నేటి నుంచి సెపక్‌తక్రా చాంపియన్‌షిప్‌ | sepak takraw championship starts today | Sakshi
Sakshi News home page

నేటి నుంచి సెపక్‌తక్రా చాంపియన్‌షిప్‌

Feb 17 2018 10:11 AM | Updated on Sep 4 2018 5:07 PM

sepak takraw championship starts today - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆలిండియా ఇంటర్‌ యూనివర్సిటీ సెపక్‌తక్రా చాంపియన్‌షిప్‌ నేటి నుంచి జరుగనుంది. ఎల్బీ ఇండోర్‌ స్టేడియం వేదికగా మహిళలు, పురుషుల విభాగాల్లో సోమవారం వరకు ఈ పోటీలను నిర్వహిస్తారు. ఉస్మానియా యూనివర్సిటీ ఆధ్వర్యంలో జరిగే ఈ టోర్నీలో దేశవ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాలకు చెందిన 38 పురుషుల జట్లు, 32 మహిళల జట్లు పాల్గొంటున్నాయి. ఈ మేరకు శుక్రవారం టోర్నీకి సంబంధించిన బ్రోచర్‌ను నిర్వాహకులు విడుదల చేశారు. రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి టి. పద్మారావు గౌడ్‌ ఈ పోటీలను ప్రారంభిస్తారని వారు తెలిపారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో శాట్స్‌ చైర్మన్‌ ఎ. వెంకటేశ్వర్‌ రెడ్డి, ప్రొఫెసర్‌ ఎస్‌. రామచంద్రం, ఓయూ వైస్‌ చాన్స్‌లర్‌ తదితరులు పాల్గొంటారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement