సాక్షి, హైదరాబాద్: జాతీయ సీనియర్ షూటింగ్ చాంపియన్షిప్లో ఆంధ్రప్రదేశ్కు స్వర్ణం లభించింది. న్యూఢిల్లీలో శుక్రవారం జరిగిన పురుషుల ట్రాప్ టీమ్ ఈవెంట్లో కైనన్ చెనాయ్, దరియస్ చెనాయ్, గౌతమ్లతో కూడిన ఆంధ్రప్రదేశ్ జట్టు పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది. ఈ ముగ్గురు కలిసి మొత్తం 349 పాయింట్లు స్కోరు చేశారు. యూపీ, తమిళనాడు రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. వ్యక్తిగత విభాగంలో కైనన్ రజత పతకం సాధించాడు.
గగన్కు కాంస్యం: మరోవైపు పురుషుల 50 మీటర్ల రైఫిల్ ప్రోన్ ఈవెంట్లో ఆంధ్రప్రదేశ్కు చెందిన గగన్ నారంగ్ కాంస్య పతకం సాధించాడు. ఫైనల్ రౌండ్లో గగన్ నారంగ్ 183.6 పాయింట్లు స్కోరు చేసి మూడో స్థానంలో నిలిచాడు.
కైనన్ బృందానికి స్వర్ణం
Published Sat, Dec 21 2013 1:39 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement
Advertisement