క్వార్టర్స్‌లో సానియా జంట | sania in quarter finals | Sakshi
Sakshi News home page

క్వార్టర్స్‌లో సానియా జంట

Published Mon, Mar 16 2015 1:42 AM | Last Updated on Sat, Sep 2 2017 10:54 PM

sania in quarter finals

కాలిఫోర్నియా: ఇండియన్ వెల్స్ ఓపెన్ డబ్ల్యూటీఏ ప్రీమియర్ టెన్నిస్ టోర్నమెంట్‌లో సానియా మీర్జా (భారత్)-మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) జంట క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. మహిళల డబుల్స్ రెండో రౌండ్‌లో టాప్ సీడ్ సానియా-హింగిస్ ద్వయం 6-3, 6-2తో కుద్రయెత్సెవా-పావ్లీచెంకోవా (రష్యా) జోడీపై గెలిచింది. 59 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ఇండో-స్విస్ జంట తమ ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేసి తమ సర్వీస్‌ను ఒకసారి కోల్పోయింది.
 
ఇదే టోర్నీ పురుషుల డబుల్స్ విభాగంలో రోహన్ బోపన్న (భారత్)-డానియల్ నెస్టర్ (కెనడా) జంట శుభారంభం చేసింది. తొలి రౌండ్‌లో బోపన్న-నెస్టర్ 7-6 (7/5), 6-4తో జెరెమీ చార్డీ-రిచర్డ్ గాస్కే (ఫ్రాన్స్) ద్వయంపై గెలిచింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement