భారత జట్టు పరాజయం | The Indian team's defeat | Sakshi
Sakshi News home page

భారత జట్టు పరాజయం

Aug 7 2013 1:32 AM | Updated on Sep 1 2017 9:41 PM

ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి యడ్లపల్లి ప్రాంజల సింగిల్స్‌లో నెగ్గినా... ఐటీఎఫ్ వరల్డ్ జూనియర్ (అండర్-14) టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో భారత జట్టుకు ఓటమి తప్పలేదు.

 సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి యడ్లపల్లి ప్రాంజల సింగిల్స్‌లో నెగ్గినా... ఐటీఎఫ్ వరల్డ్ జూనియర్ (అండర్-14) టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో భారత జట్టుకు ఓటమి తప్పలేదు. చెక్ రిపబ్లిక్‌లోని ప్రాస్టెజోవ్‌లో ఈ టోర్నీ జరుగుతోంది. టోర్నమెంట్ గ్రూప్ ‘సి’ మ్యాచ్‌లో కెనడా 2-1 తేడాతో భారత్‌ను ఓడించింది. తొలి సింగిల్స్ మ్యాచ్‌లో ప్రాంజల 3-6, 6-2, 7-5 స్కోరుతో కాథరీన్ సెబోవ్‌పై విజయం సాధించింది.
 
 రెండో సింగిల్స్‌లో భారత అమ్మాయి మిహికా యాదవ్ 2-6, 4-6తో వనీసా వాంగ్ చేతిలో ఓటమిపాలైంది. డబుల్స్ మ్యాచ్‌లో ప్రాంజల-మిహికా జోడి 3-6, 2-6 స్కోరుతో వనీసా వాంగ్-చార్లొట్ రాబిలార్డ్ చేతిలో పరాజయం ఎదుర్కొంది. తమ తదుపరి లీగ్ మ్యాచ్‌లో భారత్... స్పెయిన్‌తో తలపడుతుంది. ఈ చాంపియన్‌షిప్‌లో మొత్తం 16 జట్లను నాలుగు గ్రూప్‌లుగా విభజించారు. ఒక్కో జట్టు లీగ్ స్థాయిలో మూడు మ్యాచ్‌లు ఆడి పాయింట్ల ప్రకారం నాకౌట్‌కు అర్హత సాధిస్తుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement