అన్నాడీఎంకే మాజీ మంత్రి మృతి | AIADMK former minister No More | Sakshi
Sakshi News home page

అన్నాడీఎంకే మాజీ మంత్రి మృతి

Published Mon, Mar 13 2017 2:32 AM | Last Updated on Wed, Oct 3 2018 7:31 PM

గుండెపోటుతో అన్నాడీఎంకే మాజీ మంత్రి ఆర్‌.విశ్వనాథన్‌ శనివారం రాత్రి మృతి చెందాడు. వేలూరు జిల్లా కావేరిపాక్కంకు చెందిన విశ్వనాథన్‌

వేలూరు : గుండెపోటుతో అన్నాడీఎంకే మాజీ మంత్రి ఆర్‌.విశ్వనాథన్‌ శనివారం రాత్రి మృతి చెందాడు. వేలూరు జిల్లా కావేరిపాక్కంకు చెందిన విశ్వనాథన్‌(67) అన్నాడీఎంకే పార్టీలో తూర్పు డివిజన్‌ కార్యదర్శి, ఎమ్మెల్యే, మంత్రిగా పనిచేశారు. ఆయన అనారోగ్యం కారణంగా చెన్నైలోని రామచంద్ర ఆసుపత్రిలో చికిత్స కోసం ఈ నెల 1వ తేదీన  చేరారు. అక్కడ చికిత్సలు ఫలించక ఆయన శనివారం రాత్రి మృతి చెందాడు. విశ్వనాథన్‌ మాజీ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం మద్దతుదారునిగా ప్రచారం కార్యక్రమాల్లో పాల్గొంటూ రాజకీయాల్లో చురుకుగా వ్యవహరించేవారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement