భారత జట్టుకు ఐదో గెలుపు | Indian team to win the fifth | Sakshi
Sakshi News home page

భారత జట్టుకు ఐదో గెలుపు

Sep 7 2016 1:54 AM | Updated on Aug 29 2018 1:16 PM

చెస్ ఒలింపియాడ్‌లో భారత పురుషుల జట్టు వరుసగా ఐదో విజయాన్ని సాధించింది.

బాకు (అజర్‌బైజాన్): చెస్ ఒలింపియాడ్‌లో భారత పురుషుల జట్టు వరుసగా ఐదో విజయాన్ని సాధించింది. అజర్‌బైజాన్‌తో మంగళవారం జరిగిన ఐదో రౌండ్‌లో భారత్ 3-1తో గెలిచింది. పెంటేల హరికృష్ణ 34 ఎత్తుల్లో మమెదైరోవ్‌పై, విదిత్ 37 ఎత్తుల్లో నైదిష్‌పై నెగ్గగా... రద్జబోవ్‌తో ఆధిబన్, ఎల్తాజ్‌తో సేతురామన్ ‘డ్రా’ చేసుకున్నారు.

మహిళల విభాగంలో వియత్నాంతో జరిగిన ఐదో రౌండ్ గేమ్‌ను భారత్ 2-2తో ‘డ్రా’గా ముగించింది. ఎన్గుఝెన్ ఫామ్‌తో హారిక; థి థనాతో సౌమ్య ‘డ్రా’ చేసుకోగా... పద్మిని రౌత్ 61 ఎత్తుల్లో హోవాంగ్‌పై నెగ్గింది. తానియా సచ్‌దేవ్ 42 ఎత్తుల్లో థి మాయ్ హంగ్ చేతిలో ఓడిపోరుుంది. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement