రాణించిన మిథాలీ | Mithali Raj , Raut guide India to consolation win | Sakshi
Sakshi News home page

రాణించిన మిథాలీ

Published Wed, Apr 2 2014 1:24 AM | Last Updated on Sat, Sep 2 2017 5:27 AM

రాణించిన మిథాలీ

రాణించిన మిథాలీ

మహిళల టి20 ప్రపంచకప్‌ను భారత జట్టు విజయంతో ముగించింది. చెత్త ఆటతో సెమీస్ చేరే అవకాశాన్ని కోల్పోయిన భారత్.. గ్రూప్‌‘బి’ చివరి లీగ్‌లో 9 వికెట్ల తేడాతో వెస్టిండీస్‌పై ఘన విజయం సాధించింది.

చివరి మ్యాచ్‌లో విండీస్‌పై భారత్ గెలుపు
 మహిళల టి20 ప్రపంచ కప్
 
 సిల్హెట్: మహిళల టి20 ప్రపంచకప్‌ను భారత జట్టు విజయంతో ముగించింది. చెత్త ఆటతో సెమీస్ చేరే అవకాశాన్ని కోల్పోయిన భారత్.. గ్రూప్‌‘బి’ చివరి లీగ్‌లో 9 వికెట్ల తేడాతో వెస్టిండీస్‌పై ఘన విజయం సాధించింది. దీంతో భారత్ ఈ గ్రూప్‌లో మూడో స్థానంతో సరిపెట్టుకుంది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్, డాట్టిన్ అర్ధసెంచరీ (57)తో 20 ఓవర్లలో 7 వికెట్లకు 117 పరుగులు చేసింది.
 
 ఆ తర్వాత భారత్ 17.4 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ పూనమ్ రౌత్ (52 బంతుల్లో 56; 7 ఫోర్లు), కెప్టెన్ మిథాలీ (52 బంతుల్లో 55 నాటౌట్; 6 ఫోర్లు) అర్ధ సెంచరీలతో రాణించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. బుధవారం జరిగే 2016 టి20 ప్రపంచకప్ క్వాలిఫికేషన్ మ్యాచ్‌ల్లో పాకిస్థాన్‌తో భారత్; శ్రీలంకతో న్యూజిలాండ్ తలపడతాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement