యశ్వంత్, కీర్తనలకు స్వర్ణాలు | yaswanth, keertana got gold medals | Sakshi
Sakshi News home page

యశ్వంత్, కీర్తనలకు స్వర్ణాలు

Oct 23 2016 12:36 PM | Updated on Sep 15 2018 5:21 PM

హైదరాబాద్ జిల్లా స్థాయి రోలర్ స్కేటింగ్ చాంపియన్‌షిప్‌లో యశ్వంత్, కీర్తన పసిడి పతకాలతో మెరిశారు.

సాక్షి, హైదరాబాద్: జిల్లా స్థాయి రోలర్ స్కేటింగ్ చాంపియన్‌షిప్‌లో యశ్వంత్, కీర్తన పసిడి పతకాలతో మెరిశారు.రంగారెడ్డి జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఆర్‌ఆర్‌ఎస్‌జీఎఫ్) ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ రోలర్ స్కేటింగ్ ట్రాక్‌పై శనివారం జరిగిన అండర్-17 బాలుర ఫైనల్లో కె. యశ్వంత్ పసిడి పతకాన్ని దక్కించుకోగా... బి. రోహిత్, జాన్ సత్య వరుసగా రజత, కాంస్య పతకాలను గెలుచుకున్నారు. బాలికల విభాగంలో బి. కీర్తన, కోమిలక తొలి రెండు స్థానాల్లో నిలిచారు. అండర్-14 బాలుర విభాగంలో పి. శివరామ్ అగ్రస్థానంలో నిలవగా... కె. జతిన్, అనిరుధ్ రెండు, మూడు స్థానాల్ని సంపాదించారు. బాలికల విభాగంలో చరితాదేవి, సుశ్రుత, విధి వరుసగా తొలి మూడు స్థానాల్ని దక్కించుకున్నారు.   

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement