రోమ్ మాస్టర్స్ ఫైనల్లో సానియా జోడీ | Sania-Martina reach Rome Masters final | Sakshi
Sakshi News home page

రోమ్ మాస్టర్స్ ఫైనల్లో సానియా జోడీ

Published Sat, May 16 2015 7:13 PM | Last Updated on Sun, Sep 3 2017 2:10 AM

Sania-Martina reach Rome Masters final

రోమ్: భారత్ ఏస్ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా జోడీ.. రోమ్ మాస్టర్స్ టోర్నమెంట్లో దూసుకెళ్తోంది. మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్)తో కలసి బరిలో దిగిన సానియా మహిళల డబుల్స్లో ఫైనల్లో ప్రవేశించింది. శనివారం జరిగిన సెమీస్లో సానియా-మార్టినా 6-2, 7-6(5) స్కోరుతో కరోలిన్ గార్కియా (ఫ్రాన్సు)-కేటరినా స్రెబోట్నిక్ (స్లొవేనియా)పై విజయం సాధించారు. గంటా 27 నిమిషాల పాటు హోరాహోరీగా సాగిన పోరులో సానియా జోడీ వరుస సెట్లలో మ్యాచ్ను సొంతం చేసుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement