ధోనికి పద్మభూషణ్.. కోహ్లీకి పద్మశ్రీ ఇవ్వండి!
ధోనికి పద్మభూషణ్.. కోహ్లీకి పద్మశ్రీ ఇవ్వండి!
Published Wed, Aug 13 2014 10:47 PM | Last Updated on Sat, Sep 2 2017 11:50 AM
న్యూఢిల్లీ: భారత క్రికెట్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి పద్మ భూషణ్, డాషింగ్ బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లీలకు పద్మశ్రీ అవార్డులను ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు సిఫారసు చేసింది. అలాగే మహిళ క్రికెటర్ మిథాలి రాజ్ కు కూడా పద్మశ్రీ అవార్డును ఇవ్వాలని బీసీసీఐ కోరింది.
ధోని, కోహ్లీ,మిథాలీ రాజ్ లకు పద్మ అవార్డులు ఇవ్వాలని సిఫారసు చేసిందనే వార్తను బీసీసీఐ ప్రతినిధులు ధృవీకరించారు. ధోనికి 2009లో పద్మశ్రీ అవార్డు లభించింది. ఒకవేళ భారత ప్రభుత్వం బీసీసీఐ సిఫారసును ఆమోదించినట్టయిలే పద్మభూషణ్ అవార్డు అందుకునే క్రికెటర్లలో ధోని 10వ వ్యక్తిగా రికార్డును సొంతం చేసుకుంటారు.
Advertisement
Advertisement