క్రిస్‌ గేల్‌కు అరుదైన గౌరవం | Universe Boss rings the iconic Bell At The Eden Gardens | Sakshi
Sakshi News home page

Apr 21 2018 4:45 PM | Updated on Apr 21 2018 4:54 PM

Universe Boss rings the iconic Bell At The Eden Gardens - Sakshi

గంటను మోగిస్తున్న గేల్‌

కోల్‌కతా: ఐపీఎల్‌-11 సీజన్‌లో దూకుడుమీద ఉన్న కింగ్స్‌పంజాబ్‌ ఓపెనర్‌, వెస్టిండియన్‌ క్రికెటర్‌ క్రిస్‌ గేల్‌కు అరుదైన గౌరవం దక్కింది. శనివారం కోల్‌కతాతో ఈడేన్‌ గార్డెన్స్‌ వేదికగా మ్యాచ్‌ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ప్రతి మ్యాచ్‌ ప్రారంభానికి ముందు ఈ మైదానంలో ఉన్న గంటను మోగించడం ఆనవాయితీగా వస్తోంది. నేడు ఈ అరుదైన అవకాశం ఈ విధ్వంసకర బ్యాట్స్‌మన్‌కు వచ్చింది. మ్యాచ్‌కు ముందు గేల్‌ గంట మోగించాడు.

ఇప్పటి వరకు ప్రముఖ మాజీ క్రికెటర్లు, అసాధారణ ప్రతిభ కనబర్చిన ఆటగాళ్లకు మాత్రమే ఈ అవకాశం లభించింది. గతంలో కపిల్ దేవ్, వీవీఎస్ లక్ష్మణ్, వీరేంద్ర సెహ్వాగ్, మహిళా క్రికెటర్ జులాన్ గోస్వామికి ఈ అద్భుత అవకాశం దక్కింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇక గేల్‌ ఈ సీజన్‌లో ఆడిన రెండు మ్యాచుల్లో తమ జట్టును ఒంటి చేత్తో గెలిపించాడు. సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఏకంగా విశ్వరూపం కనబర్చి104 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement