
సాక్షి, తిరుపతి/అమరావతి: తిరుపతి సమీపంలోని శెట్టిపల్లిలో గ్రామస్తులు ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్న భూముల జోలికి రావొద్దంటూ ప్రభుత్వాన్ని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ హెచ్చరించారు. బుధవారం ఆయన శెట్టిపల్లిలో రైతులు, గ్రామస్తులతో సమావేశమై భూముల వివరాలడిగి తెలుసుకున్నారు.
రైతులెవరూ తమ భూములను ఇవ్వొద్దని, బాధితులకు జనసేన పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. వేలకోట్ల దోచుకుంటూ, పేదల భూములనూ లాక్కుంటారా? అని ప్రశ్నించారు. పట్టాలిస్తామని గ్రామదేవతపై ప్రమాణం చేసి ఇప్పుడు ఆర్థికనగరం పేరుతో భూ సమీకరణ అని భూములు లాగేసుకుంటున్నారని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment