దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న అండర్-19 క్రికెట్ ప్రపంచకప్ పోటీలలో భారత్ బోణి కొట్టింది.
దుబాయ్: దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న అండర్-19 క్రికెట్ ప్రపంచకప్ పోటీలలో భారత్ బోణి కొట్టింది. పాకిస్థాన్పై 40 పరుగుల తేడాతో భారత్ ఘనవిజయం సాధించింది.
మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లకు 7 వికెట్ల నష్టానికి 262 పరుగులు చేసింది. ఆ తరువాత రంగంలోకి దిగిన పాకిస్థాన్ జట్టు 48.4 ఓవర్లకు 222 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది.