
సాక్షి, బెంగళూరు : దేశం మొత్తం రసవత్తరంగా ఎదురుచూస్తున్న కన్నడ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ శనివారం ఉదయం ప్రారంభమైంది. కాంగ్రెస్, బీజేపీ ల మధ్య ప్రధాన పోటీ కొనసాగుతుంది. మొత్తం 224 అసెంబ్లీ స్థానాలు ఉండగా ప్రస్తుతం 222 నియోజక వర్గాల్లో పోలింగ్ జరుగుతుంది. నకిలీ ఓటర్ కార్డుల భారీగా దొరికినందుకు ఆర్ఆర్ నగర్ ఎన్నిక వాయిదా పడింది. జయనగర బీజేపీ అభ్యర్థి మృతితో అక్కడ కూడా ఎన్నికను ఎన్నికల కమిషన్ వాయిదా వేసింది. మే 28న రాజరాజశ్వరినగర్(ఆర్ఆర్ నగర్) అసెంబ్లీ స్థానానికి తిరిగి పోలింగ్ జరుగనుంది.
Comments
Please login to add a commentAdd a comment