సెయింట్ జాన్స్: వన్డే ప్రపంచ కప్లో పొల్గొనే వెస్టిండీస్ క్రికెట్ జట్టులో సీనియర్లు డ్వెన్ బ్రావో, కీరన్ పొలార్డ్లకు చోటు దక్కలేదు. విండీస్ సెలక్టర్లు సీనియర్లయిన వీరిద్దరినీ పక్కనబెట్టడం వివాదాస్పదమైంది.
ప్రపంచ కప్నకు 15 మందితో కూడిన విండీస్ జట్టును ఆదివారం ప్రకటించారు. జాసన్ హోల్డర్, మార్టోన్ శామ్యూల్స్ను కెప్టెన్, వైఎస్ కెప్టెన్గా నియమించారు. ఈ మెగా ఈవెంట్కు తాము అత్యుత్తమ జట్టును ఎంపిక చేశామని విండీస్ చీఫ్ సెలెక్టర్ క్లయివ్ లాయిడ్ అన్నాడు. జీతాల విషయంలో బ్రావో, పొలార్డ్.. విండీస్ బోర్డుల మధ్య గతంలో వివాదం ఏర్పడటం, ఇటీవల వీరిద్దరూ వన్డేల్లో అంతగా రాణించకపోవడంతో పక్కనబెట్టినట్టు భావిస్తున్నారు. వచ్చే నెల 14 నుంచి జరిగే ప్రపంచ కప్నకు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్నాయి.
విండీస్ జట్టు: జాసన్ హోల్డర్ (కెప్టెన్), మార్లోన్ శామ్యల్స్ (వైఎస్ కెప్టెన్), బెన్, డారెన్ బ్రావో, కార్టెర్, కాట్రెల్, క్రిస్టోఫర్ గేల్, సునీల్ నరైన్, రాందిన్, రోచ్, రసెల్, సమీ, సిమన్స్, డ్వెన్ స్మిత్, జెరోమీ టేలర్,
ప్రపంచ కప్: పొలార్డ్, బ్రావో అవుట్
Published Sun, Jan 11 2015 3:13 PM | Last Updated on Sat, Sep 2 2017 7:34 PM
Advertisement
Related news by tags
-
బడ్జెట్ బూస్ట్, మా ఆదాయం రూ. 2500 కోట్లకు పెరగొచ్చు- నితిన్ కామత్
2024 బడ్జెట్లో సెక్యూరిటీస్ లావాదేవీల పన్ను (ఎస్టిటి) రెట్టింపు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ జెరోధా సీఈవో ఎక్స్లో స్పందించారు. తాజా కేంద్ర బడ్జెట్లో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రతిపాదనతో తమకు రెట్టింపు లాభాలొస్తాయంటూ ట్వీట్ చేశారు.Budget summary for usSTT on options goes up from 0.062% to 0.1%. STT on futures goes up from 0.0125% to 0.02% from October 1st. We collected about Rs 1500 crores of STT last year, @zerodhaonline. If the volumes don't drop, this will increase to about Rs 2500 crores at the new…— Nithin Kamath (@Nithin0dha) July 23, 2024 ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ సర్కార్ కొలువు దీరిన తరువాత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో స్టాక్ మార్కెట్లకు సంబంధించి అనేక మార్పులను ప్రకటించారు. ముఖ్యంగా సెక్యూరిటీస్ లావాదేవీల పన్ను (ఎస్టిటి)ను ప్రస్తుత 0.01 శాతం నుండి 0.02 శాతానికి పెంచారు. అక్టోబర్ 1 నుండి ఇది అమల్లోకి రానుంది. ఈ పెంపు ద్వారా తాము రూ. 2,500 కోట్లు ఆర్జించే అవకాశం ఉందని వ్యవస్థాపకుడు, సీఈవో నితిన్ కామత్ తెలిపారు. గత ఏడాది ఈ పన్ను ద్వారా 1500కోట్లు వసూలు అయ్యాయి. ఇపుడిక ట్రేడింగ్ వాల్యూమ్లు తగ్గకపోతే కొత్త ధరల ప్రకారం రూ. 2,500 కోట్ల వరకు పెరగొచ్చని లెక్కలు చెప్పారు.బడ్జెట్ 2024-మార్కెట్-ప్రతిపాదనలుస్థిరాస్తి విక్రయానికి సంబంధించిన పన్నుల కోసం ఇండెక్సేషన్ ప్రయోజనాన్ని కూడా తొలగించింది. అలాగే ఆస్తి విక్రయంపై మూలధన లాభాల పన్నును ప్రస్తుత 20 శాతం నుండి 12.5 శాతానికి తగ్గించింది.దీర్ఘకాలిక మూలధన లాభాల పన్నును 10శాతం నుంచి 12.5శాతానికి పెంచారు.స్వల్పకాలిక మూలధన లాభాల పన్నును 15శాతం నుంచి 20శాతానికి పెంచారు. ఈ రెండూ నేటి నుంచి అమలులోకి రానున్నాయి. -
కేంద్ర మంత్రుల జీతాలకు కేటాయింపులు
కేంద్ర బడ్జెట్ 2024-25లో మంత్రిమండలి, క్యాబినెట్ సెక్రటేరియట్, ప్రధాన మంత్రి కార్యాలయ నిర్వహణ, ఇతర ఖర్చుల జాబితాను విడుదల చేశారు. ఇందుకోసం ఈ ఆర్థిక సంవత్సరంలో రూ .1,248.91 కోట్లు ఖర్చు చేయనున్నట్లు అంచనా వేశారు. ఇది 2023-24లో కేటాయించిన రూ.1,803.01 కోట్ల కంటే తక్కువ.ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ను మంగళవారం పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ప్రకటించిన పద్దుల పత్రాల్లో మంత్రి మండలి ఖర్చుల వివరాలను తెలిపారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికిగాను మంత్రి మండలి ఖర్చుల కోసం మొత్తం రూ.828.36 కోట్లు కేటాయించారు. 2023-24లో ఇది రూ.1,289.28 కోట్లుగా ఉంది. కేబినెట్ మంత్రులు, మాజీ ప్రధాన మంత్రుల జీతాలు, ఇతర అలవెన్సులు ప్రయాణాల ఖర్చుల కోసం ఈ నిధులను వెచ్చిస్తారు.జాతీయ భద్రతా మండలి సెక్రటేరియట్కు రూ.202.10 కోట్లు ఇచ్చారు. 2023-24లో ఇది రూ.299.30 కోట్లుగా ఉంది. ఈ మొత్తం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటేరియట్ అడ్మినిస్ట్రేటివ్ ఖర్చుల కోసం ఉపయోగిస్తారు. ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ కార్యాలయానికి (2023-24లో రూ.76.20 కోట్లు) మొత్తం రూ.72.11 కోట్లు అందించారు. ఈ కార్యాలయంతోపాటు నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ అడ్మినిస్ట్రేటివ్ ఖర్చుల కోసం ఈ నిధులను వాడుకుంటారు.కేంద్ర బడ్జెట్ 2024-25 కథనాల కోసం క్లిక్ చేయండికెమికల్ వెపన్స్ కన్వెన్షన్ (సీడబ్ల్యూసీ) పరిపాలనా ఖర్చుల కోసం 2023-24లో రూ.70.28 కోట్లు కేటాయించిన కేంద్రం ఈసారి రూ.75.24 కోట్లు ఇచ్చింది. ప్రధానమంత్రి కార్యాలయం పరిపాలనా ఖర్చుల కోసం రూ.65.30 కోట్లు (2023-24లో రూ. 62.65 కోట్లు) కేటాయించారు. మాజీ గవర్నర్లకు సచివాలయ సహాయం చెల్లింపుల కోసం బడ్జెట్లో రూ.1.80 కోట్లు (2023-24లో రూ.1.30 కోట్లు) కేటాయించారు. -
ఆటో పరిశ్రమపై కురవని వరాల జల్లు
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ఇందులో విద్య, వైద్యం, డిఫెన్స్ మొదలైన రంగాలకు వేలకోట్లు కేటాయించారు. కాగా రోజు రోజుకి అభివృద్ధి చెందుతున్న ఆటోమొబైల్ రంగానికి సంబంధించి ప్రత్యేకంగా ఎటువంటి ముఖ్యమైన ప్రకటనలు లేకపోవడం గమనార్హం.భారతదేశంలో ఆటోమొబైల్ రంగం వేగంగా విస్తరిస్తోంది, ఇది ప్రపంచవ్యాప్తంగా మూడవ అతిపెద్ద ఆటోమొబైల్ మార్కెట్గా నిలిచింది. ఈ వృద్ధిని దృష్టిలో ఉంచుకుని, పరిశ్రమను మరింతగా పెంచేందుకు అనేక ప్రకటనలను ఉండొచ్చని నిపుణులు భావించారు. అయితే ఈ బడ్జెట్లో అలాంటి ప్రకటనలేవీ లేదు.బడ్జెట్లో ఫేమ్ 3 సబ్సిడీ గురించి ఎలాంటి ప్రకటన లేదు. అంతే కాకుండా హైబ్రిడ్ వాహనాలపై పన్ను తగ్గింపులకు సంబంధించి కూడా ఎటువంటి ప్రకటనలు చేయలేదు. దిగుమతి చేసుకునే వాహనాల మీద కూడా ఎటువంటి ట్యాక్స్ తగ్గింపులు వెల్లడికాలేదు. మొత్తం మీద కేంద్ర బడ్జెట్ ఆటోమొబైల్ రంగం మీద అటువంటి వరాలజల్లు కురిపించలేదు. -
‘సంపద సృష్టించడం అంటే అప్పులు తెచ్చుకోవడం అన్నమాట’
సాక్షి, తాడేపల్లి: బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు నిధుల కేటాయింపుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. అమరావతికి రూ.15, 000 కోట్లు అప్పు వివిధ సంస్థల ద్వారా ఏర్పాటు చేస్తామని కేంద్ర బడ్జెట్లో ప్రకటిస్తే గొప్పలు చెప్పుకుంటున్నారంటూ ఏపీ కూటమి ప్రభుత్వ నేతలను ఉద్ధేశించి వ్యాఖ్యానించారు. సంపద సృష్టించడం అంటే అప్పులు తెచ్చుకోవడం అన్నమాట అంటూ సెటైర్లు వేశారు.అమరావతి కి 15000 కోట్లు అప్పు వివిధ సంస్థల ద్వారా ఏర్పాటు చేస్తామని కేంద్ర బడ్జెట్ లో ప్రకటిస్తే గొప్పలు చెప్పుకుంటున్నారు!సంపద సృష్టించడం అంటే అప్పులు తెచ్చుకోవడం అన్నమాట!@ncbn @JaiTDP— Ambati Rambabu (@AmbatiRambabu) July 23, 2024 కాగా కేంద్ర బడ్జెట్లో ఏపీకి మరోసారి మొండిచేయి ఎదురైంది. ఎన్డీఏ కూటమిలో ప్రధాన మిత్రపక్షంగా ఉన్న చంద్రబాబు.. ప్రత్యేక హోదా అంశంలో కేంద్రాన్ని ఒప్పించడంలో విఫలమయ్యారు. అలాగే భారీగా నిధులు రాబట్టలేకపోయారు. సరికదా.. రాష్ట్ర అభివృద్ధి కోసం కనీసం స్పష్టమైన హామీ ప్రకటనలు కూడా చేయించులేకపోయారు. సుమారు పదేళ్ల తర్వాత తెరపైకి ఏపీ విభజన అంశం వచ్చింది. అయితే ప్రత్యేక హోదా అనే పదాన్ని ప్రస్తావించకుండానే ప్రత్యేక సాయం ప్రకటన చేసింది కేంద్రం. ఈ క్రమంలో విభజన చట్టానికి కేంద్రం కట్టుబడి ఉందని చెబుతూ.. ఏపీ రాజధాని నిర్మాణానికి రూ.15వేల కోట్ల సాయం అందిస్తామని, అవసరాన్ని బట్టి మరిన్ని నిధులు ఇస్తామని.. అది వివిధ ఏజెన్సీల ద్వారా అప్పుల రూపేణా అని ఒక విడ్డూరమైన ప్రకటన చేశారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. -
ఓటర్లపై ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అనుచిత వ్యాఖ్యలు.. బాబు వెకిలి నవ్వులు
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే పెన్మత్స విష్ణుకుమార్రాజు.. పొంతన లేని వ్యాఖ్యలతో ఇటు సొంత పార్టీలోనూ, అటు ఇతర పార్టీల్లోనూ తరచూ నానుతూ ఉంటారు. ఎప్పుడు ఎవరిని పొగడుతారో? ఎప్పుడు ఎవరిని విమర్శిస్తారో? ఆయనకే తెలియదన్న పేరు గడించారు. వివాదాస్పద ప్రకటనలతో పార్టీలోనూ గందరగోళం సృష్టిస్తుంటారు. తాజాగా అసెంబ్లీలో ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ప్రసంగిస్తూ ఏపీ ఓటర్లపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ సాక్షిగా ఓటర్లను అవమానించారు. వైఎస్సార్సీపీకి ఓటేసిన వాళ్లు అన్నం తినేవాళ్లేనా? అంటూ వ్యాఖ్యానించారు. అయితే ప్రజలను కించపరిచేలా ఎమ్మెల్యే విష్ణుకుమార్రాజు మాట్లాడుతున్నా..సభా నాయకుడిగా చంద్రబాబు స్పందించకపోగా వెకిలి నవ్వు నవ్వడంపై ఓటర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Related News by category
-
ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ధరలు
యూనియన్ బడ్జెట్ 2024-25 ప్రకటన తరువాత బంగారం ధరలు భారీగా తగ్గాయి. గోల్డ్, సిల్వర్ వస్తువులు, కడ్డీలపైన బేసిక్ కస్టమ్స్ డ్యూటీని 15 శాతం నుంచి 6 శాతానికి తగ్గించారు. ప్లాటినం, పల్లాడియం, ఇరీడియం వంటి వాటిపై కూడా సుంకం 15.4 శాతం నుంచి 6 శాతానికి తగ్గిపోయింది.బంగారం, వెండి ధరలుకేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఒక్కసారిగా తగ్గిపోయాయి. దీంతో హైదరాబాద్, విజయవాడ, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో 22 క్యారెట్ల తులం ధర రూ. 2750 తగ్గింది. 24 క్యారెట్ల గోల్డ్ మీద రూ. 2999 తగ్గింది. ధరల తగ్గుదలతో పసిడి ధరలు వరుసగా రూ. 64950 (22 క్యారెట్స్ 10గ్రా), రూ. 70860 (24 క్యారెట్స్ 10గ్రా) వద్ద నిలిచాయి.ఇక చైన్నె, ఢిల్లీలలో కూడా 22 క్యారెట్స్, 24 క్యారెట్స్ 10 గ్రాముల బంగారం ధరలు వరుసగా రూ. 2750, రూ. 2990 తగ్గింది. దీంతో అక్కడ రాష్ట్రాల్లో కూడా బంగారం ధరలు ఒక్కసారిగా తగ్గాయి. వెండి ధర కూడా గరిష్టంగా రూ. 3500 తగ్గింది. దీంతో కేజీ వెండి రూ. 88000లకు చేరింది. -
Budget 2024-25: ‘అది ప్రభుత్వ ఆస్తులను విక్రయించడం కాదు’
కేంద్ర బడ్జెట్ 2024ను పార్లమెంట్లో సమర్పించిన తర్వాత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ విలేకరుల సమావేశంలో ప్రసంగించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..‘ప్రభుత్వ రంగ సంస్థల డివిడెండ్లు మెరుగుపడుతున్నాయి. దీర్ఘకాలిక మూలధన లాభాలపై 12.5% పన్నుపై చాలా చర్చలు జరిగాయి. నిజానికి సగటు పన్ను కంటే చాలా తగ్గించాం. పన్నుల విధానాన్ని మరింత సరళతరం చేసేందుకు దీన్ని ప్రవేశపెట్టాం. ప్రభుత్వ సంస్థల వాల్యూయేషన్లు పెరిగాయి. వాటి పనితీరు చాలా మెరుగుపడింది. ఆదాయ సమీకరణకు కేవలం పన్నులు విధించడమే మార్గం కాదు. పన్నేతర మార్గాలు చాలా ఉన్నాయి. ఈ మార్గాల్లో ప్రభుత్వానికి గత మూడేళ్లుగా ఆదాయం సమకూరుతోంది’ అన్నారు.కేంద్ర బడ్జెట్ 2024-25 ముఖ్యాంశాల కోసం క్లిక్ చేయండిప్రభుత్వ సంస్థల ఆస్తులను విక్రయిస్తున్నారనే ప్రశ్నకు కేంద్రమంత్రి సమాధానమిస్తూ..‘ఇది ఆస్తులను విక్రయించడం కాదు. వాడకంలోలేని ప్రభుత్వ సంస్థలకు చెందిన ప్రదేశాలు, భవనాలు, స్టేడియంలను మరిన్ని ప్రయోజనాల కోసం ఉపయోగించేలా ప్రభుత్వం చర్యలు చేపడుతుంది’ అన్నారు.#WATCH | #UnionBudget2024 | On changes in tax slab and other changes, Union Finance Minister Nirmala Sitharaman says, "It is not just because we have mentioned it in this budget but the attempt to widen the tax net is something which we have been repeatedly saying, that India's… pic.twitter.com/xrCO7EQD6b— ANI (@ANI) July 23, 2024 -
బడ్జెట్ ఎఫెక్ట్: నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు (మంగళవారం) ట్రేడింగ్ ముగిసే సమయానికి నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 73.04 పాయింట్ల నష్టంతో 80,429.04 వద్ద, నిఫ్టీ 30.20 పాయింట్ల నష్టంతో 24,479.05 వద్ద ముగిశాయి.టైటాన్ కంపెనీ, ఐటీసీ, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్, అదానీ పోర్ట్స్, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో నిలిచాయి. శ్రీరామ్ ఫైనాన్స్, లార్సెన్ & టుబ్రో, హిందాల్కో, బజాజ్ ఫైనాన్స్, ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ సంస్థలు నష్టాలను చవిచూశాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఏడాదికి 78.5 లక్షల ఉద్యోగాలు!.. కేంద్రం కీలక ప్రకటన
2023-24 ఆర్థిక సర్వే ప్రకారం, పెరుగుతున్న శ్రామికశక్తికి అనుగుణంగా వ్యవసాయేతర రంగంలో 2030 వరకు భారత ఆర్థిక వ్యవస్థ ఏటా సగటున 78.5 లక్షల ఉద్యోగాలను సృష్టించాల్సి ఉంది. సోమవారం పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్ కూడా దేశంలో ఉపాధి కల్పనలో ప్రైవేట్ రంగం పాత్రను గురించి వివరించింది.ఆర్థిక వ్యవస్థ సృష్టించాల్సిన ఉద్యోగాల సంఖ్య (సంవత్సరానికి 78.5 లక్షలు) గురించి సర్వే విస్తృత అంచనాను అందించింది. పని చేసే వయసులో ఉన్న ప్రతి ఒక్కరూ ఉద్యోగాలు కోరుకోరని. ఇందులో కొందరు స్వయం ఉపాధి కోసం చూస్తే.. మ్నారికొందరు స్టార్టప్ వంటి వాటిని ప్రారంభించి యజమానులుగా మారుతారు. ఆర్థిక వృద్ధి అనేది జీవనోపాధిని సృష్టించడమేనని సర్వే పేర్కొంది.శ్రామికశక్తిలో వ్యవసాయం వాటా తగ్గుతుందని కేంద్రం వెల్లడించింది. దీంతో భారత ఆర్థిక వ్యవస్థ వ్యవసాయేతర రంగంలో 2030 వరకు ఏటా సగటున 78.5 లక్షల ఉద్యోగాలను సృష్టించాలి. పెరుగుతున్న శ్రామిక శక్తిని తీర్చడానికి ప్రైవేట్ సంస్థలు దోహదపడాలని సర్వే పేర్కొంది.వ్యవసాయేతర రంగంలో సంవత్సరానికి 78.5 లక్షల ఉద్యోగాల డిమాండ్ను, ప్రస్తుతం ఉన్న PLI (5 సంవత్సరాలలో 60 లక్షల ఉపాధి కల్పన), మిత్రా టెక్స్టైల్ పథకం (20 లక్షల ఉపాధి కల్పన), ముద్ర మొదలైన పథకాలను భర్తీ చేయడం ద్వారా తీర్చవచ్చని డేటాలో వెల్లడించింది. -
బడ్జెట్ 2024-25: ఏ రంగానికి ఎన్ని కోట్లు?
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఏడోసారి బడ్జెట్ ప్రవేశపెట్టారు. బడ్జెట్ 2024-25లో వివిధ రంగాలకు మొత్తం రూ.48,20,512 కోట్లు కేటాయించారు. వికసిత భారత్ను దృష్టిలో ఉంచుకుని ప్రవేశపెట్టిన 2024-25 బడ్జెట్లో ఏ రంగానికి ఎంత కేటాయించిందని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.రక్షణ రంగం (డిఫెన్స్): రూ.4.56 లక్షల కోట్లు.గ్రామీణాభివృద్ధి (రూరల్ డెవలప్మెంట్): రూ.2,65,808 కోట్లు.వ్యవసాయం, అనుబంధ రంగాలు: రూ.1,51,851 కోట్లు.హోం వ్యవహారాలు: రూ.1,50,983 కోట్లు.విద్య: రూ.1,25,638 కోట్లు.ఐటీ, టెలికాం: రూ.1,16,342 కోట్లు.ఆరోగ్యం: రూ.89,287 కోట్లు.ఎనర్జీ: రూ.68,769 కోట్లు.సాంఘిక సంక్షేమం: రూ.56,501 కోట్లు.వాణిజ్యం, పరిశ్రమల రంగం: రూ. 47,559 కోట్లు
Advertisement