హెచ్‌డబ్ల్యూఎల్‌ టోర్నీకి రజని | Rani Rampal to lead Indian women’s team in Hockey World League Semi-Final | Sakshi
Sakshi News home page

హెచ్‌డబ్ల్యూఎల్‌ టోర్నీకి రజని

Jun 22 2017 12:35 AM | Updated on Sep 5 2017 2:08 PM

వచ్చే నెలలో దక్షిణాఫ్రికాలోని జొహన్నెస్‌బర్గ్‌లో జరిగే మహిళల హాకీ వరల్డ్‌ లీగ్‌ (హెచ్‌డబ్ల్యూఎల్‌) సెమీఫైనల్స్‌ టోర్నమెంట్‌లో పాల్గొనే 18 మంది సభ్యులతో కూడిన భారత జట్టును ప్రకటించారు.

న్యూఢిల్లీ: వచ్చే నెలలో దక్షిణాఫ్రికాలోని జొహన్నెస్‌బర్గ్‌లో జరిగే మహిళల హాకీ వరల్డ్‌ లీగ్‌ (హెచ్‌డబ్ల్యూఎల్‌) సెమీఫైనల్స్‌ టోర్నమెంట్‌లో పాల్గొనే 18 మంది సభ్యులతో కూడిన భారత జట్టును ప్రకటించారు. రాణి రాంపాల్‌ కెప్టెన్‌గా, సుశీలా చాను వైస్‌ కెప్టెన్‌గా వ్యవహరిస్తారు. ఆంధ్రప్రదేశ్‌ అమ్మాయి ఎతిమరపు రజని రెండో గోల్‌కీపర్‌గా తన స్థానాన్ని నిలబెట్టుకుంది. ప్రధాన గోల్‌కీపర్‌గా హరియాణా అమ్మాయి సవిత పూనియా ఎంపికైంది. జూలై 8 నుంచి 23 వరకు జరిగే ఈ టోర్నీలో మొత్తం పది జట్లు పాల్గొంటాయి. టాప్‌–6లో నిలిచిన జట్లు వచ్చే ఏడాది లండన్‌లో జరిగే మహిళల ప్రపంచకప్‌కు అర్హత సాధిస్తాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement