School Games
-
అదరగొట్టిన కడప బాలికలు
కడప: మైదుకూరులో జరిగిన రాష్ట్ర స్థాయి అండర్–17 బాలుర, బాలికల వాలీబాల్ పోటీల్లో కడప, విజయనగరం జట్లు అదరగొట్టాయి. మైదుకూరు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మూడు రోజులుగా జరిగిన ఈ పోటీలు సోమవారం ఫైనల్ మ్యాచ్లతో ఘనంగా ముగిశాయి. స్థానిక మేథా డిఫెన్స్ అకాడమి మైదానంలో ఒకటో కోర్టులో సోమవారం బాలుర విభాగంలో విజయనగరం – పశ్చిమగోదావరి జిల్లాల మధ్య ఫైనల్ మ్యాచ్ జరగగా విజయనగరం విజేతగా నిలిచింది. రెండో కోర్టులో బాలికల విభాగంలో కడప– గుంటూరు జిల్లాల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్లో కడప జట్టు ఘన విజయం సాధించింది. బాలుర విభాగంలో సెమీ ఫైనల్లో విజయనగరం జట్టు చేతిలో ఓడిపోయిన శ్రీకాకుళం, బాలికల విభాగంలో సెమీ ఫైనల్లో గుంటూరు జట్టుతో ఓడిపోయిన ప్రకాశం మూడో స్థానంలో సరిపెట్టుకున్నాయి. క్రీడా స్ఫూర్తితో పోటీలు జరగడం హర్షణీయం రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలు మైదుకూరులో క్రీడా స్ఫూర్తితో జరగడం హర్షణీయమని ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి తనయుడు, వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త శెట్టిపల్లె నాగిరెడ్డి తెలిపారు. వాలీబాల్ టోర్నమెంట్ ముగింపు సమావేశంలో ఆయన అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి పోటీలు మైదుకూరులో నిర్వహించడం నియోజకవర్గానికి ప్రతిష్టగా నిలిచిందన్నారు. టోర్నమెంట్ ప్రారంభ వేడుకల్లో ఎమ్మెల్యే రఘురామిరెడ్డి ఇచ్చిన హామీ మేరకు ఆయన తనయుడు నాగిరెడ్డి సోమవారం పోటీల్లో విజేతలుగా నిలిచిన జట్లకు నగదు బహుమతులను అందజేశారు. బాలికల, బాలుర విభాగంలో విజేతలుగా నిలిచిన కడప, విజయనగరం జట్లకు రూ.20 వేల చొప్పున, రెండో స్థానంలో నిలిచిన పశి్చమగోదావరి, గుంటూరు జట్లకు రూ.10 వేల చొప్పున నగదు బహుమతులను ఆయా జట్ల కెపె్టన్, కోచ్ మేనేజర్లకు అందజేశారు. మూడో స్థానంలో నిలిచిన శ్రీకాకుళం, ప్రకాశం జిల్లాల జట్లకు రూ.5 వేల నగదును అందించారు. మైదుకూరు మున్సిపల్ వై.రంగస్వామి మాట్లాడుతూ పోటీల్లో గెలుపోటములు సహజమేనని అన్నారు. మైదుకూరులో వాలీబాల్ పోటీల్లో విజేతలుగా నిలిచిన వారు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కూడా ప్రతిభ చూపి రాష్ట్రానికి, దేశానికి మంచి పేరు తేవాలని సూచించారు. శెట్టిపల్లె నాగిరెడ్డి, మున్సిపల్ కమిషనర్తోపాటు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ వైఎస్సార్, అన్నమయ్య జిల్లాల కార్యనిర్వాహక కార్యదర్శులు అరుణకుమారి, వసంత, మేధా డిఫెన్స్ అకాడమి చైర్మన్ సి.నరసింహులు, వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం రాష్ట్ర నాయకులు విజేతలుగా నిలిచిన జట్లలోని క్రీడాకారులకు గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ మెడల్స్ బహూకరించారు. కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాల సంఘం నాయకులు సాజిద్, రమేష్ యాదవ్, నిత్య ప్రభాకర్, ప్రవీణ్ కుమార్, కిరణ్, శ్రీకాంత్, రమేష్ బాబు, గణేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర జట్లకు ఎంపిక శ్రీనగర్లో వచ్చే నెలలో జరిగే జాతీయ స్థాయి అండర్–17 బాలుర, బాలికల వాలీబాల్ పోటీల్లో పాల్గొనే రాష్ట్ర జట్లను ఎంపిక చేశారు. అండర్–17 బాలుర, బాలికల వాలీబాల్ టోర్నమెంట్ ముగిసిన అనంతరం రాష్ట్ర బాలుర, బాలికల జట్లను ఎంపిక చేశారు. బాలికల జట్టు : జి.ప్రవల్లిక (విశాఖపట్నం), ఎం.విజయలక్ష్మి (విజయనగరం), వి.కుసుమప్రియ, పావని (కడప), సోని, ఎం.సుమశ్రీ(గుంటూరు), పి.జశి్వత(అనంతపురం), ఇ.షణ్ముఖ ప్రియ (చిత్తూరు), కె.ప్రీతి (తూర్పుగోదావరి), ఎస్.పూజిత (ప్రకాశం), సీహెచ్ శ్రీపద్మజ(కృష్ణ), స్టాండ్ బైగా డి.కీర్తన (గుంటూరు), ఎస్.మానస (అనంతపురం), ఎం.వెంకటలక్ష్మి (నెల్లూరు), ఎస్.ఉన్నత సత్యశ్రీ(కృష్ణ), డి.సమైక్య (ప్రకాశం). బాలుర జట్టు : ఎ.ప్రేమ్ కుమార్, ఎస్.తోషన్ రాము (శ్రీకాకుళం), టి.రాహుల్, ఎన్.మౌర్య (విశాఖపట్నం), బి.రంజిత్ (విజయనగరం), వి.రాజు (పశ్చిమ గోదావరి), టి.సు«దీర్ (అనంతపురం), కె.డేవిడ్ రాజు (గుంటూరు), పి.కిరణ్బాబు (ప్రకాశం), ఎన్.అజయ్కుమార్ (కడప), స్టాండ్బైగా ఎస్.భరత్ (కృష్ణ), వై.రోహిత్(కడప), ఎం.ఆర్యన్ (నెల్లూరు), బి.కార్తీక్(అనంతపురం), వై.రాంబాబు (తూర్పుగోదావరి), కె.రాము (పశ్చిమ గోదావరి). -
నేషనల్ గేమ్స్కు ఆంధ్ర ప్రదేశ్ నుండి 609 మంది విద్యార్థుల ఎంపిక
సాక్షి, విజయవాడ: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అఫ్ ఇండియా ఆధ్వర్యంలో జరిగే 66వ నేషనల్ స్కూల్ గేమ్స్ కు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం నుండి 609 మంది విద్యార్థులు ఎంపికయ్యారని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శి జి. భానుమూర్తి రాజు ఒక ప్రకటనలో తెలిపారు. ఢిల్లీ, భోపాల్, గ్వాలియర్ నగరాల్లో జూన్ 6 నుండి 12 వరకు జరిగే ఈ పోటీల్లో అండర్ 19 బాలురు, బాలికలు 21 క్రీడా అంశాల్లో పోటీపడతారని ఆయన పేర్కొన్నారు. మన రాష్ట్రం నుండి 306 మంది బాలురు, 303 మంది బాలికలు, 49 మంది కోచ్లు, 45 మంది మేనేజర్లు, నలుగురు హెడ్ అఫ్ ది డెలిగేట్లతో కలిపి మొత్తం 707 మంది పాల్గొననున్నారని తెలిపారు. పాఠశాల విద్యా శాఖ కమిషనర్ ఎస్. సురేష్ కుమార్ ఆదేశాల మేరకు రాష్ట్ర స్థాయి, అంతర్ జిల్లాల స్థాయిలో పోటీలు నిర్వహించి ప్రతిభావంతులైన క్రీడాకారులను రాష్ట్ర జట్టుకు ఎంపిక చేయడమైందని వివరించారు. జాతీయ స్థాయి క్రీడల్లో పాల్గొనే క్రీడాకారుల రిజిస్ట్రేషన్ ఫీజు, ప్రయాణ ఖర్చులు, రోజువారీ కరువు భత్యం (డిఏ), స్పోర్ట్స్ కిట్స్ కొరకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని వెల్లడించారు. రాష్ట్రం నుండి పాల్గొననున్న క్రీడాకారులు అథ్లెటిక్స్, బాక్సింగ్, ఫుట్ బాల్, జూడో, వాలీ బాల్, టేబుల్ టెన్నిస్, హాకీ, బ్యాడ్మింటన్, స్విమ్మింగ్, బాస్కెట్ బాల్, కుస్తీ, వెయిట్ లిఫ్టింగ్, తైక్వాండో, యోగా, ఖో ఖో, కబడ్డీ, చెస్, టెన్నిస్, హ్యాండ్ బాల్, షూటింగ్, జిమ్నాస్టిక్స్ వంటి 21 క్రీడాంశాల్లో పాల్గొంటారని భానుమూర్తి ప్రకటించారు. -
ఆటల్లేని.. చదువులు..!
ఆట, పాటలతో ఆనందంగా కొనసాగాల్సిన విద్యార్థుల చదువు.. జీవితం తరగతి గోడలకే పరిమితమవుతోంది. మైదానాలు ఉంటే వ్యాయామ ఉపాధ్యాయులు ఉండరు.. వ్యాయామ ఉపాధ్యాయులు ఉంటే మైదానాలూ ఉండవు. ఇవి రెండూ లేని పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కళాశాలలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కోకొల్లలు. మంచిర్యాలసిటీ: అత్తెసరు వ్యాయామ ఉపాధ్యాయులతో అరకొర మైదానాలతో జిల్లాలోని విద్యార్థులు ఆటలకు దూరమై.. కేవలం చదువుకే పరిమితమవుతున్నారు. మానసిక ప్రశాంతత కొరవడి చదువుకు కూడా దూరమవుతున్న వారు అనేకమంది విద్యార్థులు జిల్లాల్లో ఉండటం గమనార్హం. ఆటలంటే ఇష్టమున్న విద్యార్థులు మానసికంగా ఆందోళనకు గురవుతున్నారు. దీంతో చదువుకు, ఆటలకు దూరమై విలువైన జీవితాన్ని కోల్పోతున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్, డిగ్రీ, కళాశాలలు 523 ఉండగా.. 338 విద్యాలయాల్లో వ్యాయామ ఉపాధ్యాయుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కేవలం 185 విద్యాసంస్థల్లో మాత్రమే వ్యాయామ ఉపాధ్యాయులు ఉన్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. 36 శాతం విద్యాలయాల్లో మాత్రమే విద్యార్థులకు క్రీడలు అందుబాటులో ఉండగా.. 64 శాతం సంస్థల్లో విద్యార్థులు క్రీడలకు దూరమవుతున్నారు. మైదానాల పరిస్థితి ఉమ్మడి జిల్లాలో 466 ఉన్నత పాఠశాలలకుగాను సుమారు 150 పాఠశాలలకు మైదానాలు లేవు. 46 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉండగా.. 20కి పైగా కళాశాలలకు మైదానాలు లేవు. 11 డిగ్రీ కళాశాలలకు మైదానాలు ఉన్నా.. తొమ్మిది కళాశాలలకు వ్యాయామ అధ్యాపకులు లేరు. అవసరమైన స్థలం అన్ని రకాల ఆటలను విద్యార్థులతో ఆడించేందుకు కొలతల ప్రకారం స్థలం అవసరం ఉంటుంది. ప్రాథమిక పాఠశాలలకు ఒకటిన్నర ఎకరం, ప్రాథమికోన్నత పాఠశాలలకు మూడెకరాలు, ఉన్నత పాఠశాలలకు ఐదెకరాల స్థలం ఉంటే విద్యార్థులకు సౌకర్యంగా ఉంటుంది. జూనియర్ కళాశాలలకు ఐదు, డిగ్రీ కళాశాలలకు పదెకరాల స్థలం ఉండాలి. పోస్టులు భర్తీ చేయాలి విద్యాసంస్థల్లో ఖాళీగా ఉన్న వ్యాయామ ఉపాధ్యాయ, అధ్యాపక పోస్టులను భర్తీ చేయాలి. పీఈటీలకు పీడీలుగా పదోన్నతులు ఇవ్వకపోవడంతో అనేక పాఠశాలల్లో పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. పీడీలకు పదోన్నతులు ఇచ్చిన నేపథ్యంలో జూనియర్, డిగ్రీ కళాశాలల్లో విద్యార్థులకు ఆటలు ఆడించడానికి అవకాశం ఉండేది. ఖాళీల ప్రభావంతోనే విద్యాసంస్థల్లో విద్యార్థులకు ఆటలు దూరమై, కేవలం చదువుకే పరిమితమవుతున్నారు. – బెల్లం శ్రీనివాస్, వ్యాయామ ఉపాధ్యాయుడు, తాండూర్ మండలం -
పరుగెత్తడమూ విద్యే..
వరంగల్ స్పోర్ట్స్ : ‘విద్య అంటే చదవడం, రాయడం.. ర్యాంకుల కోసం వెంపర్లాడడం కాదు.. ఉదయం, సాయంత్రం మైదానాల్లో పరుగెత్తడం.. ఇష్టమైన ఆటల్లో శిక్షణ పొందడమూ విద్యే’ అని బ్యాడ్మింటన్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి, భారత జట్టు కోచ్ పుల్లెల గోపిచంద్ అన్నారు. ఆదివారం హన్మకొండ అశోకా కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన తెలంగాణ రాష్ట్ర బ్యాడ్మింటన్ అసోసియేషన్ జనరల్ బాడీ సమావేశానికి హాజరైన ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ఇష్టమైన ఆటల్లో శిక్షణ ఇప్పించాలి తల్లిదండ్రులు వారి ఆలోచనలను పిల్లలపై బలవంతంగా రుద్దుతూ తరగతి గదులకే పరిమితం చేసే ప్రయత్నం చేస్తున్నారు. విద్యార్థులకు మైదానాలను పరిచ యం చేసి వారికి ఇష్టమైన ఆటల్లో శిక్షణ ఇప్పించాలి. అలా చేయడం వల్ల క్రీడల్లో గెలుపు ఓటములను సమానంగా స్వీకరించే మనస్తత్వం అలవడుతుంది. విద్యార్థులకు ఫిజికల్ ఎడ్యుకేషన్ తప్పనిసరి. ప్రతిభకు కొదువలేదు.. తెలంగాణలో ప్రతిభ గల క్రీడాకారులకు కొదువలేదు. పట్టణ, గ్రామీణ ప్రాంత క్రీడాకారులను ప్రోత్సహించేందుకు అసోసియేషన్ పాటుపడుతోంది. క్రీడలు, క్రీడాకారుల అభ్యున్నతికి సీఎం కేసీఆర్, కేటీఆర్లు ప్రత్యేకంగా చొరవ తీసుకుంటున్నారు. ప్రతిభ ఉండి ఆర్థికంగా, ఇతర కారణాలతో వెనుకబడిన క్రీడాకారుల వివరాలను మా దృష్టికి తీసుకొస్తే తప్పనిసరిగా వారికి మెరుగైన శిక్షణ అందజేస్తాం. ఫిట్నెస్ పెంపునకు ఒప్పందం టోర్నమెంట్ల సమయంలో క్రీడాకారులకు తెలియకుండా చిన్న చిన్న ఒత్తిళ్లు వారి మెదడులోకి చొచ్చుకుపోతుం టాయి. తద్వారా క్రీడలపై దృష్టి పెట్టలేక చాంపియన్షిప్లో ప్రతిభ కనబరచలేని పరిస్థితులు ఉన్నాయి. క్రీడాకారుల్లో సైకాలజికల్గా ఫిట్నెస్ పెంపొందించేందుకు ఖరగ్పూర్ ఐఐటీతో ఒప్పందం కుదుర్చుకున్నాం. మెరికల్లాంటి కోచ్లను తయారు చేస్తాం.. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో కోచ్ల కొరత ఉంది. కోచ్లు ఉన్న కొన్ని చోట్ల నైపుణ్యం కలిగిన వారు తక్కువగా ఉన్నట్లు గుర్తించాం. అందుకే రానున్న రోజుల్లో క్రీడాకారులనే కాదు మెరికల్లాంటి కోచ్లను తయారు చేయాలని సిద్ధమవుతున్నాం. అందుకోసం జూలై 1 నుంచి ప్రత్యేక శిక్షణ తరగుతులు నిర్వహించనున్నాం. ఇప్పడికే కోచ్లుగా కొనసాగుతున్న వారితోపాటు కొత్త వారికి ప్రత్యేక శిక్షణ అందించడమే తమ లక్ష్యం. వరంగల్లో త్వరలో బ్యాడ్మింటన్ అకాడమీ.. హైదరాబాద్లో మాదిరిగా రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో బ్యాడ్మింటన్ అకాడమీ ఏర్పాటు చేయాలన్న ఆకాంక్షను క్రీడాకారులు మా ముందుకు తీసుకొస్తున్నారు. అయితే అకాడమీ ఏర్పాటు చేయడం అంత సులువు కాదు. సాంకేతిక ఇతర కారణాలు అనేకం అడ్డొస్తుంటాయి. వరంగల్ కేంద్రంగా త్వరలోనే అకాడమీ ఏర్పాటు చేసేందుకు పలువురి సలహాలు, సూచనలు తీసుకుంటున్నాం. వీలైనంత త్వరలోనే ఏర్పాటుకు కృషి చేస్తున్నాను. -
సీఎం కప్పు..చేయించింది అప్పు..!
సాక్షి, రాయవరం (మండపేట): స్కూల్ గేమ్స్ను సీఎం కప్గా నామకరణం చేసి క్రీడా పోటీలు నిర్వహించారు. పేరు మారినా..తీరు మారలేదు. నిధులు మంజూరు చేస్తాం..క్రీడలు ఆడించండంటూ అధికారులు చెప్పడంతో పాఠశాలల్లో పనిచేసే పీఈటీలు, ఫిజికల్ డైరెక్టర్లు (పీడీ) జేబులో డబ్బులు తీసి ఖర్చు పెట్టారు. స్కూల్ గేమ్స్ను పూర్తి చేసి నెలలు గడుస్తున్నా..నేటికీ పైసా విడుదల కాకపోవడంతో అప్పులు చేసి తెచ్చిన డబ్బులకు వడ్డీలు కట్టాల్సి వస్తోందని తలలు పట్టుకుంటున్నారు. డిసెంబరుతో ముగిసిన పోటీలు... విద్యార్థుల్లో క్రీడా నైపుణ్యాలను వెలికి తీసేందుకు ప్రభుత్వం సీఎం కప్ పేరుతో క్రీడా పోటీలను నిర్వహించింది. సెప్టెంబరు 24వ తేదీ నుంచి జిల్లాలో ఎస్జీఎఫ్ పోటీలు ప్రారంభించారు. తొలుత మండల స్థాయి, అనంతరం నియోజకవర్గ స్థాయి, తదనంతరం జిల్లా స్థాయిలో పోటీలు నిర్వహించారు. జిల్లా స్థాయి పోటీలు నవంబరులో జరిగాయి. జిల్లా స్థాయిలో విజేతలుగా నిలిచిన వారిని రాష్ట్ర స్థాయి, రాష్ట్ర స్థాయిలో విజేతలుగా నిలిచిన వారిని జాతీయ స్థాయిలో ఆడించారు. జాతీయ స్థాయి పోటీలు డిసెంబర్లో ముగిశాయి. బాలురు, బాలికలకు వేర్వేరుగా సీఎం కప్ క్రీడా పోటీలు అండర్–14, అండర్–17 విభాగాల్లో మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో పోటీలను నిర్వహించారు. ఆరో తరగతి నుంచి పదో తరగతి అండర్–14, అండర్–17 పోటీలు నిర్వహించారు. ఇంటర్ విద్యార్థులకు అండర్–19 పోటీలు నిర్వహించారు. ఆడించే ఆటలివే మండల స్థాయిలో వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, హ్యాండ్బాల్, త్రోబాల్, బాల్బాడ్మింటన్, టెన్నికాయిట్, అథ్లెటిక్స్, యోగా పోటీలను నిర్వహించగా, జిల్లా స్థాయిలో ఫుట్బాల్, హాకీ, క్రికెట్, సాఫ్ట్బాల్, బేస్బాల్, బాస్కెట్బాల్, నెట్బాల్, టేబుల్ టెన్నిస్, లాన్ టెన్నిస్, షటిల్ బ్యాడ్మింటన్, బాక్సింగ్, కత్తి సాము, వెయిట్ లిఫ్టింగ్, స్విమ్మింగ్ తదితర 41 క్రీడలను ఆడించారు. తలకు మించిన భారంగా మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడా పోటీలు పూర్తయి ఇంత వరకూ ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు. క్రీడల్లో పాల్గొనే ప్రతి విద్యార్థికీ టీఏ రూ.30, డీఏ రూ.30ల వంతున మంజూరు చేయాల్సి ఉంది. దీని ప్రకారం మండలానికి రూ.50 వేలు, నియోజకవర్గ స్థాయి పోటీలకు రూ.50 వేలు విడుదల చేయాల్సి ఉంది. జిల్లా స్థాయిలో నిర్వహించే పోటీలకు ఒక్కో విద్యార్థికి టీఏ రూ.50, డీఏ రూ.50ల వంతున మంజూరు చేయాల్సి ఉంది. మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి పోటీల నిమిత్తం జిల్లాకు రూ.40.5 లక్షలు, జిల్లా స్థాయి పోటీలకు రూ.2 లక్షలు విడుదల కావాల్సి ఉంది. జిల్లాలోని జి.మామిడాడలో వెయిట్లిఫ్టింగ్, కాకినాడలో జిమ్నాస్టిక్స్, అనపర్తిలో రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీలు నిర్వహించారు. రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీల నిర్వహణ, జాతీయ స్థాయి పోటీలకు విద్యార్థులను సన్నద్ధం చేయడం, వారిని జాతీయ స్థాయి పోటీలకు గౌహతి, అగర్తల, జామ్నగర్కు పంపించారు. కోసం దాదాపు రూ.15 లక్షలు మంజూరు కావాల్సి ఉంది. ఈ విధంగా జిల్లాకు రూ.60 లక్షలు విడుదల కావాల్సి ఉండగా, నేటి వరకు ఒక్క రూపాయి కూడా విడుదల కాలేదు. ఇచ్చేదే అరకొర... క్రీడా పోటీల నిర్వహణకు ప్రభుత్వం కంటితుడుపు చర్యగా, అరకొరగా నిధులు కేటాయిస్తోంది. ఆ అరకొర నిధులు కూడా క్రీడాపోటీలు ముగిసి మూడు నెలలవుతున్నా నేటికీ ఒక్క రూ పాయి విడుదల కాలేదు. చాలా మంది పీఈటీలు, పీడీలు వడ్డీ కి అప్పులు తీసుకుని వచ్చి, పెట్టుబడి పెట్టారు. ఓ వైపు తెచ్చి న డబ్బులకు రోజు రోజుకూ వడ్డీలు పెరుగుతుంటే, వీరికి తలకు మించిన భారంగా మారుతోందని వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఎస్జీఎఫ్ నిధులు విడుదల చేయాలని పీఈటీలు, పీడీలు డిమాండ్ చేస్తున్నారు. ఇలా అయితే మెరుగైన క్రీడాకారులను ఎలా తయారు చేయగలమని పలువురు వ్యాయామ ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిధులు విడుదల కాకపోవడం వాస్తవమే... సీఎం కప్ క్రీడా పోటీలకు ఇప్పటి వరకు నిధులు విడుదల కాని విషయం వాస్తవమే. మండల స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు పోటీలు పూర్తి చేసినా డబ్బులు విడుదల కాలేదు. పెట్టుబడి పెట్టిన డబ్బులకు వడ్డీలు పెరగడంతో పీఈటీలు, పీడీలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. – రాజశేఖర్, జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు, పీఈటీ, పీడీ అసోసియేషన్, కాకినాడ -
‘క్రీడా’క్రమణ
ఒంగోలు టౌన్: దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలన్న సామెతను ఎంచక్కా అనుసరిస్తున్నారు అధికార పార్టీ నేతలు. జిల్లా కేంద్రం ఒంగోలు నగరంలో కోట్లాది రూపాయల విలువైన స్థలంపై కన్నేసిన టీడీపీ నాయకుడు అధికారం ఉండగానే దానిని సొంతం చేసుకోవాలకున్నాడు. ఆలోచన వచ్చిందే తడవుగా దానికొక క్రీడా శిక్షణ పేరు పెట్టారు. క్రీడల కోసం ఆ స్థలాన్ని కేటాయించాలంటూ నగర పాలక సంస్థకు ‘అధికార’పార్టీ హోదాలో దరఖాస్తు చేసుకున్నాడు. దానికి సంబంధించి గ్రీన్ సిగ్నల్ రాకమునుపే ఏకంగా ‘క్రీడా’క్రమణకు పాల్పడ్డాడు. నగరంలో విలువైన స్థలాన్ని క్రీడా శిక్షణ పేరుతో తన అధీనంలోకి తెచ్చుకున్నాడు. మునిసిపల్ స్థలం చుట్టూ సరిహద్దులు ఏర్పాటు చేశాడు. మట్టిని తరలించి చదును చేసుకొనే పనిలో నిమగ్నమయ్యాడు. నగరపాలక సంస్థ నుంచి అనుమతి రాకపోయినప్పటికీ అధికార పార్టీ అండతో ఆ స్థలంలో తాను అనుకున్న క్రీడా శిక్షణకు తుదిరూపు ఇచ్చాడు. ఇక్కడ శిక్షణ ఇస్తామంటూ ఏకంగా బోర్డు కూడా పెట్టేసుకున్నాడు. దానిని నియంత్రించాల్సిన నగర పాలక సంస్థ అధికారులు ‘జీ హుజూర్’ అన్నట్టు వ్యవహరిçస్తుండటంతో ఆ క్రీడా శిక్షకుడు హద్దులు గీసుకొని కోట్లాది రూపాయల విలువైన స్థలాన్ని తన ఆధీనంలోకి తెచ్చేసుకున్నాడు. ఆచ్చి బూచ్చి ఒంగోలు నగరంలోని ఒక వ్యక్తికి ఆచ్చి అనేది నిక్ నేమ్. తన పేరుకు ముందు ఆ పేరుతో పిలిపించుకుంటాడు. షటిల్ ఆటలో తన ప్రావీణ్యాన్ని శిక్షణ రూపంలోకి తీసుకువచ్చి ఆదాయ మార్గంగా మలుచుకున్నాడు. ఇంతవరకు బాగానే ఉంది. ఆ క్రీడా శిక్షకుడు ఎంచుకున్న స్థలాలే వివాదాస్పదం అవుతున్నాయి. కలెక్టరేట్లో టెన్నిస్ కోర్టు ఉంది. ఆ టెన్నిస్ కోర్టుకు సంబంధించిన స్థలాన్ని ఆచ్చి పరం చేసేశారు. జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, జిల్లా రెవెన్యూ అధికారి కార్యాలయాలు ఉండే కలెక్టరేట్ ఆవరణలోని స్థలాన్నే అధికార పార్టీని అడ్డం పెట్టుకొని తన గుప్పెట్లోకి తెచ్చుకున్నాడు. దీనిని మరువకముందే మరో మునిసిపల్ స్థలంపై ఆ శిక్షకుడి కన్ను పడింది. ఒంగోలు నగర నడిబొడ్డున ఊరచెరువులో ఖాళీగా ఉన్న కోట్లాది రూపాయల విలువైన స్థలాన్ని తన అధీనంలోకి తెచ్చుకునేందుకు క్రీడా శిక్షణను తెరపైకి తీసుకువచ్చాడు. అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధి సిఫార్సుతో తన అధీనంలోకి తెచ్చుకున్నాడు. ఊర చెరువులోని షాదీఖానాకు వెనుకవైపు ఉన్న నగర పాలక సంస్థ అధీనంలోని స్థలానికి సరిహద్దులు వేసుకొన్నాడు. స్కేటింగ్ రింక్ పేరుతో బోర్డు ఏర్పాటు చేసి ఆ స్థలాన్ని అనధికారికంగా తన చేతుల్లోకి తెచ్చుకున్నాడు. పేదలకో న్యాయం పెద్దలకు మరో న్యాయం.. ఒంగోలు నగరంలో పేదలు ఇళ్ల స్థలాలు లేక ఎక్కడైనా నగర పాలక సంస్థకు చెందిన స్థలంలో చిన్న గుడిసె వేసుకుంటే నగర పాలక యంత్రాంగం పోలీసు బలగంతో అక్కడకు చేరుకొని దానిని తొలగించే వరకు అక్కడ నుంచి కదిలేదుకాదు. కోట్ల విలువైన స్థలాన్ని చేతుల్లోకి తీసుకున్న వారిని మాత్రం పల్లెత్తు మాట అనే సాహసం నగర పాలక సంస్థ అధికారులు చేయడం లేదు. అందుకు కారణం సదరు వ్యక్తికి అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధి ఆశీస్సులు ఉండటమే. పరిశీలనలో ఉంది: కార్పొరేషన్ కమిషనర్ ఒంగోలు నగరంలోని ఊరచెరువు స్థలంలో క్రీడాశిక్షణకు సంబంధించి అసోసియేషన్ తరపున స్థలం కేటాయించమని తన కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నారని కమిషనర్ వెంకటకృష్ణ చెప్పారు. ఆ స్థలాన్ని ఎవరికీ కేటాయించలేదని, పరిశీలనలోనే ఉందన్నారు. ఈ విషయమై విచారించిన తరువాత అనుమతి ఇచ్చేందుకు నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారి అయిన జిల్లా కలెక్టర్కు నోట్ ఫైల్ పెడతామని తెలిపారు. -
తెలంగాణ జట్టుకు టైటిల్
సాక్షి, హైదరాబాద్: స్కూల్ గేమ్స్ సమాఖ్య ఆధ్వర్యంలో జరిగిన జాతీయ క్రికెట్ చాంపియన్షిప్లో తెలంగాణ జట్టు సత్తా చాటింది. చెన్నై వేదికగా జరిగిన ఈ టోర్నీలో విజేతగా నిలిచి టైటిల్ను కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన తమిళనాడు నిర్ణీత 10 ఓవర్లలో 89 పరుగులు చేసింది. అరవింద్ (53) అర్ధసెంచరీతో జట్టుకు మంచి స్కోరును అందించాడు. హైదరాబాద్ బౌలర్లలో శశాంక్ యాదవ్, పరిమళ్ చెరో వికెట్ పడగొట్టారు. అనంతరం బ్యాటింగ్లో మురళీ (42) రాణించడంతో తెలంగాణ 4 వికెట్లు కోల్పోయి 95 పరుగులు చేసి గెలిచింది. ప్రత్యర్థి బౌలర్లలో సుదర్శన్ 2 వికెట్లు దక్కించుకున్నాడు. -
విష్ణువర్ధన్ జంటకు స్వర్ణం
సాక్షి, హైదరాబాద్: ఖేలో ఇండియా నేషనల్ స్కూల్ గేమ్స్లో తెలంగాణ క్రీడాకారులు ఆకట్టుకున్నారు. న్యూఢిల్లీలో జరిగిన ఈ టోర్నీ బ్యాడ్మింటన్ ఈవెంట్లో స్వర్ణాన్ని కైవసం చేసుకున్నారు. టోర్నీ చివరిరోజు గురువారం జరిగిన బ్యాడ్మింటన్ బాలుర డబుల్స్లో రాష్ట్రానికి చెందిన విష్ణువర్ధన్– నవనీత్ జంట విజేతగా నిలిచింది. ఫైనల్లో విష్ణు వర్ధన్– నవనీత్ (తెలంగాణ) జంట 23–21, 21–16తో అడ్వీస్– అరవింద్ (కేరళ) జోడీపై గెలుపొందింది. సింగిల్స్ విభాగంలో తెలంగాణకే చెందిన సాయిచంద్ కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు. కాంస్య పతక పోరులో సాయిచంద్ 21–13, 21–17తో రోహన్ (మహారాష్ట్ర)పై విజయం సాధించాడు. మరోవైపు అథ్లెటిక్స్లోనూ తెలంగాణకు పతకం లభించింది. 400 మీ. పరుగులో శ్రీకాంత్ ద్వితీయ స్థానంలో నిలిచి రజతాన్ని సొంతం చేసుకున్నాడు. ఈ టోర్నీలో తెలంగాణకు మొత్తం 5 పతకాలు లభించాయి. ఈ సందర్భంగా జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన బ్యాడ్మింటన్ క్రీడాకారులను శాట్స్ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర్ రెడ్డి, ఎండీ ఎ. దినకర్ బాబు అభినందించారు. -
స్వర్ణాలతో మెరిసిన కార్తీక్, సాయి
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న ‘ఖేలో ఇండియా స్కూల్ గేమ్స్’లో తెలంగాణ క్రీడాకారులు మెరిశారు. న్యూఢిల్లీలో జరుగుతోన్న ఈ మెగా ఈవెంట్లో హకీంపేట్లోని తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ స్కూల్ (టీఎస్ఎస్ఎస్) విద్యార్థులు రెండు స్వర్ణాలను కైవసం చేసుకున్నారు. వెయిట్లిఫ్టింగ్లో హెచ్. కార్తీక్, ఆర్. శివలింగేశ్వర సాయి విజేతలుగా నిలిచారు. 85 కేజీల విభాగంలో కార్తీక్, 69 కేజీల విభాగంలో శివలింగేశ్వర సాయి చాంపియన్షిప్ను సొంతం చేసుకున్నారు. జాతీయ స్థాయిలో సత్తా చాటిన విద్యార్థులను శాట్స్ ఎండీ ఎ. దినకర్బాబు బుధవారం అభినందించారు. ఈ సందర్భంగా పతకాలు సాధించిన వెయిట్ లిఫ్టర్లతో పాటు, రాష్ట్ర జూడో, బాస్కెట్బాల్, ఖో–ఖో బృందాలను కలిశారు. అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి రాష్ట్రానికి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని ఆయన క్రీడాకారులను కోరారు. -
స్పీడ్బాల్ అండర్–19 రాష్ట్ర జట్ల ఎంపిక
నెల్లూరు(స్టోన్హౌస్పేట): స్కూల్గేమ్స్ అండర్–19 స్పీడ్బాల్ రాష్ట్ర బాలబాలికల జట్ల ఎంపికలను బుధవారం నిర్వహించారు. స్థానిక ఏసీ సుబ్బారెడ్డి స్పోర్ట్స్ కాంప్లెక్స్లో నిర్వహించిన అంతర్జిల్లాల పోటీల్లో బాలబాలికల జట్లను ఎంపిక చేసినట్లు స్కూల్గేమ్స్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి పాటూరు వేణుగోపాలరెడ్డి తెలిపారు. ఎంపికైన క్రీడాకారులు ఈ నెల 15నుంచి హిమాచల్ప్రదేశ్లో నిర్వహించనున్న జాతీయపోటీల్లో రాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తారన్నారు. గుంటూరు ఆర్జేడీ వై.పరం«ధామయ్య, డీవీఈఓ బీమా వెంకయ్య, ఆర్ఐఓ బాబూజాకబ్, రాష్ట్ర పరిశీలకులు పుల్లయ్య, స్పీడ్బాల్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు విద్యార్థులను అభినందించారు. -
శ్రీకాంత్, జ్యోతికలకు స్వర్ణాలు
సాక్షి, హైదరాబాద్: జాతీయ స్కూల్ గేమ్స్ అథ్లెటిక్స్ అండర్–19 చాంపియన్షిప్లో తెలుగు క్రీడాకారులు సత్తా చాటారు. హరియాణాలోని రోహ్తక్లో జరిగిన ఈ టోర్నీలో రెండు స్వర్ణాలను కైవసం చేసుకున్నారు. బాలుర 400మీ. పరుగులో తెలంగాణకు చెందిన డి. శ్రీకాంత్ విజేతగా నిలిచాడు. అతను లక్ష్యాన్ని 48.83 సెకన్లలో పూర్తిచేశాడు. బాలికల విభాగంలో ఆంధ్రప్రదేశ్కు ప్రాతినిధ్యం వహించిన డి. జ్యోతిక శ్రీ 56.23 సెకన్లలో పరుగును పూర్తి చేసి పసిడి పతకాన్ని సాధించింది. -
తెలంగాణ లిఫ్టర్లకు 4 పతకాలు
సాక్షి, హైదరాబాద్: జాతీయ స్కూల్గేమ్స్ అండర్–19 వెయిట్లిఫ్టింగ్ చాంపియన్షిప్లో తెలంగాణ క్రీడాకారులు ఆకట్టుకున్నారు. తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ స్కూల్ వేదికగా జరుగుతోన్న ఈ టోర్నీలో స్వర్ణం, రజతం, 2 కాంస్యాలతో కలిపి మొత్తం 4 పతకాలను సాధించింది. బాలుర 69 కేజీల విభాగంలో ఆర్ఎస్ఎల్ సాయి (తెలంగాణ) చాంపియన్గా నిలిచాడు. అతను ఫైనల్లో 235 కేజీలు (102 స్నాచ్+133 క్లీన్ అండ్ జర్క్) బరువునెత్తి పసిడి పతకాన్ని గెలుచుకున్నాడు. 62 కేజీల విభాగంలో ఆంధ్రప్రదేశ్కు చెందిన బి. కృష్ణ (222 కేజీలు) రజతాన్ని, ఏవీ యశ్వంత్ (తెలంగాణ, 205 కేజీలు) కాంస్యాన్ని సాధించారు. 77 కేజీల విభాగంలో ఎంహెచ్ నిహాల్ రాజ్ (తెలంగాణ, 256 కేజీలు), ఎ.శివరామకృష్ణ (ఆంధ్రప్రదేశ్, 254 కేజీలు) వరుసగా రెండు, మూడు స్థానాలను సాధించగా... బాలికల 63 కేజీల విభాగంలో వేముల సాహితి (123 కేజీలు) కాంస్యాన్ని దక్కించుకుంది. -
బెల్గాంలో రాష్ట్ర విద్యార్థుల అవస్థలు
సాక్షి, హైదరాబాద్: జాతీయ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో బెల్గాంలో జరుగుతున్న 63వ నేషనల్ గేమ్స్లో పాల్గొనేందుకు వెళ్ళిన తెలంగాణ విద్యార్థులు ఇబ్బందుల్లో పడ్డారు. ఈవెంట్లు, గేమ్స్ కేటగిరీల్లో తప్పులు దొర్లడంతో నేషనల్ గేమ్స్ యాజమాన్యం వారికి ప్రవేశం ఇవ్వడం లేదు. నెలల పాటు కసరత్తు పూర్తి చేసిన ఆయా విద్యార్థులు చివరకు పోటీలో పాల్గొనే అవకాశం దక్కకపోవడంతో గందరగోళంలో పడ్డారు. రాష్ట్రం నుంచి 31 మంది ఈ గేమ్స్కు ఎంపికవగా... రెండ్రోజుల క్రితం ఆయా విద్యార్థులు తల్లిదండ్రులతో కలసి బెల్గాం చేరుకున్నారు. ఆన్లైన్లో వివరాలు నమోదు చేసే సమయంలో పొరపాట్లు దొర్లడంతో ఈ పరిస్థితి తలెత్తింది. విద్యాశాఖ ఉన్నతాధికారులు జోక్యం చేసుకుంటే పలువురు విద్యార్థులు పోటీల్లో పాల్గొనే అవకాశం ఉంది. కానీ శని, ఆదివారాలు సెలవుదినాలు కావడంతో అధికారులు అందుబాటులోకి రాలేదు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. -
యశ్ వర్మకు స్వర్ణం
సాక్షి, హైదరాబాద్: జాతీయ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగిన స్విమ్మింగ్ చాంపియన్షిప్లో సికింద్రాబాద్ రైల్వే జూనియర్ కాలేజికి చెందిన యశ్ వర్మ సత్తా చాటాడు. ఢిల్లీలో జరిగిన ఈ టోర్నమెంట్లో రెండు పతకాలతో ఆకట్టుకున్నాడు. పురుషుల వ్యక్తిగత 400 మీటర్ల మెడ్లే విభాగంలో స్వర్ణంతో పాటు, 200 మీటర్ల బటర్ఫ్లయ్ కేటగిరీలో యశ్ కాంస్యాన్ని గెలుచుకున్నాడు. -
జాతీయ పోటీలకు తేజస్విని
సాక్షి, హైదరాబాద్: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్జీఎఫ్) రాష్ట్ర స్థాయి స్కేటింగ్ చాంపియన్షిప్లో రెయిన్బో ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థిని జీఎస్టీ తేజస్విని సత్తా చాటింది. ఇందిరాపార్క్లో ఆదివారం జరిగిన ఈ టోర్నమెంట్లో రెండు స్వర్ణ పతకాలను కైవసం చేసుకుంది. ఈ గెలుపుతో బెల్గామ్లో జరిగే జాతీయ స్థాయి స్కేటింగ్ చాంపియన్షిప్లో పాల్గొనే రాష్ట్ర జట్టుకు ఎంపికైంది. -
ఇకపై ఏటా ‘ఖేలో ఇండియా స్కూల్ గేమ్స్’
న్యూఢిల్లీ: జాతీయ క్రీడల్లాగే ఇకపై ‘ఖేలో ఇండియా’ స్కూల్, కాలేజ్ గేమ్స్ నిర్వహిస్తామని కేంద్ర క్రీడాశాఖ మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ వెల్లడించారు. ఈనెల 6 నుంచి జరుగనున్న ఫిఫా అండర్–17 ప్రపంచకప్లో పాల్గొనే భారత ఫుట్బాల్ జట్టును మంగళవారమిక్కడ సన్మానిం చారు. ఈ సందర్భంగా రాథోడ్ మాట్లా డుతూ ‘దేశ క్రీడల ముఖచిత్రాన్ని మార్చనున్నాం. అందరి సహకారంతో క్రీడల్లో భారత్ను మరో దశకు తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నాం. కుర్రాళ్లు చిరు ప్రాయంలోనే క్రీడలను కెరీర్గా ఎంచుకునేందుకు చక్కని ప్లాట్ఫామ్ను ఏర్పాటు చేస్తున్నాం. ఇందులో భాగంగా తొలిసారిగా ఈ ఏడాది ‘ఖేలో ఇండియా’ జాతీయ స్కూల్ గేమ్స్ను ఈ డిసెంబర్లో నిర్వహిస్తాం. అలాగే కాలేజ్ గేమ్స్ను వచ్చే జనవరిలో నిర్వహిస్తాం. ఇకపై క్రమం తప్పకుండా ప్రతిఏటా ఈ గేమ్స్ నిర్వహణకు చర్యలు తీసుకుంటాం. తద్వారా పాఠశాల, కళాశాల స్థాయిలో ప్రతిభగల క్రీడాకారులను వెలుగులోకి తెస్తాం’ అని అన్నారు. ఆసియా గేమ్స్, పాన్ అమెరికా గేమ్స్లా ఈ ఈవెంట్లను ఘనంగా నిర్వహిస్తామని ఆయన చెప్పుకొచ్చారు. పలు కార్పొరేట్ సంస్థల సౌజన్యంతో అట్టహాసంగా నిర్వహించే ఈ క్రీడలను ప్రత్యక్ష ప్రసారం చేస్తామన్నారు. ప్రతి సంవత్సరం 1000 మంది విద్యార్థులను ఎంపిక చేసి తదుపరి ఉత్తమ శిక్షణకు రూ. 5 లక్షలు చొప్పున ఎనిమిదేళ్ల పాటు ఇస్తామన్నారు. భారత ఫుట్బాలర్లను ఉద్దేశించి ‘మైదానంలోకి దిగాక మీరు ఈ మ్యాచే మీ కెరీర్ చివరిదన్నట్లు పోరాడండి. మీరు ఈ స్థాయికి రావడానికి పడిన కష్టాలను గుర్తుకుతెచ్చుకోండి. అప్పుడే అసాధారణ ఫలితాలు సాధిస్తారు’ అని ఉత్తేజపరిచారు. -
కోచ్కు 105 ఏళ్ల జైలు శిక్ష
వాషింగ్టన్: చిన్నారులను లైంగికంగా వేధించిన కేసులో కాలిఫోర్నియా కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ప్రాధమిక పాఠశాలలో ఏడుగురు చిన్నారి బాలికలను లైంగిక వేధింపులకు గురిచేసిన కోచ్ రోనీ లీ రోమన్కు (44) కు ఏకంగా 105 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. జిన్హువా వార్తా సంస్థ అందించిన సమాచారం ప్రకారం లాస్ఏంజిల్స్ కౌంటీ సుపీరియర్ కోర్టు మంగళవారం ఈ తీర్పు వెలువరించింది. రోమన్పై మైనర్ బాలికలను వేధించిన ఘటనలకు సంబంధించి మొత్తం 7కేసుల్లో కోర్టు దోషిగా నిర్ధారించింది. పాఠశాల ఆవరణలో ఆరుగురికిపైనా, ఏడవది బాధిత బాలిక ఇంట్లో జరిగిందని విచారణలో తేలింది. 8నుంచి 11సంవత్సరాల వయసున్న బాలికలపై అతడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. జిల్లా అటార్నీ కార్యాలయం ప్రకారం కొలరావులోని కాహువేన్ ఎలిమెంటరీ స్కూల్లో, హాలీవుడ్లోని వైన్ ఎలిమెంటరీ పాఠశాలల్లో పనిచేసిన కాలంలో రోమన్ ఈ దారుణాలకు పాల్పడ్డాడు. ఈ ఏడాది జూన్ 7న ప్రాసిక్యూషన్ అతణ్ని దోషిగా నిర్ధారించడంతోకోర్టు కఠిన కారాగార శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. -
పాఠశాల కొనసాగించాలని ఎమ్మార్సీకి తాళం
గుడిబండ (మడకశిర) : తమ గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలను కొనసాగించాలని డిమాండ్ చేస్తూ మండల పరిధిలోని ముత్తుకూరు గ్రామస్తులు మంగళవారం గుడిబండ ఎమ్మార్సీ కార్యాలయానికి తాళం వేసి నిరసన తెలిపారు. వివరాల్లోకి వెళితే.. ఆ పాఠశాల ప్రభుత్వ రేషనలైజేషన్లో మూసివేశారు. అయితే పాఠశాల కొనసాగించాలంటే 30మంది విద్యార్థులు ఉండాలి. కానీ ఈ పాఠశాలకు 6,7వ తరగతులకు సంబంధించి కేవలం 25మందే ఉన్నారు. దీంతో పాఠశాల మూసివేస్తే తమ పిల్లలు సమీపంలోని పాఠశాలకు దాదాపు 2కిలోమీటర్లు నడిచి వెళ్లాల్సి వస్తుందని గ్రామస్తులు మండిపడ్డారు. కనుక పాఠశాలను కొనసాగించాలని కోరారు. ఎంఈఓ అందుబాటులో లేకపోవడంతో ఎంపీడీఓకు వినతిపత్రం ఇచ్చారు. ఇందుకు ఎంపీడీఓ సానుకూలంగా స్పందించారు. కార్యక్రమంలో శీనానాయక్, భీమారెడ్డి, కరిబసయ్య, నగేష్, భీమరాజు, బసవరాజు, నరసయ్య, హనుమంతు, శీను తదితరులు పాల్గొన్నారు. -
జాతీయ స్థాయి రగ్బీ పోటీలకు ఏపీ జట్టు
వెంకటేశ్వరపురం(నంద్యాల రూరల్): ఈనెల 22 నుంచి 24 వరకు ఒరిస్సాలోని భువనేశ్వర్లో జరిగే 62వ జాతీయ స్థాయి స్కూల్గేమ్స్ అండర్–17 బాలబాలికల రగ్బీ పోటీల్లో పాల్గొనే రాష్ట్ర క్రీడాకారులను ఎంపిక చేసినట్లు రగ్బీ రాష్ట్ర సంఘం ప్రధాన కార్యదర్శి రామాంజనేయులు తెలిపారు. మంగళవారం నంద్యాల సమీపంలోని వెంకటేశ్వరపురం వద్ద ఉన్న ఎస్డీఆర్ వరల్డ్ స్కూల్లో రాష్ట్ర జట్టు క్రీడాకారులతో స్కూల్ చైర్మన్ కొండారెడ్డి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలికల జట్టు కర్నూలు శ్రీలక్ష్మిప్రియ, గురురుషిక, చిట్టెమ్మ, శ్రీవల్లి, భారతి, అనూష, శివాణి, నెల్లూరుకు చెందిన శిల్పా, సాయివిహారిక, చిత్తూరుకు చెందిన జాహ్నవి, కడపకు చెందిన భవ్య నందిని, బాలుర విభాగంలో కర్నూలుకు చెందిన దివాకర్, సురేంద్ర, సందీప్, నెల్లూరుకు చెందిన షబ్బీర్, నవీన్, అబ్దుల్లా, శ్రీకాంత్, గుంటూరుకు చెందిన సాయిరంజిత్, గురుకృష్ణ, చిత్తూరుకు చెందిన శంకర్, మోహన్, కడపకు చెందిన ప్రవీణ్కుమార్లు ఎంపికయ్యారని వివరించారు. -
‘దేవాస్’ ఘటనపై ఇద్దరు సస్పెన్షన్
సాక్షి కథనంపై కదిలిన యంత్రాంగం సాక్షి, అమరావతి: జాతీయ ఖోఖో పోటీలకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ మర్చిపోయిన ఇద్దరు అధికారులపై వేటుపడింది. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(ఏస్జీఎఫ్ఐ) రాష్ట్ర కార్యదర్శి, అనంతపురం జిల్లా కార్యదర్శిలను విద్యాశాఖ సస్పెండ్ చేసింది. రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆదేశాల మేరకు పాఠశాల విద్యాశాఖ ఇన్చార్జి కమిషనర్ జి.శ్రీనివాసులు బాధ్యులను సస్పెండ్ చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. జాతీయ ఖోఖో పోటీలకు రాష్ట్రంనుంచి 24 మంది విద్యార్థులను మధ్యప్రదేశ్లోని దేవాస్కు పంపి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేయకపోవడంతో ఆ విద్యార్థులు పోటీలకు అవకాశం కోల్పోవడం, దేవాస్లో ఇబ్బందులకు గురైన వైనంపై ‘సాక్షి’లో కథనం వెలువడిన సంగతి తెలిసిందే. -
రగ్బీ విజేత కర్నూలు
వెంకటేశ్వరపురం (నంద్యాలరూరల్): రాష్ట్రస్థాయి 62వ స్కూల్గేమ్స్ అండర్–17 బాల బాలికల రగ్బీ పోటీల్లో కర్నూలు బాలికల జట్టు విజయకేతనం ఎగుర వేసింది. బాలుర విభాగంలో గుంటూరు జట్టు ప్రథమ స్థానంలో నిలిచింది. బాలికల విభాగంలో నెల్లూరు జట్టు రజితం, చిత్తూరు జట్టు కాంస్య పతకాలు, బాలుర విభాగంలో నెల్లూరు జట్టు రజితం, కడప జట్టు కాంస్య పతకాలు సాధించాయి. మంగళవారం ఎస్డీఆర్ వరల్డ్ స్కూల్ ఆవరణలో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర స్కూల్ గేమ్స్ రగ్బీ సంఘ ప్రధాన కార్యదర్శి రామాంజనేయులు మాట్లాడుతూ..పోటీల్లో 8 జిల్లాల జట్లు పాల్గొని తమ ప్రతిభను చాటాయన్నారు. స్కూల్ చైర్మన్ కొండారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా రగ్బీ అసోసియేషన్ అధ్యక్షుడు సురేందర్, జిల్లా స్కూల్ గేమ్ సెక్రటరీ లక్ష్మినర్సయ్య తదితరులు పాల్గొన్నారు. -
3 నుంచి రెజ్లింగ్ టోర్నీ
సాక్షి, హైదరాబాద్: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో డిసెంబర్ 3 నుంచి రాష్ట్ర స్థాయి రెజ్లింగ్ చాంపియన్షిప్ జరుగనుంది. పురానాపూల్లోని జీహెచ్ఎంసీ ప్లేగ్రౌండ్లో మూడు రోజుల పాటు ఈ టోర్నీ జరుగుతుంది. అండర్-17 బాలికలకు ఫ్రీస్టయిల్, అండర్-17, 19 బాలురకు ఫ్రీస్టయిల్, గ్రీకో రోమన్ విభాగంలో పోటీలు నిర్వహిస్తారు. ఇందులో రాణించిన రెజ్లర్లు తెలంగాణ రాష్ట్ర జట్టుకు ఎంపికవుతారు. ఈ జట్టు జనవరి 2 నుంచి 7 వరకు ఢిల్లీలో జరిగే జాతీయ స్థాయి స్కూల్ గేమ్స్ రెజ్లింగ్ చాంపియన్షిప్లో పాల్గొంటుంది. మరిన్ని వివరాల కోసం హెచ్డీఎస్జీఎఫ్ అండర్-17 ఆర్గనైజింగ్ సెక్రటరీ సుధాకర్ రెడ్డి (7075462287), అండర్-19 జూనియర్ కాలేజ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ బి. లక్ష్మ య్య 9290049752), రెజ్లింగ్ సెక్షన్ సెక్రటరీ శ్రీనివాస్ (9652828811)లను ఫోనులో సంప్రదించవచ్చు. -
ఓవరాల్ చాంప్ రంగారెడ్డి
అంతర్ జిల్లా స్కేటింగ్ చాంపియన్షిప్ సాక్షి, హైదరాబాద్: అంతర్ జిల్లా స్కేటింగ్ చాంపియన్షిప్లో రంగారెడ్డి జిల్లా ఓవరాల్ చాంపియన్గా నిలిచింది. హైదరాబాద్ జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఇందిరాపార్క్లోని జీహెచ్ఎంసీ స్కేటింగ్ రింక్పై జరిగిన ఈ టోర్నీలో మొత్తం 18 పతకాలను సాధించి అగ్రస్థానంలో నిలిచింది. క్వాడ్ ఈవెంట్ విజేతల వివరాలు అండర్-11 బాలురు: 1. సాయి సాహస్ (హైదరాబాద్), 2. తనీశ్ (రంగారెడ్డి), 3. ప్రద్యుమ్న (హైదరాబాద్). బాలికలు: 1. తిష్య (రంగారెడ్డి), 2. తేజశ్వరీ (మెదక్), 3. ఇషా (రంగారెడ్డి). అండర్-14 బాలురు: 1. రితేశ్ (రంగారెడ్డి), 2. సాయి రామ్ (రంగారెడ్డి), 3. నీరజ్ (వరంగల్). బాలికలు: 1. నిత్య (హైదరాబాద్), 2. చరిత (రంగారెడ్డి), 3. కావ్య (హైదరాబాద్). అండర్-17 బాలురు: 1. మణికంఠ (రంగారెడ్డి), 2. యశ్వంత్ (రంగారెడ్డి), 3. శ్రీకృష్ణ (హైదరాబాద్). బాలికలు: 1. విజేత (రంగారెడ్డి). ఇన్ లైన్ ఈవెంట్ విజేతల వివరాలు అండర్-11 బాలురు: 1. ధర్నేశ్ (రంగారెడ్డి), 2. సాయి కృష్ణ (రంగారెడ్డి), 3. హేమంగ్ (హైదరాబాద్). బాలికలు: 1. స్మృతి (రంగారెడ్డి), 2. అభిజిత (రంగారెడ్డి), 3. కుల్సమ్ బాను అండర్-14 బాలురు: 1. ప్రణవ్ (మెదక్), 2. భువనేశ్ (హైదరాబాద్), 3. సిద్ధార్థ్ (హైదరాబాద్). బాలికలు: 1. లిఖిత (రంగారెడ్డి), 2. సంజన (రంగారెడ్డి), 3. విరిండా సైనీ (హైదరాబాద్). అండర్-17 బాలురు: 1. తోషినందన్ (హైదరాబాద్), 2. రోహన్ (హైదరాబాద్), 3. రియాన్ (రంగారెడ్డి) -
ఇశ్విమతాయ్కి స్వర్ణం
భూపాలపల్లి: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ రాష్ట్రస్థారుు స్విమ్మింగ్ పోటీల్లో ఇశ్వి మతాయ్ స్వర్ణం సాధించింది. అండర్-14 విభాగం 50మీ. బ్యాక్ో్టక్ల్రో తను 40.07 సెకన్లలో గమ్యం చేరి విజేతగా నిలిచింది. తద్వారా ఇశ్వి మతాయ్ జాతీయస్థారుు పోటీలకు ఎంపికైంది. ఈ విభాగంలో సంజన, అంజలి రెండు మూడు స్థానాల్లో నిలిచారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో రెండు రోజుల పాటు జరిగిన స్విమ్మింగ్ పోటీలలో మొత్తం 354 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. అండర్-14, 17, 19 విభాగాల్లో ఫ్రీ స్టరుుల్, బ్యాక్ ో్టక్,్ర బటర్ఫ్లయ్, బ్రెస్ట్ో్టక్,్ర వ్యక్తిగత మెడ్లె విభాగాల్లో పోటీలు జరిగారుు. 116 మంది జాతీయ స్థారుు పోటీలకు ఎంపికయ్యారు. -
నేడు క్రికెట్ సెలక్షన్స్
సాక్షి, హైదరాబాద్: త్వరలో జరగబోయే అంతర్ జిల్లా అండర్-19 బాలుర క్రికెట్ టోర్నమెంట్ కోసం నేడు (శనివారం) సెలక్షన్స జరుగనున్నాయి. హైదరాబాద్ జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (హెచ్డీఎస్జీఎఫ్) ఆధ్వర్యంలో సైనిక్పురిలోని భవన్స జూనియర్ కాలేజ్ వేదికగా ఈ ఎంపిక పోటీలు జరుగుతారుు. ఇందులో రాణించిన క్రీడాకారులు మహబూబ్నగర్లో ఈనెల 12 నుంచి 16 వరకు జరిగే అంతర్ జిల్లా క్రికెట్ టోర్నీకి ఎంపికవుతారు. మరిన్ని వివరాల కోసం రాజేంద్ర ప్రసాద్ (9299459335)ను సంప్రదించవచ్చు. -
బాల్ బ్యాడ్మింటన్ జట్ల ఎంపిక
చాగల్లు : అండర్–14 స్కూల్గేమ్స్ జిల్లా స్థాయి బాల, బాలికల బాల్ బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలను చాగల్లు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం నిర్వహించారు. ఈ ఎంపిక పోటీలను జిల్లా వ్యాయామ ఉపా«ధ్యాయుల సంఘం అధ్యక్షుడు మరడాని అచ్యుత్, స్కూల్గేమ్స్ జిల్లా కార్యదర్శి ఎ.సాయి శ్రీనివాస్ ముఖ్య అతి«థులుగా హాజరై పర్యవేక్షించారు. ఈ ఎంపిక పోటీలకు జిల్లాలో వివిధ ప్రాంతాల నుంచి 100 మంది క్రీడాకారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సెలక్షన్ కమిటీ కన్వీనర్ సీహెచ్ సతీష్కుమార్ మాట్లాడుతూ ఎంపికైన క్రీడాకారులు నవంబర్ నెలలో పెంటపాడులో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొంటారని తెలిపారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు పి.అనిల్కుమార్, వట్టికూటి సత్యనారాయణ వివిధ పాఠశాలల నుంచి వచ్చిన వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ∙బాలుర విభాగం జట్టు జి.కరుణ్య, యు.నితిన్, ఎం.రోహిణీకుమార్ (చాగల్లు), బి.రాహుల్(గౌరీపట్నం), యు.నరేష్ (బ్రాహ్మణగూడెం), కె.వెంకట రమణ (మద్దూరు), ఎస్.భార్గవ (పెంటపాడు), ఎం.సతీష్ (సమిశ్రగూడెం) ∙బాలికల విభాగం సీహెచ్ శ్రీజ, బి.స్వాతి (చాగల్లు), కె.శ్యామ్, ఎస్.పూజిత, ఎస్కే షలాంబి (పెంటపాడు), కె.జ్యోతి (శెట్టిపేట), ఎం.హిమవతి (తాళ్లపూడి), జె.జయరేఖ(ఊనగట్ల) ఎంపికయ్యారు. -
యశ్వంత్, కీర్తనలకు స్వర్ణాలు
సాక్షి, హైదరాబాద్: జిల్లా స్థాయి రోలర్ స్కేటింగ్ చాంపియన్షిప్లో యశ్వంత్, కీర్తన పసిడి పతకాలతో మెరిశారు.రంగారెడ్డి జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఆర్ఆర్ఎస్జీఎఫ్) ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ రోలర్ స్కేటింగ్ ట్రాక్పై శనివారం జరిగిన అండర్-17 బాలుర ఫైనల్లో కె. యశ్వంత్ పసిడి పతకాన్ని దక్కించుకోగా... బి. రోహిత్, జాన్ సత్య వరుసగా రజత, కాంస్య పతకాలను గెలుచుకున్నారు. బాలికల విభాగంలో బి. కీర్తన, కోమిలక తొలి రెండు స్థానాల్లో నిలిచారు. అండర్-14 బాలుర విభాగంలో పి. శివరామ్ అగ్రస్థానంలో నిలవగా... కె. జతిన్, అనిరుధ్ రెండు, మూడు స్థానాల్ని సంపాదించారు. బాలికల విభాగంలో చరితాదేవి, సుశ్రుత, విధి వరుసగా తొలి మూడు స్థానాల్ని దక్కించుకున్నారు. -
ముగిసిన అంతర్ జిల్లాల కబడ్డీ పోటీలు
ఆచంట : ఆచంటలో మూడు రోజులపాటు జరిగిన 62వ అంతర్జిల్లాల స్కూల్గేమ్స్ అండర్–19 బాలుర, బాలికల కబడ్డీ పోటీలు బుధవారం ముగిశాయి. బాలుర విభాగంలో ప్రకాశం జట్టు, బాలికల విభాగంలో విజయనగరం జట్టు విజేతలుగా నిలిచాయి. రెండోస్థానాన్ని బాలుర విభాగంలో కృష్ణా, బాలికల విభాగంలో విశాఖ జట్లు సాధించాయి. మూడో స్థానంలో బాలుర విభాగంలో పశ్చిమగోదావరి జట్టు, బాలికల విభాగంలో ప్రకాశం జట్టు నిలిచాయి. నరసాపురం సబ్కలెక్టర్ ఏఎస్ దినేష్కుమార్ విజేతలకు బహుమతులు అందించారు. బాలికల మధ్య హోరాహోరీ బాలికల విభాగంలో ఫైనల్స్ హోరాహోరీగా జరిగింది. విజయనగరం, విశాఖ జట్లు నువ్వానేనా అన్నట్టు తలపడ్డాయి. మ్యాచ్ టై కావడంతో అంపైర్లు మరో ఐదు రైడ్స్తో ఆట కొనసాగించారు. చివరకు విజయనగరం జట్టు 29–28 పాయింట్లతో విశాఖను ఓడించింది. బాలుర మధ్య నువ్వానేనా.. బాలుర ఫైనల్స్ నువ్వానేనా అన్నట్టు సాగింది. కృష్ణా జట్టుపై ప్రకాశం జట్టు 30–27తో విజయకేతనం ఎగురవేసింది. మూడో స్థానం కోసం బాలుర విభాగంలో పశ్చిమగోదావరి, విశాఖ జట్లు తలపడగా పశ్చిమగోదావరి, బాలికల విభాగంలో ప్రకాశం, శ్రీకాకుళం జట్లు తలపడగా ప్రకాశం జట్లు గెలుపొందాయి. క్రీడలకు స్ఫూర్తినిచ్చేది కబడ్డీ క్రీడలకు స్పూర్తినిచ్చే ఆట కబడ్డీ అని, ఇటువంటి క్రీడలను మారుమూల గ్రామమైన ఆచంటలో అంతర్జిల్లాల స్థాయిలో నిర్వహించడం అభినందనీయమని నరసాపురం సబ్కలెక్టర్ ఏఎస్ దినేష్కుమార్ అన్నారు. కబడ్డీని ప్రొఫెషనల్గా తీసుకుని ఆడాలని సూచించారు. తహసిల్దార్ కె.రాజేంద్రప్రసాదరావు, ఎస్సై ఏజీఎస్ మూర్తి సర్పంచ్ బీరా తిరుతపమ్మ, జెడ్పీటీసీ సభ్యుడు, సిద్దాంతం వాటర్ డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్ తమ్మినీడి ప్రసాదు, ఓల్డ్ స్టూడెంట్స్ ఆసోసియేషన్ అధ్యక్షుడు బలుసు శ్రీరామమూర్తి పాల్గొన్నారు. -
ముగిసిన అంతర్ జిల్లాల కబడ్డీ పోటీలు
ఆచంట : ఆచంటలో మూడు రోజులపాటు జరిగిన 62వ అంతర్జిల్లాల స్కూల్గేమ్స్ అండర్–19 బాలుర, బాలికల కబడ్డీ పోటీలు బుధవారం ముగిశాయి. బాలుర విభాగంలో ప్రకాశం జట్టు, బాలికల విభాగంలో విజయనగరం జట్టు విజేతలుగా నిలిచాయి. రెండోస్థానాన్ని బాలుర విభాగంలో కృష్ణా, బాలికల విభాగంలో విశాఖ జట్లు సాధించాయి. మూడో స్థానంలో బాలుర విభాగంలో పశ్చిమగోదావరి జట్టు, బాలికల విభాగంలో ప్రకాశం జట్టు నిలిచాయి. నరసాపురం సబ్కలెక్టర్ ఏఎస్ దినేష్కుమార్ విజేతలకు బహుమతులు అందించారు. బాలికల మధ్య హోరాహోరీ బాలికల విభాగంలో ఫైనల్స్ హోరాహోరీగా జరిగింది. విజయనగరం, విశాఖ జట్లు నువ్వానేనా అన్నట్టు తలపడ్డాయి. మ్యాచ్ టై కావడంతో అంపైర్లు మరో ఐదు రైడ్స్తో ఆట కొనసాగించారు. చివరకు విజయనగరం జట్టు 29–28 పాయింట్లతో విశాఖను ఓడించింది. బాలుర మధ్య నువ్వానేనా.. బాలుర ఫైనల్స్ నువ్వానేనా అన్నట్టు సాగింది. కృష్ణా జట్టుపై ప్రకాశం జట్టు 30–27తో విజయకేతనం ఎగురవేసింది. మూడో స్థానం కోసం బాలుర విభాగంలో పశ్చిమగోదావరి, విశాఖ జట్లు తలపడగా పశ్చిమగోదావరి, బాలికల విభాగంలో ప్రకాశం, శ్రీకాకుళం జట్లు తలపడగా ప్రకాశం జట్లు గెలుపొందాయి. క్రీడలకు స్ఫూర్తినిచ్చేది కబడ్డీ క్రీడలకు స్పూర్తినిచ్చే ఆట కబడ్డీ అని, ఇటువంటి క్రీడలను మారుమూల గ్రామమైన ఆచంటలో అంతర్జిల్లాల స్థాయిలో నిర్వహించడం అభినందనీయమని నరసాపురం సబ్కలెక్టర్ ఏఎస్ దినేష్కుమార్ అన్నారు. కబడ్డీని ప్రొఫెషనల్గా తీసుకుని ఆడాలని సూచించారు. తహసిల్దార్ కె.రాజేంద్రప్రసాదరావు, ఎస్సై ఏజీఎస్ మూర్తి సర్పంచ్ బీరా తిరుతపమ్మ, జెడ్పీటీసీ సభ్యుడు, సిద్దాంతం వాటర్ డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్ తమ్మినీడి ప్రసాదు, ఓల్డ్ స్టూడెంట్స్ ఆసోసియేషన్ అధ్యక్షుడు బలుసు శ్రీరామమూర్తి పాల్గొన్నారు. -
ఎస్జీఎఫ్ కబడ్డీ జట్ల ఎంపిక
కడప స్పోర్ట్స్: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్జీఎఫ్) ఆధ్వర్యంలో అండర్–14, అండర్–17 బాలబాలికల విభాగాల్లో జిల్లాస్థాయి కబడ్డీ ఎంపికలు నిర్వహించారు. కడప నగరంలోని గాంధీనగర్ నగరపాలకోన్నత పాఠశాలలో నిర్వహించిన ఈ ఎంపికలకు డీఈఓ బి. ప్రతాప్రెడ్డి విచ్చేసి క్రీడాకారులను పరిచయం చేసుకుని ఎంపికలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా క్రీడాకారులు రాష్ట్రస్థాయి పోటీల్లో చక్కటి ఆటతీరును కనబరిచి విజేతలుగా తిరిగి రావాలని ఆకాంక్షించారు. ఆర్ఐపీఈ భానుమూర్తిరాజు, ఎస్జీఎఫ్ జిల్లా కార్యదర్శి ఎల్.ఎ. సునీల్ మాట్లాడుతూ జిల్లా జట్టుకు ఎంపికైన అండర్–14 క్రీడాకారులు కర్నూలులో, అండర్–17 విభాగం క్రీడాకారులు విజయనగరంలో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనాల్సి ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సత్యసుజాతమ్మ, సుబ్బానాయుడు, వ్యాయామ ఉపాధ్యాయులు శివశంకర్రెడ్డి, వి. కేశవ, సంపత్కుమార్, నాగార్జున, రామాంజినేయులు తదితరులు పాల్గొన్నారు. అండర్–14 బాలుర జట్టు : పి. సతీష్కుమార్, పి.నాగరాజు, టి.మురళీకృష్ణ, ఎం.రంజింత్కుమార్, ఎం.వేణు, వి.నరేన్యాదవ్, డి.సుదర్శన్రెడ్డి, మధుకల్యాణ్, మహమ్మద్సలీం, మురళీమోహన్, చంద్రశేఖర్, రామాంజినేయులు. స్టాండ్బై : ఎస్.కె. సలీం, ఎం. శివకృష్ణ, కె.హరినాథ్, వి.వంశీ, ఎస్.మాబూహుస్సేన్. అండర్–14 బాలికల జట్టు : ఎం. సుకుమారి, జె.నాగసుధామణి, ఎం.శిల్ప, కె.సుస్మిత, ఎస్.మహబూబ్చాన్, సి. స్పందన, కె.సౌజన్య, ఎస్.నాగజ్యోతి, ఎస్.పల్లవి, ఎం. వెంకటనందిని, ఐ. కీర్తి, ఎ.పుష్పలత. స్టాండ్బై : ఎం. ప్రగతి, కె.శ్రీదేవి, ఎస్.దీప్తి, డి.మీనాక్షి, ఎల్.అపర్ణ. అండర్–17 బాలుర జట్టు : ఆర్. వెంకటేష్నాయక్, డి. శ్రీనివాసులు, కె.ప్రసన్న, కె.సురేంద్ర, ఎం.కిరణ్కుమార్, జి.సుధీర్కుమార్రెడ్డి, టి.చరణ్కుమార్, ఆర్.గోవర్ధన్రెడ్డి, ఎం.నందకుమార్, కె.దేవారెడ్డి, డి.విష్ణువర్ధన్, డి.కల్యాణ్యాదవ్. స్టాండ్బై : వై. రాధాకృష్ణారెడ్డి, ఎస్.శివప్రసాద్, జె.నవీన్కుమార్, పి. వినోద్కుమార్, పి.మహబూబ్బాషా. అండర్–17 బాలికల జట్టు : ఎస్.పూజ, వి.లక్ష్మిదేవి, పి.లక్ష్మిప్రసన్న, జి.అప్సర, కె.వెంకటపద్మజ, పి.చంద్రిక, వి.లక్ష్మిప్రసన్న, ఎం.ధనలక్ష్మి, డి.చిట్టెమ్మ, పి.మైనా, పి.సుభాషిణి, ఎ.సైదా. స్టాండ్బై : సి.హరిత, ఇ.అశ్విని, ఎన్.అజయ్కుమారి, డి. దీపిక. -
అంతర్ జిల్లాల కబడ్డీ పోటీలు ప్రారంభం
ఆచంట : స్థానిక ఎంవీఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో సోమవారం సాయంత్రం అంతర్ జిల్లాల అండర్–19 కబడ్డీ పోటీలు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో వేడుకగా ప్రారంభమయ్యాయి. ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ పోటీలను ప్రారంభించారు. క్రీడాకారుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం క్రీడాకారులను పరి చయం చేసుకున్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాలకు చెందిన బాలుర, బాలికల జట్లు పోటీలకు తరలివచ్చారు. ఫ్లడ్లైట్ల వెలుగులో పోటీలు ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. ఒలింపిక్స్లో కబడ్డీని చేర్చాలి రాష్ట్రంలోనూ, దేశంలోనూ కబడ్డీకి విశేష ఆదరణ ఉందని ఒలింపిక్స్లో చేరిస్తే భారత జట్టు తప్పక బంగారు పతకం సాధిస్తుందని ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ అన్నారు. కబడ్డీ పోటీలను ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ ప్రభుత్వం క్రీడలను మరింత ప్రోత్సహిస్తుందని, బడ్జెట్లో మరిన్ని నిధులు కేటాయించేలా కృషి చేస్తానని చెప్పారు. చదువుతో పాటు క్రీడలూ ప్రధానమని, తల్లిదండ్రులు తమ పిల్లలను క్రీడల్లో ప్రోత్సహించాలని సూచించారు. కళాశాలలో ప్రహరీ నిర్మాణానికి, మైదానం చదును చేసేందుకు నిధులు కేటాయిస్తామని చెప్పారు. స్కూల్గేమ్స్ ఫెడరేషన్ రాష్ట్ర పరిశీలకులు కేవీ శేషగిరిరావు, బి.రామారావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ వేణుగోపాలరెడ్డి, ఒలింపిక్ అసోసియేషన్ సభ్యుడు ఆదిరెడ్డి సత్యనారాయణ, జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి ఐజాక్, కళాశాల ప్రిన్సిపాల్ వి.శ్రీనివాసరావు, సర్పంచ్ బీరా తిరుపతమ్మ తదితరులు పాల్గొన్నారు. ఆయా జిల్లాల కోచ్లు, పీడీలు పోటీలను పర్యవేక్షించారు. -
ముగిసిన రాష్ట్రస్థాయి హాకీ పోటీలు
విజేతలుగా నిలిచిన కడప, అనంతపురం జట్లు కల్లూరు: కర్నూలు నగర శివారులోని ఇండస్ స్కూల్ క్రీడామైదానంలో జరుగుతున్న 62వ రాష్ట్ర స్థాయి అండర్ 14 బాలబాలికల హాకీ పోటీలు ఆదివారం ముగిశాయి. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈ పోటీలు నిర్వహించారు. బాలుర విభాగంలో కడప జట్టు 5–0 గోల్స్ తేడాతో అనంతపురంపై విజయం సాధించింది. మూడో స్థానానికి చిత్తూరు, కర్నూలు జట్లు పోటీపడగా 5–0 గోల్స్ తేడాతో చిత్తూరు జట్టు జయకేతనం ఎగురవేసింది. బాలికల విభాగంలో అనంతపురం, కడప జట్ట మధ్య హోరాహోరీగా ఫైనల్ మ్యాచ్ జరిగింది. నిర్ణీత సమయంలో ఏ జట్టు గోల్ చేయకపోవడంతో పెనాల్టీ షూటౌట్ నిర్వహించారు. ఇందులో అనంతపురం జట్టు 4–1 గోల్స్ తేడాతో విజయం సాధించగా కడప జట్టు రన్నర్స్ స్థానాల్లో నిలిచింది. మూడో స్థానానికి చిత్తూరు, వైజాగ్ జట్లు పోటీపడ్డాయి. 2–0 గోల్స్ తేడాతో చిత్తూరు జట్టు జయకేతనం ఎగుర వేసింది. విజేత జట్లకు జిల్లా ఎస్పీ ఆకె రవికృష్ణ ట్రోఫీలు, మెడల్స్ అందజేశారు. కార్యక్రమంలో ఇండస్ స్కూల్ అధినేత కేఎన్వీ రాజశేఖర్, జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు విజయకుమార్, క్రీడాపోటీల పరిశీలకుడు థామస్ పీటర్, వివిధ క్రీడా సంఘాల ప్రతినిధులు, పీఈటీలు, తదితరులు పాల్గొన్నారు. -
తెలంగాణ జట్లకు కాంస్యాలు
సాక్షి, హైదరాబాద్: జాతీయ స్కూల్ గేమ్స్ అండర్-14 చెస్ టోర్నమెంట్లో తెలంగాణ బాల, బాలికల జట్లకు కాంస్య పతకాలు లభించాయి. హయత్నగర్లోని వర్డ్అండ్ డీడ్ స్కూల్లో శుక్రవారం ఈ పోటీలు ముగిశాయి. మహారాష్ట్ర, గుజరాత్ జట్లు స్వర్ణ, రజత, కాంస్య పతకాలు గెల్చుకున్నాయి. రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్పర్సన్ సునీతా మహేందర్ రెడ్డి విజేతలకు బహుమతులు అందజేశారు. -
భువనగిరిలో జాతీయ స్థాయి క్రీడలు
భువనగిరి టౌన్: పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సోమవారం నుంచి జాతీయ స్థాయి క్రీడా పోటీలు నిర్వహించనున్నారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అండర్– 19 విభాగంలో జరిగే బాల్ బ్యాడ్మింటన్, షూటింగ్బాల్ క్రీడల కోసం మైదానాన్ని ఇప్పటికే సిద్ధం చేశారు. ఈ క్రీడలకు దేశంలోని 18 రాష్ట్రాల నుంచి క్రీడాకారులు రానున్నారు. బాల్ బాడ్మింటన్ బాలురు, బాలికలు, షూటింగ్ బాల్ బాలురు, బాలికల విభాగాల్లో పోటీలు నిర్వహించనున్నారు. క్రీడాకారులతో పాటు, కోచ్లు, రీఫరీలతో కలిపి మెుత్తం 700 మంది ఈ పోటీలకు హాజరుకానున్నట్లు నిర్వాహకులు తెలిపారు. క్రీడలకు వచ్చే వారికి కోశం స్థానిక శ్రీచైతన్య, శ్రీ ప్రతిభా, యునిటీ జూనియర్ కళాశాలలో బాలురు, ఎస్ఎస్ఆర్, శ్రీవైష్ణవి, టైమ్స్ జూనియర్ కళాశాలలో బాలికలకు వసతి కల్పించేందుకు ఏర్పాట్లు చేశారు. క్రీడాకారులకు కళాశాల పక్కనే ఉన్న శ్రీవాణి విద్యాలయంలో భోజన వసతి కల్పించనున్నారు. క్రీడల సందర్భంగా రోజువారీ సాంస్కృతిక కార్యక్రమాలు సైతం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ పోటీల్లో ఎలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా అన్ని శాఖల ఆధ్వర్యంలో ఇప్పటికే సమీక్షా సమావేశాలు సైతం నిర్వహించారు. -
ప్రతిభకు ’చెద’రంగం
రాష్ట్ర ఎస్జీఎఫ్ పోటీల నిర్వహణలో అక్రమాలు చెస్ టోర్నీలో ప్రతిభావంతులకు దక్కని చోటు కొన్ని రౌండ్లు ఆడకున్నా పాయింట్ల కేటాయింపు సస్పెన్షన్లో ఉన్న వ్యక్తే చీఫ్ ఆర్బిటర్ సాక్షి, సిటీబ్యూరో : తెలంగాణ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్జీఎఫ్) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి చెస్ జట్ల ఎంపికలో పెద్ద ఎత్తున అక్రమాలు చోటుచేసుకుంటున్నాయి. పిల్లల ప్రతిభకు పదునుపెట్టి మెరికల్లాంటి వారిని ఎంపిక చేయాల్సి ఉండగా.. ఎక్కడా అలా జరగడంలేదు. అయిన వారి కోసం ప్రతిభావంతులను పక్కన పెట్టిన బాగోతం తాజాగా బయటపడింది. నిబంధనలకు తిలోదకాలిచ్చి టోర్నీలు నిర్వహిస్తున్నట్లు తేలింది. 62వ జాతీయ స్కూల్ గేమ్స్ పోటీల్లో పాల్గొనే రాష్ట్ర స్థాయి(వేర్వేరు వయోవిభాగాలు) చెస్ జట్ల కోసం ఈనెల 17, 18వ తేదీన రంగారెడ్డి జిల్లా కీసర మండలం నాగారంలోని సెరెనిటీ స్కూల్లో సెలక్షన్స జరిగారుు. ఆటగాళ్లను ఎంపిక చేసే బాధ్యతల్ని రంగారెడ్డి జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్కు అప్పగించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలనుంచి వచ్చిన చెస్ క్రీడాకారులు (బాలలు, బాలికలు) అండర్ -14, 17, 19 విభాగాల్లో పాల్గొన్నారు. రెండు రోజులు ఐదు రౌండ్ల పాటు కొనసాగిన ఈ టోర్నీకి డైరక్టర్గా రమేష్ రెడ్డి, చీఫ్ ఆర్బిటర్గా శ్రీకృష్ణ అలియాస్ ధన వ్యవహరించారు. పక్కనపెట్టిన వ్యక్తికే పట్టం.. సస్పెన్షన్ వేటు పడిన వ్యక్తినే ఆర్బిటర్గా కొనసాగించి టోర్నీని నిర్వహించారు. అండర్-11 విభాగంలో రాష్ట్ర చెస్ చాంపియన్షిప్లో అవకతవకలకు పాల్పడ్డారని పేర్కొంటూ చీఫ్ ఆర్బిటర్ శ్రీకృష్ణపై నెల క్రితం తెలంగాణ రాష్ట్ర చెస్ అసోసియేషన్ ఆరు నెలలపాటు సస్పెన్షన్ విధించింది. నిషేధం ఉన్న కాలంలో ఏ టోర్నీకి కూడా ఆర్బిటర్గా వ్యవహరించకూడదని ఆ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ నిర్ణయం తీసుకుంది. అయి నా నిబంధనలకు విరుద్ధంగా జాతీయ స్థాయి జట్టుకు క్రీడాకారులను ఎంపిక చేసే బాధ్యతలను ఉద్దేశపూర్వకంగా అప్పగించినట్లు తెలుస్తోంది. మరోపక్క ఇటీవల జరిగిన జిల్లాస్థాయి పోటీల్లోనూ ఇతను ఆర్బిటర్ కొనసాగడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. అయినా అతన్ని తప్పించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. అవకతవకలకు సాక్ష్యాలు... ఈనెల 17న నాగారంలో జరిగిన స్టేట్ స్కూల్ గేమ్స్ చెస్ టోర్నీలో తొలిరోజు పాల్గొనని ఇద్దరు క్రీడాకారులను (అండర్-17, అండర్ -19 బాలికల విభాగం) పాల్గొన్నట్టుగా చూపించారు. అంతేగాక వారిని రెండో రోజునుంచి ఆడించారు. వాస్తవంగా తొలిరోజు ఆడని వారికి రెండో రోజు అవకాశం కల్పించకూడదు. వీరిద్దరిలో ఒకరు అండర్-19 విభాగంలో రాష్ట్రస్థారుు జట్టుకు ఎంపిక కావడం గమనార్హం. పైగా వీరిద్దరూ 17వ తేదీన రాష్ట్రంలోనే లేరు. ఇదే తేదీన కోల్కతాలో జరిగిన జాతీయ అండర్-17 బాలికల చదరంగ పోటీల్లో పాల్గొన్నారు. వాస్తవంగా తొలిరోజు జరిగిన రెండు రౌండ్లలో పాల్గొనకుండా అధిక పాయింట్లు సంపాదించడం చదరంగ చరిత్రలో సాధ్యపడిన దాఖలాలు లేవని నిపుణులు పేర్కొంటున్నారు. అండర్-14 బాలికల విభాగంలో తమకు కావాల్సిన క్రీడాకారిణి కోసం ప్రతిభ గల వ్యక్తిని పక్కనబెట్టారు. అది కూడా దాదాపు 1500 రేటింగ్ గల క్రీడాకారిణిని. ప్రతి రౌండ్కు ప్రత్యర్థులను నిర్ణయించే ప్రక్రియలో లోపాల కారణంగా అనర్హులకు టీంలో చోటు కల్పించారు. అండర్-17 బాలికల విభాగంలో మరో అక్రమం చోటుచేసుకుంది. ఓ బాలికకు ఫిడే రేటింగ్ ఉన్న అంశంపై గోప్యత పాటించారు. ఈ క్రీడాకారిణిని.. అసలు రేటింగ్ లేనివారితో తలపడేలా చేశారు. ఫలితంగా గోప్యత పాటించిన క్రీడాకారిణి 4 పాయింట్లు సాధించి జాతీయ టోర్నీ ఆడే టీంకు ఎంపికకావడం గమనార్హం. లోపాలు ఎక్కడా బయటపడకుండా పూర్తిగా సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకున్నట్లు తెలుస్తోంది. వాస్తవంగా అవకతవకలకు అవకాశం ఉండే ‘స్విస్ పర్ఫెక్ట్’ సాఫ్ట్వేర్పై ఫెడరేషన్ నిషేధం విధించింది. దాంతో ఏ చెస్ అసోసియేషన్ కూడా కొన్నాళ్లుగా వినియోగించడం లేదు. అరుుతే ప్రతిష్టాత్మక రాష్ట్రస్థాయి జట్టు ఎంపిక టోర్నీలకు ఇదే సాఫ్ట్వేర్ను వాడారు. ఈ కారణంగానే ప్రతిభ గల క్రీడాకారులను పక్కన బెట్టడం సాధ్య పడింది. టోర్నీని ఆరు రౌండ్లు నిర్వహించాల్సి ఉండగా.. ఐదింటితోనే ముగించేశారు. నియమ నిబంధన ప్రకారం క్రీడాకారుల సంఖ్య 40 దాటితే టోర్నీ 6 రౌండ్లు సాగాలి. క్రీడాకారుల సంఖ్య తగ్గితే 5 రౌండ్లకే పరిమితం కావాలి. కానీ అండర్-14 బాలుర విభాగంలో 48 మంది పోటీపడినప్పటికీ.. 5 రౌండ్లతోనే మమ అనిపించారు. తద్వారా ప్రతిభ గలవారికి చోటుదక్కలేదు. తిరిగి నిర్వహించాలి... తాజా వివాదంపై ఆటగాళ్ల తల్లిదండ్రులు కొందరు నేరుగా జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఆయన ఆదేశాలపై జిల్లా విద్యాధికారి (డీఈఓ) బుధవారం విచారణ కూడా జరిపారు. అయితే సాంకేతికపరంగా జరిగిన కొన్ని లోపాలను సాకుగా చూపిస్తూ నిర్వాహకులు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. దాంతో ఇప్పటికే ఎంపికై న ఆటగాళ్లే జాతీయ స్థాయిలో పోటీ పడే అవకాశం కనిపిస్తున్నాయి. దీనిపై పలువురు ఆందోళన వ్యక్తం చేశారు. ‘పారదర్శకంగా, అత్యంత పకడ్బందీగా జరగాల్సిన టోర్నీలో అవకతవకలు జరుగుతుండటం దురదృష్టకరం. లోటుపాట్ల విషయం ఉన్నతాధికారుల దృష్టిలో ఉన్నా వారు పట్టించుకోవడం లేదు. అక్రమాలు జరిగిన టోర్నీని రద్దు చేసి ఎటువంటి మచ్చలేని ఆర్బిటర్ల ఆధ్వర్యంలో తిరిగి నిర్వహించాలి. అవకతవకలపై నిగ్గుతేల్చేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలి‘ అని చెస్ క్రీడాకారుడి తండ్రి ఒకరు వ్యాఖ్యానించారు. అరుుతే ఈ ఆరోపణలను శ్రీకృష్ణ ఖండించారు. ‘నిబంధనలకు అనుగుణంగానే సెలక్షన్సను నిర్వహించాము. ఎటువంటి అవకతవకలు జరగలేదు. పారదర్శకంగా ఎంపిక నిర్వహించామని చెప్పేందుకు మా వద్ద తగిన ఆధారాలు ఉన్నాయి‘ అని ఆయన వివరణ ఇచ్చారు. -
ఫుట్బాల్ ఎంపికలకు చక్కటి స్పందన
కడప స్పోర్ట్స్: స్కూల్గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జిల్లాస్థాయి ఫుట్బాల్ ఎంపికలకు చక్కటి స్పందన లభించింది. మంగళవారం నగరంలోని వైఎస్ఆర్ క్రీడాపాఠశాలలో అండర్–14, అండర్–17 విభాగాల్లో బాలబాలికలకు ఎంపికలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్జీఎఫ్ జిల్లా కార్యదర్శి ఎల్.ఎ. సునీల్ పోటీలను ప్రారంభించి మాట్లాడారు. గతేడాది రాష్ట్రస్థాయి పోటీల్లో జిల్లా ఫుట్బాల్ జట్టు చక్కటి ప్రతిభ కనబరిచిందన్నారు. అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ ఈ యేడాది విజేతలుగా నిలవాలని ఆకాంక్షించారు. అనంతరం ఎంపికలు నిర్వహించి రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనే జిల్లాజట్లను ప్రకటించారు. కార్యక్రమంలో క్రీడాపాఠశాల కోచ్ హరి, జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ కార్యదర్శి అమృత్రాజ్, వ్యాయామ ఉపాధ్యాయులు తిరుపాల్రెడ్డి, సంపత్, ఎజాజ్, నిత్యప్రభాకర్, మహబూబ్బాషా, బీసీవీ సుబ్బయ్య, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనే జిల్లాజట్టుకు ఎంపికైన క్రీడాకారులు అండర్–14 బాలికలు : వి.శ్రీదేవి, కె.దుర్గ, డి. నిరీక్షణ, ఎస్.చందుప్రియ, కె.సునీత, టి.స్వప్న, జి.లేఖన, ఎ.భవిత. ఆర్.సుకన్య, ఎస్.సమీర, డి.పావని, బి.అరుణ, ఆర్.గంగోత్రి, ఐ.కీర్తి, పి.యామిని, వి.గంగోత్రి, వి.నాగమునెమ్మ, ఎం.నందిని. స్టాండ్బై : వి.గాయత్రి, ఎం.పల్లవి, జి.విజయ, వెంకటలక్ష్మి, శివరంజని. అండర్–17 బాలికలు : యు.వరలక్ష్మి, జి.మానస, సీమెచ్ రాజ్యలక్ష్మి, పి.గాయత్రి, బి. దివ్య, ఎన్.కమాల్బీ, పి.వీరలావణ్య, జి.వి.సౌమ్య, సి.సుహాన్బేగం, ఎ.కౌసల్య, ఎం.శిరీష, యు.హరిణి, సి.వెంకటనవిత, జె.ప్రవళ్లిక, డి.చంద్రవదన, కె.ఉమాదేవి, ఎస్.శ్రావణి, ఎం.హవిల. స్టాండ్బై : కె.నందిని, హరిప్రియ, భూదేవి, మనోరంజని. అండర్–14 బాలురు : జి. రాజేష్, ఎన్.బాషా, బి.ఉదయ్కిరణ్రెడ్డి, ఎం.సంతోష్, వి.సాయిరాం, కె.పరమేష్రెడ్డి, సతీష్, బి.జె.వెస్లీ, ఎస్.మహమ్మద్రఫి, సి.హరికిరణ్, ఎస్.మహేష్, జె. బన్నీ, యు. ప్రణయ్, ఎ. రవితేజ, మనోజ్కుమార్రెడ్డి, టి. దినేష్, ఎస్. అహ్మద్, జి.దివాకర్, వెంకటనాయుడు, పూజిత్. అండర్–17 బాలురు : బి. మేఘనాథ్, కొండారెడ్డి, కె.జగదీష్, కె.రామాంజి, ఎస్. దిలీప్, ఎ.వెంకటసాయికిరణ్, ఎస్.సొహైల్, కె.అజయ్కుమార్సంజీవ్, ఎస్.మోహన్, ఎస్. రాము, ఎస్.కె. గైబుసా, పి.సాయికుమార్, ఎం.జయచంద్ర, ఆర్, సుధాప్రియదర్శన్, ఎన్.శివకుమార్, డి.అశోక్, ఎస్. ఇంతియాజ్, కె.వంశీ, ఎస్.మహమ్మద్యాసీన్, జి.వి.అశోక్ -
రాష్ట్రస్థాయి బాల్బ్యాడ్మింటన్ చాంపియన్గా జిల్లా జట్టు
నిజామాబాద్ స్పోర్ట్స్ : స్కూల్గేమ్స్ ఫె డరేషన్ అండర్–19 బాలబాలికల బాల్బ్యాడ్మింటన్ రాష్ట్రస్థాయి టోర్నీలో జిల్లా బాలబాలికల జట్లు విజేతలుగా నిలిచి చాంపియన్ను కైవసం చేసుకున్నాయి. ఈనెల 10 నుంచి 12వ తేదీ వరకు న ల్గొండ జిల్లాలోని మిర్యాలగూడలో టో ర్నీ జరిగింది. ఇందులో బాలబాలికల జ ట్లు విజేతగా నిలిచాయి. బాలుర జట్టు లో ఉప్పల్వాయి గురుకుల విద్యార్థులు, బాలికల జట్టులో మొత్తం సుద్దపల్లి, కం జర విద్యార్థినులు ఉన్నారు. ప్రత్యేకంగా అభినందించిన కలెక్టర్ రాష్ట్రస్థాయిలో జిల్లాను చాంపియన్గా నిలిపిన క్రీడాకారులను కలెక్టర్ డాక్టర్ యోగితారాణా గురువారం తన చాంబ ర్లో ప్రత్యేకంగా అభినందించారు. బా లబాలికల జట్ల కెప్టెన్లతో, పీడీ నాగేశ్వర్తో మాట్లాడారు. జిల్లాను రాష్ట్రస్థాయి లో ప్రథమస్థానంలో నిలిపినందుకు, ఇందుకు కృషిచేసిన ప్రిన్సిపాల్స్, కోచ్ల ను అభినందించారు. మరిన్ని విజయా లు సాధిస్తూ జిల్లాకు, రాష్ట్రానికి మంచి పేరుప్రఖ్యాతలు తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో అండర్–19 ఎస్జీఎఫ్ కార్యదర్శి ఎండీ షకీల్, డీసీవో సాయినా థ్, సుద్దపల్లి, కంజర ప్రిన్సిపాల్స్ సరోజినాయుడు, సింధు, ఉప్పల్వాయి పీడీ నాగేశ్వర్రావు, నర్మద, దేవలక్ష్మి, నీరజ, జోత్య్స, ఎన్.కృష్ణ, క్రీడాకారులు పాల్గొన్నారు. లంచ్ చేయించకుండా జారుకున్న డీసీవో క్రీడాకారులకు లంచ్ చేయించాలని గు రుకులాల జిల్లా కో–ఆర్డినేటర్ సాయినాథ్ను కలెక్టర్ ఆదేశించారు. కలెక్టర్ చాంబర్ నుంచి బయటకు వచ్చిన కోద్దిసేపటికి కో–ఆర్డినేటర్ ఎవరికీ చెప్పకుండా జారుకున్నాడు. దీంతో సుద్దపల్లి ప్రిన్సిపాల్, పీడీలు కో–ఆర్డినేటర్కు ఫోన్ చేయగా స్పందించలేదు. కలెక్టర్ సీసీ రామును కలిసి విషయం తెలిపారు. సీసీ కలెక్టర్ అనుమతితో మెస్లో అందరికీ లంచ్ చేయించారు. జాతీయస్థాయికి ఎంపికైన క్రీడాకారులు రాష్ట్రస్థాయిలో ప్రతిభ చూపి విజేతలుగా నిలిచిన జట్ల నుంచి జాతీయస్థాయికి పలువురు క్రీడాకారులు ఎంపియ్యారు. బాలుర జట్టులో ఆర్.అనిల్కుమార్, పి.సాయికుమార్, సీహెచ్.మహేశ్(ఉప్పల్వాయి)లు ఎంపిక కాగా, బాలికల జట్టులో లిఖిత, అలేఖ్య(సుద్దపల్లి), ప్రత్యూష(కంజర)లు ఎంపికయ్యారు. -
రేపటి నుంచి ఎస్జీఎఫ్ గేమ్స్
సాక్షి, హైదరాబాద్: అండర్-19 హైదరాబాద్ జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ పోటీలు శుక్రవారం ప్రారంభం కానున్నాయి. నగరంలోని వివిధ వేదికల్లో మొత్తం 19 క్రీడాంశాల్లో బాలబాలికల విభాగాలలో ఈ పోటీలను నిర్వహిస్తారు. సెప్టెంబర్ 16: చెస్ జీజేసీ, కూకట్పల్లి సెప్టెంబర్ 16: టార్గెట్బాల్, ఎల్బీ స్టేడియం హ్యాండ్బాల్ పీజీ సెప్టెంబర్ 16: సైక్లింగ్, ఓయూ సైక్లింగ్ స్టేడియం సెప్టెంబర్ 16: వెయిట్ లిఫ్టింగ్, ఎల్బీ స్టేడియం సెప్టెంబర్ 16: పవర్ లిఫ్టింగ్, ఎల్బీ స్టేడియం సెప్టెంబర్ 16: ఫెన్సింగ్, ఎల్బీ స్టేడియం సెప్టెంబర్ 16: జిమ్నాస్టిక్స్, ఎల్బీ స్టేడియం సెప్టెంబర్ 16: యోగా, ఎల్బీ స్టేడియం సెప్టెంబర్ 16: టెన్నికాయిట్, ఎల్బీ స్టేడియం సెప్టెంబర్ 16: టెన్నిస్ వాలీబాల్, జీహెచ్ఎంసీ, ముషీరాబాద్ పీజీ సెప్టెంబర్ 16: బీచ్ వాలీబాల్, జీహెచ్ఎంసీ, సికింద్రాబాద్ స్విమ్మింగ్పూల్ సెప్టెంబర్ 17: స్విమ్మింగ్, జీహెచ్ఎంసీ, సికింద్రాబాద్ స్విమ్మింగ్పూల్ సెప్టెంబర్ 18: సాఫ్ట్ టెన్నిస్, ఇందిరాపార్క్ టెన్నిస్ కోర్ట్ సెప్టెంబర్ 18: సూపర్సెవెన్ క్రికెట్, భవన్స కాలేజ్, సైనిక్పురి సెప్టెంబర్ 19: బాస్కెట్బాల్, వీపీజీ జీహెచ్ఎంసీ, బాస్కెట్బాల్ కోర్ట్ సెప్టెంబర్ 20: ఫీల్డ్ ఆర్చరీ, ఎగ్జిబిషన్ గ్రౌండ్స సెప్టెంబర్ 20: సెపక్తక్రా వీపీజీ, ఇండోర్ స్టేడియం సెప్టెంబర్ 22: నెట్బాల్, జీజేసీ, కాచిగూడ సెప్టెంబర్ 22: బేస్బాల్, జీసీపీఈ -
సాఫ్ట్బాల్ పోటీలకు 13 మంది ఎంపిక
భాకరాపేట : అండర్ 19 బాలికల సాఫ్ట్బాల్ పోటీలకు జిల్లా నుంచి 13 వుందిని ఎంపిక చేసినట్లు ఆంధ్రప్రదేశ్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆర్గనైజర్ ఎ.జయరామయ్య తెలిపారు. బుధవారం చిన్నగొట్టిగల్లు ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో నిర్వహించిన పోటీల్లో జిల్లాలోని పలు కళాశాలల నుంచి వచ్చిన క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 13 వుంది బాలికలను రాష్ట్రస్థాయిలో తూర్పుగోదావరి జిల్లా అన్నవరంలో జరిగే పోటీలకు ఎంపిక చేశారు. వారిలో ఎన్.పవనకువూరి(పీలేరు), ఎ.అఖిల(ఎస్పీడబ్ల్యూ), ఎస్.అనూష(చిత్తూరు), సీ.ఆదిలక్ష్మి(నగరి), పీ.హేవూవతి(పుత్తూరు), ఎం.నందిని(అంగళ్లు), ఎన్.స్వాతి(ఎస్పీడబ్ల్యూ), కె.విజయదుర్గ(పెనువుూరు), ఎం.జ్యోత్సS్న (చిన్నగొట్టిగల్లు), వి.భారతి (చిన్నగొట్టిగల్లు), ఎ.రోజా(పీలేరు), కె. వెంకటరవుణవ్ము (ఎస్పీడబ్ల్యూ), ఎ.రాశి(ఎస్పీడబ్ల్యూ) ఉన్నారు. ఈ కార్యక్రవుంలో చిన్నగొట్టిగల్లు కళాశాల ప్రిన్సిపాల్ బి.సిద్దవుుని, పీ.డీ షాజహాన్, పీఈటీలు రావుకష్ణ రంగన్న, అన్సర్, అధ్యాపకులు పాల్గొన్నారు. -
జిల్లా స్కూల్గేమ్స్ టీటీ జట్లు ఖరారు
జిల్లా అండర్–14 బాలబాలికల జట్లు వెల్లడి 16 నుంచి విజయవాడలో రాష ్టస్కూల్గేమ్స్ టీటీ పోటీలు శ్రీకాకళం న్యూకాలనీ: విజయవాడ కేంద్రంగా ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో ఈనెల 16 నుంచి మూడు రోజులపాటు జరగనున్న రాష్ట్రస్థాయి స్కూల్గేమ్స్ అండర్–14 బాలబాలికల టేబుల్ టెన్నిస్ చాంపియన్షిప్ పోటీల్లో పాల్గొనే జిల్లా జట్ల ఎంపిక పూర్తయింది. జిల్లా జట్లకు ఎంపికైన క్రీడాకారుల జాబితాను జిల్లా పాఠశాలల క్రీడల సమాఖ్య అధ్యక్షులు, డీఈఓ డి.దేవానందరెడ్డి, కార్యదర్శి ఎమ్మెస్సీ శేఖర్లు వెల్లడించారు. గతనెల 30, 31 తేదీల్లో శ్రీకాకుళం కోడిరామ్మూర్తి ఇండోర్ స్టేడియంలో జరిగిన జిల్లాస్థాయి స్కూల్గేమ్స్ ఎంపిక పోటీల్లో ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను తుదిజట్లకు ఎంపిక చేసినట్టు స్పష్టం చేశారు. ఈ జట్లకు కోచ్, మేనేజర్లగా పీఈటీలు ఎం.త్రినాథ్ (జెడ్పీహెచ్స్కూల్, బొండపల్లి), డి.భవానీ (జెడ్పీహెచ్స్కూల్ మాకివలస)లను నియమించినట్లు పేర్కొన్నారు. 15న ఇక్కడ నుంచి పయనం.. జిల్లా స్కూల్గేమ్స్ అండర్–14 టీటీ జట్లు ఈనెల 15న (గురువారం) ఇక్కడ నుంచి ప్రయాణమై వెళ్లేందుకు ఏర్పాట్లు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఎంపికైన క్రీడాకారుంతా ఆ రోజు ఉదయం 8 గంటలకు తమ లగేజీతో పాటు నాలుగు అర్హత ధ్రువీకరణ పత్రాలు, ప్రస్తుతం చదువుతున్న స్టడీ సర్టిఫికెట్, గత ఏడాది మార్క్స్ మెమో, ఆధార్ కార్డు జిరాక్స్, రెండు ఫొటోలతో శ్రీకాకుళం రోడ్ (ఆమదాలవలస) రైల్వేస్టేషన్కు చేరుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు సెల్:94400 01616 (శేఖర్) నంబర్ను సంప్రదించాలని సూచించారు. జిల్లా జట్ల వివరాలు.. బాలుర జట్టు: వీఎం ఫరజ్ఖాన్, డి.ధరణిదర్నాయుడు (సెయింట్జోషప్స్ స్కూల్, శ్రీకాకుళం), బి.సూర్యప్రకాశ్ (జెడ్పీహెచ్ స్కూల్ జి.సిగడాం), పి.దివాకర్ (జెడ్పీహెచ్ స్కూల్, పొన్నాడ), ఆర్.శేఖర్ (జెడ్పీహెచ్ స్కూల్ మాకివలస). బాలికల జట్టు: బి.కవిత, పి.శ్రావణి, పి.గాయత్రి, పి.ప్రశాంతి (జెడ్పీహెచ్ స్కూల్ ఫరీదుపేట), ఎస్.వెంకటలక్ష్మి (జెడ్పీహెచ్ స్కూల్, పొన్నాడ)లు ఎంపికైన వారిలో ఉన్నారు. -
స్కూల్ గేమ్స్ ఖోఖో జిల్లా జట్ల ప్రకటన
కల్లూరు: జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఖోఖో జిల్లా బాలబాలికల జట్లను ఫెడరేషన్ కార్యదర్శి పవన్కుమార్ శనివారం ప్రకటించారు. అండ్ –14 బాలికల జట్టు : శారద, హైమావతి, మేరీ , శివలక్ష్మీ, అపర్ణ , మానస , శ్రావణి , శిరీష , సావిత్రి , ప్రియాంక , ఉషారాణి , శిరీష, స్టాండ్బైస్: బి మౌనిక, రేణుక , నందిని , సిందూ, శాంతి , భారతిని ఎంపిక చేశారు. బాలుర జట్టు : దుర్గప్రసాద్ , రామాంజనేయులు, ధరణి , నాగరాజు , మహేష్ , జగదీష్ , నవీన్, మహబూబ్బాషా, ఆదర్శ్, అబ్దుల్ కలాం, నాగరాజు , కిరణ్, స్టాండ్బై : శివ, అఫ్సార్, మధు , ఇస్మాయిల్ , శివకుమార్ , శ్రీనివాసులు ఎంపికయ్యారు. అండర్ 17 బాలికల జట్టు: దివ్య, అఖిల , కల్పన ,చాందినీ ,నాగేశ్వరమ్మ , శ్రావణి , ప్రత్యూష, అనంతలక్ష్మీ, దిల్షాద్ , దీపిక, లక్ష్మీప్రియ, వెన్నెల, స్టాండ్బై: సంధ్యారాణి , వినీత, అరీఫాబేగం , తస్లీమా, నాగవిజేత, సల్మాను ఎంపిక చేశారు. బాలుర జట్టు ః వై రవికుమార్, యు. రవికుమార్, వెంకటేష్ , శ్రీను, శరత్, మాలిక్ , రవినాథ్, రాజశేఖర్గౌడ్, తిక్కస్వామి, షణ్ముఖ, ఓబులేసు, ఉసేనయ్య, స్టాండ్బైగా రసూల్, శ్రీనివాసులు, ప్రతాప్ , గణేశ్వరుడు, యశ్వంత్,ఆంజనేయులు ఎంపికయ్యారు. -
సింధు స్ఫూర్తితో క్రీడల్లో రాణించాలి
అనంతపురం సప్తగిరి సర్కిల్ : రియో ఒలింపిక్స్ విజేత సింధును స్ఫూర్తిగా తీసుకొని క్రికెట్, జిమ్నాస్టిక్స్, టేబుల్ టెన్నిస్ క్రీడల్లో రాణించాలని టేబుల్ టెన్నిస్ జిల్లా అధ్యక్షుడు అక్బర్సాహెబ్ పేర్కొన్నారు. క్రికెట్, జిమ్నాస్టిక్స్, టేబుల్టెన్నిస్ జిల్లా జట్ట ఎంపిక గురువారం నిర్వహించినట్లు స్కూల్ గేమ్స్ కార్యదర్శి నారాయణ తెలిపారు. టేబుల్టెన్నిస్ జిల్లా అధ్యక్షుడు అక్బర్సాహెబ్ మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయన్నారు. జిల్లా స్థాయికి ఎంపిక కావడం ఎంతో గొప్ప విషయమన్నారు. అండర్–17 బాలికల క్రికెట్ జట్టు గుంటూరులో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొననున్నట్లు చెప్పారు. అండర్–14,17 బాలుర, బాలికల జిమ్నాస్టిక్స్ పోటీలు గుంటూరులో జరుగుతాయన్నారు. టేబుల్టెన్నిస్ అండర్–14 బాలుర, బాలికల రాష్ట్ర స్థాయి పోటీలు విజయవాడలోను, అండర్–17 బాలుర, బాలికల పోటీలు ఏలూరులో జరుగుతాయని కార్యదర్శి నారాయణ తెలిపారు. ఈ పోటీలకు అబ్జర్వర్లుగా డీ నాగరాజు, నాగరాజా, అంజన్న, శంకర్, సెలెక్షన్ కమిటీ సభ్యులుగా లత, మంజుల, రవి, సిరాజుద్దీన్, సునీత, జయసింహ, పీఈటీలు మొరార్జీ యాదవ్, రమేష్, లక్ష్మణ్ పాల్గొన్నారు. -
రాష్ట్రస్థాయి స్కూల్గేమ్స్కు 16 మంది ఎంపిక
మామిడికుదురు: రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ పోటీలకు మామిడికుదురు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన 16 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. కాకినాడలో మంగళవారం జరిగిన అర్హత పోటీల్లో కనబరిచిన ప్రతిభ ఆధారంగా వీరిని ఎంపిక చేశారని ప్రధానోపాధ్యాయుడు జేఎన్ఎస్ గోపాలకృష్ణ బుధవారం విలేకర్లకు తెలిపారు. అండర్–14 ఆర్చరీ పోటీలకు గుత్తుల నాగకృష్ణశ్రీరామ్, బడుగు గోపీచంద్, పుల్లేటికుర్తి యశ్వంత్, చీకురుమిల్లి ఉమ, చీకురుమిల్లి జ్యోతి, పమ్మి రేఖ, కడలి నాగదుర్గ, అండర్–17 ఆర్చరీ పోటీలకు పితాని ఉదయ్కిరణ్, చీకురుమిల్లి కేశవ, మద్దాల లోకేష్నాగబాబు, మట్టపర్తి వెంకటసత్యప్రభు, బొక్కా బేబీసుమ, అండర్–17 తైక్వాండో పోటీలకు సీహెచ్ స్వర్ణరేఖ, హెచ్కే సౌలత్, పి.తేజ, అండర్–17 రెజ్లింగ్ పోటీలకు మద్దాల లక్ష్మీగణేష్ ఎంపికయ్యారని చెప్పారు. రెజ్లింగ్ పోటీలు కృష్ణా జిల్లాలో త్వరలో జరుగుతాయని, మిగిలిన పోటీలు చిత్తూరు జిల్లాలో జరుగుతాయని తెలిపారు. ఎంపికైన విద్యార్థులను ఆయన, పీడీ వి.శ్రీనివాస్, పీఈటీ పి.విజయ్ప్రకాశ్, ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు అభినందించారు. -
ప్రతిభావంతులకే పెద్దపీట
శ్రీకాకుళం న్యూకాలనీ: ప్రతిభావంతులకే జిల్లా జట్లలో స్థానం కల్పించాలని జిల్లా విద్యాశాఖాధికారి, జిల్లా స్కూల్గేమ్స్ ఫెడరేషన్ అధ్యక్షులు డి.దేవానందరెడ్డి కోరారు. జిల్లా పాఠశాలల క్రీడల సమాఖ్య(స్కూల్గేమ్స్ ఫెడరేషన్) ఆధ్వర్యంలో స్థానిక కోడి రామ్మూర్తి స్టేడియంలో మూడు రోజులపాటు జరగనున్న ప్రతిష్టాత్మక జిల్లాస్థాయి స్కూల్గేమ్స్ ఎంపిక పోటీలు మంగళవారం ప్రారంభమయ్యాయి. కార్యక్రమానికి డీఈఓ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఎంపికలను పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు. జిల్లా జట్లకు ఎంపికయ్యే క్రీడాకారులకు రాష్ట్ర పోటీలకు వెళ్లేముందు శిక్షణా శిబిరాలను నిర్వహించేందుకు కలెక్టర్ సంసిద్ధత వ్యక్తం చేసినట్లు చెప్పారు. త్వరలో కామన్ ఎగ్జామినేషన్ ఫీజు కింద హైస్కూల్ విద్యార్థుల నుంచి వసూలు చేసే (రూ.80, రూ.100) మొత్తంలో 3 రూపాయలను క్రీడలకు కేటాయించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. శ్రీకాకుళం డివిజన్ డిప్యూటీ ఈఓ వి.సుబ్బారావు, ఆర్ఎంఎస్ఏ డిప్యూటీ ఈఓ ఎ.ప్రభాకరరావు మాట్లాడుతూ పాఠశాలల క్రీడలు విద్యార్థి జీవితంలో చాలా కీలకమని, అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జిల్లా క్రీడాభివృద్ధి అధికారి బి.శ్రీనివాస్కుమార్ మాట్లాడుతూ స్కూల్గేమ్స్ ఎంపిక పోటీలకు హాజరయ్యే విద్యార్థులకు వచ్చే ఏడాది నుంచైనా భోజనాలు కల్పించాలన్నారు. కార్యక్రమంలో క్రీడల సమాఖ్య కార్యనిర్వహణ కార్యదర్శి ఎమ్మెస్సీ శేఖర్, జిల్లా ఒలింపిక్ సంఘం కార్యదర్శి పి.సుందరరావు, పీఈటీ సంఘ సలహాదారు కె.రాజారావు, జిల్లా పీఈటీ సంఘం అధ్యక్షులు ఎం.వి.రమణ, కార్యదర్శి ఎం.సాంబమూర్తి, పాఠశాల క్రీడల సంఘం సంయుక్తకార్యదర్శి ఎస్.శ్రీనివాసరావు, సంపతిరావు సూరిబాబు, పోలినాయుడు, కామయ్య, తవిటయ్య, ఆర్సీ రెడ్డి జగదీష్, వాసు, రాజశేఖర్, వెంకటరమణ, రవి, సుజాత, మాధురి, ఉష, విజయ, పీడీలు, పీఈటీలు తదితరులు పాల్గొన్నారు. ఉత్సాహంగా.. జిల్లాస్థాయి పాఠశాలల క్రీడల సమాఖ్య ఎంపికలు ఉత్సాహంగా సాగాయి. జిల్లా నలుమూలల నుంచి రికార్డుస్థాయిలో 3వేల మంది వరకు క్రీడాకారులు హాజరయ్యారు. కోడిరామ్మూర్తి స్టేడియంతోపాటు.. హాకీ, ఫుట్బాల్ ఎంపికలను సమీపంలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో నిర్వహించారు. రంగురంగుల దుస్తుల ధరించి హాజరైన బాలబాలికలతో క్రీడాప్రాంగణం కళకళలాడింది. అయితే మండే ఎండతో క్రీడాకారులు ఇక్కట్లకు గురయ్యారు. అయితే సాయంత్రం వాతావరణం ఆహ్లాదకరంగా ఉండటంతో క్రీడాకారులు రెట్టించిన ఉత్సాహంతో ఎంపికల్లో పాల్గొన్నారు. అంతకుముందు డీఈఓ దేవానందరెడ్డి వాలీబాల్ ఆడి ఎంపికలను ప్రారంభించారు. తొలిరోజు ఇలా.. వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, షటిల్ బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్బాల్, హాకీ, ఆర్చరీ క్రీడాంశాల్లో ఎంపికలు నిర్వహించారు. వాలీబాల్, ఖోఖో, కబడ్డీ, క్రికెట్, షటిల్ బ్యాడ్మింటన్ క్రీడాంశాలకు క్రీడాకారులు పోటెత్తారు. వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, బ్యాడ్మింటన్, క్రికెట్ క్రీడాంశాల్లో ప్రాథమికంగా ఎంపికలు జరిపారు. మిగిలిన తుది ఎంపికలను బుధవారం నిర్వహించనున్నారు. మూడు రోజుల ఎంపికలన్నీ ముగిసిన తర్వాత జిల్లా జట్లకు ఎంపికైన క్రీడాకారులు జాబితాలను ప్రకటిస్తామని నిర్వాహకులు తెలిపారు. భోజన ఏర్పాట్ల లేమితో బాలబాలికలకు అవస్థలు పడ్డారు. దీనిపై సమాచారం లేకపోవడంతో అగచాట్లు పడ్డారు. నేడు జరగనున్న ఎంపికలు ఇవే.. అండర్–14, 17 వయస్సుల్లో వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, షటిల్ బ్యాడ్మింటన్, క్రికెట్ తుది ఎంపికలతోపాటు బాస్కెట్బాల్, హ్యాండ్బాల్, సాఫ్ట్బాల్, వెయిట్లిఫ్టింగ్, తైక్వాండో, స్విమ్మింగ్, బాక్సింగ్, రెజ్లింగ్, చెస్, లాన్టెన్నిస్, టేబుల్ టెన్నిస్, బాల్ బ్యాడ్మింటన్, కరాటే, యోగ ఎంపికలను నిర్వహించనున్నారు. -
లోకేశ్, లావణ్యలకు స్వర్ణాలు
సాక్షి, హైదరాబాద్: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్జీఎఫ్) ఆధ్యర్యంలో జరిగిన రంగారెడ్డి జిల్లా బాక్సింగ్ టోర్నీలో లోకేశ్, లావణ్య విజేతలుగా నిలిచారు. సరూర్నగర్ బాక్సింగ్హాల్లో గురువారం జరిగిన పోటీల్లో అండర్-17 బాలుర 46 కేజీల విభాగంలో జి. లోకేశ్ (జడ్పీహెచ్ఎస్, సరూర్నగర్) విజే తగా నిలిచి పసిడి పతకాన్ని దక్కించుకోగా... డి. అఖిల్ (జడ్పీహెచ్ఎస్, దర్గా) రజత పతకాన్ని సాధించాడు. కె. నివాస్ (నారాయణ), కె. దినేశ్ (నాగార్జున స్కూల్) తృతీయ స్థానంలో నిలిచి కాంస్య పతకాలు సాధించారు. బాలికల 42 కేజీల విభాగంలో లావణ్య (జడ్పీహెచ్ఎస్, సరూర్నగర్) స్వర్ణ పతకాన్ని సంపాదించింది. ఇతర వెయిట్ కేటగిరీల విజేతలు అండర్-17 బాలురు 46-48 కేజీ: 1. పవన్, 2. లోహిత్, 3. కె. సాయి నిహాల్; 48-50 కేజీ: 1. ఎస్. భువన్, 2. బి. వంశీ; 50-52 కేజీ: 1. ఎం. శ్రీనివాసులు, 2. ఎం. సాత్విక్ రెడ్డి; 52-54 కేజీ: 1. కె. బాలకృష్ణ; 54-57 కేజీ: 1. ఎన్. హరీశ్; 66-70 కేజీ: 1. వి. వరుణ్; 70-75 కేజీ: 1. కె. వేణు గౌడ్; అండర్-17 బాలికలు 42-44 కేజీ: మేఘన; 44-46 కేజీ: ఎన్. హర్షిత; 46-48 కేజీ: కె. మిథాలి; 48-50 కేజీ: జి. కళావతి; 50-53కేజీ: పి. గుణనిధి; 53-56 కేజీ: కె. యశస్వి; 59-62 కేజీ: పి. రాజేశ్వరి; 75-81 కేజీ: ప్రవళిక; 81-86 కేజీ: జాహ్నవి. అండర్-14 బాలురు 28-30 కేజీ: రాహుల్సింగ్; 30-32 కేజీ: కె. దేవి వరప్రసాద్; 32-34 కేజీ: డి. అనూష్; 34-36 కేజీ: టి. భువనేశ్వర్; 36-38 కేజీ: ఎస్. రక్షిత్; 38-40కేజీ: అబ్దుల్ ఖలీద్. -
27 నుంచి జిల్లాస్థాయి స్కూల్ గేమ్స్ సెలెక్షన్స్
అనంతపురం సప్తగిరి సర్కిల్ : ఈ నెల 27 నుంచి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జిల్లాస్థాయి సెలెక్షన్స్ నిర్వహిస్తున్నట్లు జిల్లా అధ్యక్షుడు అంజయ్య, కార్యదర్శి నారాయణ తెలిపారు. సెలెక్షన్ షెడ్యూల్ క్యాలెండర్ను జిల్లా విద్యాశాఖ అధికారి అంజయ్య విడుదల చేశారు. 2002 జనవరి 1 తరువాత జన్మించిన వారు (6–8 తరగతులు చదువుతున్న వారు) అండర్–14కు, 1999 జనవరి 1లోపు పుట్టిన వారు (9–10 తరగతులు చదువుతున్న వారు) అండర్–17కు అర్హులన్నారు. వీరు ఆయా పాఠశాలల నుంచి జనన ధ్రువీకరణ పత్రాలను తీసుకుని సెలెక్షన్ షెడ్యూల్కు అనుగుణంగా హాజరు కావాలన్నారు. సెలెక్షన్స్ షెడ్యూల్ ఇదే.. సెలెక్షన్ ఈ నెల 27 నుంచి సెప్టెంబర్ 23 వర కు కొనసాగుతాయన్నారు. 27న కబడ్డీ, 30న లాన్ టెన్నిస్, ఫెన్సింగ్, 31న బ్యాడ్మింటన్, సెప్టెంబర్ 1న బాస్కెట్బాల్, రెజ్లింగ్, ఆర్చరీ, బాక్సింగ్, రైఫిల్ షూటింగ్, 2న హ్యాండ్బాల్, చెస్, 3న జూడో, 6, 7, 8 తేదీల్లో క్రికెట్, జిమ్నాస్టిక్, వెయిట్ లిఫ్టింగ్, 19న కబడ్డీ, సైక్లింగ్, 20న ఖోఖో, 21న తైక్వాండో, 22న ఫుట్బాల్, 23న వాలీబాల్ నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. మరిన్ని వివరాలకు 94411 64789 నంబరుకు సంప్రదించాలన్నారు. -
కేశవ్ మెమోరియల్ స్కూల్ గెలుపు
సాక్షి, హైదరాబాద్: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరుగుతోన్న హిమాయత్నగర్ జోనల్ కబడ్డీ, వాలీబాల్ టోర్నమెంట్లో కేశవ్ మెమోరియల్ స్కూల్ విజయం సాధించింది. సోమవారం జరిగిన కబడ్డీ టోర్నమెంట్ అండర్-17 బాలుర విభాగంలో కేశవ్ మెమోరియల్ స్కూల్ 27-1తో ప్రభుత్వ బాలుర హైస్కూల్ (అంబర్పేట)ను చిత్తుగా ఓడించింది. బాలికల విభాగంలో ప్రభుత్వ బాలికల హైస్కూల్ 25-8తో బీఆర్ఆర్ హైస్కూల్పై విజయం సాధించింది. ఇతర మ్యాచ్ల్లో నృపతుంగ హైస్కూల్ 19-6తో జీపీఎస్పై, హారో హైస్కూల్ 19-7తో నవ్య గ్రామర్ స్కూల్పై, సెయింట్ పీటర్స్ హైస్కూల్ 10-7తో జీజీహెచ్ఎస్ (అంబర్పేట)పై గెలుపొందాయి. ఇతర మ్యాచ్ల వివరాలు అండర్ -17 బాలురు: జీబీహెచ్ (కాచిగూడ) 19-8తో రిషి విద్యాలయపై, హెచ్పీఎస్ (రామంతపూర్) 11-7తో కేశవ్ మెమోరియల్ స్కూల్(ఇంగ్లీష్ మీడియం)పై, పీపుల్స్ హైస్కూల్ 15-3తో శ్రీ సత్యసాయి స్కూల్(విద్యానగర్)పై, గాంధీ హైస్కూల్ 10-3తో సెయింట్ అగస్టీన్ హూస్కూల్పై, భరత్ స్కౌట్స్, గైడ్స్ హైస్కూల్ 9-6తో సెయింట్ ఫిలిప్స్ స్కూల్పై విజయం సాధించాయి. అండర్-14 బాలురు: జీబీహెచ్ ఎస్ (కాచిగూడ) 10-3తో భాష్యం హైస్కూల్పై, భరత్ హైస్కూల్ 21-6తో సెయింట్ పీటర్స్ ైెహ స్కూల్పై, శ్రీ సత్యసాయి విద్యా విహార్ 10-6తో కోర్ మోడల్ హైస్కూల్పై, హుడా హైస్కూల్ 14-12తో సెయింట్ అగస్టీన్ హైస్కూల్పై, హారో హైస్కూల్ 5-3తో ప్రభుత్వ పోలీస్ బాలుర స్కూల్పై, నవ్య గ్రామర్ హైస్కూల్ 18-4తో సీపీఎల్ (అంబర్పేట)పై విజయం సాధించాయి. అండర్-14 బాలికలు: అజంపురా హైస్కూల్ 15-5తో సీపీఎల్ అంబర్పేటపై, జీబీహెచ్ఎస్, కాచిగూడ 18-0తో సెయింట్ అగస్టీన్పై, భాష్యం హైస్కూల్ 15-5తో ఆర్పీహెచ్ఎస్పై నెగ్గాయి. -
29న జోనల్ స్థాయి క్రికెట్ క్రీడాకారులు ఎంపిక
శామీర్పేట్: మేడ్చల్ జోనల్ స్థాయి క్రికెట్ క్రీడాకారుల ఎంపిక కుత్బుల్లాపూర్ మండలం గండిమైసమ్మ పరిధిలోని జ్యోతిరావు పూలే స్టేడియంలో ఈ నెల 29న నిర్వహించనున్నట్లు స్కూల్గేమ్స్ ఫెడరేషన్ జోనల్ కార్యదర్శి అరుణజ్యోతి బుధవారం సాయంత్రం తెలిపారు. పూలే స్టేడియంలో అండర్ 14, అండర్ 17 స్థాయి క్రికెట్ పోటీల్లో పాల్గొనే క్రీడాకారుల ఎంపిక నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు ఈ ఎంపికలో పాల్గొని తమ క్రీడానైపుణ్యాన్ని ప్రదర్శించాలని కోరారు. విద్యార్థులు తమ స్కూల్ బోనఫైడ్తో ఎంపిక ప్రదేశానికి హజరుకావాలన్నారు. -
రాష్ట్ర బ్యాడ్మింటన్ పోటీలు ప్రారంభం
శ్రీకాకుళం స్పోర్ట్స్: శ్రీకాకుళం పట్టణంలోని కోడిరామ్మూర్తి స్టేడియంలో 60వ పాఠశాలల క్రీడా(స్కూల్ గేమ్స్) పోటీలు ప్రారంభమయ్యూరుు. మూడు రోజుల పాటు జరగనున్న షటిల్ బ్యాడ్మింటన్ అండర్-14, 17 బాలబాలికల ఎంపిక పోటీలను శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి ప్రారంభించారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన విద్యార్థులు మార్చ్ఫాస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ క్రీడలు చదువులో భాగమేనన్నారు. రాష్ట్ర ఒలింపిక్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ ప్రతిభ కలిగిన క్రీడాకారులకు ఎల్లప్పుడూ ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్నారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్పర్సన్ ఎంవీ పద్మావతి, డీఈఓ అరుణకుమారి, డీఎస్డీఓ జూన్ గెల్యూట్, ప్రభుత్వ డిగ్రీకళాశాల(పురుషులు) ప్రిన్సిపాల్ బమ్మిడి పోలీసు తదితరులు పాల్గొన్నారు. తొలిరోజు పోటీల్లో కృష్ణ, గుంటూరు, విశాఖ జిల్లాల క్రీడాకారులు ముందంజలో ఉన్నారు. మరోవైపు రాష్ట్ర స్కూల్గేమ్స్ వెయిట్లిఫ్టింగ్ పోటీలు గురు, శుక్రవారాల్లో నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. -
‘స్కూల్ గేమ్స్’ నిధుల పెంపునకు కృషి
టీఆర్ఎస్ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు రామ్మోహన్ కీసర: సూల్క్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో యేటా నిర్వహించే క్రీడా పోటీల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం మంజూరు చేసే నిధులను వచ్చే ఏడాది నుంచి పెంచాలని ముఖ్యమంత్రి కేసీఆర్కు విన్నవించనున్నట్లు టీఆర్ఎస్ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు రామ్మోహన్ అన్నారు. మండంలోని అహ్మద్గూడ లీడ్ఇండియా భారతరత్న పాఠశాలలో రెండురోజులుగా నిర్వహించిన తైక్వాండో రాష్ట్రస్థాయి ఎంపికల పోటీల ముగింపు కార్యక్రమం సోమవారం జరిగింది. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రామ్మోహన్ మాట్లాడారు. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం ముందుంటుందన్నారు. ప్రభుత్వం నుంచి మరిన్ని నిధులు మంజూరు చేయించి వచ్చే ఏడాది స్కూల్ గేమ్స్ను పకడ్బందీగా నిర్వహించేందుకు కృషి చేస్తాన న్నారు. క్రీడా పోటీల ఆర్గనైజింగ్ సెక్రటరీ శేఖర్రెడ్డి, క్రీడల ఇన్చార్జి రమేష్రెడ్డిలు మాట్లాడుతూ.. రాష్ట్రస్థాయి తైక్వాండో ఎంపిక పోటీల్లో అండర్ 14, 17 విభాగాల్లో (బాలుర, బాలికలు) తెలంగాణలోని 10 జిల్లాల నుంచి 400 మంది పాల్గొన్నారన్నారు. ఇందులో 40 మంది విద్యార్థులను జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక చేశామన్నారు. జిల్లా ఫిజికల్ డెరైక్టర్ల అసోసియేషన్ అధ్యక్షుడు రాఘవరెడ్డి, లీడ్ ఇండియా భారతరత్న పాఠశాల చైర్మన్ సుదర్శనాచారి పాల్గొన్నారు. -
8న కేసీఆర్ రాక
కరీంనగర్ స్పోర్ట్స్: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్జీఎఫ్) ఆధ్వర్యంలో జిల్లాలో ప్రతిష్టాత్మంగా నిర్వహించనున్న జాతీయస్థాయి ఖోఖో పోటీల ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ముఖ్య అతిథిగా రానున్నారు. ఈ నెల 8 నుంచి 12 వరకు 60వ జాతీయ స్థాయి పాఠశాలల అండర్-14 బాలబాలిక ఖోఖో చాంపియన్షిప్ పోటీలు కొత్తపల్లిలోని అల్ఫోర్స్ ఈ-టెక్నో స్కూల్లో నిర్వహిస్తున్నారు. కేసీఆర్ 8న ఉదయం హైదరాబాద్ నుంచి బయల్దేరి 11.30 గంటలకు కొత్తపల్లికి చేరుకుని పోటీలను ప్రారంభిస్తారని కలెక్టర్ ఎం.వీరబ్రహ్మయ్య తెలిపారు. సీఎం పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లపై కలెక్టర్ జిల్లాస్థాయి అధికారులతో ఆదివారం కలెక్టరేట్లో సమీక్ష సమావేశం నిర్వహించారు. బుధవారం ఉదయం సీఎం కరీంనగర్ చేరుకుని నేరుగా ఖోఖో పోటీల ప్రారంభోత్సవానికి వెళ్తారని తెలిపారు. ఈ సందర్భంగా కరీంనగర్ నుంచి కొత్తపల్లి వరకు ట్రాఫిక్ అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పారిశుధ్య నిర్వహణ, వైద్యబృందాలు తదితర ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో ఎస్పీ శివకుమార్, ఓఎస్డీ సుబ ్బరాయుడు, కార్పొరేషన్ కమిషనర్ శ్రీకేశ్ లాట్కర్, వివిధ శాఖ ఉన్నతాధికారులు, క్రీడా సంఘాల బాధ్యులు పాల్గొన్నారు. కాగా కేసీఆర్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆగస్టులో జిల్లాకు వచ్చారు. ప్రజాప్రతినిధులు, అధికారులతో జిల్లా అభివృద్ధి కార్యక్రమాలపై కలెక్టరేట్లో సుదీర్ఘంగా సమీక్ష సమావేశం నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న వాటర్గ్రిడ్ పథకా న్ని ఇక్కడినుంచే ప్రకటించిన విషయం తెలిసిందే. తిరిగి రెండోసారి కేసీఆర్ జిల్లాకు వస్తున్నారు. ఖోఖో పోటీల ప్రారంభోత్సవం తర్వాత.. అదే రోజు ఆదిలాబాద్ జిల్లాలో జరగనున్న గిరి జన పోరాట యోధుడు కొమురం భీమ్ జయంతి వేడుకల్లో పాల్గొనేందుకు వెళ్లనున్నారు. -
క్రీడల అభివృద్ధికి కృషి
పరిగి: క్రీడల అభివృద్ధికి కృషి చేస్తానని పరిగి ఎమ్మెల్యే తమ్మన్నగారి రామ్మోహన్రెడ్డి (టీఆర్ఆర్) అన్నారు. బుధవారం స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో స్థానిక మినీస్టేడియంలో జోనల్ స్థాయి క్రీడాకారుల ఎంపికలను ఆయన ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా రామ్మోహన్రెడ్డి మాట్లాడుతూ.. నియోజకవర్గంలో క్రీడాకారులకు, వ్యాయామ ఉపాధ్యాయులకు అండగా ఉంటానన్నారు. మోడల్ స్కూళ్లు, ఇండోర్ స్టేడియాలు త్వరితగతిన పూర్తయ్యేలా అధికారులు, కాంట్రాక్టర్లతో మాట్లాడతానని తెలిపారు. ఈ ప్రాంత విద్యార్థులెవరైనా ఇంజినీరింగ్ చదవాలనుకుంటే తమ కళాశాలల్లో ఉచితంగా సీట్లు ఇస్తానని తెలిపారు. పరిగి నంబర్- 1 ఉన్నత పాఠశాలకు క్రీడా సామగ్రి కోసం టీఆర్ఆర్ చారిటబుల్ ట్రస్టు ద్వారా రూ. 20వేలు అందజేస్తానని తెలిపారు. కార్యక్రమంలో స్కూల్గేమ్స్ ఫెడరేషన్ జోనల్ సెక్రటరీ భాస్కర్రెడ్డి, జీహెచ్ఎంలు గోపాల్, రాములు, పీడీలు గాంగ్యానాయక్, సునీత, వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం మాజీ అధ్యక్షుడు రాములు, నాయకులు నారాయణ్రెడ్డి, ఎర్రగడ్డపల్లి కృష్ణ, కృష్ణారెడ్డి పాల్గొన్నారు. -
క్రమశిక్షణతో విధులు నిర్వహించాలి
నిజామాబాద్ నాగారం : స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శిగా భూమారెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బుధవారం స్థానిక తిలక్గార్డెన్లో గల న్యూఅంబేద్కర్ భవనంలో ప్రభుత్వ, ప్రైవేట్ వ్యాయామ ఉపాధ్యాయులతో ఎస్జీఎఫ్ కార్యదర్శి నియామకంపై సమావేశం నిర్వహించారు. ఈ కార్యదర్శి పదవికి పోటీలో ఆరుగురు నిలిచారు. అందరు ఎన్నికలు జరుగుతాయని అనుకున్నారు.. కానీ గతంలో నుంచి ఇప్పటి వరకు కార్యదర్శిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారని, ఇప్పుడు కూడా ఏకగ్రీవంగా ఎన్నుకుందామని, దీనికి సహకరించాలని డీఈఓ శ్రీనివాసాచారి సూచించారు. దీనికి కొంతమంది అభ్యంతరం వ్యక్తం చేయడంతో పలువురి అభిప్రాయాలు తీసుకున్నారు. కార్యదర్శి పోటీలో ఉన్నవారు స్టేజీ మీదకు వచ్చి జాయినింగ్, సీనియారిటీ వివరాలు చెప్పాలని, తప్పుడు సమాచారం చెప్పితే సస్పెండ్ చేస్తానని అన్నారు. దీంతో వరుసగా జి.వి.భూమారెడ్డి, ఎం లక్ష్మీనారాయణ, వి.గంగాధర్, ఎం. నాగమణి, రసూల్ తదితరులు వచ్చారు. వీరి సీనియారిటీని డీఈఓ పరిశీలించారు. సీనియారిటీలో ముందున్న జిల్లా కేంద్రంలోని దుబ్బ ప్రభుత్వ పాఠశాలలో పని చేస్తున్న జి.వి భూమరెడ్డి(పీడీ)ని జిల్లా కార్యదర్శి పదవికి ఏక గ్రీవంగా ఎన్నుకుంటున్నట్లు తెలిపారు. దీంతో అందరు చప్పట్లతో అభినందనందించారు. జిల్లాకు పతకాలు తీసుకురావాలి వ్యాయామ ఉపాధ్యాయులు క్రమశిక్షణతో విధులు నిర్వహించాలని డీఈఓ సూచించారు. ఎస్జీఎఫ్ జిల్లా కార్యదర్శిగా ఇంతవరకు జానకీరాం కొనసాగారని, ఎన్ని ఇబ్బందులు ఉన్నా చాలా బాగా పనిచేశాడని డీఈఓ అభినందించారు. పిల్లలను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఆడించి పతకాలు, జిల్లాకు మంచి పేరు తీసుకువచ్చేవిధంగా కృషి చేయాలని ఆకాంక్షించారు. రోజు రెండు పిరియడ్లు బోధించాలి జిల్లాలోని అన్ని పాఠశాలల్లో విద్యార్థులకు వ్యాయామ విద్యపై తప్పని సరిగా అవగాహన కల్పించాలని సూచించారు. ఇందుకోసం పీఈటీ, పీడీలు ప్రతి రోజు రెండు పీరియడ్లు విద్యార్థులకు వ్యాయమ విద్యా, ఆరోగ్యంపై అవగాహ న కల్పించాలన్నారు. అలాగే సాయంత్రం 3.30 నుంచి 5 గంటల వరకు పిల్లలకు విధిగా ఆటలు ఆడించాలన్నారు. పిల్లల దగ్గర నుంచి రూ.3చొప్పున వసూలు చేసి కార్యదర్శికి అందించాల న్నారు. అనంతరం డీఈఓ నూతనంగా ఎన్నికైన ఎస్జీఎఫ్ కార్యదర్శి భూమరెడ్డిని అభినందించారు. అలాగే జానకీరాంను కూడా సన్మానిం చా రు. కార్యక్రమంలో డిప్యూటీ ఈఓ పోచాద్రి, జా యింట్ సెక్రటరీ మల్లెష్గౌడ్, సభ్యులు శివరాజ్, మోహన్రెడ్డి, వెంకటేశ్వర్రావు, అనురాధ తదితరులు పాల్గొన్నారు. -
వాలీబాల్ విజేత ఖమ్మం
ఖమ్మం వైరారోడ్, న్యూస్లైన్: స్కూల్గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో స్థానిక సర్దార్పటేల్ స్టేడియంలో నిర్వహిస్తున్న అండర్-17 రాష్ట్రస్థాయి బాలబాలికల వాలీబాల్ టోర్నీ ఆదివారం ముగిసింది. బాలుర విభాగంలో విజేతగా ఖమ్మం జిల్లా జట్టు నిలిచింది. బాలికల విభాగంలో కృష్ణ జిల్లా ప్రథమ స్థానం దక్కించుకుంది. క్వార్టర్ ఫైనల్స్ మొదలు, సెమీస్, ఫైనల్స్ ఇలా మొత్తం 26 మ్యాచ్లను ఒకేరోజు నిర్వహించారు. క్రీడాకారులు తీవ్ర అలసటకు లోనయ్యారని ఆయా టీమ్ల యాజమాన్యాలు వాపోయాయి. బాలుర విభాగంలో ద్వితీయస్థానంలో వరంగల్, తృతీయస్థానాన్ని విజయనగరం దక్కించుకున్నాయి. బాలికల విభాగంలో వరంగల్, నిజామాబాద్ ద్వితీయ, తృతీయస్థానాల్లో నిలిచాయి. విజేతలకు డీఈఓ రవీంద్రనాథ్రెడ్డి, డిప్యూటీ డీఈఓ బాలరాజు, డీఎస్డీవో కబీర్దాస్, ఎస్జీఎఫ్ సెక్రటరీ జి.శ్యాంప్రసాద్, కె.క్రిష్టపర్బాబు, షఫీ, క్రీడల పరిశీలకులు బాలరాజు, ఖమ్మం టూటౌన్ సీఐ సారంగపాణి బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా పీఈటీలు డీఈఓను సన్మానించారు. పీఈటీలు, క్రీడాకారులు సమన్వయంతో వ్యవహరించినప్పుడే విజయాలు సాధ్యమని డీఈఓ అన్నారు. క్రీడల్లో గెలుపోటములు సహజమేనన్నారు. జాతీయస్థాయి పోటీలకు క్రీడాకారులను ఎంపిక చేశారు. జాతీయ జట్టుకు ఎంపికైన క్రీడాకారులు కర్నాటక రాష్ట్రంలోని బీజాపూర్లో జరిగే జాతీయస్థాయి వాలీబాల్ పోటీల్లో పాల్గొంటారని స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ సెక్రటరీ జి.శ్యాంబాబు తెలిపారు. జాతీయస్థాయికి ఎంపికై న క్రీడాకారులు కె. రాందాస్ (నల్లగొండ), ఎమ్. సృజన్ (వరంగల్), కె.నరేష్ (ఖమ్మం), రాజు (ఖమ్మం), ఎస్.జగపతిబాబు (వరంగల్), ఎన్.రామకృష్ణ (గుంటూరు), కె.పాల్రాజు (శ్రీకాకుళం), నరేష్ (రంగారెడ్డి), ఎమ్.రామారావు (విజయనగరం), కె.పాల్రాజ్ (ప్రకాశం), మణికుమార్ (ఖమ్మం), బాషామియా (కర్నూల్), స్టాండ్బై గా ఎమ్.తిరుపతి (కరీంనగర్), మణికంఠ (తూర్పుగోదావరి), సాకిబ్ బాషా (చిత్తూర్) ఎంపికయ్యారు. జాతీయ జట్టుకు ఎంపికైన బాలికలు: యు. హంస (నిజామాబాద్), ఎమ్. శ్రీప్రియ (క్రిష్ణా), ఎస్కె. ఈస్తర్రాణి (క్రిష్ణా), ఎమ్.అఖిల (నిజామాబాద్), ఎ.జ్యోతి (వరంగల్), ఇ. నిర్మలాదేవి (వరంగల్), డి.నిరూషా (వరంగల్), ఎ.సాహితీరెడ్డి (రంగారెడ్డి), ఎస్. ఐశ్వర్య (తూర్పుగోదావరి), ఎస్.లావణ్య (నల్లగొండ), కె.లక్ష్మీశిరీష (కడప), బి.శ్రావణి (ఖమ్మం), స్టాండ్ బైగా షర్మిల (ప్రకాశం), ఆర్.వరలక్ష్మి (మెదక్), ఎమ్.భవాని (మహబూబ్నగర్) ఎంపికయ్యారు. -
రాష్ట్ర అథ్లెటిక్స్ జట్టుకు జిల్లాలోనే శిక్షణ!
శ్రీకాకుళం స్పోర్ట్స్, న్యూస్లైన్: జాతీయ పాఠశాలల క్రీడల (స్కూల్ గేమ్స్) అథ్లెటిక్స్ చాంపియన్షిప్ పోటీల్లో ప్రాతినిధ్యం వహించే రాష్ట్ర అథ్లెటిక్స్ జట్టుకు శ్రీకాకుళంలోనే శిక్షణ శిబిరాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రతినిధులు, అధికారులు భావిస్తున్నారు. జనవరి రెండో వారంలో జరగనున్న ఈ పోటీలకు సంబంధించిన తేదీలు త్వరలో వెల్లడికావాల్సి ఉంది. రాష్ట్ర స్థాయి పోటీల్లో ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచిన క్రీడాకారులందరినీ జాతీయ పోటీలకు పంపించాలని రాష్ట్ర స్కూల్ గేమ్స్ ప్రతినిధులు సమాలోచనలు చేస్తున్నారు. అదే జరిగితే అండర్-14 బాలబాలికల విభాగం నుంచి 40 మంది, అండర్-17 బాలబాలికల విభాగం నుంచి 68 మంది బాలబాలికలు ఎంపికవుతారు. మొత్తంమీద 108 మంది జాతీయ పోటీలకు అర్హత సాధిస్తారు. ఇదే లెక్కన తుది జట్టు ఎంపికలు జరిగితే శ్రీకాకుళం జిల్లా నుంచి ఇద్దరు మాత్రమే ఎంపికయ్యే అవకాశం ఉంది. వీరిలో అండర్-17 బాలురులో జావెలిన్త్రో క్రీడలో కె.జగన్నాథం ప్రథమ స్థానంలో నిలవగా... అండర్-14 బాలికల్లో లాంగ్జంప్లో జి.రమ్య ద్వితీయ స్థానంలో నిలిచింది. మరో ముగ్గురు టాప్-5 స్థానంలో నిలిచారు. ఆతిథ్యం అదిరినా..! ఈ నెల 10 నుంచి 12వ తేదీ వరకు కోడిరామ్మూర్తి స్టేడియంలో జరిగిన రాష్ర్టస్థాయి పోటీల్లో పాల్గొనే క్రీడాకారులకు జిల్లా క్రీడా యంత్రాంగం పూర్తి స్థాయిలో సౌకర్యాలు కల్పించింది. అయితే, క్రీడలకు ఆతిథ్యమిచ్చిన శ్రీకాకుళం జిల్లా క్రీడాకారులు మాత్రం ఘోరమైన వైఫల్యాన్ని చవిచూశారు. అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేశారు. రంగారెడ్డి జిల్లా క్రీడాకారులు కనీవినీ ఎరుగుని స్థాయిలో పతకాలు సాధించి ఓవరాల్ చాంపియన్షిప్తో పాటు అండర్-14 బాలబాలికల చాంపియన్ ట్రోపీలను సైతం కైవసం చేసుకోగా, ఆతిధ్య శ్రీకాకుళం మాత్రం కేవలం రెండంటే రెండు పతకాలు మాత్రమే సాధించి చివరి వరుసలో నిలిచింది. లోపం ఎక్కడ ? రాష్ట్రపోటీల్లో జిల్లా అథ్లెటిక్స్ క్రీడాకారులు మరీ ఇంత నీరసంగా ఆడడంపై జిల్లా పాఠశాలల క్రీడల సమాఖ్యతో పాటు వ్యాయామ ఉపాధ్యాయులను సైతం కలవరపరుస్తోంది. లోపం ఎక్కడ జరిగిందనే విషయమై చర్చిస్తున్నారు. చేతలు కాలాక ఆకులు పట్టుకున్నట్లు... ఎంపికల సమయంలో క్రీడాకారుల ప్రతిభ, అనంతరం వారికి శిక్షణ శిబిరాల ఏర్పాటు, నాణ్యమైన పీఈటీల సమక్షంలో తర్ఫీదునీయటం మరిచిన జిల్లా క్రీడల యంత్రాంగం పోటీలన్నీ ముగిసిన తర్వాత కారణాలు వెతుకుతోంది. లాబీయింగ్ లేకపోలేదు..! గత కొంతకాలంగా జిల్లాస్థాయి ఎంపికల సమయంలో కొంతమంది పీఈటీలు లాబీయింగ్ చేయించుకుని ప్రతిభ లేకపోయినా ఒత్తిడి చేసి జట్లకు ఎంపిక చేయించుకుంటున్నారనే అభియోగాలు ఉన్నాయి. దీనికి తోడు అథ్లెటిక్స్ విభాగంలో తర్ఫీదునిచ్చే డీఎస్ఏ అథ్లెటిక్స్ లేకపోవడం, శిక్షణ శిబిరాలు, ప్రోత్సాహం లేకపోవడం వంటి కారణాలే వైఫల్యానికి కారణంగా తెలుస్తోంది. దీనికి తోడు పైకా పథకం ఉద్దేశం పక్కదారి పట్టడంతో క్రీడాకారులకు మరిన్ని కష్టాలు, చిక్కులు వచ్చిపడుతున్నాయి. గ్రామీణ స్థాయి క్రీడాకారులను ఎలాంటి లాబీయింగ్లకు ఆస్కారం లేకుండా అన్నివిధాలా ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్తే పతకాలు పండించడం ఖాయమని పలువురు వ్యాయామ ఉపాధ్యాయులే చెబుతుండడం గహనార్హం. -
జాతీయస్థాయి బాక్సింగ్ పోటీలకు ప్రమీల
మామిడికుదురు, న్యూస్లైన్ : స్థానిక దీప్తి పాఠశాల పదో తరగతి విద్యార్థిని, పాశర్లపూడిబాడవకు చెందిన తుమ్మా ప్రమీల ఈ నెల 18 నుంచి గౌహతిలో జరిగే జాతీయస్థాయి బాక్సింగ్ పోటీలకు ఎంపికైంది. హైదరాబాద్లో ఆదివారం జరిగిన స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్-17 బాక్సింగ్ పోటీల్లో బంగారు పతకం గెలుచుకున్న ప్రమీలను జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక చేశారని దీప్తి విద్యా సంస్థల కరస్పాండెంట్ డీవీవీ సత్యనారాయణ, జిల్లా బాక్సింగ్ కోచ్ బొంతు మధుకుమార్ సోమవారం తెలిపారు. రాష్ట్ర బాక్సింగ్ పోటీల్లో మరో ఇద్దరు విద్యార్థినులు కూడా పతకాలు సాధించారు. కాగా, 66 కిలోల విభాగంలో పీబీఎస్ఎన్డీ వజ్రేశ్వరి (జెడ్పీ హైస్కూల్, మామిడికుదురు) రజత, 48 కిలోల విభాగంలో అదే పాఠశాల విద్యార్థిని ఎం.విజయభూలక్ష్మి కాంస్య పతకాలు గెల్చుకున్నారని మధుకుమార్ తెలిపారు. వీరిని డీఈఓ శ్రీనివాసులురెడ్డి, డీవైఈఓ గంగాభవాని, ప్రధానోపాధ్యాయులు మైలవరపు రవీంధ్రనాథ్, జొన్నలగడ్డ గోపాలకృష్ణ, స్కూల్ గేమ్స్ కార్యదర్శి కె.శ్రీనివాసరావు, మధుకుమార్, టూర్ మేనేజర్ ఎన్వీవీ సత్యనారాయణ అభినందించారు. -
సత్తా చాటారు!
కీసర, న్యూస్లైన్: రాష్ట్రస్థాయి ఖోఖో పోటీట్లో జిల్లా జట్లు సత్తా చాటాయి. బాలురు, బాలికల విభాగాల్లో ప్రథమ స్థానంలో నిలిచాయి. కీసరలోని సెరిని టీ పాఠశాల ఆవరణలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మూడురోజులపాటు నిర్విహ ం చిన 59వ రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలు ఆదివారం ముగిశాయి. బాలికల విభాగంలో నిజామాబా ద్ జిల్లా జట్టు ద్వితీయ, మహబూబ్నగర్ జట్టు తృతీయ, నల్గొండ నాలుగో స్థానంలో నిలిచా యి. బాలుర విభాగంలో ద్వితీయస్థానంలో నిజామాబాద్ జిల్లా జట్టు, తృతీయ స్థానంలో ఆదిలాబాద్ జట్టు, నాలుగో స్థానంలో వరంగల్ జట్టు నిలిచిందని క్రీడా పోటీల ఇన్చార్జి రమేష్రెడ్డి తెలిపారు. పోటీల్లో గెలుపొందిన జట్లకు ఎమ్మెల్యే కేఎల్లార్ బహుమతులు ప్రదానం చేశా రు. అనంతరం మాట్లాడుతూ క్రీడలు శారీరక, మానసిక వికాసానికి దోహదం చేస్తాయని, క్రీడల్లో రాణించే విద్యార్థులు జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకుంటారన్నారు. క్రీడాకారులు గెలుపోటములను సమానంగా స్వీకరించాలని సూచించారు. పాఠశాల స్థాయిలోనే విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు స్సూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఖోఖో పోటీలు వేదికగా నిలిచాయన్నారు. పోటీల్లో రంగారెడ్డి జిల్లా జట్లు బాలికలు, బాలుర విభాగాల్లో మొదటిస్థానాల్లో నిలవడం అభినందించదగిన విషయమన్నారు. స్కూల్గేమ్స్ ఫెడరేషన్ ఆర్గనైజింగ్ కార్యదర్శి చంద్రశేఖర్ మాట్లాడుతూ.. ఖోఖో పోటీల్లో 23 జిల్లాలకుగాను ప్రకాశం జిల్లా తప్ప మిగిలిన 22 జిల్లాల జట్లు పాల్గొన్నాయన్నారు. బాలికలు, బాలుర విభాగాల్లో మొత్తం 552 మంది విద్యార్థులు పోటీల్లో పాల్గొన్నారని, 130 మంది వ్యాయామ ఉపాధ్యాయులు విధులు నిర్వర్తించారని చెప్పారు. కార్యక్రమంలో టోర్నమెంట్ ఇన్ చార్జి రమేష్రెడ్డి, స్థానిక సర్పంచ్ చినింగని గణేష్, ఉప సర్పంచ్ రాయిల శ్రావణ్కుమార్ గుప్తా, కీసరగుట్ట కాంగ్రెస్ నేతలు తటాకం వెంకటేష్, పన్నాల బుచ్చిరెడ్డి, రమేష్ గుప్తా, జంగయ్య యాదవ్, భానుశర్మ, శివగౌడ్ పాల్గొన్నారు. -
విద్యార్థులు క్రీడల్లోనూ రాణించాలి: గీతారెడ్డి
జహీరాబాద్, న్యూస్లైన్: విద్యార్థినులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని రాష్ట్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి జే గీతారెడ్డి సూచించారు. శనివారం మండలంలోని రంజోల్ గ్రామ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో 9వ జోనల్ స్థాయి గురుకుల పాఠశాలల క్రీడలు ప్రారంభమయ్యాయి. నాలుగు రోజుల పాటు ఈ పోటీలు జరగనున్నాయి. ప్రారంభ వేడుకల్లో కలెక్టర్ దినకర్బాబు, సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్కుమార్, డీసీసీబీ చైర్మన్ ఎం జైపాల్రెడ్డి, అదనపు జేసీ మూర్తి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మంత్రి గీతారెడ్డి మాట్లాడుతూ చదువు ఎంత ముఖ్యమో క్రీడలు కూడా అంతే ముఖ్యమన్నారు. ఈ పోటీల్లో మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్, నల్గొండ, మహబూబ్నగర్, నిజామాబాద్ జిల్లాలకు చెందిన గురుకుల పాఠశాలల విద్యార్థులు పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. ఇలాం టి వేదికల్లో విద్యార్థులు వారి సత్తాను చాటుకోవాలన్నారు. వ్యక్తిగత ప్రతిభ చూపేందుకు కృషి చేయాలన్నారు. గురుకుల పాఠశాలల్లో ఉత్తమ బోధన అందుతోందన్నారు. అందుకే మంచి ఫలితాలను వస్తున్నాయని మంత్రి తెలిపారు. ఉన్నత చదువులు చదువుకుని కుటుంబానికి, సమాజానికి మంచి పేరు తీసుకురావాలని విద్యార్థినులకు సూచించారు. విదేశాల్లో ఉన్నత చదువులు కొనసాగించుకోవాలనుకునే గురుకుల పాఠశాలల విద్యార్థులను ప్రభుత్వ ప్రోత్సాహం ఉంటుందన్నారు. అనంతరం సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్కుమార్ మాట్లాడారు. గురుకులాల్లో నాణ్యమైన విద్య, క్రీడలను ప్రోత్సహించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఆపరేషన్ మౌంట్ ఎవరెస్ట్ అనే కార్యక్రమం తీసుకున్నట్లు తెలిపారు. ఎవరెస్టు శిఖరాన్ని ఎక్కేందుకు వీలుగా ఒక బృందాన్ని సిద్ధం చేస్తున్నామన్నారు. కలెక్టర్ దినకర్బాబు మాట్లాడుతూ కష్టపడితేనే ఆశించిన ఫలితం పొందవచ్చని తెలిపారు. విద్యార్థులు క్రీడల్లో నైపుణ్యం చాటుకోవాలన్నారు. డీసీసీబీ చైర్మన్ ఎం జైపాల్రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ సదుపాయాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకుని అభివృద్ధి చెందాలన్నారు. కార్యక్రమంలో జిల్లా పరిశ్రమల శాఖ జీఎం సురేష్కుమార్, గురుకుల పాఠశాలల కన్వీనర్ సుదర్శన్, పాఠశాల ప్రిన్సిపాల్ విజయలక్ష్మి, గ్రామ సర్పంచ్ అనసూజమ్మ, విద్యార్థులు, ఉపాధ్యాయులు నాయకులు పాల్గొన్నారు. -
గెలుపోటములు సాధారణం
భూపాలపల్లి, న్యూస్లైన్ : క్రీడల్లో గెలుపోటములు సాధారణమని, ఓటమి చెందిన క్రీడాకారులు నిరుత్సాహపడకుండా మరోసారి గెలుపునకు కృషిచేయాలని ప్రభుత్వ చీఫ్విప్, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, పరకాల ఎమ్మెల్యే మొలుగూరి బిక్షపతి అన్నారు. భూపాలపల్లి పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో శుక్రవారం స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్జీఎఫ్ఐ) ఆధ్వర్యంలో పరకాల జోన్ పాఠశాలల క్రీడోత్సవాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. భూపాలపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు విజయ అధ్యక్షతన జరిగిన ఈ క్రీడోత్సవాలకు ప్రభుత్వ చీఫ్విప్ గండ్ర వెంకటరమణారెడ్డి ముఖ్యఅతిథిగా, పరకాల ఎమ్మెల్యే మొలుగూరి బిక్షపతి విశిష్ట అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చీఫ్విప్ గండ్ర మాట్లాడుతూ పరకాల ప్రాంతంలో అనేక మంది జాతీయస్థాయి క్రీడాకారులు ఉన్నారన్నారు. వీరిని స్ఫూర్తిగా తీసుకుని క్రీడల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సౌకర్యాల కల్పన కు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. క్రీడలను ప్రోత్సహించేందుకు ఈ ఏడాది స్పోర్ట్స్ బడ్జెట్ను రూ. 200 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. అనంతరం పరకాల ఎమ్మెల్యే మొలుగూరి బిక్షపతి మాట్లాడుతూ క్రీడలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగినన్ని నిధులు కేటాయించలేదని ఆరోపించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పడిన అనంతరం క్రీడలకు ప్రాధాన్యం ఇస్తామన్నారు. అనంతరం స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయులు, పీఈటీలుగా ఎంపికైన వారిని ఘనంగా సన్మానించారు. ఈ క్రీడల్లో పరకాల జోన్లోని భూపాలపల్లి, రేగొండ, శాయంపేట, చిట్యాల, మొగుళ్లపల్లి, పరకాల మండలాలకు చెందిన సుమారు 700 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. అండర్-14, 17 బాల, బాలికల విభాగాల్లో జరుగనున్న కబడ్డీ, వాలీబాల్, ఖోఖో పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను జిల్లా స్థాయి పోటీలకు ఎంపిక చేస్తారు. కార్యక్రమంలో డీఎస్పీసంజీవరావు, డిప్యుటీ డీఈఓ క్రిష్ణమూర్తి, పరకాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చెర్మైన్ యార మల్లారెడ్డి, భూపాలపల్లి నగర పంచాయతీ కమిషనర్ నోముల రవీందర్యాదవ్, ఎంఈఓ సాల్మన్, తహసీల్దార్ రాజమహేందర్రెడ్డి, ఎంపీడీఓ బ్రహ్మచారి, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ఎ.విజయ్కుమార్, ప్రైవేటు కళాశాలల సంఘం మండలాధ్యక్షుడు బిల్ల రాజిరెడ్డి, భూపాలపల్లి క్రీడా కమిటీ నాయకులు జోగుల సమ్మయ్య, కె.రాజయ్య, సెగ్గెం సిద్ధు, సంజీవరావు, చిట్యాల, గణపురం ఎంఈఓలు జి.సారంగపాణి, కె.సురేందర్ పాల్గొన్నారు.