నైనాకు టైటిల్ | Table tennis naina jaiswal won title | Sakshi
Sakshi News home page

నైనాకు టైటిల్

Published Thu, Oct 31 2013 12:16 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

జాతీయ ర్యాంకింగ్ ఈస్ట్‌జోన్ టేబుల్ టెన్నిస్ (టీటీ) చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్ అమ్మాయి నైనా జైస్వాల్ విజేతగా నిలిచింది.

సాక్షి, హైదరాబాద్: జాతీయ ర్యాంకింగ్ ఈస్ట్‌జోన్ టేబుల్ టెన్నిస్ (టీటీ) చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్ అమ్మాయి నైనా జైస్వాల్ విజేతగా నిలిచింది. పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురిలో మంగళవారం జరిగిన సబ్ జూనియర్ బాలికల సింగిల్స్ ఫైనల్లో నైనా 4-3 (11-8, 10-12, 11-8, 9-11, 6-11, 11-9, 12-10)తో మౌమితా దత్తా (పశ్చిమ బెంగాల్)పై గెలిచింది.
 
 క్వార్టర్ ఫైనల్లో నైనా 3-2తో అర్చన కామత్ (కర్ణాటక)పై, సెమీఫైనల్లో 4-1తో అభినయ (తమిళనాడు)పై విజయం సాధించింది. ఆంధ్రప్రదేశ్ నుంచి సబ్ జూనియర్ స్థాయిలో రెండు జాతీయ ర్యాంకింగ్ టైటిల్స్ నెగ్గిన తొలి క్రీడాకారిణిగా నైనా గుర్తింపు పొందింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement