
కోల్కతా: బలమైన జట్టున్న భారత్... గులాబీ బంతితో ఆడే డే నైట్ టెస్టునూ గెలవగలదని మాజీ సారథి సౌరభ్ గంగూలీ అన్నాడు. ‘బంతి రంగులో మార్పు తప్ప ఇందులో తేడా ఏమీ లేదు. నాణ్యమైన ఆటగాళ్లున్న భారత్ గెలవగలదు’ అని గురువారం ఓ వాణిజ్య కార్యక్రమంలో గంగూలీ వ్యాఖ్యానించాడు.
అఫ్గానిస్తాన్తో చరిత్రాత్మక టెస్టు ఆడకూడదని కెప్టెన్ కోహ్లి తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించాడు. ‘జట్టేదైనా దేశానికి ఆడటం ముఖ్యమని కోహ్లి భావి స్తాడు. అలాంటివాడు కౌంటీలను ఎంచుకోవడం ఇంగ్లండ్ పర్యటనకు అతడిస్తున్న ప్రాధాన్యాన్ని తెలియజేస్తుంది’ అని అన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment