
విజయం దిశగా దూసుకెళ్తున్న కంగారూలు
భారత్తో మ్యాచ్లో ఆస్ట్రేలియా విజయం దిశగా దూసుకెళ్తోంది.
మెల్బోర్న్: భారత్తో మ్యాచ్లో ఆస్ట్రేలియా విజయం దిశగా దూసుకెళ్తోంది. ముక్కోణపు సిరీస్లో భాగంగా ఆదివారం జరుగుతున్న మ్యాచ్లో 268 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ఆసీస్ 36 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. ఫించ్ (89) అజేయ హాఫ్ సెంచరీ చేశాడు. స్మిత్ (38) బ్యాటింగ్ చేస్తున్నాడు.
ఆసీస్ స్కోరు 51 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. భారత్ పేసర్ ఉమేష్ యాదవ్.. వార్నర్ను అవుట్ చేశాడు. వార్నర్.. రైనాకు క్యాచిచ్చాడు. 115 పరుగుల వద్ద అక్షర్ పటేల్.. వాట్సన్ (41)ను బౌల్డ్ చేశాడు.
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ దిగిన భారత్.. ఓపెనర్ రోహిత్ శర్మ(138) సెంచరీ, రైనా (51) హాఫ్ సెంచరీ చేయడంతో నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 267 పరుగులు చేసింది. ఆసీస్ బౌలర్ మిచెల్ స్టార్క్ ఆరు వికెట్లు తీసి భారత్ను కట్టడి చేశాడు.