దాడిశెట్టి రాజాకు నోటీసులు | Tuni Police Issued Notice To MLA Dadishetti Raja | Sakshi
Sakshi News home page

దాడిశెట్టి రాజాకు నోటీసులు

Dec 19 2018 8:31 PM | Updated on Dec 19 2018 8:45 PM

Tuni Police Issued Notice To MLA Dadishetti Raja - Sakshi

అధికార టీడీపీ ప్రభుత్వం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులపై వేధింపుల పర్వం కొనసాగిస్తోంది.

సాక్షి, తూర్పుగోదావరి/కాకినాడ : అధికార టీడీపీ ప్రభుత్వం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులపై వేధింపుల పర్వం కొనసాగిస్తోంది. పోలవరంలో ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్న క్రమంలో తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాపై మూడేళ్ల క్రితం కేసు(ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ) నమోదైన విషయం తెలిసిందే. అయితే ఈ కేసుకు సంబంధించి రాజాకు తుని పోలీసులు బుధవారం నోటీసులు జారీ చేశారు.

నేరుగా వైఎస్సార్‌ సీపీ కార్యాలయానికి వచ్చిన తుని రూరల్‌ ఎస్సై సీఆర్పీసీ సెక్షన్‌ 41 కింద నోటీసు అందజేశారు. కాగా మూడేళ్ల తర్వాత.. అది కూడా ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో తనపై కక్ష్య సాధించేందుకే యనుమల సోదరులు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారంటూ రాజా ఆరోపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement