సంగారెడ్డి జోన్ : సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్స్టేషన్ల పరిధిలో పోలీసులు నిర్వహించిన డ్రంక్ డ్రైవ్ కార్యక్రమంలో మద్యం తాగి వాహనాలు నడిపిన 24 మందిని గురువారం సంగారెడ్డి జిల్లా ఏడీఎం కోర్టులో హాజరుపర్చగా ఒక రోజు నుంచి ఏడు రోజుల వరకు జైలు శిక్ష విధిస్తూ ఏడీఎం కోర్టు మేజిస్ట్రేట్ దేవి మానస తీర్పు వెల్లడించారని సంగారెడ్డి ట్రాఫిక్ సీఐ సంజయ్కుమార్ తెలిపారు. సంగారెడ్డి ట్రాఫిక్ పోలీస్స్టేషన్ నుంచి 9 మందిని కోర్టులో ప్రవేశపెట్టామన్నారు. ఇద్దరికి రెండురోజులు, ఏడుగురికి ఒక రోజు జైలు శిక్ష వి«ధించారన్నారు. సంగారెడ్డి రూరల్ పోలీస్స్టేషన్ నుంచి ముగ్గురిని కోర్టులో ప్రవేశపెట్టగా ఒకరికి ఏడు రోజులు, ఒకరికి మూడు రోజులు, ఒకరికి ఒక రోజు జైలు శిక్ష విధించారన్నారు. మునిపల్లి పోలీస్స్టేషన్ నుండి 11 మందిని కోర్టులో ప్రవేశపెట్టగా వారిలో ఇద్దరికి మూడు రోజులు, ముగ్గురికి రెండు రోజులు, ఆరుగురికి ఒక రోజు జైలు శిక్ష విదించారన్నారు. బీడీఎల్ బానూర్ పోలీస్స్టేషన్ పరిధిలో ఒకరిని కోర్టులో హాజరు పర్చగా ఒక రోజు జైలు శిక్ష విధించినట్లు సీఐ సంజయ్కుమార్ తెలిపారు.
Breadcrumb
డ్రంకెన్ డ్రైవ్లో 24 మందికి జైలు
Jan 26 2018 3:50 PM | Updated on Aug 21 2018 6:02 PM
Advertisement
Related News By Category
Related News By Tags
-
తాగి నడిపితే.. మాములుగా వుండదు..!
మహబూబ్నగర్: జిల్లాలో రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో వాటిని కట్టడి చేయడానికి జిల్లా పోలీస్ శాఖ డ్రంకెన్ డ్రైవ్ కేసులపై ప్రత్యేక దృష్టిపెట్టింది. ఈ ఏడాది రికార్డు స్థాయిలో డ్రంకెన్ డ్రైవ్...
-
ఫోన్లో ఆ వీడియోలు ఉన్నాయని ..!
మెల్బోర్న్ : ఫోన్లో అశ్లీల దృశ్యాలు ఉన్నాయని ఓ వ్యక్తికి జైలుశిక్ష వేసిన ఘటన మెల్బోర్న్లో చోటుచేసుకుంది. ఇండియాకు చెందిన మన్ప్రీత్ సింగ్ ఫోన్లో చైల్డ్ పోర్నొగ్రఫీకి సంబంధించిన వీడియోలు ఉన్నా...
-
'ప్రమాదాలు కొనితెచ్చుకోవద్దు'
హైదరాబాద్: డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో మూడవ ఎంఎం కోర్టు 19మందికి రూ.2000 జరిమానాతో పాటు జైలు శిక్ష విధించిందని కాచిగూడ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ పి.జ్ఞానేందర్ రెడ్డి తెలిపారు. బుధవారం పోలీస్ స్టేష...
-
డ్రంకెన్ డ్రైవ్లో 8మందికి జైలు శిక్ష
కాచిగూడ : మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న 8 మందికి కోర్టు ఒకటి నుంచి మూడు రోజుల పాటు జైలు శిక్షతో పాటు రూ. 2 వేల అపరాధ రుసుం విధించింది. ఈ మేరకు కాచిగూడ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ పి.జ్ఞానేందర్ రె...
-
జైలు శిక్ష విధిస్తావా..చంపేస్తాం
తమిళనాడు: గంజాయి అక్రమ రవాణా కేసులో 12 సంవత్సరాల జైలు శిక్ష విధించిన న్యాయమూర్తిని కోర్టు ఆవరణలోనే చంపేస్తామని ఇద్దరు సోదరులు బెదిరించిన ఘటన తేని కోర్టు ఆవరణలో శుక్రవారం కలకలం రేపింది. వివరాలు.. మదురై...
Advertisement