్టంలో ఉన్న అంశాల ప్రకారమే గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చిందని ఆయన స్పష్టం చేశారు. నీటి వివాదంపై టీఆర్ఎస్ రాజకీయాలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. కేంద్రం సరైన సమయంలోనే నోటిఫికేషన్ ఇచ్చిందని, రాష్ట్రాల్లో ప్రాజెక్టులను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే నిర్వహించుకుంటాయని తెలిపారు. పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులపై చర్చించేందుకు, కార్యాచరణ రూపొందించడానికి సోమవారం సమావేశం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. దేశ వ్యాప్తంగా పదివేల రైతు ఉత్పాదక సంఘాలు ఏర్పాటు చేస్తున్నట్లు జీవీఎల్ చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో రైతులకు అమలు చేస్తున్న పథకాలు , సమస్యలపై ఆరు నెలలుగా అధ్యయనం చేస్తున్నట్లు తెలిపారు. బీజేపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు పాటిబండ్ల రామకృష్ణ, టుబాకో బోర్డు చైర్మన్ యడ్లపాటి రఘునాథబాబు, మాజీ మంత్రి డాక్టర్ శనక్కాయల అరుణ, మాజీ ఎమ్మెల్యే దారా సాంబయ్య తదితరులు పాల్గొన్నారు. -
కేంద్రం గెజిట్ నోట్ విడుదల చేయడం శుభపరిణామం
సాక్షి, తూర్పుగోదావరి జిల్లా: నీటి ప్రాజెక్టుల నిర్వహణ విషయంలో కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు స్వాగతించారు. ప్రాజెక్టుల నిర్వహణ బాధ్యతను రివర్ మేనేజ్మెంట్ బోర్డులకు అప్పగిస్తూ కేంద్రం గెజిట్ విడుదల చేయటం శుభపరిణామమం అన్నారు. ఇరు రాష్ట్రాల మధ్య సయోధ్యకు ఇది దోహదపడుతుందని పేర్కొన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి జీవీఎల్ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. కాగా రాజమండ్రిలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా... ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు చేయడం శుభపరిణామమని జీవీఎల్ హర్షం వ్యక్తం చేశారు. రానున్న పార్లమెంటు సమావేశాల్లో రాష్ట్రానికి సంబంధించిన సమస్యలు పరిష్కారమయ్యే దిశగా తమ వాణి వినిపిస్తామని పేర్కొన్నారు. -
‘తిరుపతి’లో బీజేపీ– జనసేన కూటమి పోటీ
సాక్షి, విశాఖపట్నం: తిరుపతి ఉప ఎన్నికలో బీజేపీ, జనసేన కూటమి పోటీ చేస్తుందని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు స్పష్టం చేశారు. విశాఖలోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రానికి లక్షల కోట్లు నిధులు అందిస్తున్నా.. బీజేపీపై ప్రజలు విశ్వాసం చూపడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రానున్న కాలంలో రూ.8.17 లక్షల కోట్లు ఇన్ఫ్రా తదితర రంగాల్లో పెట్టుబడులుగా రానున్నాయని చెప్పారు. ఇండస్ట్రియల్, పెట్రో కారిడార్లు ఏర్పాటైతే రాష్ట్రంలో 1.43 లక్షలమందికి ఉపాధి లభిస్తుందన్నారు. రైల్వేజోన్ అంశంపై రైల్వే మంత్రిత్వ శాఖతో తరచూ సంప్రదింపులు జరుపుతున్నట్టు వివరించారు. రాష్ట్రాన్ని బీజేపీ ఇన్ని రకాలుగా అభివృద్ధి చేస్తుంటే ఇక్కడి నుంచి మాత్రం ప్రతిఫలం దక్కలేదన్నారు. జమిలి ఎన్నికల అంశం ఇప్పట్లో తేలేది కాదన్నారు. కోస్టల్ టూరిజం ప్రాజెక్టు కూడా పరిశీలనలో ఉందని జీవీఎల్ వివరించారు. -
‘కళ్ల జోళ్లు ఇస్తాం.. ఒకసారి వెళ్లి చూసి రండి’
సాక్షి, తాడేపల్లి : టీడీపీ సభ్యులు పార్లమెంటు వేదికగా అబద్ధాలు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ విమర్శించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో రాష్ట్రానికి మంచి పేరు వస్తుందని చెడగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. అచ్చెన్నాయుడు నియోజకవర్గంలో నంది విగ్రహం మార్చి పెట్టాలని ప్రయత్నం చేశారని దుయ్యబట్టారు. అలాంటి వారిని అరెస్ట్ చేస్తే తప్పా అని నిలదీశారు. మీరేం చేసినా పట్టించుకోకుంటే మంచిదా అని ప్రశ్నించారు. తప్పులు చేస్తూ అన్ని చోట్లా దొరికారని. దానిలో సరైన సాక్షాలు కేంద్ర హోంమంత్రి అమిత్ షాకే ఇస్తున్నామని పేర్కొన్నారు. వీళ్ళందరి జాతకాలను వీడియో సాక్షిగా కేంద్రానికి తెలుపుతామని పేర్కొన్నారు. రాష్ట్రంలో మత మార్పిడిలు ఎక్కడ జరుగుతున్నాయని పిర్యాదు చేశారని టీడీపీ నాయకులను ప్రశ్నించారు. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడన్నా మత కలహాలు జరిగిన చరిత్ర ఉందా అని నిలదీశారు. చదవండి: టీడీపీ ఎంపీలు కాళ్ల బేరానికి వెళ్లారు.. రాజకీయంగా ప్రజలు తిరస్కరించిన తర్వాత ఇప్పుడు మత కలహాలు అనడం మీరు(టీడీపీ) బతకడం కోసమేనని డొక్కా దుయ్యబట్టారు. టీడీపీ పార్టీ నుంచి చాలా మంది వలస వెళ్లిపోతున్నారన్న ఆయన దాన్ని ఒప్పుకోడానికి మనసు ఒప్పక మతకలహాలు అనడం దివాళా కోరు పద్ధతని విమర్శించారు. అమిత్ షాకి ప్రవీణ్ చక్రవర్తి వీడియో చూపించారని, ఒకవేళ అది టీడీపీ హయాంలో జరిగితే దాన్ని అమిత్ షాకి చూపుతారా.. అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ విషయంలో తాము వాస్తవాలు వెల్లడిస్తామన్నారు. పాస్టర్ ప్రవీణ్ చక్రవర్తిని ఎవరు అరెస్ట్ చేశారో? అప్పుడు మీరెందుకు అరెస్ట్ చేయలేదని, మోదీపై మీరు ఏవిధంగా మాట్లాడారో ఆ వీడియోలను కూడా బీజేపీకి అందిస్తామని హెచ్చరించారు. అమిత్ షాపై దాడి చేసిందేవరో కూడా వివరిస్తామని అన్నారు. లేనివి ఉన్నవిగా ప్రచారం చేస్తూ బురదజల్లే ప్రయత్నం చేయడం మానుకోవాలని టీడీపీ నేతలకు డొక్కా మాణిక్య వరప్రసాద్ హితవు పలికారు. ‘మోదీకి కుటుంబం లేదని మాట్లాడింది మీరు కాదా. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం మీరు రెచ్చగొడుతున్నారు. విజయవాడలో 40 దేవాలయాలు కూల్చింది మీరు కాదా. FRBM అనుమతి లేకుండా అప్పు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఆ అనుమతి లేకుండా చట్టానికి లోబడకుండా ఎవరైనా అప్పులు ఇస్తారా. ఏ రాష్ట్రమైనా, కేంద్రమైనా అప్పులు తెస్తుంది. నీ హయాంలో కూడా అప్పులు తెచ్చిన మాట మర్చిపోవద్దు. పోలవరం గురించి మాట్లాడే అర్హత వీళ్లకు ఉందా...?అది ఎక్కడ పూర్తి అయ్యి సీఎం జగన్కు మంచి పేరువస్తుందో అని ఆగిపోయిందని ఆరోపణలు చేస్తున్నారు. కళ్ళజోళ్ళు ఇస్తాం....ఒకసారి వెళ్లి చూసి రండి. జీవీఎల్ చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలి. వాస్తవాలు తెలుసుకోవాలి. కావాలంటే డేటా పంపుతాం. టీడీపీ హయాంలో జరిగిన డేవాలయాలపై దాడుల విషయంపై మీకు సమాచారం లేదా. దేశంలో రాష్ట్ర గౌరవం పెంచేలా మాట్లాడాలి కానీ చెడ్డపేరు వచ్చేలా మాట్లాడటం సరికాదు’ అంటూ ఎంపీ జీవీఎల్ నరసింహరావును ఉద్ధేశించి వ్యాఖ్యలు చేశారు. -
పెట్టుబడుల ఆకర్షణలో ఏపీ ముందంజ
సాక్షి, న్యూఢిల్లీ: ఎలక్ట్రానిక్ రంగంలో పెట్టుబడులను ఆకట్టుకోవడంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందంజలో ఉందని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఈ సందర్భంగా ఏపీలో 3 ఎలక్ట్రానిక్ మ్యాన్ఫ్యాక్చరింగ్ క్లస్టర్లు ఏర్పాటు చేయనున్నట్లు గురువారం పార్లమెంట్లో వెల్లడించింది. చిత్తూరు జిల్లా శ్రీసిటీతో పాటు రేణిగుంట, ఏర్పేడులో క్లస్టర్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. ఎలక్ట్రానిక్ రంగంలో పెట్టుబడులు ఆకర్షించేందుకు ఏపీ ప్రయత్నిస్తోందని పేర్కొంది. ఈ మేరకు పార్లమెంటులో ఇటీవల బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అడిగిన ప్రశ్నకు కేంద్రం సమాధానం ఇచ్చింది. దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల్లో 19 ఎలక్ట్రానిక్ మ్యాన్ఫ్యాక్చరింగ్ క్లస్టర్లతోపాటు మూడు కామన్ ఫెసిలిటీ సెంటర్ల ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపింది. -
దేవాలయాలు కూల్చిన చరిత్ర టీడీపీ, బీజేపీలది..
సాక్షి, తాడేపల్లి: దేవాలయాలు కూల్చిన చరిత్ర టీడీపీ, బీజేపీలదేనని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు. గత టీడీపీ ప్రభుత్వంలో బీజేపీ నేత మాణిక్యాలరావు దేవాదాయ శాఖ మంత్రిగా ఉండగా, 40కిపైగా దేవాలయాలను కూల్చివేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. విగ్రహాలను చెత్త బండిలో తరలించిన చరిత్ర టీడీపీ, బీజేపీలదేనని ధ్వజమెత్తారు. బుధవారం వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఏదో జరిగిపోతోందని టీడీపీ, బీజేపీ నేతలు కూడగట్టుకొని దేశవ్యాప్తంగా దుశ్ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు చేసిన వ్యాఖ్యలని ఆయన తప్పుపట్టారు. రాజ్యసభలో జీవీఎల్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఏదో జరిగిపోతోందని దుశ్ప్రచారం చేయడం సరికాదన్నారు. టీడీపీ, బీజేపీ ఉమ్మడి ప్రభుత్వంలో 40 దేవాలయాలు కూల్చేసినప్పుడు జీవీఎల్ ఎక్కడున్నారన్నారని నిలదీశారు. ఆలయాలపై దాడుల ఘటనలపై సిట్ దర్యాప్తులో ఒక్కో నివేదిక బయటికొస్తుంటే టీడీపీ, బీజేపీ నేతలు భయంతో వణికిపోతున్నారన్నారు. బీజేపీ నేతలు కూడా కొన్ని సంఘటనల్లో ప్రత్యక్షంగా పాల్గొన్నారని ఆరోపించారు. అంతర్వేది ఘటనపై సీబీఐ దర్యాప్తుకు సిఫార్సు చేసినా, ఇంత వరకు కేంద్రం ప్రభుత్వం స్పందించలేదని, దీనికి జీవీఎల్ ఏమని సమాధానం చెప్తాడని నిలదీశారు. రాజమండ్రిలో అర్చకునికి డబ్బులిచ్చి విగ్రహాన్ని ధ్వంసం చేయించింది టీడీపీ కాదా అని ప్రశ్నించారు. దీనిపై బీజేపీ స్పందించకపోవటాన్ని ఆయన తప్పుపట్టారు. ఏపీకి రావాల్సిన నిధుల గురించి జీవీఎల్ ఏరోజైనా రాజ్యసభలో మాట్లాడారా అని నిలదీశారు. టీడీపీ ఎంపీలు అమిత్ షా అపాయింట్మెంట్ కోరడంపై ఆయన స్పందిస్తూ.. చంద్రబాబుది.. అందితే జట్టు, అందక పోతే కాళ్లు పట్టుకునే రకమని విమర్శించారు. రాష్ట్రంలో గుడులను కూల్చిన చరిత్ర టీడీపీ, బీజేపీలదైతే.. గుడులను నిర్మిస్తున్న ఘనత వైఎస్సార్సీపీదేనని స్పష్టం చేశారు. అంతర్వేది రథాన్ని 1.20 కోట్లతో త్వరితగతిన నిర్మించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. రామతీర్థం విగ్రహాల కోసం అశోక్ గజపతిరాజు విరాళం పంపారని, ఆ విరాళాన్ని విగ్రహాల కోసం మాత్రమే వినియోగించాలని మెలిక పెట్టడంతో ఆయన చెక్ను వెనక్కు పంపామని పేర్కొన్నారు. -
పేర్లు లేకుంటే రాష్ట్రాలకు నిధులు రావా?
న్యూఢిల్లీ: దేశ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేలా, అభివృద్ధి పథంలో పయనించే బడ్జెట్ ఇది అని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహరావు పేర్కొన్నారు. పన్నుల భారం మోపకుండా ప్రజల బడ్జెట్ మాదిరి ఉందని తెలిపారు. బడ్జెట్ అనంతరం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆర్థిక వ్యవస్థకు ఊపునిచ్చే బడ్జెట్ ఇది అభివర్ణించారు. ఉద్యోగ, ఉపాధి కల్పన కోసం ఈ బడ్జెట్ దోహదం చేస్తుందని తెలిపారు. మౌలిక వసతులను మెరుగుపరిచేదని చెప్పారు. కేంద్రం ప్రభుత్వం ఆరోగ్య రంగంపై పెట్టే ఖర్చు గణనీయంగా పెంచారని, ఆరోగ్య రంగంలో ఆత్మనిర్భరత సాధించేందుకు నిధులు కేటాయించినట్లు వివరించారు. మార్కెట్ యార్డులలో మౌలిక సదుపాయాలు మెరుగుపరిచేందుకు రూ.లక్ష కోట్ల నిధులు కేటాయించారని ప్రస్తావించారు. అయితే కొన్ని వస్తువులపై సెస్ విధించడంతో మార్కెట్ యార్డులలో మౌలిక సదుపాయాలు పెంచడానికి ఉపయోగపడుతుందని ఎంపీ జీవీఎల్ పేర్కొన్నారు. తాగునీటి కోసం జలజీవన్ మిషన్ కోసం నిధులు కేటాయించినట్లు తెలిపారు. ప్రపంచమంతా ఆర్థికంగా నష్టపోయినా దేశంలో ఆత్మనిర్భరతా నినాదంతో ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేసేలా బడ్జెట్ రూపకల్పన చేశారని కొనియాడారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి, ఆర్థిక మంత్రికి అభినందనలు తెలిపారు. తెలుగు రాష్ట్రాలకు బడ్జెట్లో పెద్దపీట వేశారని చెప్పారు. అయితే కొన్ని రాజకీయ పార్టీలు రాజకీయ విమర్శలు చేయడం సహజమేనని తీసిపారేశారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు, పథకాలను తెలుగు రాష్ట్రాలు సరిగా ఉపయోగించుకోవడం లేదని ఆరోపించారు. బడ్జెట్లో ప్రస్తావన లేకపోతే నిధులు, మొండిచేయి చూపినట్లు కాదని పేర్కొన్నారు. పోలవరం గురించి రెండు రోజుల్లో కేంద్రం నుంచి స్పష్టమైన వివరణ రానున్నట్లు ప్రకటన చేశారు. ఏపీకి కేంద్రం ఇచ్చే నిధులు, బడ్జెట్ కేటాయింపుల గురించి మీడియా ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తామని ఎంపీ జీవీఎల్ నరసింహరావు చెప్పారు. -
ధర్మ దీక్ష భగ్నం
నెల్లిమర్ల (విజయనగరం): ‘ధర్మ దీక్ష’ పేరుతో బీజేపీ, జనసేన మంగళవారం తలపెట్టిన ఛలో రామతీర్థం కార్యక్రమాన్ని పోలీసులు భగ్నం చేశారు. సెక్షన్–30 అమల్లో ఉండటం, శాంతిభద్రతల పరిరక్షణకు ఆటంకం కలుగుతుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి పోలీసులు అనుమతివ్వలేదు. అయినా కార్యక్రమం నిర్వహించేందుకు ఆ రెండు పార్టీలు ప్రయత్నించడంతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు సహా నేతలు, కార్యకర్తలను నెల్లిమర్లలో పోలీసులు అడ్డుకున్నారు. వారిని దాటివెళ్లేందుకు ప్రయత్నించిన వీర్రాజును, ఇతర నేతలను అదుపులోకి తీసుకున్నారు. దీంతో గంటసేపు హైడ్రామా నడిచింది. బీజేపీ, జనసేన నేతలను రామతీర్థం వెళ్లనివ్వకుండా నిలువరించేందుకు మంగళవారం వేకువజాము నుంచే పోలీసులు భారీఎత్తున నెల్లిమర్లలో మోహరించారు. అయినప్పటికీ సోము వీర్రాజు, ఎమ్మెల్సీ మాధవ్, జనసేన రాజకీయ వ్యవహారాల ఇన్చార్జి యశస్వినితో పాటు పలువురు నేతలు, కార్యకర్తలు రామతీర్థం వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో వారందరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనికి నిరసనగా సోము వీర్రాజు రోడ్డుపై బైఠాయించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తమను రామతీర్థం వెళ్లకుండా అడ్డుకున్న ప్రభుత్వానిది పిరికిపంద చర్య అని ధ్వజమెత్తారు. బోడికొండపై గల రాముడిని దర్శించుకునేందుకు ప్రభుత్వం ముందుగా తమకు అనుమతిచ్చిందన్నారు. అయితే, మంగళవారం ఉదయం అకస్మాత్తుగా అనుమతి రద్దు చేసిందని ఆరోపించారు. సెక్షన్–30 అమల్లో ఉన్నప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు, వైఎస్సార్సీపీ నేత విజయసాయిరెడ్డికి అనుమతులు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. రాముడు తమ ఆరాధ్య దైవమని, విగ్రహాన్ని కూల్చిన పాపం ప్రభుత్వానికి తప్పకుండా తగులుతుందని అన్నారు. ఆలయాలపై వరుసగా దాడులు జరుగుతున్నా అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని వీర్రాజు ఆరోపించారు. దోషులను శిక్షించే వరకు ఆందోళన కొనసాగుతుందని స్పష్టం చేశారు. జీవీఎల్ ఖండన సాక్షి, న్యూఢిల్లీ:రామతీర్థం పర్యటనకు వెళ్లిన ఏపీ బీజేపీ నాయకులను అరెస్ట్ చేయడాన్ని రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ఖండించారు. రామతీర్థంలో రాముడి విగ్రహం తలను తొలగించడం కచ్చితంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావాలను దెబ్బతీయడమేనని ఆయన వ్యాఖ్యానించారు. మంగళవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. ఈ తరహా దాడులు మరో మతంపై జరిగితే పరిణామాలు మరోలా ఉండేవన్నారు. గతంలో ముస్లిం రాజుల పాలనలో జరిగిన తీరులో హిందూ ఆలయాలపై దాడులు జరుగుతున్నాయన్నారు. ప్రభుత్వం రామతీర్థం ఘటనలో తప్ప గతంలో ఆలయాలపై దాడి జరిగినప్పుడు ఎప్పుడూ స్పందించలేదని పేర్కొన్నారు. ఒక్క చర్చిపై రాళ్లు వేస్తే 40 మందిని వెంటనే అరెస్ట్ చేసిన ప్రభుత్వం, మందిరాలపై జరిగే దాడుల విషయంలో ఎందుకు అలా వ్యవహరించడం లేదని జీవీఎల్ ప్రశ్నించారు. టీడీపీ శ్రేణులే ఈ పని చేశాయని వైఎస్సార్సీపీ నేతలు చెబుతున్నారే తప్ప ఎలాంటి చర్యలు లేవని విమర్శించారు. చర్చిలు మాత్రమే ప్రార్ధనా స్థలాలని ప్రభుత్వం భావిస్తోందా అనే విషయాన్ని వెంటనే స్పష్టం చేయాలన్నారు. -
కొత్త చట్టాలపై అపోహలొద్దు: జీవీఎల్
సాక్షి, గుంటూరు: కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలు విప్లవాత్మకమైనవని.. దీని వల్ల రైతులు ఎవరూ ఇబ్బంది పడరని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వ్యవసాయ నూతన చట్టాలపై సూచనలు వింటామని, కానీ వెనకడుగేసేది లేదని స్పష్టం చేశారు. ఈ చట్టాలు 30, 40 ఏళ్ల క్రితం ప్రవేశపెట్టి ఉంటే రైతుల జీవితాలు బాగుపడేవన్నారు. (చదవండి: విశాఖకు ఎందుకు వలసొచ్చావ్..?) ‘‘చట్టాలు రూపకల్పనలో మేధావులు, నిపుణులు అభిప్రాయాలు తీసుకున్నాం. చట్టాలపై కొంతమంది అపోహలు సృష్టించి ఆందోళనకు గురిచేస్తున్నారు. కొత్తగా వచ్చిన చట్టాల ప్రకారం రైతులు పండించిన పంటను మార్కెట్ యార్డ్ బయట అమ్ముకోవచ్చు. మార్కెట్ యార్డ్కు చెస్ కట్టాల్సిన అవసరం లేదు. ఆ డబ్బులు రైతుకు మిగులుతాయి. కొత్త వ్యవసాయ చట్టాల వల్ల కనీస మద్దతు ధర ఉండదని కొంతమంది అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. అసత్యాలను నమ్మొద్దు. రైతులకు అపోహలు కలిగితే వాటిని నివృత్తి చేయడానికి సమావేశాలు నిర్వహిస్తున్నామని’’ ఎంపీ జీవీఎల్ నరసింహారావు వివరించారు. (చదవండి: సవాళ్ల పర్వం: ముఖం చాటేసిన వెలగపూడి) నూతన చట్టాలను స్వాగతించాలి: సోము వీర్రాజు వ్యవసాయాన్ని ప్రవృత్తి గా మార్చుకుని ఎంతోమంది ఆర్గానిక్ వ్యవసాయం చేస్తున్నారని బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. పండించే పంటలపైనే రైతుతో ఒప్పందాలు ఉంటాయని, రైతు భూమి సురక్షితమని ఈ బిల్లులో స్పష్టంగా ఉందని పేర్కొన్నారు. వ్యవసాయ దిగుబడి ఖరీదు .. ఒప్పందం ప్రకారం చెల్లింపులు ఉంటాయని తెలిపారు. ఈ చట్టాల గురించి రెండు దశాబ్దాలుగా చర్చ సాగుతూనే ఉంది. ఎన్నో చర్చలు, ఆలోచనలు చేశాకే ప్రధాని మోదీ.. ఈ చట్టాలను తెచ్చారు. నీరు-మీరు అంటూ కోట్లు వెచ్చించారు. కానీ నేడు ఒక్క చెట్టు కూడా కాన రావడం లేదని’ ఆయన విమర్శించారు. సేంద్రీయ వ్యవసాయ విధానాలపై రైతులు అవగాహన పెంచుకోవాలని సోము వీర్రాజు సూచించారు. -
రైతులకు కొత్తచట్టాలు అనుకూలం: జీవీఎల్
సాక్షి, గుంటూరు: దేశంలో తెలుగు రాష్ట్రాల్లో అత్యధికంగా మిర్చిని పండిస్తున్నారని ఎంపీ జీవీఎల్ నరసింహారావు తెలిపారు. టాస్క్ఫోర్స్ కమిటీ సమావేశంలో మిరప సాగుపై చర్చించామని పేర్కొన్నారు. ఏడాదికి 6200 కోట్ల రూపాయల మిర్చి ఎగుమతి జరుగుతోందన్నారు.ఏఏ దేశాలకు ఎగుమతి చేయాలి, సాగులో ఎదురవుతున్న ఇబ్బందులు, మిర్చి రైతులకు మంచి ధర వచ్చేలా ఏ చర్యలు తీసుకోవాలి వంటి పలు అంశాలపై చర్చించామని జీవీఎల్ వెల్లడించారు. (చదవండి: పురిటి గడ్డ రుణం.. సీఎం జగన్ సంకల్పం) కేంద్రం చేసిన కొత్త చట్టాలు రైతులకు అనుకూలంగా ఉన్నాయి. ఎగుమతి దారులతో రైతులను అనుసంధానం చేస్తాం. దీంతో మంచి ధర వచ్చే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. విపరీతంగా పురుగు మందులు వాడటాన్ని గమనించామని, అందరితో చర్చించి పురుగు మందుల వాడకాన్ని తగ్గించే విధంగా సిఫార్స్ చేస్తామని చెప్పారు. వాటిని రైతుల వద్దకు తీసుకెళ్లేందుకు ప్రణాళికలు రూపొందిస్తామని పేర్కొన్నారు. స్పైసెస్ పార్కును అందుబాటులో తెచ్చేందుకు అధ్యయనం చేసి చర్యలు తీసుకొంటామని ఎంపీ జీవీఎల్ నరసింహారావు వెల్లడించారు.(చదవండి: ‘ఆయన.. నీటి విలువ తెలిసిన వ్యక్తి’) -
దేవాలయాలు కూల్చిన దుర్మార్గుడు బాబు
తిరుపతి గాంధీ రోడ్డు: అధికారంలో ఉండగా విజయవాడలో 40 ఆలయాలకు పైగా కూల్చేసిన దుర్మార్గుడు చంద్రబాబని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. చిత్తూరు జిల్లా తిరుపతిలో ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడారు. మత రాజకీయాలు నెరిపే చంద్రబాబు నిద్రలేచినప్పుడల్లా నేను హిందువునని ప్రకటించుకునే ప్రయత్నం చేస్తుంటారని ఎద్దేవా చేశారు. ఆలయాల కూల్చివేతపై తీవ్ర వ్యతిరేకత రావడంతో వాటిని నిర్మిస్తానని నమ్మబలికి విస్మరించారని దుయ్యబట్టారు. 14 ఏళ్లు సీఎంగా ఉండి సొంత జిల్లాను అభివృద్ధి చేయలేని అసమర్థుడని, అందుకే ఇక్కడి ప్రజలకు మొహం చాటేస్తున్నారన్నారు. తిరుపతిలో జరగబోయే పార్లమెంటు ఉప ఎన్నికల్లో జనసేనతో కలిసి పోటీచేస్తామని చెప్పారు. బీజేపీని ఎదుర్కోలేక కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీలు రైతులతో ఆందోళనలు చేయిస్తున్నాయన్నారు. క్షేత్రస్థాయిలో రైతుల వద్దకు వెళ్లి సాగు బిల్లులపై అవగాహన కల్పిస్తామన్నారు. టీడీపీ, వైఎస్సార్సీపీలు పోటీపడి రాష్ట్రంలో కుల రాజకీయాలు చేస్తున్నాయని ఆరోపించారు. తెలంగాణలో ఒక సర్జికల్ స్ట్రైక్ కావాల్సి వస్తే ఏపీలో రెండు నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్థన్రెడ్డి మాట్లాడుతూ.. తిరుపతి విమానాశ్రయంలో అంతర్జాతీయ విమానాలు, డొమెస్టిక్ కార్గో నడిపేలా నెల రోజుల్లోనే చర్యలు చేపడుతామన్నారు. -
జనసేనతో కలిసి పోటీ చేస్తాం: ఎంపీ జీవీఎల్
సాక్షి, తిరుపతి: తిరుపతి ఉప ఎన్నికల్లో జనసేనతో కలిసి పోటీ చేస్తామని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు తెలిపారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఢిల్లీలో రైతుల ఆందోళన వెనుక కొన్ని పార్టీల కుట్ర ఉందని విమర్శించారు. రైతులకు మంచి చేయాలనే స్వామినాథన్ కమిటీ వేసి సంస్కరణలు తీసుకొచ్చామని పేర్కొన్నారు. రైతుల సంక్షేమం కోరే ఏకైక ప్రభుత్వం మోదీ ప్రభుత్వమని తెలిపారు. (చదవండి: ఆ నిర్ణయం దేశానికే ఆదర్శం..) మార్కెట్ యార్డుల్లో దళారీ వ్యవస్థను కొనసాగించాలని కొన్ని రాజకీయ పార్టీలు కోరుకుంటున్నాయని మండిపడ్డారు. వారి ఆర్థిక లాభం కోసమే చట్టాలను వెనక్కి తీసుకోవాలంటున్నారని విమర్శలు గుప్పించారు. తుపాను ప్రభావం వల్ల నష్టపోయిన రైతులను కేంద్ర ప్రభుత్వం ఆదుకుంటుందని పేర్కొన్నారు. దేవాలయాలే దండగన్న మహానుభావుడు చంద్రబాబు అని.. ఆయన కూడా హిందూయిజం గురించి మాట్లాడుతున్నారని జీవీఎల్ దుయ్యబట్టారు. (చదవండి: ‘రాజ్యాంగ వ్యతిరేక శక్తులెవరో తేల్చుకుంటాం’) -
స్ట్రైయిట్ టాక్ - జీవీఎల్ నరసింహ రావు
-
రైతుల సమస్యల పరిష్కారం కోసమే టాస్క్ఫోర్స్
సాక్షి, గుంటూరు: మిర్చి రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక టాస్క్ ఏర్పాటు చేశామని రాజ్యసభ సభ్యుడు, మిర్చి టాస్క్ ఫోర్స్ చైర్మన్ జీవిఎల్ నరసింహరావు తెలిపారు. గురువారం ఆయన గుంటూరు మిర్చి యార్డులో జరిగిన టాస్క్ ఫోర్స్ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జీవీఎల్ మాట్లాడుతూ.. ఆరు నెలల కార్యచరణలో భాగంగా తొలి సమావేశం ఏర్పాటు చేశామని తెలిపారు. రైతులు తమ సమస్యలను కమిటీ ముందు ప్రస్తావించవచ్చని తెలిపారు. కేంద్రం కొత్తగా తీసుకున్న నిర్ణయాలు, ఏపీలో ముందుగా అమలు చేయాలన్నది తన పక్షపాతంమని పేర్కొన్నారు. ఎందుకంటే తను గుంటూరు జిల్లా వాడినని గుర్తుచేశారు. రూ.7 వేల కోట్లతో పది వేల రైతు సంఘాలు ఏర్పాటు చేయాలన్నది కేంద్ర నిర్ణయమని వెల్లడించారు. 500 మంది రైతులు సంఘంగా ఏర్పడితే కేంద్ర ప్రభుత్వం నుంచి నేరుగా నిధులు రైతుల ఖాతాలోకి జమ అవుతాయని ఆయన చెప్పారు. ముందుగా రూ.25 లక్షలు, ఈక్విటీ రూపంలో మరో రూ.15 లక్షలను కేంద్రం ఆర్థిక సహాయం రూపంలో అందజేస్తుందని తెలిపారు. కేంద్రం తీసుకున్న వచ్చిన కొత్త చట్టాల వల్ల రైతులకు ఉపయోగకరమైన వాతావరణం కలిగిస్తుందని తెలిపారు. వాటిపై కొంతమంది తప్పుడు ప్రచారం చేశారని మండిపడ్డారు. గుంటూరు జిల్లాలో కనీసం 400, 500 రైతు కమిటీలు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. రూ.లక్ష కోట్ల పెట్టుబడితో వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు. ఏపీకి రూ.6,500కోట్ల నిధులు కేటాయించామని తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాలకి కలిపి రూ.10వేల కోట్లపైగా కేంద్రం నిధులు కేటాయించిందని తెలిపారు. -
టీడీపీ అవినీతిపై దర్యాప్తు జరగాల్సిందే: జీవీఎల్
సాక్షి, ఢిల్లీ: హిందూ ఉద్ధారకుడిగా ప్రతి పక్షనేత చంద్రబాబు నాయుడు ప్రగల్భాలు పలుకుతున్నారని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు మండిపడ్డారు. ఆయన హయాంలో అనేక దేవాలయాలను కూల్చేశారని, పుష్కరాల సమయంలో అనేక మంది ప్రాణాలు కోల్పోయారని జీవీఎల్ ధ్వజమెత్తారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అంతర్వేది, అమరావతిలపై సీబీఐ దర్యాప్తు జరపాలని కోరారు. గతంలో జరిగిన అవినీతిపై దర్యాప్తు జరగాల్సిందేని ఆయన డిమాండ్ చేశారు. దేవాలయాలపై జరుగుతున్న దాడుల నిరోధానికి కేంద్ర హోంమంత్రి అమిత్షాకు లేఖ రాశామని తెలిపారు. చర్చి పై రాళ్ళు వేశారనే ఆరోపణలతో అరెస్టు చేసిన 41 మందిని తక్షణమే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. (చదవండి: చంద్రబాబు సాయం కోర్టులకు అక్కర్లేదు) -
రాధాకృష్ణ తెగ ఫీలవుతున్నారు: సోము వీర్రాజు
-
ఆంధ్రజ్యోతి రాధాకృష్ణపై సోము సెటైర్లు
సాక్షి, గుంటూరు: ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఆంధ్రజ్యోతి దినపత్రిక ఎండీ వేమూరి రాధాకృష్ణపై తనదైన శైలిలో సెటైర్లు వేశారు. తమ పార్టీ అంతర్గత వ్యవహారాల్లో తలదూర్చొద్దని బహిరంగ ప్రకటన ద్వారా హితవు పలికారు. రాధాకృష్ణ ఏం చేసినా, ఎన్ని చేసినా టీడీపీ మంచికే అన్న విషయం అందరికీ తెలుసునని అన్నారు. పత్రికను అడ్డం పెట్టుకుని నిర్లజ్జగా వ్యవహరిస్తున్నారని చురకలంటించారు. ఆంద్రజ్యోతిలో ప్రచురించిన "మీ జీవీఎల్, మీ ఇష్టం" విశ్లేషణపై సోము వీర్రాజు ఈ వ్యాఖ్యలు చేశారు. (చదవండి: రాష్ట్రాన్ని అథోగతి పాల్జేసిన చంద్రబాబు) బీజేపీ అధ్యక్షుడి పత్రికా ప్రకటన యథాతథంగా.. ఈ రోజు ఆంధ్రజ్యోతిలో మీ సంపాదకీయం చదివాను. అందులో మా ఎంపీ జీవీఎల్ నరసంహారావు గారిని ఉద్దేశించి "మీ జీవీఎల్, మీ ఇష్టం" అనే శీర్షికతో విశ్లేషణ రాశారు. మా జీవీఎల్ గారు చంద్రబాబుగారిని విమర్శించడం మాకే మంచిది కాదు అని మీ అమోఘమైన విశ్లేషణ ద్వారా తెలిపారు. బీజేపీ ఆంధ్రప్రదేశ్లో బలపడాలి అనుకుంటే జీవీఎల్ లాంటి వారిని మా నాయత్వమే కట్టడి చేయాలనీ సెలవిచ్చారు. గతంలో అడ్డగోలుగా ప్రధాని మోదీ గారిని, వారి కుటుంబాన్ని, బీజేపీని టార్గెట్ చేసిన మీకు సడెన్గా బీజేపీపై ప్రేమ పుట్టిందని, మేము ఆంధ్రప్రదేశ్లో ఎదగటం లేదని మీరు తెగ ఫీల్ అవుతున్నారని మీ విశ్లేషణ ద్వారా తెలిసింది. ఆ విశ్లేషణ వెనుక కొత్తగా బీజేపీ పైన పుట్టిన ప్రేమ కాదని, ఇది పతనానికి చేరువలో ఉన్న చంద్రబాబు నాయుడు గారిని, టీడీపీని రక్షించే ప్రయత్నమని ఇట్టే పిల్లలకు కూడా అర్థమైపోతుంది. మీరు టీడీపీకి సలహాదారునిగా, అనుకూలంగా పని చేస్తారని ప్రజల్లో వినికిడి. మరీ ఇంత పబ్లిక్గా, నిర్లజ్జగా పత్రికను అడ్డం పెట్టుకుని మా అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవడం తగునా చెప్పండి. మీ రాజకీయ సలహాలు చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే ఇవ్వండి. అసెంబ్లీలో టీడీపీ 23 స్థానాలకే పరిమితం అవడంలో మీ పాత్ర కూడా ప్రధానమా కాదా? అదే నిజమైతే, మీరు ఇలాగే మీ సలహాలను టీడీపీకి కొనసాగిస్తూ పోతే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 23 నుండి రెండు లేక మూడు స్థానాలకు టీడీపీ పడిపోవడం ఖాయం. మీరు మా జాతీయ నాయకత్వానికి మా నాయకులను ఎలా కట్టడి చేయాలో, మా పార్టీని ఎలా కాపాడుకోవాలో సెలవిచ్చారు. ఈ విశ్లేషణ అసలు మతలబు ఏమిటో, మీ అసలు తాపత్రయం ఏమిటో వారికి త్వరలోనే వివరిస్తాను. మీరేమి దిగులు పడవలసిన అవసరం లేదు. మీరు బహిరంగ విశ్లేషణ రాశారు కనుక మీకు లేఖను కూడా బహిరంగం గానే రాస్తున్నాను. అన్యధా భావించరని ఆశిస్తాను. (చదవండి: తప్పుడు కథనం ఆధారంగా ‘పిల్’ ఏమిటి?) -
జీవీఎల్పై అనుచిత వ్యాఖ్యలు, కేసు నమోదు
సాక్షి, విజయవాడ: తప్పుడు ప్రచారాలతో పబ్బం గడుపుకునే టీడీపీ నేతల ఆగడాలు ఎక్కువయ్యాయి. అసత్య ప్రచారాలు చేస్తున్నారంటూ టీడీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. తనపై దుష్ప్రచారం చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే విడదల రజనీ సీఐడీ డీజీపీకి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. తాజాగా టీడీపీకి చెందిన రామయ్య అనే వ్యక్తిపై ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతలు సీఐడీ డీజీ సునీల్ కుమార్కు ఫిర్యాదు చేశారు. జై తెలుగుదేశం, టీడీపీ యూత్ అనే పేర్లతో ఫేస్ బుక్ పేజీలలో రామయ్య తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. పరిపాలనా వికేంద్రీకరణకు మద్దతుగా మాట్లాడుతున్న బీజేపీ నేతలను టీడీపీ సోషల్ మీడియా వింగ్ టార్గెట్ చేస్తోందని ఫిర్యాదు చేశారు. బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావును ఉద్దేశించి టీడీపీ సోషల్ మీడియా కార్యకర్త రామయ్య అనుచిత వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసుకున్న సీఐడీ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. (విశాఖ ఇమేజ్ దెబ్బతీయడమే చంద్రబాబు ఆలోచన) -
చంద్రబాబు సాయం కోర్టులకు అక్కర్లేదు
సాక్షి, న్యూఢిల్లీ: స్వయంప్రతిపత్తి కలిగిన న్యాయస్థానాలకు ప్రతిపక్ష నేత చంద్రబాబు సహాయం అవసరం లేదని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి, ఎంపీ జీవీఎల్ నరసింహారావు వ్యాఖ్యానించారు. కుట్రలు జరుగుతున్నాయనుకుంటే కోర్టులకు తమ అధికారాలను ఎలా వినియోగించుకోవాలో బాగా తెలుసన్నారు. కోర్టుల విషయంలో రాజకీయ నాయకులు జోక్యం చేసుకోవడం సరైన విధానం కాదని సూచించారు. జీవీఎల్ మంగళవారం ఢిల్లీలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. ► వ్యవస్థల గురించి అందరికంటే ఎక్కువగా చంద్రబాబుకే తెలుసు. వ్యవస్థల్లో లేని వాటిని కూడా ఆయన తనకు అనుకూలంగా చెప్పుకున్న రోజులున్నాయి. ఆయన హయాంలో సీబీఐని రాష్ట్రానికి రానివ్వకుండా చేశారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏ విషయంలో పడితే ఆ విషయంలో జోక్యం చేసుకునే అవకాశం లేదు. ► చంద్రబాబు లేఖలో నాకు తెలిసి తన ఫోన్ ట్యాప్ అవుతోందని చెప్పలేదు. ఒకవేళ అలా ఉన్నా కోర్టుల దృష్టికి తీసుకెళ్లాలి తప్పితే ఇలాంటి విషయాల్లో కేంద్రం జోక్యం చేసుకోదు. 2015లో ఆయన ఫోన్ ట్యాప్ అయితే రాష్ట్రమంతా మారుమోగింది. ► చంద్రబాబు ఏదైనా విచారణ జరగాలనుకుంటే ముఖ్యమంత్రికి లేఖ రాయాలి. ప్రధానికి కాదు. రాష్ట్ర ప్రభుత్వం ఏవైనా ప్రాథమిక ఆధారాలు సేకరించి విచారణ కోరితే కేంద్రం సహకరిస్తుంది. రాష్ట్రాల అభ్యర్థన మేరకు, కోర్టుల ఆదేశాల మేరకు మాత్రమే సీబీఐ విచారణ ఉంటుంది. ► న్యాయమూర్తుల ఫోన్లు కూడా ట్యాప్ అవుతున్నాయని లేఖలో ప్రస్తావించారు. న్యాయమూర్తులు, కోర్టులకు స్వయం ప్రతిపత్తి ఉంది. తమ అధికారాలను ఎలా వినియోగించుకోవాలో వారికి బాగా తెలుసు. ► చంద్రబాబు ఆస్తులపై సీబీఐ విచారణ జరపాలని లక్ష్మీపార్వతి 2005లో దాఖలు చేసిన పిటిషన్పై 14 ఏళ్లుగా స్టే ఉంది. ఇదొక గిన్నీస్ బుక్లో చేర్చాల్సిన అంశం. అన్ని సంవత్సరాలు ఏరకంగా స్టే ఇచ్చారన్నది చాలా ప్రధానమైన అంశం. -
బాబు అక్రమాల కేసు గిన్నిస్ రికార్డు లెవల్లో..
సాక్షి, న్యూఢిల్లీ : తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అక్రమాల కేసుకు సంబంధించి గిన్నిస్ బుక్ రికార్డు లెవల్లో స్టే ఎందుకు కొనసాగుతోందని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో కేంద్రం జోక్యం చేసుకోదని ఆయన స్పష్టం చేశారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో జడ్జీలకు చంద్రబాబు సహకారం అవసరం లేదన్నారు. ( ట్యాపింగ్ శుద్ధ అబద్ధం ) మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘కోర్టులకు ఈ విషయంలో సంపూర్ణ అధికారాలు ఉన్నాయి. ఫోన్ ట్యాపింగ్ విషయం రాజకీయ అంశం. ప్రధానికి రాసిన లేఖలో ఎవరి ఫోన్ ట్యాప్ అయిందో చంద్రబాబు రాయలేదు. అన్ని అంశాలు కేంద్ర పరిధిలో ఉండవు. కొన్ని అంశాల్లోనే కేంద్రం జోక్యం చేసుకుంటుంది. కోర్టులపై నిఘా ఉంచారని చంద్రబాబు అన్నారు. అలాంటివి జరిగితే ఎలాంటి చర్యలు తీసుకోవాలో కోర్టులకు తెలుసు. -
‘వ్యక్తిగత అభిప్రాయాలతో పార్టీకి సంబంధం లేదు’
సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అంశం కేంద్ర పరిధిలో లేదన్నదే తమ పార్టీ అధికారిక విధానమని బీజేపీ జాతీయ అధికారిక ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు మరోసారి స్పష్టం చేశారు. కొందరు నేతలు వారి వ్యక్తిగత అభిప్రాయాలను పార్టీ లైన్కు విరుద్ధంగా చెబుతున్నారని జీవీఎల్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గురువారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. పార్టీ అగ్ర నేతలతో చర్చించిన తర్వాతే రాజధాని అంశంపై తమ అధికారిక విధానాన్ని ప్రకటించామని తెలిపారు. తమ పార్టీ విధానాన్ని కేంద్ర హోంశాఖ అధికారికంగా హైకోర్టులో వెల్లడించిందని గుర్తుచేశారు. కావాలనే కొందరు బీజేపీపై దుష్ప్రచారం చేస్తున్నారని జీవీఎల్ మండిపడ్డారు. నాయకుల వ్యక్తిగత అభిప్రాయాలతో పార్టీకి సంబంధం లేదన్నారు. వ్యక్తిగత ప్రకటనలకు మీడియా ప్రాధాన్యత ఇచ్చి బీజేపీని టార్గెట్ చేయవద్దని కోరారు. (చదవండి : ‘ఈనాడు ఇటువంటి వార్తలు రాయడం బాధాకరం’) -
3 రాజధానులు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం
సాక్షి, న్యూఢిల్లీ: మూడు రాజధానులు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయమని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు స్పష్టం చేశారు. దీనిపై తమ ఆలోచనలను విస్పష్టంగా ఇప్పటికే చెప్పామని అన్నారు. శుక్రవారం ఇక్కడ బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి, ఎంపీ జీవీఎల్ నరసింహారావు, ఏపీ బీజేపీ ఇన్ఛార్జి సునీల్ దేవ్ధర్తో కలిసి మీడియాతో మాట్లాడారు. అమరావతి రైతుల ఉద్యమాన్ని సమర్థిస్తున్నామని, రైతులకు ఇవ్వవలసినవి, గత ప్రభుత్వం ఇస్తామన్నవి, ఈ ప్రభుత్వం అమలు చేయాలన్నారు. చంద్రబాబువి మూర్ఖపు నిర్ణయాలు: జీవీఎల్ ► టీడీపీ చేసిన తప్పులకు ఆ పార్టీ బాధ్యత వహించకుండా బీజేపీని టార్గెట్ చేసి తప్పించుకోవచ్చని తప్పుడు ఆలోచనలు చేస్తోంది. ► గత టీడీపీ ప్రభుత్వం స్వార్థ రాజకీయాల కోసం అమరావతిని ఎంచుకుంది. ► భూములిచ్చిన రైతులకు న్యాయం జరగాలని, ప్రభుత్వ పెట్టుబడులు వృథా కాకూడదని చెప్పాం. ► రాజధాని అమరావతి కొనసాగి ఉంటేనే బాగుండేది. ► చంద్రబాబు ముఖ్యమంత్రిగా అనేక మూర్ఖపు నిర్ణయాలు తీసుకున్నారు. సీబీఐని రాష్ట్రంలోకి రానివ్వబోమన్నారు. కేంద్ర అధికారులను కూడా తామే ఎంక్వైరీ చేస్తామని మూర్ఖంగా ప్రవర్తించారు. ఆయన ఉంటే చంద్రన్న రాజ్యాంగం. లేకపోతే అసలు రాజ్యాంగం తనకు అనుకూలంగా పని చేయాలనుకోవడం తప్పు. ► అప్పుడూ కేంద్రంలో మా ప్రభుత్వం ఉంది. చంద్రబాబు చేసిన నిర్ణయం తప్పు అయినా, మేం జోక్యం చేసుకోలేదు. కాబట్టి ప్రస్తుత నిర్ణయానికి కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేదు. ► రాయలసీమలో హైకోర్టు పెట్టాలని మా మేనిఫెస్టోలో డిమాండ్ చేశాం. జేపీ నడ్డాతో సోము వీర్రాజు భేటీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో శుక్రవారం భేటీ అయ్యారు. పార్టీ ఏపీ ఇన్చార్జి సునీల్ దేవ్ధర్తో కలిసి నడ్డాతో భేటీ అయిన వీర్రాజు తనను రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యను వీర్రాజు మర్యాద పూర్వకంగా కలిశారు. హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్రెడ్డి, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి మురళీధరన్, పార్జీ జాతీయ ప్రధాన కార్యదర్శులు రాంమాధవ్, అరుణ్సింగ్ తదితరులను వీర్రాజు కలిశారు. -
‘వారి సూచన మేరకే అమరావతిపై నా ప్రకటన’
-
ఆ విష సంస్కృతికి బీజం వేసింది టీడీపీనే..
సాక్షి, విజయవాడ : నాయకులను రోడ్లపై అడ్డుకునే విష సంస్కృతికి తొలుత బీజాలు వేసింది తెలుగుదేశం పార్టీయే అని బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు అన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, అమిత్ షా గతంలో ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చినప్పుడు టీడీపీ నేతలు దారుణంగా వ్యవహరించారని విమర్శించారు. మోదీ.. గో బ్యాక్ అంటూ చంద్రబాబు నాయుడు నల్ల చొక్కా వేసుకున్నారని, అమిత్ షా కాన్వాయ్పై రాళ్లదాడి కూడా చేశారని గుర్తుచేశారు. జడ్ప్లస్ కేటగిరి భద్రత ఉన్న ప్రధాన మంత్రి మోదీ, అమిత్ షాపై టీడీపీ నేతలు దాడికి తెగబడ్డారని పేర్కొన్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో చంద్రన్న రాజ్యాంగం అమలులో ఉండేదని ఎద్దేవా చేశారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఒక విధంగా ప్రతిపక్షంలో ఉన్న మరో విధంగా మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. (ప్రజాగ్రహానికి తలొగ్గిన చంద్రబాబు) వికేంద్రీకరణకు వ్యతిరేకంగా ఉత్తరాంధ్ర పర్యటనకు వెళ్లిన చంద్రబాబును శుక్రవారం విశాఖ వాసులు అడ్డుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే శుక్రవారం విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో జీవీఎల్ మాట్లాడారు.‘ గతంలో వైఎస్ జగన్, విజయసాయిరెడ్డి విశాఖ వెళ్ళినప్పుడు టీడీపీ నేతలు ఎయిర్ పోర్టులో అడ్డుకున్నారు. వైజాగ్ ఎయిర్ పోర్టుకు వచ్చిన వాళ్లు ఏ పార్టీకి చెందిన వారో వాళ్ల చొక్కా మీద రాసి ఉండదు. అమరావతిలో టీడీపీ నేతలు దాడులకు తెగబడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. రాయలసీమలో హైకోర్టు పెట్టాలని గతంలోనే తీర్మానం చేశాం. (ఉరిమిన ఉత్తరాంధ్ర) హైకోర్టును రాయలసీమలో ఏర్పాటు చేయడంపై త్వరలోనే న్యాయశాఖ మంత్రిని కలుస్తాను. రాజధాని ఏర్పాటు విషయంలో కేంద్రం రాజ్యాంగ బద్దంగా వ్యవహరిస్తోంది. రాజధాని విషయంలో టీడీపీ నేతలు తమపై ఎందుకు విమర్శలు చేస్తున్నారో అర్ధం కావడంలేదు. ప్రజలను మభ్యపెట్టే విధంగా టీడీపీ నేతలు వ్యవహరిస్తున్నారు.ఢిల్లీలో అల్లర్లు వెనుక కొన్ని అసాంఘిక శక్తులు ఉన్నాయి. అల్లర్లను ఢిల్లీ పోలీసులు సమర్థవంతంగా ఆపగలిగారు.’ అని అన్నారు. -
మూడు రాజధానులపై కేంద్రం జోక్యం చేసుకోదు
సాక్షి, న్యూఢిల్లీ: రాజధాని వ్యవహారం పూర్తిగా రాష్ట్ర పరిధిలోని అంశమని బీజేపీ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు చెప్పారు. కేంద్ర హోంశాఖ మంగళవారం లోక్సభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంలో ఈ విషయం తెలియజేసిందని అన్నారు. రాజధాని విషయంలో కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్కు ఇచ్చిన సమాధానంపై ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నేతలు వక్రీకరణలు మానుకోవాలని సూచించారు. జీవీఎల్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం లోక్సభకు ఇచ్చిన సమాధానంలో ముఖ్యంగా మూడే వాక్యాలున్నాయని చెప్పారు. అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా నిర్ణయిస్తూ అప్పటి రాష్ట్ర ప్రభుత్వం 2015 ఏప్రిల్ 23న ఒక జీవో ద్వారా నోటిఫికేషన్ వెలువరించిందనేది మొదటి వాక్యమని అన్నారు. ఆ జీవోలో రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడా కేంద్ర ప్రభుత్వానికి రాజధాని గురించి తెలియజేయలేదని అన్నారు. అది రాష్ట్ర ప్రభుత్వం తనంతట తానుగా తీసుకున్న నిర్ణయం కాబట్టి కేంద్రానికి తెలపాల్సిన అవసరం లేదన్నారు. రాష్ట్రంలో రాజధాని మార్పు గురించి గానీ, మూడు రాజధానుల గురించి గానీ తమకు ఇంకా సమాచారం లేదన్నదే హోంశాఖ సమాధానంలోని రెండో వాక్యమని తెలిపారు. రాష్ట్ర పరిధిలో ఎక్కడైనా రాజధానిని ఏర్పాటు చేసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందన్నది మూడో వాక్యమని వివరించారు. అంటే రాజధానిని ఎక్కడ స్థాపించుకోవాలన్నది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశమని కేంద్రం స్పష్టంగా తేల్చిచెప్పిందని వెల్లడించారు. అందుకే అమరావతి విషయంలో గానీ, మూడు రాజధానుల విషయంలో గానీ కేంద్రం జోక్యం చేసుకునే అవకాశం లేదని ఉద్ఘాటించారు. అమరావతి ప్రాంత ప్రజలను మభ్యపెట్టడం కోసం ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని జీవీఎల్ విమర్శించారు. ముగిసిన అధ్యాయాన్ని మళ్లీ కొనసాగించాలంటే... ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా అన్నది ముగిసిన అధ్యాయమని గతంలోనే పలుమార్లు చెప్పామని జీవీఎల్ నరసింహారావు గుర్తుచేశారు. ముగిసిన అధ్యాయాన్ని మళ్లీ కొనసాగించాలంటే దేశ ఆర్థిక వ్యవస్థ ఇబ్బందులకు గురవుతుందని వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదా డిమాండ్ చంద్రబాబు మెడకు చుట్టుకున్నట్లే.. పదేపదే ఈ డిమాండ్ లేవనెత్తితే జగన్ కూడా ప్రమాదకర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ శాసన మండలి రద్దు విషయంలో కేంద్ర ప్రభుత్వం నిబంధల ప్రకారం నడుచుకుంటుందని తెలిపారు. అది కూడా భ్రమలో భాగమే... 2015లో అప్పటి ప్రభుత్వం జీవో ద్వారా నోటిఫై చేసింది కనుక ప్రస్తుతానికి అమరావతే రాజధాని అని లోక్సభకు ఇచ్చిన సమాధానంలో కేంద్రం పేర్కొందని జీవీఎల్ నరసింహారావు చెప్పారు. ప్రస్తుత ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని మార్చుకొని భవిష్యత్తులో రాజధానిని మరోచోటుకి మార్చి, ఆ విషయాన్ని తెలియజేస్తే కేంద్రం గుర్తిస్తుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం రాజకీయాలకు అతీతంగా, రాజ్యాంగబద్ధంగా, నిబంధనలకు అనుగుణంగా పనిచేస్తుందని పేర్కొన్నారు. మనకున్న ఫెడరల్ వ్యవస్థ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ అధికారాల్లో కేంద్రం జోక్యం చేసుకోదని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం 2015లో అమరావతిని రాజధానిగా ప్రకటిస్తూ జారీ చేసిన జీవో అక్బర్ శిలా శాసనమో, చంద్రబాబు నాయుడు చెక్కిన శిలా ఫలకమో కాదని తేల్చిచెప్పారు. దానిపై కొత్త జీవో జారీ చేసే అధికారం ఎవరికీ లేదని అనుకుంటే అది కూడా భ్రమలో భాగమేనని చెప్పారు. కొత్త ప్రభుత్వం నిబంధనలకు లోబడి మరో జీవో జారీ చేయవచ్చని తెలిపారు. -
రాజధాని రాష్ట్ర పరిధిలోనిదే
-
రాష్ట్ర పరిధిలో ఎక్కడైనా రాజధాని: జీవీఎల్
-
కొందరు భ్రమలు కల్పిస్తున్నారు: జీవీఎల్
సాక్షి, అమరావతి: రాజకీయంగానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై బీజేపీ పోరాటం ఉంటుందని ఆ పార్టీ ఎంపీ, అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు అన్నారు. రాజధాని విషయంలో కేంద్రం జోక్యం చేసుకోదని మరోసారి స్పష్టం చేశారు. బుధవారం ఆయన మాట్లాడుతూ... రాష్ట్రంలోని 50 శాతం మంది ప్రజలు.. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నారని.. అలాంటి ప్రభుత్వ అధికారంలో కేంద్రం ఎందుకు జోక్యం చేసుకుంటుందని ప్రశ్నించారు. అదే విధంగా.. రాజధాని రాష్ట్ర పరిధిలోని అంశమని.. రాష్ట్ర పరిధిలో ఎక్కడైనా రాజధాని పెట్టుకోవచ్చని జీవీఎల్ స్పష్టం చేశారు. ఈ విషయాన్ని కేంద్రం స్పష్టంగా చెప్పినా తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని జీవీఎల్ వ్యాఖ్యానించారు. రాజధాని విషయంలో ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని కేంద్రం అడ్డుకుంటోందని కొందరు భ్రమలు కల్పిస్తున్నారని మండిపడ్డారు. సమాఖ్య వ్యవస్థలో రాష్ట్ర పరిధిలో ఉన్న వ్యవహారాల్లో కేంద్రం జోక్యం చేసుకోదని తాము స్పష్టంగా చెబుతున్నామన్నారు.(రాజధాని అంశంపై తొలిసారిగా స్పందించిన కేంద్రం) కాగా ఆంధ్రప్రదేశ్లో రాజధాని అంశంపై కేంద్రం మంగళవారం తొలిసారిగా స్పందించింది. రాజధాని ఏర్పాటు అంశం రాష్ట్రాల పరిధిలోదేనని.. ఈ విషయంలో రాష్ట్రాలదే తుది నిర్ణయమని స్పష్టం చేసింది. ఈ మేరకు లోక్సభలో టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ అడిగిన ప్రశ్నకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్రాయ్ లిఖితపూర్వక సమాధానమిచ్చారు.(రాష్ట్ర పరిధిలోనే ‘రాజధాని’) -
పోలవరంకు బడ్జెట్తో సంబంధం లేదు : జీవీఎల్
సాక్షి, న్యూఢిల్లీ : ఆర్థికాభివృద్ధి లక్ష్యంగా కేంద్ర బడ్జెట్ ఉందని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి, ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. రాష్ట్రాల అంశాల ప్రతిపాదికన బడ్జెట్ను చూడటం సరికాదని తెలిపారు. కేంద్ర బడ్జెట్కు సంబంధించి శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆదాయపన్ను వ్యవస్థను సరళీకృతం చేసేలా బడ్జెట్ ఉందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆదాయపన్ను శాతాన్ని తగ్గించడం చారిత్రాత్మక నిర్ణయమని పేర్కొన్నారు. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కల్చర్ అండ్ హెరిటేజ్ను అమరావతిలో పెట్టాలని కేంద్రమంత్రికి విజ్ఞప్తి చేస్తానని తెలిపారు. పోలవరం ప్రాజక్టుకు కేంద్ర బడ్జెట్కు సంబంధం లేదని చెప్పారు. అందుకు నాబార్డ్ ద్వారా కేంద్రం నిధులిస్తుందన్నారు. పెద్ద మొత్తంలో నిధులను రాష్ట్ర ప్రభుత్వాల ప్రతిపాదనల మేరకు మౌలిక వసతుల కల్పనకు సమాకూర్చానున్నామని తెలిపారు. -
రాజ్యాంగం మేరకే కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ శాసన మండలి రద్దు వ్యవహారాన్ని కేంద్ర ప్రభుత్వం రాజకీయ కోణంలో చూడబోదని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి, ఎంపీ జీవీఎల్ నరసింహారావు పేర్కొన్నారు. బుధవారం ఢిల్లీలో కొన్ని టీవీ చానళ్లతో మాట్లాడుతూ.. రాజ్యాంగం ప్రకారమే కేంద్రం వ్యవహరిస్తుందని స్పష్టంచేశారు. ‘ఇది రాజకీయ వ్యవహారం కాదు. బీజేపీ తీసుకునే నిర్ణయమూ కాదు. శాసనమండలి రద్దుపై రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. వ్యవస్థ ఆధారంగా కేంద్రం ముందుకెళ్తుంది.. రాజకీయ కోణముండే ఆస్కారం లేదు’ అని వెల్లడించారు. ఎక్కడా రాజకీయాలకు తావుండదు బిల్లుపై బీజేపీ వైఖరి ఎలా ఉంటుందన్న ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. ‘కేబినెట్ ఆమోదం పొంది ప్రభుత్వం ద్వారా వచ్చే బిల్లును ప్రభుత్వంలో ఉన్న పార్టీగా వ్యతిరేకించడం సాధ్యం కాదు కదా.. ఏవో కారణాల వల్ల ఆపేస్తారని, రాష్ట్రంలోని పరిస్థితుల కారణంగా ఆపేస్తారని కొందరు అంటున్నారు. నా అవగాహన మేరకు ఆర్టికల్ 169(1) ప్రకారం రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేస్తే దానిని కేంద్ర ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లాలి. దీనిలో ఎక్కడా రాజకీయాలకు తావులేదు’ అని పేర్కొన్నారు. బీజేపీకి ఏపీ చట్టసభల్లో.. అది కూడా శాసన మండలిలో మాత్రమే ఇద్దరు సభ్యులు ఉన్నారని, మండలి రద్దుతో ఆ ప్రాతినిధ్యం కూడా పోతుందన్న ప్రశ్నకు స్పందిస్తూ.. ఇద్దరున్నా పది మంది సభ్యులున్నా సంబంధం లేదని, వ్యవస్థకు లోబడి నడుచుకోవాలన్నారు. బిల్లు వెనుక బీజేపీ ఉందన్న విమర్శలను తోసిపుచ్చుతూ.. ‘అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని మాత్రమే కేంద్రం పరిగణనలోకి తీసుకుంటుంది. అక్కడ ఏపార్టీ అధికారంలో ఉందన్న అంశాన్ని పరిగణించదు. కాబట్టి రాజకీయ కోణం నుంచి చూస్తే అది తప్పు. దీని వెనక బీజేపీ ఉందన్న విమర్శలు అక్కసుతో కూడినవే. ఏపీ ప్రజలు అప్పటి ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్ కాంగ్రెస్కు మద్దతు పలికారు. మేం వారితో కలిసి పోటీచేయలేదు. ఈరోజు కూడా వారు ఎన్డీయేలో భాగస్వామి కాదు. అక్కడ సీపీఎం ఉన్నా రాజ్యాంగ వ్యవస్థకు లోబడి కేంద్రం నడుచుకుంటుంది’ అని స్పష్టం చేశారు. షెడ్యూల్కు అనుగుణంగా బిల్లుపై ముందుకెళ్తారు ఈ సమావేశాల్లోనే బిల్లు వచ్చే అవకాశం ఉందా? అని ప్రశ్నించగా.. దీనికి సమాధానం కేంద్ర కేబినెట్ కార్యదర్శి లేదా హోం శాఖ లేదా పార్లమెంటరీ వ్యవహారాల శాఖ నుంచి లభించవచ్చని.. వాటి షెడ్యూలు ప్రకారం సమయానుసారంగా పనిచేస్తాయని చెప్పారు. రాజకీయ కోణంలో జాప్యం చేయడం.. వెంటనే చేయడం వంటి కోణాలకు ఆస్కారం ఉండదని వివరించారు. రాజధానిపై పార్లమెంటులో బీజేపీ వైఖరి ఎలా ఉంటుందని ప్రశ్నించగా ‘ఇది రాష్ట్ర పరిధిలోని అంశమని గతంలోనే కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి చెప్పారు. చర్చకు వస్తే మా పార్టీ వాణిని వినిపిస్తాం. దీనిని రాజకీయంగా రాష్ట్రంలో ఎదుర్కోవాలని గతంలోనే నిర్ణయించాం. కేంద్ర ప్రభుత్వానికి ఆపాదించాలనడాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ ఒప్పుకోం’ అని పేర్కొన్నారు. -
రాజ్యాంగబద్ధంగానే వ్యవహరిస్తాం
-
రాజధాని రాష్ట్ర పరిధిలోని అంశమే
సాక్షి, న్యూఢిల్లీ: రాజధాని రాష్ట్ర పరిధిలోని అంశమేనని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు చెప్పారు. అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్కు పాల్పడినవారిపై రేపటిలోగా క్రిమినల్ కేసులు నమోదు చేయాలన్నారు. ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని ఇన్ని వాస్తవాలు, ఆధారాలు ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు కేసులు నమోదు చేయడం లేదని ప్రశ్నించారు. బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణతో కలసి ఆయన మంగళవారం న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. జీవీఎల్ మాట్లాడుతూ.. ‘రాజధాని రాష్ట్ర పరిధిలోని అంశం కాబట్టి రాజకీయంగా మేం రాష్ట్రంలో పోరాటం చేస్తామని చెప్పాం. కేంద్రం పెద్దన్న పాత్ర పోషించాలని టీడీపీ నేతలు అం టున్నారు. రాజ్యాంగ వ్యవస్థలో కొన్ని నిర్ణయాలను కేంద్రం, మరికొన్నింటిని రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. శివరామకృష్ణన్ కమిటీ వద్దని చెప్పినప్పటికీ చంద్రబాబు ప్రభుత్వం అమరావతిలో రాజధాని నిర్మాణం చేపట్టింది. రాష్ట్ర పరిధిలోని అంశం కాబట్టి అందరూ సమర్థించారు. పెద్దన్న పాత్ర పోషించాలని కేంద్రంపై రుద్దే ప్రయత్నం చేయడం టీడీపీ ప్రతిపక్షంగా విఫలమైందనడానికి నిదర్శనం. వేరొకరు పెద్దన్న పాత్ర పోషిస్తే టీడీపీ దద్దమ్మ పాత్ర పోషిస్తుందా?’ అని మండిపడ్డారు. కన్నా మాట్లాడుతూ.. ‘మూడు రాజధానుల నిర్ణయానికి కేంద్ర మద్దతు ఉందంటూ చేస్తున్న ప్రచారాన్ని ఖండిస్తున్నాం’ అని చెప్పారు. జనసేనతో సమావేశం ‘రాజధాని’పై కాదు: పవన్కల్యాణ్తో బుధవారం జరిగే సమావేశంలో రాజధాని అంశంపై చర్చిస్తారని కొన్ని టీవీ చానళ్లు ప్రసారం చేసిన కథనాల్లో వాస్తవం లేదని జీవీఎల్ నరసింహారావు తెలిపారు. -
జనసేనతో రేపటి మీటింగ్ అందుకే: జీవీఎల్
న్యూఢిల్లీ: రాజధాని రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోని అంశమని.. ఇందులో కేంద్రం జోక్యం చేసుకోదని బీజేపీ అధికార ప్రతినిధి, ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. రాజధాని మార్పుతో కేంద్రం ఎవరితోనూ ఎటువంటి సమావేశం జరపడం లేదని స్పష్టం చేశారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... జనసేన పార్టీతో రేపటి సమావేశం కేవలం సమన్వయ కమిటీ సభ్యుల ఎంపిక కోసం మాత్రమే నని పేర్కొన్నారు. రాజధాని అంశంతో ఈ సమావేశానికి ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. అదే విధంగా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ కార్యాచరణపై కూడా చర్చిస్తామని తెలిపారు రాజధాని కోసమే రేపు జనసేనతో సమావేశం అన్నది పూర్తిగా అవాస్తమని వెల్లడించారు. అయితే కొన్ని మీడియాలు దురుద్దేశపూర్వకంగానే తప్పుడు వార్తలు ప్రసారం చేస్తున్నాయని మండిపడ్డారు.. ఇక ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వరకు ఢిల్లీలోనే సమావేశాలు నిర్వహించుకుంటామని జీవీఎల్ తెలిపారు.(మొదటి ముద్దాయి చంద్రబాబు: జీవీఎల్ ) కాగా రాష్ట్రంలో బీజేపీ- జనసేన కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా... జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. బీజేపీ, జనసేన భావజాలం ఒక్కటేనని ఉద్ఘాటించారు. ప్రత్యేక ప్యాకేజీ గురించి బీజేపీ నేతల వివరించిన తీరు తనను ఆకట్టుకుందని తెలిపారు. ఇక గతంలో పవన్.. బీజేపీకి వ్యతిరేకంగా వామపక్షాలతో కలసి పనిచేసిన సంగతి తెలిసిందే. కాగా మూడు రాజధానులు ఏర్పాటు చేయాలన్న అంశంపై శాసనసభ ప్రత్యేక సమావేశాల్లో భాగంగా.... అభివృద్ధి, పరిపాలన వికేంద్రీకరణ బిల్లుకు ఆంధ్రప్రదేశ్ శాసన సభ సోమవారం ఆమోదం తెలిపిన విషయం విదితమే. విశాఖపట్నం పరిపాలనా రాజధాని, అమరావతి శాసన రాజధాని, కర్నూలు న్యాయ రాజధానిగా బిల్లు ఆమోదం పొందింది. అదే విధంగా సీఆర్డీఏ ఉపసంహరణ బిల్లును కూడా ఆమోదించింది. వామపక్షాలకు ఏమైనా బాకీ ఉన్నానా: పవన్ మూడు రాజధానులకు నా మద్దతు: జనసేన ఎమ్మెల్యే -
మొదటి ముద్దాయి చంద్రబాబు: జీవీఎల్
న్యూఢిల్లీ: రాజధాని ఏర్పాటు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశమని బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు మరోసారి స్పష్టం చేశారు. శివరామకృష్ణన్ కమిటీ వద్దని చెప్పినా గత టీడీపీ ప్రభుత్వం అమరావతిలో రాజధాని ఏర్పాటు చేసిందని గుర్తుచేశారు. మంగళవారం జీవీఎల్ విలేకరులతో మాట్లాడుతూ.. అమరావతి విషయంలో చంద్రబాబు తీరుపై మండిపడ్డారు. నాడు కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని తాము డిమాండ్ చేశామని.. అయితే చంద్రబాబు అందుకు ఒప్పుకోలేదని తెలిపారు. ఇప్పుడేమో ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంలో కేంద్రం పెద్దన్న పాత్ర పోషించాలని టీడీపీ నేతలు అంటున్నారని దుయ్యబట్టారు. తాము పెద్దన్నగా వ్యవహరిస్తే 23 మంది ఎమ్మెల్యేలున్న టీడీపీ దద్దమ్మ పాత్ర పోషిస్తుందా అని ఎద్దేవా చేశారు. ఇప్పుడు హైకోర్టు ఏర్పాటుకు తాము పూర్తిగా సహకారం అందిస్తామన్నారు. మొదటి ముద్దాయి చంద్రబాబు ‘రాజధానిలో ఇన్సైడర్ ట్రేడింగ్పై విచారణకు ఆదేశించాలి. అమరావతిలో నాలుగేళ్లలో నాలుగు బిల్డింగులు కూడా కట్టని చంద్రబాబు చేతగాని వ్యక్తి. చంద్రబాబుది దద్దమ్మ ప్రభుత్వం. అందువల్లే అమరావతిలో నిర్మాణాలు పూర్తి చేయలేదు. అమరావతిలో మొదటి ముద్దాయి చంద్రబాబు. అమరావతి పేరుతో సేకరించిన నిధులు స్వాహా చేశారు. అమరావతిలో వేల కోట్లు దుర్వినియోగం చేశారు’ అని టీడీపీ అధినేత చంద్రబాబు తీరును జీవీఎల్ ఎండగట్టారు. కాగా రాజధాని అంశం రాష్ట్ర పరిధిలోని అంశమని.. అభివృద్ధి వికేంద్రీకరణ నిర్ణయాన్ని తాము సమర్థిస్తున్నట్లు జీవీఎల్ గతంలో పేర్కొన్న విషయం తెలిసిందే.(3 రాజధానులు: జీవీఎల్ కీలక వ్యాఖ్యలు) అభివృద్ధి వికేంద్రీకరణ మా సిద్ధాంతం.. అభివృద్ధి వికేంద్రీకరణ తమ సిద్ధాంతమని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధే తమ మొదటి ప్రాధన్యత అని పేర్కొన్నారు. రాయలసీమలో హైకోర్టు ఏర్పాటుకు సహకరిస్తామని తెలిపారు. అమరావతిని చంద్రబాబు రియల్ ఎస్టేట్కు అడ్డాగా మార్చారని మండిపడ్డారు. జనసేనతో కలిసి తాము పోరాటం చేస్తామని... రాజధాని నిర్మాణానికి అదనంగా సేకరించిన భూములు వెనక్కి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. చంద్రబాబుకు నమస్కరిస్తున్నా: చెవిరెడ్డి సర్వతోముఖాభివృద్ధే మా లక్ష్యం అమరావతి దుస్థితికి బాబే కారకుడు! -
ముఖ్యమంత్రి x కేంద్రమంత్రి
తిరువనంతపురం: పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) అమలుకు సంబంధించి కేరళ ప్రభుత్వానికి, కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్కు మధ్య వాగ్యుద్ధం జరుగుతోంది. కేరళలో సీఏఏ అమలుచేయబోమన్న రాష్ట్ర అసెంబ్లీ తీర్మానంపై కేంద్ర ప్రభుత్వం విరుచుకుపడింది. పౌరసత్వంపై చట్టాలను రూపొందించే అధికారం కేవలం పార్లమెంట్కు మాత్రమే ఉంటుందని.. కేరళసహా మరే ఇతర రాష్ట్రానికి ఉండబోదన్న కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ఆరోపించారు. రవిశంకర్ వ్యాఖ్యలపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ బుధవారం మండిపడ్డారు. రాష్ట్ర అసెంబ్లీలకు కూడా సొంత హక్కులు ఉంటాయని స్పష్టం చేశారు. ఆ హక్కులకు ప్రత్యేక రక్షణ ఉంటుందని.. వాటిని ఎవరూ ఉల్లంఘించరాదని తేల్చిచెప్పారు. రాజ్యాంగ ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లే తీరుగా ఉన్న పౌరసత్వ చట్టాన్ని అమలు చేసేది లేదని తీర్మానించిన తొలి రాష్ట్రం కేరళ అని అన్నారు. పార్లమెంట్ ఆమోదించిన చట్టాలను రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయాల్సిందేనని రవిశంకర్ అన్నారు. పార్లమెంట్ చట్టాలను అమలుచేయబోమని చెప్పే అధికారం రాష్ట్రాలకు లేదని తేల్చిచెప్పారు. కాగా.. సీఏఏ అమలు చేయబోమని కేరళ ప్రభుత్వం తీర్మానించడం పార్లమెంటరీ అధికారాల ఉల్లంఘన కిందకు వస్తుందని, దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు రాజ్యసభ చైర్మన్ వెంకయ్యకు లేఖ రాశారు. -
రాజధానిపై కేంద్రం జోక్యం చేసుకోదు
రాజధాని విషయంలో కేంద్రం జోక్యం చేసుకోదు. నేను ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి.. కేంద్ర ప్రభుత్వ ఆలోచన మేరకే చెబుతున్నా. జాతీయ అధికార ప్రతినిధిగా ఐదేళ్లలో నేను చెప్పిందేదీ మా పార్టీ కాదనలేదు. – జీవీఎల్ నరసింహారావు సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో కేంద్ర ప్రభుత్వ జోక్యం ఉండదని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు స్పష్టం చేశారు. ఇది పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా అధికారికంగా చెప్పే మాట అని పేర్కొన్నారు. ఇతర ఎంపీలు, నేతల ప్రకటనలు వారి వ్యక్తిగతం అని స్పష్టీకరించారు. దక్షిణాదిలో ఉండే ఐదు రాష్ట్రాలలో తానొక్కడినే పార్టీ అధికార ప్రతినిధినని, తాను చెప్పే విషయాలే అధికారికం అని అన్నారు. విజయవాడలో సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘ఇది (రాజధాని తరలింపు అంశం) కేంద్ర ప్రభుత్వ పరిధిలోనిది కాదు. కేంద్రం జోక్యం చేసుకొని ఏదో చేయాలనే ఆలోచన ఉంటే.. అది మన వ్యవస్థకు లోబడి చేయడానికి విరుద్ధమైనది. దీనికే కట్టుబడి ఉన్నాం. నేను అధికారికంగా ఈ విషయం చెబుతున్నా. మీరు బాండ్ రాసివ్వమంటే ఆ అవసరం మాకు లేదు’ అని జీవీఎల్ అన్నారు. తమ పార్టీలో పార్లమెంట్లో సభ్యులు కాని వారు చాలా మంది ఈ విషయంలో ఏం మాట్లాడినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమేనన్నారు. రాజధాని తరలింపు గురించి రాష్ట్ర ప్రభుత్వం.. కేంద్రం దృష్టికి తీసుకొస్తే అప్పుడు ఏదైనా సూచన చేయొచ్చేమో గానీ, కేంద్రం తనంతట తాను జోక్యం చేసుకోదని ఆయన స్పష్టం చేశారు. రాజధాని అమరావతిలోనే పెట్టండని నాడు కేంద్రం చెప్పిందా? పార్టీలో నేతలు ఒకే మాటపై లేరన్న ప్రశ్నకు సమాధానమిస్తూ.. టీడీపీలోనూ ఈ అంశంపై ఒక మాట మీద లేరు కదా అని ఆయన ప్రశ్నించారు. గంటా శ్రీనివాసరావు మరో రకంగా మాట్లాడుతున్నారని గుర్తు చేశారు. అన్నదమ్ములు (చిరంజీవి, పవన్కల్యాణ్లు) ఒక మాట మీద లేరన్నారు. అయినా.. రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ఒక స్పష్టమైన ప్రతిపాదనను వెల్లడించలేదని చెప్పారు. ‘వ్యవస్థలో తనకున్న అధికారాలకు లోబడే కేంద్రం పని చేస్తుంది. రాజధాని అమరావతిలోనే పెట్టండని అప్పుడు కేంద్రం చెప్పలేదు. ఇప్పుడు ఇక్కడి నుంచి మార్చండని, మార్చ వద్దని చెప్పదు. ఈ అంశంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కూడా ఎక్కడా చెప్పలేదు. రాజధాని తరలింపు జరిగితే రైతులకు న్యాయం జరగాలని ఒక పార్టీ నేతగా, వ్యక్తిగా చెబుతున్నానన్నారు. రైతులకు న్యాయం చేసే అంశం, రాజధాని తరలించకుండా కేంద్రం జోక్యం చేసుకునే అంశం.. రెండూ వేర్వేరు అని చెప్పారు. పౌరసత్వ చట్ట సవరణ బిల్లు, ఎన్పీఆర్ ప్రక్రియలపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవపట్టిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. -
ఒకేచోట అభివృద్ధితో సీమాంధ్రకు దారుణ నష్టం
సాక్షి, న్యూఢిల్లీ: అధికార వికేంద్రీకరణను తాము స్వాగతిస్తున్నామని, సమర్థిస్తున్నామని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు తెలిపారు. ‘గతంలో హైదరాబాద్ కేంద్రంగా జరిగిన అభివృద్ధి వల్లే సీమాంధ్ర దారుణంగా నష్టపోయింది. ఇప్పుడు రాష్ట్ర అవసరాలే ప్రాతిపదికగా వికేంద్రీకరణ ఉండాలి. ఒకచోటే కేంద్రీకరిస్తే అన్ని మౌలిక సదుపాయాలు అక్కడే కల్పించాల్సి వస్తుంది’ అని పేర్కొన్నారు. రాజధానిపై నియమించిన శివరామకృష్ణన్ కమిటీలో రాజకీయ నాయకులు ఎవరూ లేరని, కమిటీ వికేంద్రీకరణకు సిఫారసు చేసిందన్నారు. సచివాలయం కూడా ఒకేచోట ఉండాల్సిన అవసరం లేదని కమిటీ చెప్పిందన్నారు. జీవీఎల్ బుధవారం తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. ‘పలు దేశాల్లో, రాష్ట్రాల్లో రాజధాని ఒకచోట, హైకోర్టు మరోచోట ఉన్న సందర్భాలు అనేకం ఉన్నాయి. రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలని బీజేపీ కూడా చాలా సందర్భాల్లో డిమాండ్ చేసింది. గత ప్రభుత్వం ఆ డిమాండ్లను విస్మరించింది’ అని చెప్పారు. రాజధానిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. దానిపై వెంటనే చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. కేంద్రం నిర్దేశించే పరిస్థితి లేదు ‘రాజధానిని రాష్ట్రం ఎంచుకున్న చోట మౌలిక వసతుల కోసం కేంద్రం సాయం చేస్తుందని పునర్ వ్యవస్థీకరణ చట్టంలో ఉంది. ఇంతకు మించి కేంద్ర ప్రభుత్వ పరిధి ఏమీ లేదు. ఇది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశం. రాజధాని ఎక్కడ ఉండాలో కేంద్రం నిర్దేశించే పరిస్థితి లేదు. శివరామకృష్ణన్ కమిటీ సిఫార్సులను గత ప్రభుత్వం బేఖాతరు చేసింది. కమిటీ చేసిన కొన్ని ప్రతిపాదనలను నేడు సీఎం జగన్ అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తోంది’ అని పేర్కొన్నారు. ఒకవైపు ఆక్వా.. మరోవైపు ఖనిజ సంపద ‘వికేంద్రీకరణను బీజేపీ స్వాగతిస్తుంది. ఏపీలో ఆక్వా కల్చర్ ఒకవైపు ఉంటే గనులు, ఖనిజాలు మరోవైపు ఉన్నాయి. రాజధానిలో ప్రజా ప్రయోజన కోణం ఉండాలే కానీ రాజకీయ కోణం, సామాజిక కోణం ఉండకూడదు. అలాంటి చర్యను మేం సమర్థించం. రాజధాని ప్రాంత రైతుల్లో ఆందోళన ఉంది. వారికి నష్టం జరగకుండా నిర్ణయాలు తీసుకోవాలి. అమరావతిని అసెంబ్లీకే పరిమితం చేయకుండా చూడాలి’ అని సూచించారు. -
3 రాజధానులు: జీవీఎల్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిల్లీ: ఒకేచోట రాజధాని నిర్మాణంతో ఆర్థికాభివృద్ధి జరగదని బీజేపీ అధికార ప్రతినిధి, ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. రాజధాని అంశం రాష్ట్ర పరిధిలోని అంశమని.. అభివృద్ధి వికేంద్రీకరణ నిర్ణయాన్ని తాము సమర్థిస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు నష్టం జరగకుండా చూసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి విఙ్ఞప్తి చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా వికేంద్రీకరణ దిశగా ఆలోచించి అడుగులు వేయాలని, ఇందులో భాగంగా మూడు రాజధానులు రావాల్సిన పరిస్థితి కనిపిస్తోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వ్యాఖ్యల నేపథ్యంలో బుధవారం జీవీఎల్ విలేకరులతో మాట్లాడారు. రాజధాని విషయంలో సీఎం జగన్ ప్రకటనపై ఇంకా స్పష్టత రావాల్సి ఉందన్నారు. నిపుణుల కమిటీ నివేదిక వచ్చిన తర్వాత ఎవరూ నష్టపోకుండా అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా రాజధాని అంశంపై శివరామకృష్ణ కమిటీ చేసిన సూచలను జీవీఎల్ ప్రస్తావించారు. ‘ శివరామకృష్ణ కమిటీ కూడా వికేంద్రీకరణ జరగాలని చెప్పింది. అయితే గత ప్రభుత్వం రిపోర్టులు, గ్రాఫిక్స్కే పరిమితమైంది. చంద్రబాబు కూడా గతంలో నారాయణ కమిటీని నియమించి అమరావతిలో నిర్మాణం చేపట్టారు. అధికార వికేంద్రీకరణను పట్టించుకోలేదు. దీంతో సీమాంధ్ర చాలా నష్టపోయింది. నిజానికి ఒకేచోట రాజధాని నిర్మాణంతో అభివృద్ధి జరగదు’ అని అభిప్రాయపడ్డారు. చాలా రాష్ట్రాల్లో రాజధాని ఒకచోట, హైకోర్టు మరోచోట ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. హైదరాబాద్ విషయంలో చేసిన తప్పును పునరావృతం చేయడం సరికాదని వ్యాఖ్యానించారు.(ఆంధ్రప్రదేశ్కు 3 రాజధానులు!) అదే విధంగా గత ప్రభుత్వ హయాంలో రాజధాని పరిసర ప్రాంతాల్లో జరిగిన భారీ అవినీతి గురించి మాట్లాడుతూ.. ‘ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని టీడీపీ నేతలపై ఆరోపణలు ఉన్నాయి. వారిపై ఎలాంటి చర్యలు ఉండబోతున్నాయి. అలాగే రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు ప్లాట్లను అభివృద్ధి చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. వెంటనే ఏపీ ప్రభుత్వం ఈ విషయంపై స్పష్టతనిచ్చి నిర్ణయం తీసుకోవాలి’ అని జీవీఎల్ పేర్కొన్నారు. అదే విధంగా శివరామకృష్ణ కమిటీ సూచలను మరోసారి పరిశీలించాలని ప్రభుత్వాన్ని కోరారు. -
వికేంద్రీకరణను సమర్థిస్తున్నాం: జీవీఎల్
-
రాహుల్ జిన్నా అయితే బావుంటుంది : జీవీఎల్
న్యూఢిలీ: ‘తన పేరు రాహుల్ సావర్కర్ కాదని... రాహుల్ గాంధీ’ అని కాంగ్రెస్ పార్టీ నాయకుడు, రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహరావు మండిపడ్డారు. రాహుల్ గాంధీకి రాహుల్ జిన్నా అనే పేరు అయితే సరిగా సెట్ అవుతుందని విమర్శించారు. ముస్లింలను మెప్పించేలా రాజకీయాలు చేస్తున్నా రాహుల్కు సావర్కర్ అనే పేరు కంటే ముహమ్మద్ అలీ జిన్నా పేరు అయితే కరెక్ట్గా సరిపోతుందని ఎద్దేవా చేస్తూ ట్విట్ చేశారు. నా పేరు రాహుల్ సావర్కర్ కాదు : ఢిల్లీలో జరిగిన భారత్ బచావో ర్యాలీలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. తాను నిజాలు నిర్భయంగా మాట్లాడతానని.. అందుకు ఎన్నటికీ క్షమాపణ చెప్పబోనని అన్నారు. తన పేరు రాహుల్ సావర్కర్ కాదని... రాహుల్ గాంధీ అంటూ బీజేపీ విమర్శలను తిప్పికొట్టారు. రాహుల్ వ్యాఖ్యలను బీజేపీ తీవ్రంగా తప్పుపట్టింది. కాంగ్రెస్ చేపట్టిన ర్యాలీ.. భారత్ బచావ్ కాదని, కాంగ్రెస్ బచావో అని జీవీఎస్ ఎద్దేవా చేశారు. కుటుంబంతో విహారయాత్రకు వెళ్లారంటూ హేళన చేశారు. అధికారం రాని కారణంగా వారు (కాంగ్రెస్ పార్టీ) పడుతున్న బాధలను ప్రదర్శించడానికే ఈ ర్యాలీని నిర్వహించారని కాంగ్రెస్ పార్టీని జీవీఎల్ నరసింహరావు దుయ్యబట్టారు. The more appropriate name for you @RahulGandhi is RAHUL JINNAH. Your Muslim appeasement politics and mindset makes you a worthy legatee of Mohammad Ali Jinnah, not Savarkar. #RahulJinnah https://t.co/NzvAmuLxQB — GVL Narasimha Rao (@GVLNRAO) December 14, 2019 ఇక ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా భారత ఆర్థికవ్యవస్థను నాశనం చేశారని రాహుల్గాంధీ ఆరోపణలు చేయడాన్ని తప్పుపడుతూ.. దేశ శత్రువులందరూ భారతదేశానికి బలమైన ఆర్థిక వ్యవస్థను నాశనం కావాలని కోరుకుంటున్నారని చెప్పారు. -
ఎంపీల విదేశీ పర్యటనలపై చట్టం తేవాలి
న్యూఢిల్లీ: ఎంపీలు విదేశీ పర్యటనలు చేసినప్పుడు దానికి సంబంధించిన వివరాలతో పాటు ఖర్చుల వివరాలు తప్పనిసరిగా వెల్లడించేలా చట్టాన్ని తీసుకురావాలని బీజేపీ ఎంపీ కోరారు. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ రహస్య విదేశీ పర్యటనల నేపథ్యంలో ఆ పార్టీ లక్ష్యంగా ఎంపీ జీవీఎల్ నరసింహారావు ప్రజా ప్రాతినిధ్య (సవరణ) బిల్లుకు సంబంధించిన ఓ ప్రైవేట్ మెంబర్స్ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టారు. ‘విదేశీ ప్రభుత్వాలు, సంస్థల నుంచి స్వీకరించిన ఏ రకమైన ఆతిథ్యం అయినా సరే దాని వివరాలు రాజ్యసభ చైర్మన్కు గానీ, లోక్సభ స్పీకర్కు గానీ వెల్లడించాలి’అని బిల్లు తెలిపింది. కాగా, ఎంపీలు విదేశీ పర్యటనల వివరాలు తెలపాలని 2017లోనే మార్గదర్శకాలు జారీ అయ్యాయని, 2019 జూలైలోనూ పార్లమెంటరీ వ్యవహారాల శాఖ దీన్ని పునరుద్ఘాటించిందని జీవీఎల్ పేర్కొన్నారు. -
‘పవన్ ఆ ప్రతిపాదనతో వస్తే ఆహ్వానిస్తాం’
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో మత సామరస్యం లేకపోవడానికి హిందూ నాయకులే కారణమంటూ జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహరావు ఖండించారు. బుధవారం జీవీఎల్ మీడియాతో మాట్లాడుతూ.. మత ఘర్షణలకు హిందువులే కారణమంటూ చెప్పడం వెనక పవన్కు రాజకీయ దురుద్దేశం ఉందని మండిపడ్డారు. పవన్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. టీడీపీ నేతలు బీజేపీతో కలిసే ఉన్నారని, కేంద్ర పెద్దలు అంటే తనకెంతో గౌరవం ఉందంటూ పవన్ చెప్తున్నారని జీవీఎల్ తెలిపారు. బీజేపీ విధానాలు నచ్చి కలిసి పని చేయాలనుకునే ప్రాంతీయ పార్టీల విలీనాన్ని స్వాగతిస్తామని చెప్పారు. పవన్ విలీన ప్రతిపాదనతో వస్తే కచ్చితంగా ఆహ్వానిస్తామని.. అందుకు తన వంతు సహకారం అందిస్తానని పేర్కొన్నారు. ఎన్నికల ముందే జనసేన పార్టీని బీజేపీలో విలీనం చేయాలని కోరినప్పటికీ పవన్ అంగీకరించలేదని వ్యాఖ్యానించారు. మరోవైపు పొత్తులకు ఇది సమయం కాదని అభిప్రాయపడ్డారు. ఏపీకి 3 స్మార్ట్ సిటీలు మాత్రమే కేటాయించారు : టీజీ స్మార్ట్ సిటీల కేటాయింపులో ఆంధ్రప్రదేశ్కు అన్యాయం జరిగిందని బీజేపీ ఎంపీ టీజీ వెంకటేశ్ అన్నారు. అభివృద్ధి చెందిన తమిళనాడు రాష్ట్రానికి 11 స్మార్ట్ సిటీలు కేటాయిస్తే, కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేవలం 3 మాత్రమే కేటాయించారని ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గత నాలుగేళ్ల కింద ప్రారంభమైన అమృత్ పథకంలో భాగంగా కర్నూలు పట్టణ త్రాగునీటి అవసరాలకు నిధులు కేటాయించారని వాటిని సక్రమంగా ఖర్చుపెట్టి సకాలంలో పనులు పూర్తయ్యేలా చొరవ తీసుకోవాలని కేంద్రాన్ని కోరామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని సకాలంలో పనులు పూర్తి చేసినట్లయితే కర్నూలు జిల్లా ప్రజల నీటి కష్టాలు తొలుగుతాయని టీజీ పేర్కొన్నారు. -
చంద్రబాబుకు బీజేపీ బంపర్ ఆఫర్
-
‘టీడీపీని విలీనం చేస్తానంటే అధిష్టానంతో మాట్లాడతా’
సాక్షి, విజయవాడ : ఓడిపోయిన పార్టీ నుంచి పది మంది నాయకులు వస్తే తమ పార్టీ బలపడదని బీజేపీ నేత, రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు పేర్కొన్నారు. కొందరు రాజకీయ భవిష్యత్ కోసం బీజేపీలో చేరుతున్నారని అలాంటి వారితో పార్టీ బలపడదని స్పష్టం చేశారు. శనివారం విజయవాడలో ఓ కార్యక్రమంలో పాల్గొన జీవీఎల్ అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై విమర్శల వర్షం కురిపించారు. టీడీపీ అంటే విశ్వసనీయత, సిద్దాంతం లేని పార్టీ అని ఎద్దేవా చేశారు. చంద్రబాబు దగ్గర ఏముందని ఆయనతో కలిసి ముందుకు వెళతామని ప్రశ్నించారు. టీడీపీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరారని, ఆ పార్టీ లోక్సభ సభ్యులు బీజేపీకి అవసరం లేని సమయంలో టీడీపీతో ఎందుకు కలుస్తామన్నారు. భవిష్యత్ గురించి భయపడే చంద్రబాబు కేంద్రంతో విభేదించమని మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. కులాలు, మతాలతో రాజకీయాలు చేయాలని చంద్రబాబు చూశారని మండిపడ్డారు. జీవీఎల్ ఇంకా ఏమన్నారంటే ఆయన మాటల్లోనే.. అవినీతికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి ‘చంద్రబాబును మేము భయపెట్టడం లేదు. అవినీతి ఎవరు చేసిన శిక్ష తప్పదు అని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. మోదీ మాటలకు భుజాలు తడుముకొంటే మేము ఏమి చేయలేము. పోలవరంలో అవినీతి జరగలేదని మా పార్టీ నేతలు ఎవరూ చెప్పలేదు. పోలవరంలో దాదాపు రూ. 2200 కోట్ల మేర అవినీతి జరిగిందని నిపుణుల కమిటీ నిర్ధారించింది. దానిపై రివర్స్ టెండరింగ్ వెళ్లామని రాష్ట్ర ప్రభుత్వం చెపుతోంది. పోలవరం, అమరావతిలో అవినీతికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి. ప్రజా ధనం దుర్వినియోగం కాకుండా కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అప్పు తీసుకోవడం తప్పుకాదు, దాన్ని ఎన్నికల్లో గెలవడం కోసం దుర్వినియోగం చేయడం చేయడం తప్పు. అప్పు చేసిన చంద్రబాబు పసుపు కుంకుమ కింద ప్రజా ధనాన్ని ఖర్చు చేశారు. టీడీపీని బీజేపీలో విలీనం చేసే ఉద్దేశం ఉంటే చెప్పండి గతంలో చంద్రబాబు పోలవరంపై కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులకు లెక్కలు అడిగాము. వాటికి చంద్రబాబు లెక్కలు చెప్పలేదు. ఖర్చు చేసిన నిధులకు చంద్రబాబు లెక్కలు ఎందుకు చెప్పలేక పోతున్నారో అర్ధం కావడం లేదు. చంద్రబాబుకు బీజేపీలో టీడీపీని విలీనం చేసే ఉద్దేశం ఉంటే నేను మా అధిష్టానంతో మాట్లాడుతాను. సుజనా చౌదరి చంద్రబాబు గురించి అమిత్ షా తో ఎందుకు మాట్లాడుతున్నారో నాకు తెలియదు. మోదీని చాలా నీచంగా చంద్రబాబు తిట్టారు. దేశంలో ఏ నాయకుడు తిట్టని విధంగా తిట్టారు. రుణాలు ఎగవేత విషయంలో ఎవరు తప్పించుకోలేరు. దీనికి సుజనాచౌదరి కూడా అతీతుడు కాదు. అందరిలాగే సుజనాచౌదరి కూడా బ్యాంక్లకు రుణాలు కట్టాల్సిందే. ఆయన బీజేపీలో చేరినంత మాత్రాన ఎలాంటి మినహాయింపు ఉండదు ఆ రెండు రాష్ట్రాల్లో బీజేపీనే గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు గెలవబోతున్నారనే దానిపై ఆసక్తి ఉండేది. కానీ మహారాష్ట్రలో కాంగ్రెస్, ఎన్సీపిలు బీజేపీకి కనీస పోటీ ఇవ్వలేక పోతున్నాయి. దీంతో మహారాష్ట్రతో పాటు హరియాణలో బీజేపీ గెలవడం తథ్యం. తెలుగు రాష్ట్రాల్లో కూడా బలపడాలనే దాని మీద దృష్టి పెట్టాము. ఆంధ్రప్రదేశ్లో రైతుల సమస్యలు మీద దృష్టి పెట్టాము. రైతులకు గిట్టుబాటు ధర వచ్చేలా ప్రయత్నం చేస్తున్నాము. రాష్ట్రానికి మరిన్ని నిధులు జాతీయ సంస్థలు ఆంధ్రప్రదేశ్ కు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. జలజీవన్ మిషన్ ద్వారా లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు రాబోతున్నాయి. జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి నీటిని అందిస్తాము. రద్దు చేస్తారని ఎవరూ ఊహించలేదు గతంలో 55 శాతం గ్రామాలకు రోడ్లు ఉంటే మోదీ హయాంలో 90 శాతం గ్రామాలకు రోడ్లు వచ్చాయి. వచ్చే ఐదేళ్లలో ఆర్థిక వ్యవస్థను 5 ట్రిలియన్ డాలర్లకి పెంచే విధంగా కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. ప్రధాని 370 ఆర్టికల్ రద్దు చెస్తారని ఎవరూ ఊహించలేదు. 370 ఆర్టికల్ ను ప్రపంచ సమస్యగా చూపించే ప్రయత్నం పాకిస్థాన్ చేసింది. అయితే ప్రపంచ దేశాలు మద్ధతు భారతదేశం కు లభించేలా మోదీ చేశారు. రాబోయే రోజుల్లో ప్రపంచంలో భారతదేశం మూడవ ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుంది’ అంటూ జీవీఎల్ నరసింహారావు పేర్కొన్నారు. -
రివర్స్ టెండరింగ్తో ఆదా ఆహ్వానించదగ్గ విషయం
సాక్షి, విశాఖపట్నం : పోలవరం ప్రాజెక్టులో చేపట్టిన ‘రివర్స్ టెండరింగ్’లో రూ. 200 కోట్లు ఆదా అయిందంటే ఆహ్వానించదగ్గ పరిణామమేనని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు అన్నారు. ఖర్చు తగ్గించి పోలవరం నిర్మిస్తామంటే కేంద్రానికి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వంద రోజుల పాలనలో కేంద్ర ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుందని అన్నారు. కార్పోరేట్లో పన్ను తగ్గింపుతో పెట్టుబడులు వస్తాయని తెలిపారు. పెట్టుబడులు రావటం వల్ల యువతకు ఉద్యోగాలు లభిస్తాయని అన్నారు. రాష్ట్రాభివృద్ధికి కేంద్రం పూర్తి సహకారం అందిస్తుందని చెప్పారు. విశాఖ - చెన్నై పారిశ్రామిక కారిడార్ అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. విశాఖ అభివృద్ధికి కేంద్రం అన్ని రకాలుగా సహాయం అందిస్తుందని అన్నారు. భారత ప్రభుత్వం తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలను ప్రపంచ దేశాలు మెచ్చుకుంటున్నాయని పేర్కొన్నారు. ప్రపంచమంతా భారతదేశాన్ని విశ్వశక్తిగా.. ప్రధాని నరేంద్రమోదీని విశ్వనాయకుడిగా గుర్తిస్తోందని అన్నారు. టీడీపీ సొంత తప్పిదాల వల్లే ఓటమి మూటగట్టుకుందని అన్నారు. పీపీఏల్లో అవినీతి లేదని తాము చెప్పటం లేదని, సూచన మాత్రమే చేశామని తెలిపారు. పార్టీలోకి వచ్చినంత మాత్రన కేసులు మాఫీ కావు బీజేపీ అవినీతికి ఎప్పుడూ వ్యతిరేకమేనని, తమ పార్టీలోకి వచ్చినంత మాత్రాన వారి కేసులు మాఫీ కావని జీవీఎల్ నరసింహరావ్ స్పష్టం చేశారు. టీడీపీనుంచి వచ్చిన వాళ్లు బీజేపీ భావజాలంతోనే పని చెయ్యాలని తెలిపారు. వారి కేసులకు సంబంధించి వారే సమాధానం చెప్పుకోవాలని అన్నారు. -
కర్నూలులో హైకోర్టు డిమాండ్ చేసింది బీజేపీనే
సాక్షి, కర్నూలు : కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని దీక్ష చేస్తున్న న్యాయవాదులకు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు సంఘీభావం తెలిపారు. రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలని మొదటగా డిమాండ్ చేసింది బీజేపీనేని, ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి హైకోర్టును రాయలసీమలో ఏర్పాటు చేస్తారని కోరుతున్నామన్నారు. రాజధాని విషయంలో చంద్రబాబు చేసిన తప్పు ప్రస్తుత సీఎం జగన్ చేయరని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. అక్టోబర్ 2 నుంచి పదిహేను రోజులపాటు ప్రజా సమస్యలపై, రైతులు ఆత్మహత్య చేసుకున్న ప్రాంతాల్లో పాదయాత్ర నిర్వహిస్తామని వెల్లడించారు. జల సంరక్షణ పథకం ద్వారా దేశంలోని ప్రతి కుటుంబానికి మంచినీటి సరఫరా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందని జీవీఎల్ తెలిపారు. -
గత ప్రభుత్వం ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసింది
-
రాజధాని నిర్మాణ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే
-
‘రామాయపట్నం పోర్టుకు ఏపీ ప్రభుత్వం సానుకూలం’
సాక్షి, ప్రకాశం : గత టీడీపీ ప్రభుత్వం ప్రకాశం జిల్లాపై కక్ష సాధించిందని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీల్ నరసింహారావు విమర్శించారు. శుక్రవారం రామాయపట్నం పోర్టు ఏరియాను పరిశీలించిన జీవీఎల్.. పోర్టు వల్ల జరిగే మంచి చెడుల గురించి గ్రామస్తులతో చర్చించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రామాయపట్నం పోర్టు నిర్మాణానికి అన్ని అనుకూలంగా ఉన్నా గత టీడీపీ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఆలోచించలేదని మండిపడ్డారు. పోర్టుపై కేంద్ర ప్రభుత్వం లేఖ రాసినా.. టీడీపీ ప్రభుత్వం సమాధానం ఇవ్వలేదని చెప్పారు. రామాయపట్నం పోర్టుకు సహజ అనుకూలతలు ఉన్నాయని వివరించారు. కానీ ప్రస్తుతం ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పోర్టుకు సానుకూలంగా ఉందన్నారు. పోర్టు కోసం తాను కూడా గట్టిగా ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు. దీనిపై అవసరమైతే ప్రధానితో కూడా మాట్లాడతానని పేర్కొన్నారు. -
విశాఖ, విజయవాడ మధ్య ‘డబుల్ డెక్కర్’
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో ప్రధాన నగరాలైన విశాఖపట్నం, విజయవాడల మధ్య ఉదయ్ డబుల్ డెక్కర్ రైలును త్వరలోనే ప్రారంభించనున్నట్టు కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఈ రైలు వారంలో 5 రోజులు సేవలు అందించనున్నట్టు పేర్కొన్నారు. ఈ రైలు రాకతో రెండు నగరాల మధ్య రవాణా మరింత మెరుగవుతుందని ఆయన ఆకాక్షించారు. విజయవాడ, విశాఖపట్నం మధ్య ఉదయ్ డబుల్ డెక్కర్ ఎక్స్ప్రెస్ను ప్రవేశపెట్టాలని కోరుతూ రెండు నెలల క్రితం బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు, రైల్వే మంత్రికి లేఖ రాశారు. దీనిపై స్పందించిన గోయల్ ఈ మేరకు సమాధానమిచ్చారు. ఈ విషయాన్ని జీవీఎల్ గురువారం ట్విటర్ ద్వారా వెల్లడించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీకి జీవీఎల్ కృతజ్ఞతలు తెలిపారు. -
పార్లమెంటులో చరిత్ర సృష్టించాం : జీవీఎల్
సాక్షి, న్యూఢిల్లీ : 70 ఏళ్ల పురాతన అధికరణాన్ని రద్దు చేసి పార్లమెంటులో చరిత్ర సృష్టించామని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు వ్యాఖ్యానించారు. ‘ఇది సువర్ణాక్షరాలతో లిఖించే రోజు’ అంటూ ఆనందం వ్యక్తం చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మూడింట రెండు వంతుల మెజారిటీతో బిల్లు పాసయిందని తెలిపారు. రాజ్యసభలో తమకు మెజారిటీ లేకపోయినా బిల్లు పాస్ చేయించామన్నారు. ఆర్టికల్ 370 కారణంగా జమ్మూకశ్మీర్ తీవ్రంగా వెనుకబడిందని పేర్కొన్నారు. తాజాగా తీసుకొచ్చిన బిల్లులతో జమ్మూకశ్మీర్లో నూతన పరిపాలనకు నాంది పలుకుతుందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఉంటే అసాధ్యమనేది లేదని మరోసారి రుజువైందన్నారు. -
ఆర్ అండ్ ఆర్లో భారీ అక్రమాలు: జీవీఎల్
న్యూఢిల్లీ : పోలవరం ప్రాజెక్టులో భారీగా అక్రమాలు జరిగాయని బీజేపీ అధికార ప్రతినిధి, ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఆరోపించారు. సహాయ పునరావాస ప్యాకేజీ(ఆర్ అండ్ ఆర్)లో భారీగా ప్రజాధనం దోచుకున్నారని మండిపడ్డారు. సోమవారం ఆయన మాట్లాడుతూ..లేని ఇళ్లను ఉన్నట్లుగా చూపి నష్టపరిహారం దండుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చెట్లు, ట్యూబువెల్స్ పేరుతో ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీలో భారీగా డబ్బు దోచుకున్నారని పేర్కొన్నారు. ఈ విషయాలపై విచారణ జరుపుతున్నారా అని రాజ్యసభలో ప్రశ్నించినట్లు తెలిపారు. అదే విధంగా ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీలో అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కోరతానని పేర్కొన్నారు. -
అక్రమ కట్టడాలపై ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నా
-
రైతులకు పింఛన్లు, ప్రతీ ఇంటికి నీటి సరఫరా!
సాక్షి, గుంటూరు : గత 60 ఏళ్ళలో జరగని అభివృద్ధిని ప్రధాని నరేంద్ర మోదీ ఐదేళ్లలో చేసి చూపించారని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. ఆయన చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలే తమ పార్టీకి మరోసారి అధికారాన్ని కట్టబెట్టాయని పేర్కొన్నారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ..ఆంధ్రప్రదేశ్లో టీడీపీ ప్రభుత్వం పూర్తిగా అవినీతిలో నడిచిందని విమర్శించారు. కేవలం కేంద్రంపై అభాండాలు వేయడం కోసమే వారు సమయం కేటాయించారన్నారు. టీడీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి కేవలం మీడియాలో మాత్రమే కనబడిందని ఎద్దేవా చేశారు. భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన కేంద్ర ప్రభుత్వం త్వరలోనే మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుందని వెల్లడించారు. రైతులకు పింఛన్లు, దేశ వ్యాప్తంగా ప్రతి ఇంటికి పైపుల ద్వారా మంచి నీటిని ఇచ్చేందుకు ప్రణాళికలు రచిస్తోందన్నారు. అందుకే బిల్లులు నిలిచిపోయాయి.. రాజ్యసభలో రాజ్యసభలో బీజేపీకి సరిపడా బలం లేకపోవడం వల్ల చాలా బిల్లులు నిలిచిపోయాయని జీవీఎల్ తెలిపారు. అయితే ఇప్పుడు పెద్దల సభలో బీజేపీ బలం క్రమంగా పెరుగుతోందని.. 2022 నాటికి ఎన్డీయేకు పూర్తి స్థాయి సంఖ్యా బలం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. చట్టసభలలో అల్లర్లు చేసి, బిల్లులను అడ్డుకున్న పార్టీలు ప్రజా క్షేత్రంలో ఘోరంగా దెబ్బతిన్నాయని ఎద్దేవా చేశారు. 2024లో కూడా అత్యధిక మెజారిటీతో బీజేపీ అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు. ఆరు నెలల నుంచి ఏడాది లోపు ఏపీలో పూర్తి స్థాయిలో తాము బలపడతామని విశ్వాసం వ్యక్తం చేశారు. బీజేపీలో చేరినప్పటికీ నాయకులపై ఉన్న అభియోగాలను వారు ఎదుర్కోవాల్సిందేనని తాజాగా బీజేపీలో చేరిన ఎంపీలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. -
ఏపీ గత ప్రభుత్వం అవినీతి పాలన అందించింది
-
బీజేపీలో చేరినా కేసులు ఎదుర్కోక తప్పదు: జీవీఎల్
ఢిల్లీ: టీడీపీకి ఆంధ్రప్రదేశ్లో భవిష్యత్తు లేదని, ఆ పార్టీ త్వరలోనే కనుమరుగవడం ఖాయమని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు జోస్యం చెప్పారు. ఢిల్లీలో జీవీఎల్ విలేకరులతో మాట్లాడుతూ..బీజేపీలో చేరే వారికి కేసుల నుంచి రక్షణ లభించదని చెప్పారు. ఎవరి కేసులు వారే వ్యక్తిగతంగా ఎదుర్కోక తప్పదన్నారు. చట్టప్రకారమే టీడీపీ రాజ్యసభపక్షం విలీనం అయ్యిందని వెల్లడించారు. కోవర్టు ఆపరేషన్లు కోసం వస్తోన్న వారిపై నిఘా ఉంటుందని వెల్లడించారు. వైఎస్సార్ కాంగ్రెస్ నుంచి ఏకంగా 23 మంది ఎమ్మెల్యేలను తీసుకుని నలుగురిని మంత్రులు చేసిన టీడీపీకి మా గురించి మాట్లాడే అర్హత లేదని విమర్శించారు. -
ఆయన స్వలాభం కోసమే టీఆర్ఎస్తో గొడవ
ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహా రావు మరోసారి తీవ్రంగా మండిపడ్డారు. ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో జీవీఎల్ విలేకరులతో మాట్లాడుతూ..తన స్వలాభం కోసమే టీఆర్ఎస్తో చంద్రబాబు తగవు పెట్టుకున్నారని ఆరోపించారు. ఏపీ, తెలంగాణ ప్రజలు చాలా మంచిగా కలిసి మెలిసి జీవిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఏపీ, తెలంగాణ మధ్య పెండింగ్ అంశాలను పరిష్కరించడానికి ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ఉన్నారని అన్నారు. కేంద్రానికి ఏపీ, తెలంగాణ రెండు కళ్లలాంటివని చెప్పారు. రెండు రాష్ట్రాల అభివృద్ధికి అన్ని విధాలా కృషి చేశామని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శలు చేయడంలో అర్ధం లేదన్నారు. ఏపీ ప్రయోజనాలను దెబ్బతీయడంలో చంద్రబాబే ప్రధాన దోషి అని ఆరోపించారు. ఎన్నికల్లో తుపానులాగా చంద్రబాబు ప్రభుత్వం తుడిచిపెట్టుకు పోవడం ఖాయమన్నారు. పోలవరం కాంట్రాక్టుల్లో తన వాటా తనకు వచ్చిందో లేదో తెలుసుకోవడానికి పర్యటనలు, సమీక్షలు చేస్తున్నారని ఆరోపించారు. పోలవరంలో వచ్చే డబ్బుపైనే చంద్రబాబు ఆశలు పెట్టుకున్నారని విమర్శించారు. రాష్ట్రంలో అనేక పెండింగ్ ప్రాజెక్టులున్నా కేవలం పోలవరంపైనే సమీక్ష నిర్వహించడంలో మతలబు ఏంటని ప్రశ్నించారు. బాబు కొత్త డ్రామాకు ఓట్లు వచ్చే పరిస్థితి లేదు చంద్రబాబు నాయుడి కొత్త డ్రామాలకు ఓట్లు వచ్చే పరిస్థితి లేదని జీవీఎల్ వ్యాఖ్యానించారు. చంద్రబాబు పాలనపై ప్రజలు ఇప్పటికే తీర్పు ఇచ్చేశారని అన్నారు. చంద్రబాబు పదవి త్వరలోనే ఊడిపోతుందని జోస్యం చెప్పారు. ప్రధాని మోదీని చంపడానికి అర్బన్ నక్సలైట్లు ప్రయత్నించారని ఆరోపించారు. తమ రాజకీయ ప్రయోజనాల కోసమే ఎన్నికల కమిషన్ను చంద్రబాబు బ్లాక్మెయిల్ చేస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాలు ఫలించే అవకాశమే లేదన్నారు. ఎన్నికల్లో ఎన్డీయే ప్రభుత్వానికి పూర్తి మెజారిటీ రాబోతుందని అభిప్రాయపడ్డారు. తమ సంతానానికి రాష్ట్ర బాధ్యతలు అప్పగించి ఢిల్లీకి రావాలని చంద్రబాబు, కేసీఆర్లు ఉబలాటపడుతున్నారని, కానీ వారి ఆశలు నెరవేరే అవకాశం లేదన్నారు. లోకేష్ సైతం ఓడిపోబోతున్నాడు మంగళగిరిలో చంద్రబాబు తనయుడు నారా లోకేష్ సైతం ఓడిపోబోతున్నాడని జోస్యం చెప్పారు. 2024 కల్లా బీజేపీ ఏపీ, తెలంగాణాల్లో నిర్ణయాత్మక శక్తి ఎదుగుతుందని వ్యాఖ్యానించారు. ఈ రెండు రాష్ట్రాలను బీజేపీకి కంచుకోటగా మారుస్తామని చెప్పారు. తెలంగాణాలో టీడీపీ అడ్రస్ పూర్తి గల్లంతైందని, ఏపీలో కూడా టీడీపీ చతికిలపడిందని అన్నారు. ఎన్నికల్లో ఎవరు కూడా చంద్రబాబును పట్టించుకోలేదని వ్యాక్యానించారు. -
‘బాబు పదవి 3 వారాల్లో ఊడటం ఖాయం’
ఢిల్లీ: మూడు వారాల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడి పదవి ఊడిపోవడం ఖాయమని బీజేపీ జాతీయ అధికార ప్రతినిథి జీవీఎల్ నరసింహారావు జోస్యం చెప్పారు. ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ..తన సమీక్షల వల్ల ఏదో వెలగబెట్టినట్లు ఆయన చేస్తోన్న ప్రకటనలు చూస్తుంటే అందరికీ నవ్వొస్తుందని ఎద్దేవా చేశారు. చంద్రబాబు పాలనలో కరవు కాటకాలతో రైతులు అల్లాడుతున్నా బాబు పట్టించుకోలేదని మండిపడ్డారు. ‘దొంగ డ్రామాలు చేస్తూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు. ఎన్నికల నియమావళిని రాజకీయం చేయాలని ఆరాటపడుతున్నారు. ఎన్నికల సంఘంతో చర్చించిన తర్వాతే కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుంది. రైల్వే జోన్ ప్రకటన సమయంలో ఇంకా ఎన్నికల ప్రకటన రానప్పటికీ ఎన్నికల సంఘం అనుమతితోనే రైల్వే శాఖ ప్రకటన చేసింద’ని వ్యాఖ్యానించారు. ‘స్థానికంగా కౌన్సిల్ ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఎన్నికల కమిషన్ అనుమతితో రైల్వే జోన్ ప్రకట చేశారు. ప్రతి దానికీ చంద్రబాబు రాజకీయం చేయడం వల్ల టెన్షన్ తప్ప ఆయనకు ఒరిగేదేమీ లేదు. మసూద్ అజార్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించడం మోదీ ప్రభుత్వ దౌత్య విజయం. దేశ భద్రతకు మా ప్రభుత్వం పెద్ద పీట వేస్తుంది అనడానికి ఇదొక నిదర్శనం. ఈ అంశంపై విపక్షాలు చచ్చు ప్రకటనలు చేస్తున్నాయ’ని ఆరోపించారు. -
ఏపీ అభివృద్ధిని అడ్డుకునే పార్టీలతో బాబు జతకడుతున్నారు
-
ఆంధ్రా ప్రయోజనాలకు బాబే అడ్డు: జీవీఎల్
ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహా రావు మరోసారి మండిపడ్డారు. ఓటమి భయంతోనే ఈసీ, ఈవీఎం, మోదీలపైన చంద్రబాబు సంబంధం లేని విమర్శలు చేస్తున్నారని విమర్శించారు. మంగళవారం ఢిల్లీలో జీవీఎల్ విలేకరులతో మాట్లాడుతూ..చంద్రబాబు నాయుడు డీఎంకేకు ఎందుకు మద్ధతు ఇస్తున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలని అడిగారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డీఎంకే అధ్యక్షులు ఎంకే స్టాలిన్ చెప్పారా అని సూటిగా ప్రశ్నించారు. కర్ణాటకకు పోయి ప్రచారం చేస్తున్నావ్.. ప్రత్యేక హోదాకు అక్కడి సీఎం కుమార స్వామి ఏమైనా మద్ధతిచ్చారా అని ప్రశ్న సంధించారు. మరి చంద్రబాబు ఎందుకు వారిని సమర్ధిస్తున్నారని అడిగారు. ఏపీ అభివృద్ధిని అడ్డుకునే పార్టీలతో చంద్రబాబు జతకడుతున్నారని విమర్శించారు. ఆంధ్రా ప్రయోజనాలకు అడ్డుపడుతోంది చంద్రబాబేనని స్పష్టంగా పేర్కొన్నారు. తెలంగాణ కేసీఆర్, ఆంధ్రాకు ప్రత్యేక హోదా ఇవ్వాలని మద్ధతు తెలిపితే ఆయనను విమర్శించడం చంద్రబాబుకే చెల్లిందన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు చౌకబారు మాటలు మానుకోవాలని సూచించారు. -
ఓటమి భయంతోనే ఈసీపై చంద్రబాబు ఆరోపణలు
సాక్షి, న్యూఢిల్లీ: ఎన్నికల్లో ఓటమి తప్పదన్న భయంతోనే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎన్నికల సంఘం (ఈసీ)పై ఆరోపణలు చేస్తున్నారని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. ఎన్నికల్లో ఓట్లు వేసిన 3 కోట్ల మంది ఆంధ్రులకు లేని అనుమానాలు చంద్రబాబుకే ఎందుకు వస్తున్నాయని ఆయన ప్రశ్నించారు. ఆదివారం జీవీఎల్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలు తాము ఏ పార్టీకి ఓటు వేసింది వీవీ ప్యాట్ల్లో చూసుకున్నారని తెలిపారు. ఎక్కడైనా తప్పులు జరిగి ఉంటే ప్రజలే ఫిర్యాదులు చేసేవారని పేర్కొన్నారు. 2014 ఎన్నికల్లో గెలిచినప్పుడు ఎందుకు ఈవీఎంల గురించి మాట్లాడలేదని చంద్రబాబును ప్రశ్నించారు. ఇప్పుడు ఎన్నికలు పూర్తయ్యాక ఈసీపై ఆరోపణలు చేస్తుండటం ద్వారా తాను ఓడిపోతున్నానని చంద్రబాబు ఢిల్లీలో దండోరా వేస్తున్నట్లు ఉందని ఎద్దేవా చేశారు. ఈవీఎంల పనితీరుపై సమావేశం నిర్వహించడం ద్వారా అందులో పాల్గొన్న పార్టీలన్నీ ఓటమిని ముందే అంగీకరించాయన్నారు. కాగా, ఈవీఎంల పనితీరుపై 2010లో తాను రాసిన పుస్తకాన్ని టీడీపీ ఇప్పడు చూపిస్తుండటాన్ని జీవీఎల్ ఆదివారం ఓ ప్రకటనలో తప్పుపట్టారు. గతంలో ప్రజలు ఎవరి ఓటు వేశారన్న విషయం వారి తెలిసేది కాదని, దీన్ని అధిగమించడానికి ప్రజలు ఎవరి ఓటు వేసింది తెలిసేలా చేయాలని డిమాండ్ చేస్తూ పుస్తకాన్ని రాశానన్నారు. ఈ నేపథ్యంలో వీవీ ప్యాట్లను ప్రవేశపెట్టారని, ఇప్పుడు వీటి ద్వారా ప్రజలు ఎవరికి ఓటు వేసింది స్పష్టంగా తెలుస్తుందన్నారు. -
ఓటమి భయంతోనే చంద్రబాబు ఈసీపై ఆరోపణలు : జీవీఎల్
-
టీడీపీ బాక్సులు గల్లంతు కావడం ఖాయం
సాక్షి, ఢిల్లీ : టీడీపీ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫ్రస్టేషన్లో ఉన్నారని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నర్సింహారావు విమర్శించారు. ఓటమి భయంతోనే చంద్రబాబు ఈసీపై ఆరోపణలు చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. జీవీఎల్ ఆదివారం న్యూఢిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఇప్పుడు ఈవీఎంను తప్పుబడుతున్న చంద్రబాబు....2014 ఎన్నికల్లో ఎందుకు మాట్లాడలేదని సూటిగా ప్రశ్నించారు. అధికారులను బదిలీ చేస్తే చంద్రబాబు ఎందుకు యాగీ చేస్తున్నారని జీవీఎల్ ప్రశ్నించారు. ఏపీలో మూడు కోట్లమంది ప్రజలు ఓటు హక్కును వినియోగించుకున్నారన్నారు. వారికి రాని అనుమానం చంద్రబాబుకు మాత్రమే ఎందుకు వచ్చిందన్నారు. ఈ ఎన్నికల్లో టీడీపీ బాక్సులు గల్లంతు కావడం ఖాయమని జోస్యం చెప్పారు. ఓ పరిపక్వత గల రాజకీయ నాయకుడు అలా ప్రవర్తించరాదని, చంద్రబాబు నలభై ఏళ్ల అనుభవం ఎందుకని ప్రశ్నించారు. ఆయనలో ఆ హుందాతనం కనిపించకపోగా, చౌకబారుతనం కనిపించిందని జీవీఎల్ వ్యాఖ్యానించారు. -
ఢిల్లీ టూర్తో ప్రజాధనం వృథా
సాక్షి, న్యూఢిల్లీ : రాష్ట్రంలో ఎన్నికలు సజావుగా.. జరగలేదని ఎన్నికల నిర్వహణలో ఈసీ విఫలమైందని చంద్రబాబు విమర్శించిన సంగతి తెలిసిందే. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఫిర్యాదు చేసేందకు ఢిల్లీ వెళ్లనున్నట్లు ప్రకటించారు. ఢిల్లీ టూర్పేరుతో చంద్రబాబు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు మండిపడ్డారు. గతంలో ఢిల్లీ పర్యటనలో రెండు కోట్ల ప్రభుత్వ సొమ్ము వృథా చేశారన్నారు. టీడీపీ అధ్యక్షుడు హోదాలో వెళ్లిన బాబు పార్టీ డబ్బు ఖర్చు పెట్టుకోవాలని సూచించారు. ప్రజాధనాన్ని వృథా చేస్తే.. ఆ డబ్బులను అధికారులు వసూలు చేయాలని కోరారు. -
‘చంద్రబాబు దారుణంగా ఓడిపోబోతున్నారు’
సాక్షి, విజయవాడ: ఎన్నికల్లో ఓడిపోతున్న విషయం చంద్రబాబుకు అర్థమైందని, తన ఓటమిని ఎన్నికల కమీషన్ మీద నెట్టే వేసేందుకు ప్రయత్నిస్తున్నారని బీజేపీ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహరావు అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల కమిషన్ అనేది స్వతంత్ర సంస్థ అని, ఎన్నికల సంఘం ఎవరి మాట వినదని అన్నారు. నరేంద్ర మోదీ మాట ఎన్నికల కమిషన్ విన్నట్లయితే మోదీ బయోపిక్ విడుదలను ఎందుకు నిలుపుదల చేస్తోందని ప్రశ్నించారు. ఈవీఎంలు పని చేయడం లేదని ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చంద్రబాబు చేశారని ధ్వజమెత్తారు. ఈవీఎంలలో చిన్న చిన్న సాంకేతిక సమస్యలు సహజమని, వాటిని వెంటనే ఎన్నికల కమిషన్ సరిదిద్దిందని తెలిపారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూలేని విధంగా ప్రజలు ఓటు హక్కును వినియోగించుకున్నరని చెప్పారు. చంద్రబాబు, టీడీపీ ఎమ్మెల్యేలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని.. చంద్రబాబు దారుణంగా ఓడిపోబోతున్నారని జోస్యం చెప్పారు. పెద్ద ఎత్తున ప్రజలు ఓటు హక్కును వినియోగించుకోవడం ద్వారా ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత స్పష్టమవుతోందన్నారు. పోలింగ్ శాతం పెరగడం ద్వారా ప్రజలు మార్పును కోరుకుంటున్నారన్న విషయం అర్థమవుతోందన్నారు. టీడీపీకి ఓటు వేస్తే వైఎస్సార్సీపీ వెళ్తుతోందన్న చంద్రబాబు మాటలు ఆయన ఓటమిని తెలియజేస్తున్నాయని జీవీఎల్ అన్నారు. -
అంబులెన్స్లలో డబ్బులను తరలిస్తున్నారు
-
‘చంద్రబాబుకు ఎదురుగా కూర్చుని దీక్ష చేస్తా’
సాక్షి, విజయవాడ : ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో వేల కోట్లు చేతులు మారితే.. వందల కోట్లే బయటపడుతున్నాయని.. సోదాల తీవ్రత పెంచకపోతే.. చంద్రబాబుకు ఎదురుగా కూర్చుని దీక్ష చేస్తానని బీజేపీ రాజ్యసబ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ఫైర్ అయ్యారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఐటీ దాడులు ఈసీ పరిధిలో జరిగేవని ఇప్పటికే పంపకాలు జరిగిపోయాయని అన్నారు. టీడీపీ ఎన్ని అడ్డదారులు తొక్కినా, డ్రామాలు అడినా ఘోర పరాభావం తప్పదని అన్నారు. అవినీతి చక్రవర్తిలా పాలన కొనసాగించారని విమర్శించారు. టీడీపీకి ఇవే చివరి ఎన్నికలని.. ప్రతిపక్ష హోదా కూడా రాదని దుయ్యబట్టారు. చంద్రబాబు హయాంలో ఏదైనా పరిశ్రమ ఉందంటే.. అది కేవలం ఎన్నికల పరిశ్రమేనని ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో గెలుపుకోసం భారీగా పెట్టుబడులు పెడుతున్నారని ఆరోపించారు. తనిఖీల్లో కోట్ల రూపాయల నగదు బయటపడుతోందని విమర్శించారు. టీడీపీకి వ్యతిరేకంగా తుపాన్ రాబోతోందని.. దాంట్లో టీడీపీ కొట్టుకుపోవడం ఖాయమన్నారు. -
‘టీడీపీకి ప్రతిపక్ష హోదా కూడా రాదు’
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్లో టీడీపీకి వ్యతిరేకంగా తుఫాన్ వీస్తోందని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అన్నారు. తన అనుభవంతో చెప్తున్నానని, టీడీపీకి ప్రతిపక్ష హోదా కూడా రాదని స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఘోర పరాజయం తప్పదని తెలిసే పెద్ద మొత్తంలో ధనాన్ని ఖర్చు పెడుతున్నారని.. ఇప్పటి వరకు పదివేల కోట్లు ఖర్చు చేశారని జీవీఎల్ ఆరోపించారు. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో పెట్టుబడులు, పరిశ్రమలు లేవని, ప్రతి దానికి తన స్టిక్కర్ వేసుకోవాలని ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీ వల్లనే కియా మోటర్స్ పరిశ్రమం వచ్చిందని తెలిపారు. దానిని కూడా తానే తీసుకుని వచ్చానని చంద్రబాబు ప్రచారం చేసుకోవడం దారుణమన్నారు. రాజకీయ వేలంపాటలా ధన దుర్వినియోగం చేస్తున్నారని అన్నారు. ఏ పరిశ్రమలో కూడా వంద కోట్ల పెట్టుబడులు పెట్టలేదుకానీ.. ఒక్క నియోజవర్గంలోనే 100 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రజల వద్ద లూటీ చేసిన ధనాన్నే మళ్లీ ఎన్నికల్లో ఖర్చుచేస్తున్నారని, ఐటీ సోదాలను అడ్డుకున్నారంటే అవినీతి ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోందన్నారు. ఐదేళ్లలో ప్రకటనలు తప్ప చంద్రబాబు చేసిన అభివృద్ధి ఏమీ లేదని పేర్కొన్నారు. -
మంగళగిరి ప్రజలకు ఇది మంచి అవకాశం!
సాక్షి, అమరావతి: ‘మంగళగిరి ప్రజలకు ఇది మంచి అవకాశం. ప్రజలు ఆలోచించి.. మంచి అభ్యర్థికి ఓటు వేయాలి. అర్హతలేని రాజకీయ వారసులను ఓడించాలి’ అని ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి, బీజేపీ నాయకుడు ఐవైఆర్ కృష్ణారావు పిలుపునిచ్చారు. రాజ్యసభ ఎంపీ, బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహరావుతో కలిసి ఆయన గురువారం విలేకరులతో మాట్లాడారు. మంగళగిరిని ‘మందలగిరి’గా మార్చేస్తారేమో! ‘మంగళగిరికి ఈ ఎన్నికల్లో చాలా ప్రాధాన్యముంది. అధికార బలంతో, ధనబలంతో సీఎం చంద్రబాబు తనయుడు నారా లోకేష్ ఇక్కడి నుంచి గెలవాలనుకుంటున్నారు. స్థానికేతరుడైన వ్యక్తి ఇక్కడికి వచ్చి ఎందుకు పోటీచేస్తున్నారో ప్రజలు అర్ధం చేసుకోవాలి. భూ వ్యాపారం చేసుకోడానికి, వేలకోట్ల నల్లధనం దాచుకోడానికే ఆయన ఇక్కడికి వచ్చారు. అవినీతి సొమ్మంతా ఇక్కడ పెట్టుబడి పెట్టారు. మంగళగిరిపై లోకేష్కు ఎలాంటి ప్రేమలేదు. అభివృద్ధి పేరుతో ఆయన ప్రజలను మోసం చేస్తున్నారు’ అని జీవీఎల్ వ్యాఖ్యానించారు. మంగళగిరి పేరును మందలగిరిగా పేరు మార్చే పరిస్థితి నెలకొందని ఆయన అన్నారు. నారా లోకేష్ అమాయకుడేమీ కాదని, రాష్ట్రంలో అవినీతి, అక్రమాలన్నింటికీ ఆయన సూత్రధారి అని మండిపడ్డారు. లోకేష్ అంటే లోకాన్ని దోచేటోడని, ఈ నేపథ్యంలో ప్రజలు తమను తాము కాపాడుకోవాల్సిన పరిస్థితి ఉందని అన్నారు. పుట్టా సుధాకర్ యాదవ్ ఇట్లో జరిగిన ఐటీ సోదాలను టీడీపీ నేతలు అడ్డుకున్న తీరు అమానుషమని మండిపడ్డారు. అడ్డకున్న వారిపై కేసులు నమోదుచేసి అరెస్ట్ చెయ్యాలని డిమాండ్ చేశారు. రాజకీయ ఉగ్రవాదులుగా టీడీపీ నేతలు మారారని ధ్వజమెత్తారు. టీటీడీని రాజకీయ దళారులకు అప్పజెప్పి టీడీపీ రాజకీయం చేస్తోందని, టీటీడీ చైర్మన్ పదవికి పుట్టా సుధాకర్ వెంటనే రాజీనామా చెయ్యాలని అన్నారు. అన్య మతుస్తుల తరఫున ప్రచారం చేసే వ్యక్తిని టీటీడీ చైర్మన్గా నియమించడం వెనక చంద్రబాబు ఉద్దేశం ఏమిటన్ని ప్రశ్నించారు. టీడీపీకి ఇవే చివరి ఎన్నికలు అని, ఆ పార్టీకి ప్రస్తుత ఎన్నికల తర్వాత ప్రతిపక్ష హోదా కూడా రాదని జీవీఎల్ పేర్కొన్నారు. -
తెలుగుదేశం పార్టీ మొత్తం దొంగల ఫార్టీ: జీవీఎల్
-
అలా అంటే భగీరథునికి అవమానం..!
సాక్షి, కాకినాడ : చంద్రబాబు నాయుడిపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు విమర్శల వర్షం కురిపించారు. ఎనీ టైం వాటర్ స్కీమ్ అంటూ బాబు గొప్పలు చెప్పకుంటున్నారని, కానీ ఆయన సొంత జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో నేటికి త్రాగునీరు అందని పరిస్ధితి నెలకొందని చెప్పారు. ‘చంద్రబాబుని అపర భగీరథుడు అని పచ్చ నేతలు అంటున్నారు. ఇది భగీరథునికి అవమానం’ అని ఎద్దేవా చేశారు. సోమవారం పోలవరం అంటూ కొత్త ప్రచారానికి తెరలేపి.. దానిని "సొమ్ము" వారంగా చంద్రబాబు మార్చేశారని మండిపడ్డారు. పోలవరంతో పాటు ప్రతి సాగు నీటి ప్రాజెక్టును చంద్రబాబు ఎటీఎంగా వాడుకున్నారని అన్నారు. టీడీపీ మొత్తం దొంగల పార్టీ అని రూ.1853 కోట్లు అదనంగా కాంట్రాక్టర్లకు దోచి పెట్టారని ఆరోపించారు. పట్టిసీమ ప్రాజెక్టులో కాంట్రాక్టర్కు అదనంగా దోచిపెట్టిన రూ.321 కోట్లు ఎక్కడికి పోయాయని నిలదీశారు. రైతులకు, మహిళలను ఇచ్చిన హామీలను మరిచిన చంద్రబాబు సాగునీటి ప్రాజెక్టుల కాంట్రాక్టర్లకు మాత్రమే న్యాయం చేశారని ఆగ్రహాం వ్యక్తం చేశారు. సీఎం ఛీఫ్ మానిప్యులేటర్గా మారారని అన్నారు. ఈ ఎన్నికల్లో టీడీపీకి ఓటమి ఖాయమని, ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా రాదని జోస్యం చెప్పారు. ఇక ఎన్నికల వేళ జనసేన గిమ్మిక్కులపై జీవీల్ స్పందిస్తూ.. ‘ఆ పార్టీని జనసేన అనడంకంటే కులసేన అంటే బెటర్’ అన్నారు. -
భయంతోనే రాహుల్ అక్కడ పోటీ : జీవీఎల్
సాక్షి, విజయవాడ : కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ, చంద్రబాబుపై బీజేపీ ఎంపీ బీవీఎల్ నరసింహారావు విమర్శలు గుప్పించారు. బాబు, రాహుల్ గాంధీకి ఓటమి భయం వెంటాడుతోందని అన్నారు. బీజేపీపై దుష్ప్రచారం తమకు పాజిటివ్గా మారుతోందని చెప్పారు. కాంగ్రెస్కు అమేధీలో వ్యతిరేత ఉండడంతో రాహుల్కు భయపట్టుకుందని, అందుకే కేరళలోని వయనాడ్ నుంచి కూడా పోటీకి దిగుతున్నారని ఎద్దేవా చేశారు. విజయవాడ సభలో రాహుల్ దీనిపై వివరణ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. గత సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్కు వచ్చిన 44 స్థానాలు కూడా ఈసారి రావని జోస్యం చెప్పారు. చంద్రబాబు, రాహుల్, మమత, కేజ్రీవాల్ వ్యక్తిగత ప్రతిష్ట కోల్పోయారని అన్నారు. బహిరంగ చర్చకు రావాలని రైల్వే మంత్రి పీయూష్ గోయల్ చంద్రబాబుకి సవాల్ విసిరితే.. ఎందుకు స్పందించలేదని సూటిగా ప్రశ్నించారు. ‘ఇవి సైకిల్ కనుమరుగయ్యే ఎన్నికలు. ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ. మళ్లీ తెలుగుదేశం పార్టీ నిలబడలేదు. పవన్ కల్యాణ్ ప్యాకేజీ కల్యాణ్గా మారాడు. పెదబాబు, చినబాబులను పల్లెత్తు మాట అనడం లేదు. మంగళగిరి వైపు కన్నెత్తి చూడటం లేదు. సినిమాలతో పాటు నిజ జీవితంలో కూడా పవన్ నటిస్తున్నారు ’ అని చెప్పారు. గంటల తరబడి సోది ముచ్చట్లు చెబుతున్న చంద్రబాబు ప్రజలకు ఏం చేశారో మాత్రం చెప్పడం లేదని అన్నారు. కేంద్ర పథకాలను తనవిగా ప్రచారం చేసుకుంటున్న సీఎం స్టిక్కర్ బాబుగా మిగిలిపోయారని చురకలంటించారు. 12 లక్షల ఆవాజ్ యోజన ఇళ్ళు ఇస్తే.. అవన్నీ తామే ఇచ్చామని చంద్రబాబు చెప్పుకుంటున్నారు. స్పెషల్ ప్యాకేజీ కింద 90 శాతం కేంద్రం నిధులిస్తే.. అవినీతికి పాల్పడ్డారు . ఏపీకి ఇచ్చిన నిధుల గురించి ప్రధాని మోదీ చెబుతుంటే సహించలేక పోతున్నారు. కేంద్రం మాట్లాడి కియా ప్రాజెక్టును దేశానికి తీసుకువచ్చింది. -
ఇవి సైకిల్ కనుమరుగయ్యే ఎన్నికలు
-
చంద్రబాబును ముంచేశారు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తలబిరుసుతో వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారని బీజేపీ నాయకుడు జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాలు పాటించకుండా హైకోర్టు ఎక్కిన చంద్రబాబు వైఖరిని ఆయన తప్పుబట్టారు. ‘ఎన్నికల సంఘంతో చంద్రబాబు దురుసు ప్రవర్తన.. సీబీఐ పట్ల మమతా బెనర్జీ తీరు కన్నా ఘోరంగా ఉంది. ఎలక్షన్ కమిషన్ రాజ్యాంగ సంస్థ. ఎవరు తప్పుడు సలహా ఇచ్చారోగాని చంద్రబాబును ముంచేశారు. తప్పుడు, తలబిరుసు ప్రవర్తనకు జీవితంలోని మర్చిపోలేని గుణపాఠం తప్పద’ని జీవీఎల్ ట్వీట్ చేశారు. ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావును బదిలీ చేయాలన్న సీఈసీ ఆదేశాలు పాటించకుండా ఏపీ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించడంపై రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు ట్విటర్లో స్పందించారు. ‘ఎన్నికల సమయంలో డీజీపీగా సీఎస్ ఉండటం నాకు తెలిసి సవాళ్లతో కూడిన విషయం. నాకు తెలిసి సీఎస్, డీజీపీ ఈ సమయంలో ఎన్నికల సంఘం పరిధిలో ఉంటారు. టీఎన్ శేషన్ సమయంలో సుప్రీంకోర్టు ఈ విషయంలో స్పష్టత ఇచ్చింది. మరి వారే ఎన్నికల సంఘంపై కోర్టు కేసు ఎట్లా వేస్తారు? నాకు తెలియని న్యాయపరమైన అంశాలు దీంట్లో ఉన్నాయా’ అని ఐవైఆర్ ప్రశ్నించారు. (చదవండి: ఈసీకి ఎదురుతిరిగిన ఏపీ ప్రభుత్వం) -
‘ఆయన ప్యాకేజీ కళ్యాణ్’
సాక్షి, విజయవాడ: ఏపీలో జరిగే ఎన్నికల ప్రచారంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటారని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవిఎల్ నరసింహారావు తెలిపారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఈ నెల 29న రాజమండ్రి, ఏప్రిల్ 1న కర్నూలుల్లో ఎన్నికల ప్రచారంలో ప్రధాని పాల్గొంటారని అన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్తో పాటు ముఖ్యమైన జాతీయ నాయకులు రాష్ట్రానికి ఎన్నికల ప్రచారానికి వస్తున్నారని చెప్పారు. ఈ నెల 26న ఆంధ్రప్రదేశ్ ఎన్నికల మేనిఫెస్టోను పీయూష్ గోయల్ విడుదల చేస్తారని తెలిపారు. ఏపీలో ఎన్నికలు ధన మయమైయ్యాయి.. దీనిపై రేపు ఎన్నికల కమిషన్ను కలిసి టీడీపీ ధన రాజకీయాలు పై ఫిర్యాదు చేస్తామన్నారు. తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థి రూ. 100 నుంచి 150 కోట్లు ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్నారని ఆరోపించారు. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు రూ. 30 కోట్లు, మంత్రులు వందల కోట్లు ఖర్చు చేయడానికి సిద్ధమవుతున్నారు. ఏపీ ఎన్నికల్లో 6 వేలు కోట్లు ఖర్చు చేయడానికి సీఎం చంద్రబాబు సిద్ధమయ్యారని విమర్శించారు. బాబు ధన ప్రవాహానికి ఎన్నికల సంఘం అడ్డుకట్టు వేయాలి అన్నారు. సీఎం చంద్రబాబు మాటలనే జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రిపీట్ చేస్తున్నారని ధ్వజమెత్తారు. పవన్ కళ్యాణ్ ప్యాకేజీ కళ్యాణ్ గా మారారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు మాటలు వింటే పవన్ కళ్యాణ్ తన రాజకీయ భవిష్యత్ అంధకారం చేసుకున్నట్లేనని అన్నారు. తెలంగాణ పాకిస్థాన్ అయితే చంద్రబాబు కుటుంబం, పవన్ కళ్యాణ్ కుటుంబం హైదరాబాద్లో ఎందుకు ఉంటున్నారో చెప్పాలన్నారు. ఆంధ్ర ప్రజలపై తెలంగాణలో దాడులు చేస్తున్నారని ఏపీ ప్రజలని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. 2014లో టీడీపీతో పొత్తు పెట్టుకొని తప్పు చేశామన్నారు. -
‘ఏప్రిల్ 11న టీడీపీ జ్యోతి ఆరిపోతుంది’
సాక్షి, విజయవాడ : ఎదుటి పార్టీలపై బురదజల్లుతూ.. టీడీపీ నీచ రాజకీయాలకు పాల్పడుతుందని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన రోడ్ షోలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఐదేళ్ల టీడీపీ పాలనలో భూకబ్జాలు, అవినీతి తప్ప ఏమీ చేయలేదని ఆరోపించారు. ఈ ఎన్నికల్లో టీడీపీ చిత్తుగా ఓడిపోతుందన్నారు. ఏప్రిల్ 11( ఎన్నికల రోజు) తర్వాత టీడీపీ జ్యోతి ఆరిపోతుందని ఎద్దేవా చేశారు. రాష్ట్రం, దేశం అభివృద్ధి జరగాలంటే బీజేపీ అధికారంలోకి రావాలన్నారు. ఏపీ కోసం ప్రత్యేక మేనిఫెస్టో సిద్ధం చేశామని, రెండు రోజుల్లో విడదల చేస్తామని చెప్పారు. -
జగన్పై కక్ష సాధింపు చర్యలు చేయలేదనే!
సాక్షి, అమరావతి: కేంద్ర ప్రభుత్వం తన అధికారాన్ని దుర్వినియోగం చేసైనా తన రాజకీయ ప్రత్యర్థి జగన్మోహన్రెడ్డిపై కక్ష సాధింపు చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధానమంత్రి మోదీని కోరినా స్పందించలేదు కాబట్టే తెలుగుదేశం పార్టీ ఎన్డీయే నుంచి వైదొలిగింది నిజం కాదా? అని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ప్రశ్నించారు. ఎమ్మెల్సీ సోము వీర్రాజుతో కలిసి బుధవారం ఆయన విజయవాడలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎన్నికల్లో లబ్ధి పొందాలన్న ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడిని మోదీ కాపాడుతున్నారని చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. మోదీ ప్రభుత్వానికి అవినీతి పరులెవ్వరినీ కాపాడాలని ఉండదు, అదే సమయంలో అవినీతి పేరుతో ఎవరినీ టార్గెట్ చేసే పరిస్థితి లేదన్నారు. ఈ ఎన్నికల సమయంలో తుపాను మాదిరి టీడీపీ నేతలు వేరే పార్టీకి వలసవెళ్తున్నందున చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుందన్నారు. జగన్మోహన్రెడ్డి కేసులను విచారణ చేసిన అధికారులు ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారని.. వారి అనుబంధం బయటపడుతుందనే భయంతో కేంద్రంలోని మోదీ, బీజేపీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఈ కేసులపై విచారణ జరిగిన సమయంలో కాంగ్రెస్ పార్టీ, చంద్రబాబుల మధ్య అనుబంధం ఏంటో తేలాల్సి ఉందన్నారు. సీబీఐని కేంద్రం దుర్వినియోగం చేస్తుందని చంద్రబాబు ఆరోపిస్తాడు గానీ, సీబీఐ అంటే ‘చంద్రబాబు బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్’ అని ఎద్దేవా చేశారు. అప్పట్లో ఆయన చెప్పిన పనిచేసిన సీబీఐ ఇప్పుడు స్వతంత్రప్రతిపత్తిగా పనిచేస్తోందన్నారు. ఇతరులపై చంద్రబాబు ఇష్టమొచ్చినట్టు ఆరోపణలు చేస్తారు గానీ, ఆయన చేసిన అవినీతి చూసి రాష్ట్ర ప్రజలందరూ ఆశ్చర్యపోతున్నారని చెప్పారు. రాజధాని, విశాఖపట్నం భూములతో పాటు, భోగాపురం ఎయిర్పోర్టు, మచిలీపట్నం, కాకినాడ సెజ్ల పేరుతో వేల ఎకరాల భూములను దోచుకున్న చంద్రబాబును ఇప్పుడు ప్రజలెవరూ నమ్మడం లేదని.. దోచుకున్న డబ్బులతో ఇప్పుడు అధికారంలోకి రావాలని కుట్రలు చేస్తున్నారని తూర్పారపట్టారు. తెలుగుదేశం పార్టీలో ఎంపీ అభ్యర్థులంటే పన్ను ఎగవేతదారులు, ఈడీ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు, దొంగ వ్యాపారాలు చేసే వారు, భూకబ్జాదారులేనని దుయ్యబట్టారు. ఓటుకు కోట్లు కేసు రాజీ చేసిందెవరు? సీఎం చంద్రబాబు అనేక అవినీతి కేసుల్లో స్టేలు తెచ్చుకొన్నారని, ఆయన స్టేలో కొనసాగుతున్న ఏ కేసు గురించైనా కేంద్ర ప్రభుత్వం మాట్లాడిందా? అని సోము వీర్రాజు ప్రశ్నించారు. చంద్రబాబుకు ఏ వ్యవస్థనైనా మేనేజ్ చేయగల సమర్థత ఉందని, ఆయన అన్ని వ్యవస్థలనూ నాశనం చేస్తూ కేంద్రంపైనా, బీజేపీపైనా విమర్శలు చేస్తున్నారని విమర్శించారు. ఇంకొకరిపై విమర్శలు చేస్తున్న చంద్రబాబు ఓటుకు కోట్లు కేసులో ఎవరితో రాజీ చేసుకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. -
‘మరో 4 రోజుల్లో తొలి జాబితా’
సాక్షి, న్యూఢిల్లీ : టీడీపీకి ఇవే చివరి ఎన్నికలంటూ బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు జోస్యం చెప్పారు. సార్వత్రిక ఎన్నికల నగారా మోగిన నేపథ్యంలో జీవీఎల్ సోమవారం పార్టీ పెద్దలతో సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. మరో నాలుగు రోజుల్లో ఆంధ్రప్రదేశ్ బీజేపీ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేస్తామని తెలిపారు. సామాజిక ప్రాతిపదికన సీట్ల కేటాయింపు ఉంటుందని స్పష్టం చేశారు. బీజేపీ బలోపేతంతోనే జాతీయ భద్రత సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై విమర్శలు కురిపించారు. డబ్బులను పంచి అందలాలు ఎక్కాలని టీడీపీ భావిస్తుందని ఆరోపించారు. అవినీతిలో టీడీపీకి గోల్డ్ మెడల్ ఇవ్వొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. బీజేపీపై విర్శలు చేయడం.. తమ మీద పడి ఏడవడం తప్ప చంద్రబాబు చేసింది ఏమి లేదని విమర్శించారు. జనాలు గంట గంటకు తమ ఓటు ఉందో లేదో చెక్ చేసుకుంటున్నారంటే రాష్ట్రంలో చంద్రబాబు పాలన ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. -
‘డేటా చోరీ రెండు రాష్ట్రాల సమస్య కాదు’
సాక్షి, న్యూఢిల్లీ: ప్రజల సమాచారాన్ని ప్రైవేటు సంస్థలకు అందజేసి.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెద్ద నేరానికి పాల్పడిందని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు మండిపడ్డారు. ఐటీ గ్రిడ్స్ స్కామ్పై ఆయన మంగళవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ప్రజల సమాచారాన్ని రాజకీయాలకు వాడుకోవడం దుర్మార్గమైన చర్య అని ఆయన అభిప్రాయపడ్డారు. ఓటర్ల ప్రొఫైల్ సేకరించి డేటాను దుర్వినియోగం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రైవేటు సంస్థలకు ప్రభుత్వ సమాచారం ఎలా వచ్చిందని ప్రశ్నించారు. ఈ డేటాతో చంద్రబాబు ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడేందుకు యత్నించారని ఆరోపించారు. ఇప్పుడు ఈ విషయం వెలుగులోకి వచ్చేసరికి తన బండారం బయటపడుతుందని చంద్రబాబు భయపడుతున్నారని విమర్శించారు.(డేటా స్కామ్ డొంక కదులుతోంది!) డేటా చోరికి పాల్పడి చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని తెలిపారు. ఇది రెండు రాష్ట్రాల సమస్య కాదని.. ప్రజల భద్రత, గోప్యతకు సంబంధించిన విషయమని పేర్నొన్నారు. దీనిపై లోతైన విచారణ జరగాల్సిన అవసరం ఉందన్నారు. తప్పు చేసిన వారిని కఠినంగా శిక్షించాలి.. లేకుంటే ప్రజస్వామ్యం అపహాస్యం అవుతుందని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ ప్రయోజనాలకు పచ్చ చొక్కాలకే పరిమితం చేస్తున్నారని విమర్శించారు. దుర్మార్గులు రాజకీయాలు చేస్తే ఇలాంటి నేరాలే జరుగుతాయని వ్యాఖ్యానించారు. ఈ ఘటనపై ఈసీ వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. తప్పుచేసిన వారిని పట్టుకుంటే శభాష్ అనకుండా ఏపీ ప్రభుత్వం వింత ఆరోపణలు చేస్తుందని.. ఇది దొంగలు భుజాలు తడుముకున్నట్టు ఉందని ఎద్దేవా చేశారు.(డేటా లీక్.. సీఎంవో నుంచే?) -
చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు
-
‘చిన్న హీరోతో కావడం లేదని పీకేని తెచ్చారా’
సాక్షి, విజయవాడ : దేశ ప్రజలంతా ప్రధాని మోదీ దౌత్యాన్ని, వింగ్ కమాండర్ అభినందన్ ధైర్యసాహసాలను కొనియాడుతుంటే కొందరు మాత్రం కేంద్రం చర్యలను తప్పు పడుతున్నారని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు మండిపడ్డారు. ఓవైపు పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సర్జికల్ స్ట్రైక్స్పై ప్రశంసలు వర్షం కురుస్తోంటే.. మరోవైపు రాజకీయ దురుద్దేశంతో చంద్రబాబు, పవన్ కల్యాన్, మమతా బెనర్జీ బీజేపీపై విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత్పై నిందలు మోపీ పాకిస్తాన్లో హీరోలు కావాలని ఉబలాటపడుతున్నారని ఎద్దేవా చేశారు. పార్టీ కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. (ఏపీలో అవినీతి,కుటుంబ పాలన) దేశమంతా తిట్టిపోసింది.. పాకిస్తాన్పై భారత్ చర్యలను తప్పుబడుతూ చంద్రబాబు, మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర వ్యతిరేకత వచ్చిందని జీవీఎల్ అన్నారు. చంద్రబాబుకు దేశమంతా చివాట్లు పెట్టిందని చెప్పారు. దాంతో ‘యూటర్న్ బాబు’గా పేరొందిన చంద్రబాబు మాట మార్చారని తెలిపారు. జనసేన అధినేత పవన కల్యాణ్ (పీకే) కూడా ఈ మధ్య పాకిస్తాన్పై ప్రతీకారం విషయంలో వింతగా మట్లాడుతున్నారని జీవీఎల్ విమర్శలు గుప్పించారు. పీకే అంటే పాకిస్తాన్ షార్ట్కట్ అని అక్కడి జనం భ్రమపడుతున్నారని పేర్కొన్నారు. చంద్రబాబు ప్రభావం వల్లనే పవన్ అలా మాట్లాడుతున్నారేమోనని అనుమానం వ్యక్తం చేశారు. ఒకప్పడు పెదబాబు, చినబాబును విమర్శించే పవన్.. ఇప్పుడు వారిని పల్లెత్తు మాట కూడా అనడం లేదని చెప్పుకొచ్చారు. (అభినందన్ ఆగయా..) స్థాయి సరిపోవడం లేదని పీకేని తెచ్చారా.. నిన్నటి వరకు హీరో శివాజీతో అర్థంపర్థంలేని విమర్శలు చేయించిన చంద్రబాబు తాజాగా పవన్ను తెరమీదకి తీసుకొచ్చాడని జీవీఎల్ చురకలంటించారు. చిన్న హీరో స్థాయి సరిపోవడం లేదని, పెద్ద హీరోతో మాట్లాడిస్తున్నారేమోనని అనుమానం వ్యక్తం చేశారు. పవన్ మాటలను ప్రధానంగా పాకిస్తాన్ వాడుకుంటోందని, ఓట్ల కోసం జాతీయ భద్రత అంశాలను వాడుకోవద్దని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికైనా పవన్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించాలని కోరారు. ‘ఎక్కడ నెగ్గాలో కాదు. ఎక్కడ తగ్గాలో తెలిస్తేనే పవన్కు ప్రజాదరణ ఉంటుంది’ అని సూచించారు. సాధ్యం కాదు కాబట్టే.. విశాఖ రైల్వే జోన్తో ప్రధాని మోదీకి పేరొస్తుందని చంద్రబాబు గాబరా పడుతున్నారని జీవీఎల్ విమర్శించారు. కేంద్రం ప్రవేశపెట్టిన అనేక పథకాలకు స్టిక్కర్లు వేసుకునే సీఎం చంద్రబాబు రైల్వే జోన్కు అలా చేసే అవకాశం లేకపోవడంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారని ఎద్దేవా చేశారు. నిన్నటి విశాఖ బహిరంగ సభలో ఏపీకి ఏం చేశామో ప్రధాని మోదీ చెప్పారని.. చంద్రబాబు బండారాన్ని బయటపెట్టారని తెలిపారు. -
దేశమంతా చంద్రబాబును తిట్టిపోసింది
-
చంద్రబాబుకు సవాల్ విసిరిన జీవీఎల్
సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహరావు బహిరంగ సవాల్ విసిరారు. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ చేస్తోన్న కుల రాజకీయాలపై.. ఆ పార్టీపై వస్తోన్న అవినీతి ఆరోపణల నిర్థారణకు చంద్రబాబు సిద్ధమా అని సూటిగా ప్రశ్నించారు. సోమవారమిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జీవీఎల్ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల చరిత్రలో గతంలో తానెన్నడూ కుల రాజకీయాలను చూడలేదని అన్నారు. దేశంలో ఇంతవరకూ ఎవరూ కూడా కులం విషయంలో బీజేపీ వైపవేలెత్తి చూపలేదని స్పష్టం చేశారు. తమ పార్టీ అన్ని సామాజిక వర్గాలకు సముచిత ప్రాధాన్యం ఇస్తుందని చెప్పుకొచ్చారు. మోదీ ప్రభుత్వం రైతులకు ‘కిసాన్ సమ్మాన్’ నిధి కింద రెండు వేల రూపాయలు ఇస్తుండటంతో.. చంద్రబాబు అన్నదాత సుఖీభవ అనే స్టిక్కర్ కార్యక్రమానికి తెర తీశాడని దుయ్యబట్టారు. చంద్రబాబు ఏ తప్పు చేయకపోతే సీబీఐ, ఈడీ అంటే ఎందుకంత భయపడుతున్నారో చెప్పాలని డిమాండ్ జీవీఎల్ చేశారు. హైదరాబాదును ప్రపంచస్థాయికి తీసుకెళ్లిన చంద్రబాబు.. నాలుగేళ్లలో అమరావతిలో ఒక్క నిర్మాణాన్ని కూడా ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నలు సంధించారు. రాజధాని నిర్మాణం విషయంలో చంద్రబాబు గ్రాఫిక్స్తో కాలం గడుపుతున్నారని ఆరోపించారు. కోతల రాయుడు చంద్రబాబు.. అమరావతి విషయంలో చెప్పింది కొండంత అయితే చేసింది మాత్రం గోరంత కూడా లేదని ఎద్దేవా చేశారు. టీడీపీ నాయకులు సినీ పక్కి రాజకీయాలు చేస్తూ.. అభూత కల్పనలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. విభజన చట్టంలోని అంశాలను అమలు చేయకుండా కాంగ్రెస్ నాయకులు దొంగ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. ఇవాళ రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడుతున్న ఏపీ కాంగ్రెస్ నాయకులు విభజన చట్టం తయారయ్యే రోజున నిద్ర పోయారా అంటూ జీవీఎల్ ప్రశ్నించారు. అభివృద్ధిలో పోటీ పడదామని చంద్రబాబు కేసీఆర్కు లేఖ రాయడం హాస్యాస్పదమన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధిలో కాకుండా అవినీతిలో పోటీ పడుతున్నాయని మండిపడ్డారు. -
అందుకే చంద్రబాబు స్టిక్కర్ బాబు: జీవీఎల్
సాక్షి, విజయవాడ : కేంద్ర పథకాలను తనవిగా ప్రచారం చేసుకుంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ‘స్టిక్కర్ బాబు’ అయ్యారని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ఎద్దేవా చేశారు. శుక్రవారమిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వచ్చేనెలలో కేంద్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లో రూ.2 వేలు జమ చేస్తుందని తెలిసి చంద్రబాబు ‘అన్నదాత సుఖీభవ’ అనే స్టిక్కర్ కార్యక్రమాన్ని ప్రజల ముందుకు తెచ్చారని ధ్వజమెత్తారు. వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలుకు గాను కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి మంజూరు చేసిన నిధులు ఏమయ్యాయో లెక్క చెప్పాలని జీవీఎల్ డిమాండ్ చేశారు. తాను అన్ని చేశానంటూ గొప్పులు చెప్పుకోవటం చంద్రబాబుకు అలవాటేనన్నారు. రాజమండ్రిలో అమిత్ షా వాస్తవాలు చెప్తుంటే.. అవి టీడీపీ నాయకులకు మింగుడుపటడం లేదని జీవీఎల్ విమర్శించారు. అమరావతి పేరుతో అవినీతి కట్టడాలు నిర్మిస్తున్నారని ఆరోపించారు. ఎన్టీఆర్ సినిమాలో కూడా అన్ని అవాస్తవాలే చూపించారని.. అందుకే ప్రజలు ఆ సినిమాను వ్యతిరేకించారని అన్నారు. కుమార్తెను చూడటం కోసం జగన్ లండన్కు వెళ్లారని, అయితే చంద్రబాబు మాత్రం ఎన్నికల సందర్భంగా డబ్బు ఏర్పాటు చేసుకోవడానికి ప్రతిపక్ష నేత విదేశాలకు వెళ్తున్నారంటూ ఆరోపించడం హస్యాస్పదంగా ఉందన్నారు. అంటే టీడీపీ నాయకులు విదేశీ పర్యటనలు చేసేది డబ్బు ఏర్పాటు చేసుకునేందుకేనా అంటూ ప్రశ్నించారు. టీడీపీ వ్యవహారశైలి నచ్చకే ఆ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు పార్టీని వీడుతున్నారని ఆయన ఆరోపించారు. -
టీడీపీ డ్రామా రాజకీయాలు ప్రజలు నమ్మరు
-
‘ఏపీలో డ్రామా రాజకీయాలే తప్ప.. అభివృద్ధి లేదు’
సాక్షి, ప్రకాశం: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవినీతికి అడ్డగా మారిందని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ఆరోపించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో డ్రామా రాజకీయాలే తప్ప అభివృద్ధి లేదని మండిపడ్డారు. 2500 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. ఆ డబ్బును ప్రజలకు ఎప్పుడు చెల్లిస్తారో సమాధానం చెప్పాలన్నారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు ఓటమి తప్పదని హెచ్చరించారు. టీడీపీ నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వస్తున్న వలసలే ఇందుకు నిదర్శనమన్నారు. -
ఆరువందల హామీలిచ్చి అధికారంలోకి..
సాక్షి, కరీంనగర్: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత రాజకీయ స్వలాభం కోసమే కూటమి కడుతున్నారని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అన్నారు. గత ఎన్నికల్లో ఆరువందల హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారని, నాలుగున్నరేళ్లు గడిచినా వాటిని అమలుచేయలేదని ఆరోపించారు. జీవీఎల్ సోమవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కల్తీ కూటమిని ప్రజలు నిర్వీర్యం చేస్తారని అన్నారు. కూటమి పేరుతో చంద్రబాబు దేశమంతా తిరుగుతూ ప్రజాధన్నాన్ని దుర్వినియోగం చేస్తూ జల్సాలు చేస్తున్నారని మండిపడ్డారు. రాజకీయ ఎజెండా తప్ప అభివృద్ధి, విజన్ లేని రాజకీయ నాయకుడు చంద్రబాబని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం పథకాలను ఏపీతో పాటు తెలంగాణ కూడా నీరుగారుస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలందరికీ ఆరోగ్య రక్షణ కల్పించే ఆయుష్మాన్ భారత్ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా పేరుతో చంద్రబాబు దొంగ దీక్షలు, డ్రామాలు ఆడుతున్నారని జీవీఎల్ ఆరోపించారు. -
చంద్రబాబు ‘పిచ్చి పీక్స్’కు చేరినట్టుంది!
సాక్షి, అమరావతి: నిండు సభలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రవర్తించిన తీరుపై బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహరావు తీవ్రంగా మండిపడ్డారు. అసెంబ్లీలో బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజుతో చంద్రబాబు ప్రవర్తించిన తీరు సరికాదని, ఆయన ప్రవర్తన చూస్తే ‘పిచ్చి పీక్స్’ చేరినట్టు తెలుస్తోందని జీవీఎల్ ట్విట్టర్లో పేర్కొన్నారు. మహా ఫ్రస్టేషన్లో ఉన్న సీఎం ‘అసెంబ్లీ రౌడీ’లాగా ప్రవర్తించారని ధ్వజమెత్తారు. సీఎం తీరుపై సభాహక్కుల ఉల్లంఘన నోటీసు ఇవ్వాలని యోచిస్తున్నట్టు ఆయన వెల్లడించారు. -
చంద్రబాబు ఏ జిల్లాకు న్యాయం చేయలేదు
-
విమానాలు, స్టార్ హోటళ్లలో గడుపుతూ..
సాక్షి, పశ్చిమగోదావరి : కేంద్రం ఇచ్చిన నిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబు విమానాలు, స్టార్ హోటళ్లలో విలాసవంతంగా గడుపుతూ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి, ఎంపీ జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. బీజేపీ పాలిత రాష్ట్రాలన్నింటిలోకెళ్లా ఏపీకే ప్రధాని మోదీ అధిక నిధులు ఇచ్చారని పేర్కొన్నారు. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే పైడికొండల మాణిక్యాల రావు క్యాంపు కార్యాలయంలో ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా.. ఆంధ్రప్రదేశ్కు కేంద్ర ప్రభుత్వం 900 కోట్ల రూపాయల కరువు సాయాన్ని ప్రకటించిందని జీవీఎల్ పేర్కొన్నారు. కేంద్రం ఇచ్చిన నిధులను ఈ రాష్ట్ర ప్రభుత్వ దొంగలు దోచుకు తింటున్నారని ధ్వజమెత్తారు. దొంగ దీక్షలు చేస్తూ చంద్రబాబు ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. కరువు సాయం ప్రభుత్వ దొంగల బారిన పడనివ్వకుండా చూడాల్సిన బాధ్యత ప్రజలపైనే ఉందన్నారు. ఓఆర్పీ అంటే ఒకే ర్యాంకు ఒకే పెన్షన్ అనేది బీజేపీ నినాదమైతే.. కాంగ్రెస్ వాళ్లకు మాత్రం ఓన్లీ రాహుల్-ఓన్లీ ప్రియాంక అంటూ ఎద్దేవా చేశారు. -
ఇప్పుడు ‘జయహో బీసీ’ అంటే ప్రజలు నమ్మరు
సాక్షి, అమరావతి : నాలుగున్నరేళ్ల నుంచి బీసీలను వంచించిన టీడీపీ ప్రభుత్వం.. ఎన్నికల ముందు ‘జయహో బీసీ’ అంటే నమ్మడానికి ప్రజలేం అమాయకులు కారని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు అన్నారు. హైకోర్టు జడ్జీలుగా బీసీలు పనికిరారంటూ సీఎం చంద్రబాబు కుట్ర పన్నారని ట్విటర్లో పేర్కొన్నారు. ‘ఆదరణ’ పేరుతో చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. కేంద్ర, రాష్ట్ర నిధులను కూడా ఖర్చు టీడీపీ ప్రభుత్వం ఖర్చు చేయలేదని విమర్శించారు. 4 1/2 ఏళ్లనుంచి వంచించిన తెలుగు దేశం ప్రభుత్వం ఎన్నికల ముందు "జయహో బీసీ" అంటే నమ్మే అమాయకులు లేరు.'ఆదరణ' పేరుతో అవినీతి చేసారు.రాజకీయ ప్రాధాన్యతలేదు. బీసీలు హైకోర్ట్ జడ్జిలుగా పనికిరారని సీఎం కుట్ర చేసారు.కేంద్ర,రాష్ట్ర నిధులను కూడా ఖర్చు చేయని ప్రభుత్వం.https://t.co/3CJW6GEic6 pic.twitter.com/uMSfUHaPpy — GVL Narasimha Rao (@GVLNRAO) 27 January 2019 -
చంద్రబాబు బండారం బయటపెడతాం: జీవిఎల్
సాక్షి, గుంటూరు: అవినీతి, ఆర్బాటం, ప్రచారం తప్ప ఏపీకి సీఎం చంద్రబాబు చేసింది శూన్యమని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవిఎల్ నరసింహారావు దుయ్యబట్టారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన పథకాలకు చంద్రబాబు పసుపు ముసుగు వేశారని విమర్శించారు. అన్ని ముసుగులను తొలగిస్తామని చంద్రబాబు బండారం బయటపెడతామని వ్యాఖ్యానించారు. కేంద్రమంత్రి నితిన్ గడ్కరి సోమవారం గుంటూరు పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏపీలో కేంద్రం చేసిన అభివృద్ధి కాకుండా టీడీపీ ప్రభుత్వం చేసిన కనీసం మూడు పనులు చెప్పాలని సవాల్ విసిరారు. గృహనిర్మాణంలో అంతులేని అవినీతికి టీడీపీ నేతలు పాల్పడుతున్నారని ఆరోపించారు. కేంద్రం మంజూరు చేసిన ఎలక్ట్రానిక్ కంపెనీలను చినబాబు(నారా లోకేష్) గొప్పగా ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. ఏపీలో రాష్ట్రపతి పాలన కావాలనుకుంటే, ప్రధానిని అడ్డుకుంటామని బాబు ప్రకటన చేయాలన్నారు . టీడీపీ నేతలు ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని హెచ్చరించారు. టీడీపీ నేతలు చేసిన అవినీతి, అక్రమాలకు జైలు వెళ్లడానికి సిద్దంగా ఉండాలని జీవిఎల్ సూచించారు. -
ఎన్ఐఏ అంటే టీడీపీకి ఎందుకు భయం?
సాక్షి, హైదరాబాద్: ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నం జరిగితే.. ఆ దాడిని టీడీపీ ప్రభుత్తం చిన్నగా చేసి చూపించే ప్రయత్నం చేసిందని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవిఎల్ నరసింహారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రతిపక్షనేతపై కక్ష సాధింపు వైఖరికి ఇది నిదర్శనమన్నారు. శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో పలు అంశాలపై ఆయన చర్చించారు. జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ దర్యాప్తుకు టీడీపీ నేతలు ఎందుకు భయపడుతున్నారో అర్థం కావటంలేదన్నారు. వాస్తవాలు బయటకు వస్తే జాతకాలు తారుమారవుతాయని చంద్రబాబు భయపడుతున్నారని ఎద్దేవ చేశారు. ఎన్ఐఏ చట్టం ప్రకారం కేసులు తమంతట తాము తీసుకునే అధికారం ఉందని తెలిపారు. టీడీపీ డ్రామా పూర్తిగా బయట పడుతుందని అందుకే రాష్ట్రాల సంబంధాలు అంటే అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నారని జీవీఎల్ వ్యాఖ్యానించారు. తెలంగాణలో ఓటమి అనంతరం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడులో అసహనం పెరిగిందని ఎద్దేవ చేశారు. ఏపీలో కూడా టీడీపీకి రెండు సీట్లే రావడం ఖాయమని జీవిఎల్ జోస్యం చెప్పారు. మహిళా బీజేపీ నాయకురాలు పట్ల చంద్రబాబు వ్యవహరించిన తీరు దారుణంగా ఉందని మండిపడ్డారు. ఓటమి భయంతోనే చంద్రబాబు ఇలా వ్యవహరిస్తున్నారన్నారు. శబరిమలలో భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా కేరళ ప్రభుత్వం వ్యవహరిస్తోందని జీవిఎల్ నరసింహారావు మండిపడ్దారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న భక్తులపై దాడులు చేయడం దుర్మార్గమన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసమే సీపీఎం ప్రభుత్వం భక్తులపై దాడులకు పాల్పడుతుందని ఆరోపించారు. కేరళ సీఎం పినరయి విజయన్ దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం భక్తులను భయపెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. శబరిమల తీర్పుపై వేసిన రివ్యూ పిటిషన్ విచారణకు రాబోతోందని పేర్కొన్నారు. -
చంద్రబాబులో అసహనం పెరిగిపోయింది
-
‘ఏడాదిలో రెండతస్తుల భవనాన్ని నిర్మించలేకపోయారు’