కర్నూలు జిల్లాలో కాంగ్రెస్‌కు షాక్ | Kotla Harshavardhan Reddy Joins YSRCP | Sakshi
Sakshi News home page

వైఎస్సార్ సీపీలో చేరిన కోట్ల హర్షవర్ధన్ రెడ్డి

Published Thu, Feb 7 2019 3:09 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

Kotla Harshavardhan Reddy Joins YSRCP - Sakshi

కర్నూలు జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. కోడుమూరు నియోజకవర్గ కాంగ్రెస్‌ నేత కోట్ల హర్షవర్ధన్‌ రెడ్డి గురువారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో..

కడప : కర్నూలు జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. కోడుమూరు నియోజకవర్గ కాంగ్రెస్‌ నేత కోట్ల హర్షవర్ధన్‌ రెడ్డి గురువారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో సుమారు 2వేల మందితో ఆయన పార్టీలో చేరారు. వైఎస్ జగన్ ఈ సందర్భంగా కోట్ల హర్షవర్ధన్‌ రెడ్డికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీపీలతో పాటు, ఏడుగురు ఎంపీటీసీలు, పలువురు సర్పంచ్‌లు కూడా వైఎస్సార్ సీపీలో చేరారు. ఈ సందర్భంగా కోట్ల హర్షవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ...వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని అన్నారు. జగనన్నను ముఖ్యమంత్రి చేసేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తామని ఆయన తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement