భారత్ తొలి పోరు అర్జెంటీనాతో | India's first war with Argentina | Sakshi
Sakshi News home page

భారత్ తొలి పోరు అర్జెంటీనాతో

Sep 24 2015 1:16 AM | Updated on Sep 3 2017 9:51 AM

భారత్ తొలి పోరు అర్జెంటీనాతో

భారత్ తొలి పోరు అర్జెంటీనాతో

స్వదేశంలో జరిగే హాకీ వరల్డ్ లీగ్ ఫైనల్స్ టోర్నమెంట్‌లో ఆతిథ్య భారత జట్టు తొలి మ్యాచ్‌లో అర్జెంటీనాతో తలపడనుంది

హాకీ వరల్డ్ లీగ్ ఫైనల్స్ టోర్నీ షెడ్యూల్ విడుదల
 
 లుసానే (స్విట్జర్లాండ్): స్వదేశంలో జరిగే హాకీ వరల్డ్ లీగ్ ఫైనల్స్ టోర్నమెంట్‌లో ఆతిథ్య భారత జట్టు తొలి మ్యాచ్‌లో అర్జెంటీనాతో తలపడనుంది. ఈ ఏడాది నవంబరు 27 నుంచి డిసెంబరు 6 వరకు జరిగే ఈ మెగా ఈవెంట్‌కు చత్తీస్‌గఢ్ రాష్ట్ర రాజధాని రాయ్‌పూర్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ టోర్నీకి సంబంధించిన షెడ్యూల్‌ను అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్‌ఐహెచ్) బుధవారం విడుదల చేసింది.  పూల్ ‘బి’లో భారత్, అర్జెంటీనా, నెదర్లాండ్స్, జర్మనీ... పూల్ ‘ఎ’లో ఆస్ట్రేలియా, బెల్జియం, బ్రిటన్, కెనడా జట్లు ఉన్నాయి.

తొలి రోజు నవంబరు 27న అర్జెంటీనాతో భారత్; డిఫెండింగ్ చాంపియన్ నెదర్లాండ్స్‌తో ఒలింపిక్ చాంపియన్ జర్మనీ తలపడతాయి. అనంతరం భారత్ 28న జర్మనీతో; 30న నెదర్లాండ్స్‌తో ఆడుతుంది. డిసెంబరు 4, 5న సెమీఫైనల్స్, డిసెంబరు 6న ఫైనల్ జరుగుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement