AIADMK
-
రసవత్తరంగా తమిళ రాజకీయం గవర్నర్ ను కలిసిన పళనిస్వామి
-
టీవీకే విజయ్ను ఉద్దేశిస్తూ.. తమిళనాడు గవర్నర్ అధికారిక ప్రకటన
సాక్షి,చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో ఉత్కంఠ మరింతగా పెరిగింది. తాజాగా తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధ్యక్షుడు విజయ్ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ కలిశారు. ఈ సమావేశం అనంతరం గవర్నర్ కార్యాలయం అధికారిక ప్రకటన విడుదల చేసింది.ప్రకటనలో ‘ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన మెజారిటీ మద్దతు ఇంకా లభించలేదు. అసెంబ్లీలో స్పష్టమైన మెజారిటీ నిరూపించకపోతే ప్రభుత్వం ఏర్పాటు ఆహ్వానం ఇవ్వలేం’ అని పేర్కొంది. దీంతో టీవీకే ప్రభుత్వం ఏర్పాటుపై సస్పెన్స్ కొనసాగుతోంది.234 సభ్యుల అసెంబ్లీలో టీవీకే 108 స్థానాలు గెలుచుకుంది. విజయ్ రెండు నియోజకవర్గాల్లో గెలవడంతో ఒక సీటు వదులుకోవాలి. దీంతో పార్టీ బలం 107కి తగ్గుతుంది. కాంగ్రెస్ 5 ఎమ్మెల్యేలు మద్దతు ప్రకటించడంతో సంఖ్య 112కి చేరింది. కానీ మెజారిటీకి కావలసిన 118కి ఇంకా తక్కువ. ఇక ఇతర పార్టీల వైఖరి కీలకంగా మారింది. సీపీఐ,సీపీఎం, వీసీకే మద్దతు ఇవ్వాలని ఆలోచిస్తున్నాయి. డీఎంకే అధినేత స్టాలిన్ విజయ్కు మద్దతు ఇచ్చే అంశాన్ని వామపక్షాలకే వదిలేశారు. అయితే ఏఐఏడీఎంకే మాత్రం టీవీకేకు మద్దతు ఇవ్వబోమని స్పష్టంగా తెలిపింది.టీవీకే మద్దతుదారులు లోక్భవన్ వద్ద నిరసనలు చేపట్టారు. గవర్నర్ ఆలస్యం పై పలువురు ప్రముఖులు విమర్శలు చేశారు. టీవీకే మద్రాస్ హైకోర్టును ఆశ్రయించే అవకాశాన్ని కూడా పరిశీలిస్తోంది. మొత్తం మీద, టీవీకే సింగిల్ లార్జెస్ట్ పార్టీ అయినప్పటికీ, మెజారిటీకి కావలసిన సంఖ్య ఇంకా తక్కువ. గవర్నర్ ఆహ్వానం ఇవ్వడానికి ముందు స్పష్టమైన మెజారిటీ నిరూపణ కోరుతున్నారు. చిన్న పార్టీల నిర్ణయం, కాంగ్రెస్ మద్దతు, డీఎంకే తాత్కాలిక వెనుకడుగు వంటి అంశాలు తమిళనాడు రాజకీయాల్లో ఉత్కంఠను మరింతగా పెంచుతున్నాయి. Governor Tells Vijay, Majority Not Yet EstablishedChennaiThe #LokBhavan, Tamil Nadu, has issued a press statement stating that Governor Rajendra Vishwanath Arlekar met C. Joseph #Vijay, President of the Tamilaga Vettri Kazhagam (#TVK), in #Chennai today. During the… pic.twitter.com/c1OQza05RK— Yasir Mushtaq (@path2shah) May 7, 2026 -
పొలిటికల్ థ్రిల్లర్
-
విజయ్కు గవర్నర్ గ్రీన్సిగ్నల్
చెన్నై: తమిళ రాజకీయాల్లో ఉత్కంఠకు తెర పడింది. ప్రభుత్వ ఏర్పాటునకు టీవీకే పార్టీకి గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ అనుమతి ఇచ్చారు. విజయ్తో భేటీ అనంతరం ఈ నిర్ణయం వెలువడింది. అయితే, లోక్భవన్ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఈ నేపథ్యంలో గవర్నర్ అధికారిక ప్రకటన కోసం టీవీకే శ్రేణులు ఎదురుచూస్తున్నాయి. మరోవైపు.. న్యాయ సలహా తీసుకున్న తర్వాత తన నిర్ణయం చెబుతానని గవర్నర్ వ్యాఖ్యలు చేయడం కొసమెరుపు. ఒకవేళ గవర్నర్ నుంచి అధికారిక ప్రకటన వెలువడితే ఈరోజే విజయ్.. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. దీంతో, విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్దమైంది. గవర్నర్ గ్రీన్సిగ్నల్తో టీవీకే అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. కాసేపటి క్రితమే లోక్భవన్ వేదికగా గవర్నర్, విజయ్ మధ్య కీలక సమావేశం జరిగింది. 24 గంటల్లో రెండోసారి గవర్నర్ను విజయ్ కలిశారు.40 నిమిషాల భేటీ తర్వాత కీలక పరిణామం చోటుచేసుకుంది. విజయ్కు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. టీవీకేను ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించేందుకు గవర్నర్ సానుకూలంగా స్పందించారు. వీరి భేటీ సందర్భంగా గవర్నర్కు విజయ్.. కాంగ్రెస్ పార్టీ మద్దతు లేఖ, మంత్రుల జాబితాను అందించినట్టు సమాచారం. ఈ క్రమంలోనే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని గవర్నర్ను కోరారు. ఇదే సమయంలో అసెంబ్లీలో బల నిరూపణ చేసుకుంటామని విజయ్ చెప్పారు. 113 మంది ఎమ్మెల్యే జాబితాను సమర్పించారు. #WATCH | Chennai | TVK Chief Vijay leaves from Lok Bhavan after meeting Tamil Nadu Governor Rajendra Vishwanath Arlekar pic.twitter.com/ygxHkVNi4q— ANI (@ANI) May 7, 2026విజయ్కు అనుమతి ఇవ్వాలి..ఇదిలా ఉండగా.. తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటుచేయడానికి విజయ్కు అనుమతి ఇవ్వాలని వీసీకే గవర్నర్ను కోరింది. అయితే ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించే అవకాశంపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. ఇద్దరేసి ఎమ్మెల్యేలున్న వీసీకే, సీపీఐ సానుకూలంగా స్పందించినా, ఇంకా అధికారికంగా చెప్పలేదు. టీవీకేకు తొలుత అవకాశం ఇవ్వాలనే అభిప్రాయాన్ని డీఎంకే కూడా వ్యక్తంచేసింది. -
గంటగంటకూ ఉత్కంఠ..! తమిళ రాజ్యమేలేదెవరు..?
-
నిప్పు-నీరు కలిసే చాన్సే లేదా?
అధికారం అయితే నీది లేదంటే నాది.. ద్రవిడ సిద్ధాంతం ఆధారంగా నడిచే తమిళనాడు రాజకీయాల్లో దశాబ్దాలుగా కొనసాగుతున్న తంతు ఇదే . అయితే ఈసారి విజయ్ అనే రూపంలో ‘మార్పు’ ఆ రెండు పార్టీల ఓటు బ్యాంకును గట్టిగా దెబ్బ కొట్టింది. వాటిని పక్కన నెట్టేసి అధికారం ఏర్పాటు దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇలాంటి పరిస్థితుల్లోనైనా వైరాన్ని పక్కన పెట్టి డీఎంకే–అన్నాడీఎంకేలు చేతులు కలుపుతాయా?.. డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలు రహస్య చర్చలు జరుపుతున్నాయి. ఈ రెండూ కలిసి అధికారం ఏర్పాటు చేయబోతున్నాయి. తద్వారా అత్యధిక స్థానాలు గెల్చుకున్న విజయ్కు భారీ షాక్ తగలబోతోంది. అదే టైంలో.. ఒక దెబ్బకు రెండు పిట్టలు అన్నచందాన తమను ఇంతకాలం అవసరానికి వాడుకున్న జాతీయ పార్టీలనూ దెబ్బ కొట్టబోతున్నాయి. ఇది నిన్న సాయంత్రం నుంచి తమిళనాట జరుగుతున్న ప్రచారం. అయితే అటు డీఎంకే, ఇటు అన్నాడీఎంకే రెండూ ఈ ప్రచారాన్ని కొట్టిపారేశాయి. ఇది టీవీకే ఆడుతున్న చిల్లర మైండ్గేమ్ అని తిట్టిపోశాయి. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమనే మాట ఒకటి ఉంది. అలాంటప్పుడు డీఎంకే-అన్నాడీఎంకే.. ఈ పార్టీల మధ్య స్నేహం ఎందుకు అసాధ్యం?. తమిళ రాజకీయాల పేజీలను తిరగేస్తే.. ఏనాడూ ఈ పార్టీలు జట్టు కట్టిన సందర్భం కనిపించదు. స్థానిక ఎన్నికల దగ్గరి నుంచి ఎందులో అయినా సరే మద్దతు అనేది భూతద్దం పెట్టి వెతికినా కనిపించదు. కేవలం ద్రవిడ ఉద్యమ వారసత్వం, తమిళ భాషా హక్కుల అంశాల్లో రెండు పార్టీలూ ఒకే వేదికను పంచుకోవడం తప్పించి. ఈ రెండు పార్టీలు కలవకపోవడానికి ప్రధానంగా మూడు బలమైన కారణాలు కనిపిస్తాయిపుట్టుకే..1972లో కరుణానిధి నాయకత్వంలోని డీఎంకే నుంచి ఎంజీ రామచంద్రన్ (MGR) బహిష్కరించింది. ఆ అవమానానికి ప్రతీకారంగా ఎంజీఆర్ అన్నాడీఎంకే (AIADMK) స్థాపించారు. కొత్త పార్టీ ప్రకటన సమయంలో.. డీఎంకేలో అవినీతి పెరిగిపోయిందని సంచలన ఆరోపణలు చేశారాయన. నాటి నుంచి నేటి దాకా.. ఒక పార్టీ ఉనికి మరొక పార్టీని వ్యతిరేకించడం మీదనే ఆధారపడి ఉంది. ఒకవేళ ఈ రెండూ కలిస్తే, అవి తమ మౌలిక సిద్ధాంతాన్ని తామే తుడిచేసుకున్నట్లు అవుతుంది.భిన్న ధృవాల రాజకీయం (Bipolar Politics)గత 50 ఏళ్లుగా తమిళ ప్రజలకు ఈ రెండు పార్టీలే ప్రత్యామ్నాయాలు. డీఎంకే పాలన నచ్చకపోతే అన్నాడీఎంకేకి.. అది నచ్చకపోతే మళ్ళీ డీఎంకేకు ఓటు వేస్తూ అధికారం కట్టబెట్టుకుంటూ వస్తున్నారు. ఒకవేళ ఈ రెండు పార్టీలు పొత్తు పెట్టుకుంటే.. అప్పటివరకు ఈ రెండు పక్షాల మధ్య చీలి ఉన్న 70-80 శాతం ఓటు బ్యాంకు గందరగోళానికి గురవుతుంది. ఇది మూడవ శక్తికి (తాజాగా విజయ్ నేతృత్వంలోని టీవీకే వంటి పార్టీలకు) రెడ్ కార్పెట్ పరిచినట్లు అవుతుంది. తమ ఓటు బ్యాంకును కాపాడుకోవడానికే ఇవి ఎప్పుడూ ప్రత్యర్థులుగానే ఉండాలని కోరుకుంటాయి.కేడర్ స్థాయి ఘర్షణదశాబ్దాలుగా కొనసాగుతున్న వైరంలో.. కేవలం నాయకులే కాదు, క్షేత్రస్థాయి కార్యకర్తలు కూడా భాగస్వాములు. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ప్రతి చోటా ఈ రెండు పార్టీల నాయకుల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. గత ఐదు దశాబ్దాలుగా ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకుంటూ, ఒకరినొకరు విమర్శించుకుంటూ.. దాడులు చేసుకుంటూ..ఆఖరికి హత్యలు కూడా చేసుకుంటూ వస్తున్నారు. పెరిగిన క్యాడర్, అకస్మాత్తుగా పొత్తు పెట్టుకుంటే దానిని అంగీకరించడం అసాధ్యం. నాయకులు పైన కలిసినా, కింద కార్యకర్తలు కలవడం కష్టమైన పని.మరి జాతీయ పార్టీలతో జట్టు?.. తమిళ గడ్డపై ఎట్టి పరిస్థితుల్లో మత శక్తులకు చోటు ఉండకూడదు.. అనేది ద్రవిడ సిద్ధాంత ప్రాథమిక సూత్రం. అయినప్పటికీ డీఎంకే, అన్నాడీఎంకేలు జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలతో పొత్తులు పెట్టుకుంటాయి. ఎందుకనేది పరిశీలిస్తే.. 👉ఢిల్లీలో పట్టు కోసం (Influence in Delhi)తమిళనాడులో ఈ రెండు పార్టీలు ఎంత బలంగా ఉన్నా.. జాతీయ రాజకీయాల్లో ప్రభావం చూపడం కూడా ఎంతో అవసరం. కేంద్రంలో చట్టాలు చేయాలన్నా లేదంటే రాష్ట్రానికి నిధులు రావాలన్నా జాతీయ పార్టీల మద్దతు అవసరం. పైగా కేంద్రంలో అధికారంలో ఉండే పార్టీతో పొత్తు పెట్టుకుంటే.. కేంద్ర క్యాబినెట్లో తమ ఎంపీలకు మంత్రి పదవులు దక్కుతాయి. తద్వారా రాష్ట్ర సమస్యలపై ఢిల్లీలో ఒత్తిడి తీసుకురావచ్చనేది ఒక లెక్క.👉విడదీసి పాలించడం (Cutting the Competition)తమిళనాడులో కాంగ్రెస్కు, బీజేపీకి సొంతంగా గెలిచే సత్తా తక్కువ (సుమారు 5% నుండి 10% ఓటు బ్యాంకు మాత్రమే ఉంది). ఈ చిన్న ఓటు బ్యాంకు కూడా మూడో పార్టీకి వెళ్తే తమకు నష్టం జరుగుతుందని ద్రవిడ పార్టీలు భయపడతాయి. అందుకే, ఆ జాతీయ పార్టీని తమ వైపు తిప్పుకోవడం ద్వారా ప్రత్యర్థిని బలహీనపరచడం వీరి వ్యూహం. 👉సిద్ధాంతం vs అధికారం (Ideology vs Pragmatism)ద్రవిడ సిద్ధాంతం (Dravidian Ideology) ప్రకారం మతతత్వానికి వ్యతిరేకంగా ఉండాలి. కానీ ఎన్నికల రాజకీయాల్లో 'గెలవడమే' ముఖ్యం. సాధారణంగా "సెక్యులరిజం" పేరుతో డీఎంకే కాంగ్రెస్తో జతకడుతుంది. అదే సమయంలో బీజేపీని "మతతత్వ పార్టీ" అని విమర్శిస్తూ ద్రవిడ ఓటర్లను ఆకట్టుకుంటుంది. అయితే.. జయలలిత ఉన్నప్పుడు హిందూ ఓటర్లను ఆకట్టుకోవడానికి కొన్నిసార్లు బీజేపీతో సాఫ్ట్గా ఉండేవారు. అదే ఆ తర్వాతి కాలంలో ఎన్డీయే పొత్తునకు కారణమైంది. అయితే అది కేవలం రాజకీయ అవసరం కోసమే తప్ప సిద్ధాంతపరంగా కాదు. అందుకే ఈ రెండు పార్టీలు ఏ క్షణమైనా జాతీయ పార్టీలతో బంధాన్ని తెంచుకునేందుకు సిద్ధంగా ఉంటాయి. విజయ్ రాకతో సీన్ మారేనా?2026 అసెంబ్లీ ఎన్నికలు తమిళనాడుకు మునుపెన్నడూ లేని రీతిలో ఆసక్తికర రాజకీయం అందించాయి. అగ్రనటుడు విజయ్ రెండేళ్ల కిందట స్థాపించిన టీవీకే తొలి ఎన్నికల్లోనే అత్యధిక స్థానాలు గెలుచుకోగా.. డీఎంకే అధికారం కోల్పోయి రెండో స్థానంలోకి, ప్రతిపక్ష అన్నాడీఎంకే మూడో ప్లేస్లోకి పడిపోయాయి. తమిళనాట హంగ్ ఏర్పడటంతో.. ప్రభుత్వ ఏర్పాటులో టీవీకే (TVK) పార్టీని అడ్డుకోవడానికైనా ఈ రెండు పార్టీలు కలుస్తాయేమోనని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే.. తమ 50 ఏళ్ల సిద్ధాంత పోరాటాన్ని ఒక్క ఎన్నిక కోసం వదులుకోవడానికి వారు సిద్ధంగా ఉన్నారా? అన్నదే ఇక్కడ అసలు ప్రశ్న. ఇదే అసలు సమస్య.. నాయకత్వ అహంకారం-పట్టుదల ఈ రెండు పార్టీలకు ఇప్పటికీ కొనసాగుతున్న ఓ కామన్ గుణం. జనతా సర్కార్ ఉన్న టైంలో.. ఇందిరా గాంధీని దెబ్బ కొట్టడానికి ఈ తమిళ శక్తులను ఒక్కటి చేసే ప్రయత్నం జరిగింది. కానీ, చివరి నిమిషంలో ఆ ప్రయత్నం ఎందుకనో ఫలించలేదు. ఎంజీఆర్ తదనంతరం జయలలిత అన్నాడీఎంకే పగ్గాలు చేపట్టారు. అయితే కరుణానిధి-జయలలిత ఉన్న కాలంలో ఈ వైరం వ్యక్తిగత స్థాయికి చేరింది. అది ఎంతలా అంటే.. 1989 మార్చి 25న తమిళనాడు అసెంబ్లీలో జయలలిత పట్ల జరిగిన అవమానం(ఆమె చీరను లాగడం..), 75 ఏళ్ల వయసులో కరుణానిధిని అర్ధరాత్రి పూట ఇంట్లోంచి లాక్కొచ్చి మరీ జయ సర్కార్ అరెస్ట్ చేయించడం.. ఇలాంటి సంఘటనలు ఈ రెండు పార్టీల మధ్య స్నేహపూర్వక చర్చలు అనే దారులు పూర్తిగా మూసివేశాయి. బద్ధ శత్రువులుగా మారిపోయాయి. ఆ తర్వాతి కాలంలో.. ఆ పార్టీల అధినేతలుగా స్టాలిన్, ఎడప్పాడి పళనిస్వామి (EPS) కూడా అదే పంథాను అనుసరిస్తున్నారు. ఈ ఇద్దరిలో ఒకరి కింద మరొకరు పని చేయడానికి ఏ నాయకుడూ సిద్ధపడరు. ముఖ్యమంత్రి పదవి విషయంలో రాజీ పడటం అనేది ద్రావిడ రాజకీయాల్లో దాదాపు అసాధ్యమైన విషయం.తమిళనాడు రాజకీయ చరిత్రలో డీఎంకే, డీఎంకే పార్టీల మధ్య ఉన్న వైరం కేవలం అధికార పోరాటం మాత్రమే కాదు. అది ఒక చారిత్రక భావోద్వేగ ఘర్షణ. అందుకే నిప్పు నీరు కలవడం అసాధ్యమనే చెప్పచ్చు. ఒకవేళ కలిసే ప్రయత్నాలు జరిగితే.. ఆ క్షణమే ద్రావిడ రాజకీయాల అస్తిత్వం దెబ్బతింటుందని వారి నమ్మకం. అందుకే వారు 'మొండిగా' విడివిడిగానే పోరాడతారు తప్ప, చేతులు కలపరు. -
తమిళ రాజకీయంలో సంచలనం.. విజయ్ సీఎం కానట్టే...!!
-
అధికారం కోసం కొత్త పొత్తు.. మాజీ శత్రువులు ఇప్పుడు కొత్త మిత్రులు?
-
తమిళనాడులో మారుతున్న రాజకీయ సమీకరణాలు.. డీఎంకే, అన్నాడీఎంకే మధ్య పొత్తు వార్తలతో వేడెక్కిన పాలిటిక్స్.
-
రేపు తమిళనాడులో కాంగ్రెస్ ధర్నా
తమిళనాడు రాజకీయానికి సంబంధించిన అప్డేట్స్.. తమిళనాడు గవర్నర్ను కలిసిన సీఎస్, డీజీపీవిజయ్కు కాన్వాయ్ ఎలా ఇచ్చారని డీజీపీని ప్రశ్నించిన గవర్నర్ఏ బేస్ చేసుకుని కాన్వాయ్, భద్రత కేటాయించారన్న గవర్నర్రేపు తమిళనాడు వ్యాప్తంగా ధర్నాకు పిలుపునిచ్చిన కాంగ్రెస్తమిళనాడు గవర్నర్, బీజేపీ వ్యతిరేకంగా కాంగ్రెస్ నిరనలుగవర్నర్ తీరుకు నిరసనగారేపు తమిళనాడు వ్యాప్తంగా కాంగ్రెస్ ధర్నవిజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ అడ్డుకుంటున్నారని విమర్శలుగవర్నర్ తీరుకు నిరసనగా ఆందోళనకు ధర్నాకు దిగనున్న కాంగ్రెస్ శ్రేణులు రేపు వామపక్షాల ఎగ్జిక్యూటివ్ సమావేశంటీవీకే అధినేత విజయ్ కీలక నిర్ణయంప్రభుత్వం ఏర్పాటు కోసం అవసరమైన మద్దతు కూడగట్టే ప్రయత్నాలు వేగవంతంవామపక్షాలతో చర్చలు జరిపేందుకు రంగంలోకి టీవీకే నేత నిర్మల్ కుమార్వామ పక్షాలతో చర్చలు జరిపే బాధ్యతల్ని కుమార్కు అప్పగించిన విజయ్ రేపు వామపక్షాల ఎగ్జిక్యూటివ్ సమావేశంసమావేశం తర్వాతే విజయ్కు మద్దతు అంశంపై క్లారిటీ అప్పటి వరకు కొనసాగనున్న ఉత్కంఠలోక్భవన్ అధికారిక ప్రకటనతమిళనాడు గవర్నర్ కార్యాలయం లోక్భవన్ అధికారిక ప్రకటనగవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ ఈ రోజు చెన్నైలో విజయ్ని కలిశారుప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ మద్దతు తమిళనాడు శాసనసభలో ఇంకా లభించలేదని స్పష్టంలోక్భవన్ ఎదుట విజయ్ అభిమానుల ఆందోళనప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని ప్లకార్డులతో ప్రదర్శననాది భరోసాటీవీకే చీఫ్ విజయ్కు గవర్నర్ భరోసా ప్రభుత్వ ఏర్పాటు ఇతర పార్టీలను ఆహ్వానించబోమని హామీ తగిన మెజారిటీతో రావాలని సూచన 118 మంది జాబితాతో వచ్చి మెజారిటీ నిరూపించుకోవాలని సలహా విజయ్కి మద్దతు ఇస్తారా?డీఎంకే మిత్రపక్షాల నిర్ణయంపై ఉత్కంఠవామపక్షాలతో పాటు వీసీకే పార్టీ మద్దతు కోరిన విజయ్మద్దతు కోరుతూ లేఖ రాసిన టీవీకే అధినేతడీఎంకే అధినేత స్టాలిన్తో భేటీ అయిన మిత్రపక్షాల నేతలువిడిగా పార్టీ సమావేశాలు నిర్వహించుకోవాలని నిర్ణయం తమ నిర్ణయం ఏంటన్నది రేపు భేటీల తర్వాత ప్రకటించే చాన్స్విజయ్కు మద్దతుగా వ్యాఖ్యలు చేసిన సీపీఐ(2)ఏదీ తేల్చని సీపీఎం (2)మద్దతు ఇవ్వమని ఇదివరకు ప్రకటించిన వీసీకే(2)విజయ్ లేఖ నేపథ్యంలో పునరాలోచనలో వీసీకేమద్దతు ఇవ్వబోమని స్పష్టం చేసిన ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్(2)తమిళనాడులో కొనసాగుతున్న సస్పెన్స్..విజయ్ సమర్పించిన సంఖ్యా బలం పట్ల సంతృప్తి చెందని గవర్నర్.గవర్నర్ ఆఫీసు నుంచి టీవీకేకి ఫోన్.118 మంది మెజార్టీ ఫిగర్తో లేఖ సమర్పించాలని టీవీకేకు స్పష్టం చేసిన గవర్నర్ ఆఫీస్.కోర్ కమిటీతో సమావేశమైన టీవీకే నేతలుసంబంధిత వార్త: 113తో ప్రభుత్వమా? అలా ఎలా?కమల్ హాసన్ సంచలన వ్యాఖ్యలుఎంపీ కమల్హాసన్ ట్వీట్.ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు.తమిళనాడు ప్రజల ఆకాంక్షలను గవర్నర్ అవమానిస్తున్నారు.లోక్భవన్ కాదు.. అసెంబ్లీలో మెజార్టీ నిరూపించుకోవాలి.ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్ను ఆహ్వానించాలి. తమిళనాడు చర్రితలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ రాలేదు. தமிழ்நாடு சட்டமன்றத் தேர்தலில் தனித்து ஆட்சியமைக்கும் அதிகாரத்தை மக்கள் எந்தக் கட்சிக்கும் வழங்கவில்லை. இந்த முடிவு தமிழ்நாட்டு வரலாற்றில் முன்னெப்போதும் நிகழாதது. என் சகோதரர் திரு. @mkstalin அவர்கள் ‘மக்கள் தீர்ப்பை மதிக்கிறோம்; பொறுப்பான எதிர்க்கட்சியாகச் செயல்படுவோம்’ என்று…— Kamal Haasan (@ikamalhaasan) May 7, 2026విజయ్కు గవర్నర్ గ్రీన్ సిగ్నల్40 నిమిషాల భేటీ తర్వాత కీలక పరిణామంటీవీకేను ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించేందుకు గవర్నర్ సానుకూలంగా స్పందనముగిసిన భేటీ.. లోక్భవన్లో గవర్నర్తో ముగిసిన విజయ్ భేటీ.24 గంటల్లో రెండోసారి గవర్నర్ను కలిసిన విజయ్.కాంగ్రెస్ పార్టీ మద్దతు లేఖ, మంత్రుల జాబితాను గవర్నర్కు ఇచ్చిన విజయ్.ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని గవర్నర్ను కోరిన విజయ్.అసెంబ్లీలో బల నిరూపణ చేసుకుంటామన్న విజయ్.113 మంది ఎమ్మెల్యే జాబితాను సమర్పించిన విజయ్.కాసేపట్లో గవర్నర్ను కలవనున్న అన్నాడీఎంకే పళనిస్వామి. పళనిస్వామికి టెన్షన్!విజయ్కు మద్దతుగా నిలవాలని పళనిస్వామిపై అన్నాడీఎంకే ఎమ్మెల్యేల ఒత్తిడి.ఈపీఎస్ ఒప్పుకోకుంటే టీవీకేకి మద్దతు పలికే ఆలోచనలో 25 మందికిపైగా అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు.25 నుంచి 28 మంది ఎమ్మెల్యేలతో టీవీకే నేతలు వేలుమణి, షణ్ముగం సంప్రదింపులు.పుదుచ్చేరి రిసార్టులో 25 మందికిపైగా అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు.విజయ్ పార్టీకి మద్దతు తెలిపిన ఇద్దరు వీసీకే ఎమ్మెల్యేలు. లోక్భవన్లో గవర్నర్తో విజయ్ సమావేశం..ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని గవర్నర్ను కోరిన విజయ్.అసెంబ్లీలో బల నిరూపణ చేసుకుంటామన్న విజయ్అతిపెద్ద పార్టీ కనుక ముందుగా తనకే అవకాశం ఇవ్వాలని కోరిన విజయ్.కాంగ్రెస్ పార్టీ మద్దతు లేఖ, మంత్రుల జాబితాను గవర్నర్కు ఇచ్చిన విజయ్.ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన సంఖ్యా బలం ఉంది: విజయ్ తమిళనాడులో ట్విస్ట్ల మీద ట్విస్టులుగవర్నర్ ఆర్లేకర్ అపాయింట్మెంట్ కోరిన అన్నాడీఎంకే పళనిస్వామివిజయ్ భేటీ అనంతరం గవర్నర్ను కలవనున్న పళనిస్వామి.మధ్యాహ్నం 12 గంటలకు గవర్నర్తో పళనిస్వామి భేటీ. గవర్నర్తో పళనిస్వామి సమావేశంపై పలు రకాల ఊహాగానాలుటీవీకే విజయ్కి మద్దతు ఇవ్వాలని పుదుచ్చేరిలో 25 మంది ఎమ్మెల్యేల క్యాంపుతాజా పరిణామాల నేపథ్యంలో టీవీకేకు అన్నాడీఎంకే మద్దతు ఇచ్చే ఛాన్స్అన్నాడీఎంకే మద్దతిస్తే సునాయాసంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్న విజయ్గవర్నర్, విజయ్ భేటీపై సర్వత్ర ఉత్కంఠ👉గవర్నర్ను కలిసిన విజయ్👉లోక్భవన్లో గవర్నర్తో విజయ్ భేటీ. ప్రజల అండ విజయ్కు ఉంది: ప్రకాశ్రాజ్తమిళనాడు రాజకీయాలపై స్పందించిన ప్రకాశ్రాజ్ప్రభుత్వ ఏర్పాటుపై అనిశ్చితి కొనసాగుతోన్న వేళ ప్రకాశ్రాజ్ పోస్ట్విజయ్కు ప్రజామోదం ఉందంటూ వ్యాఖ్యలు.ప్రజలు అండగా ఉన్నారని కితాబు. గవర్నర్ ప్రవర్తన అత్యంత అభ్యంతరకరం, ఆమోదయోగ్యం కానిది మరియు రాజ్యాంగ విరుద్ధమైనది.మన మధ్య అభిప్రాయ భేదాలు ఉండవచ్చు..కానీ విజయం ప్రజల తీర్పు ద్వారా లభించింది.సభలో తన హక్కును నిరూపించుకునే అవకాశం అతనికి కల్పించాలి.This Governor s behaviour is Disgusting .. unacceptable and unconstitutional. We may have differences … but Vijay has got the mandate . He should be allowed to claim his right on the floor of the house. #justasking https://t.co/T72CVedXhJ— Prakash Raj (@prakashraaj) May 7, 2026క్షణక్షణం.. ఉత్కంఠ.. 👉లోక్భవన్కు బయలుదేరిన విజయ్👉కాసేపట్లో గవర్నర్తో కీలక భేటీ. 👉 కేరళ పర్యటన రద్దు చేసుకున్న గవర్నర్ ఆర్లేకర్. విజయ్ కాన్వాయ్ వద్దన్నారు: టీవీకే ప్రమాణ స్వీకారం చేసేంత వరకు విజయ్ కాన్వాయ్ వద్దన్నారు: టీవీకే అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ప్రొటోకాల్ ప్రకారం ఆయనకు కాన్వాయ్ కేటాయించినట్లు వెల్లడించిన అధికారులుసుప్రీంకోర్టుకు విజయ్కాసేపట్లో గవర్నర్తో విజయ్ భేటీతమిళ రాజకీయంపై ఉత్కంఠకాసేపట్లో లోక్భవన్కు విజయ్.ఉదయం 11 గంటలకు గవర్నర్ ఆర్లేకర్తో భేటీ కానున్న విజయ్.నిన్న గవర్నర్ను కలిసిన విజయ్118 మంది సంతకాలతో రావాలన్న గవర్నర్అతిపెద్ద పార్టీగా అవతరించినా ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ పిలవలేదనే పాయింట్ మీద కోర్టుకు వెళ్లనున్న టీవీకే.సుప్రీంకోర్టును ఆశ్రయించే ప్రయత్నాల్లో విజయ్ ఉన్నట్టు సమాచారం. అన్నాడీఎంకేలో ఏం జరుగుతోంది? పుదుచ్చేరి రిసార్టులోనే అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు.అన్నాడీఎంకే బలం-47టీవీకే మద్దతు ఇవ్వాలన్ని అన్నాడీఎంకే ఎమ్మెల్యేలను రిసార్ట్లకు తరలింపు.టీవీకేకే మద్దతు ఇవ్వాలంటున్న ఓ వర్గం.టీవీకేకి దూరంగా ఉండాలంటున్న మరో వర్గం.చెన్నైలోనే పళనిస్వామి వర్గం.పుదుచ్చేరిలో షణ్ముగం వర్గం.పుదుచ్చేరి రిసార్టులో దాదాపు 30 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు రిసార్టు నుంచి ఒక్కొక్కొరుగా పార్టీ ఆఫీసుకు వస్తున్న టీవీకే ఎమ్మెల్యేలు. నేడు విజయ్ కీలక సమావేశం.. నేడు టీవీకే ఎమ్మెల్యేలతో విజయ్ సమావేశం.రిసార్టులో ఉన్న ఎమ్మెల్యేలతో విజయ్ కీలక భేటీ.తాజా రాజకీయ పరిణామాలపై చర్చించే అవకాశం. మళ్లీ ఎన్నికలు జరపండి: శ్రీధర్ వేంబుతమిళనాడులో మళ్లీ ఎన్నికలు జరపాలని జోహో వ్యవస్థాపకుడు శ్రీధర్ వేంబు వ్యాఖ్యలు.టీవీకే విజయ్కి ప్రభుత్వ ఏర్పాటు కోసం తగినంత సంఖ్యా బలం లేదు.సంఖ్యలు సరిపోతున్నట్లు కనిపించడం లేదు.ఏ ప్రభుత్వం ఏర్పడినా, అది వివిధ రకాల ఆకర్షణలు, ఒత్తిళ్లతో అస్థిరంగా ఉండే అవకాశం ఉంది.తమిళనాడు ఇంతకంటే మెరుగైన ప్రభుత్వానికి అర్హమైనది.అందుకే రాష్ట్రంలో మళ్లీ ఎన్నికలు నిర్వహించాలి.విజయ్ సూపర్ మెజారిటీతో తిరిగి వస్తారని నేను భావిస్తున్నాను.ఒకవేళ డీఎంకే-అన్నాడీఎంకే దానిని ఆపాలనుకుంటే, వారిద్దరూ కలిసి పోరాడాలి.సున్నా సీట్లు వచ్చినా సరే, బీజేపీ ఒంటరిగా పోరాడాలి.తమిళనాడులో బీజేపీకి ఇది ఒక కొత్త ఆరంభం.ప్రజలే మళ్లీ నిర్ణయించనివ్వండి అంటూ కీలక వ్యాఖ్యలు. The numbers don't seem to add up. Whatever government is cobbled together is likely to be unstable with various pulls and pressures. Tamil Nadu deserves better.President's rule with fresh elections may be the best course, this time with a very strict "no cash for votes"…— Sridhar Vembu (@svembu) May 7, 2026తమిళనాడులో అల్లర్లకు చాన్స్..తమిళనాడులో ఇంటెలిజెన్స్ హెచ్చరికపలు ప్రాంతాల్లో అల్లర్లు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాలకు సమాచారం.దీంతో, పలు జిల్లాల్లో భద్రత కట్టుదిట్టం చేసిన సీఎస్, డీజీపీపొత్తులపై కొత్త ట్విస్ట్.. పొత్తులపై ప్రచారాన్ని ఖండించిన డీఎంకేఅవన్నీ ఫేక్ అంటూ డీఎంకే నేతలు వ్యాఖ్యలు.విజయ్ ప్రభుత్వంలో తమ జోక్యం ఉండదన్న స్టాలిన్మరోవైపు.. విజయ్కు తమ మద్దతు ఇచ్చేది లేదన్న అన్నాడీఎంకే.ప్రభుత్వ ఏర్పాటుకు టీవీకేకు అవసరమైన ఎమ్మెల్యేల మద్దతుపై ఉత్కంఠ.టీవీకేకు మద్దతు ఇచ్చేది లేదని చెబుతున్న లెఫ్ట్ పార్టీలు, అన్నాడీఎంకే.కాంగ్రెస్ మద్దతులో 112కు చేరిన టీవీకే బలంమరో ఆరుగురు ఎమ్మెల్యే కోసం టీవీకే ప్రయత్నాలు. రిసార్ట్ రాజకీయాలు..గత మూడు రోజులుగా మహాబలిపురంలోని రిసార్ట్లో టీవీకే ఎమ్మెల్యేలు.మరోవైపు.. 15 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు కూడా పుదుచ్చేరిలోని రిసార్ట్కు తరలింపు.'ది షోర్ త్రిశ్వం'లో 20కి పైగా గదులను బుక్ చేసుకున్న అన్నాడీఎంకే సీవీ షణ్ముగంPuducherry: AIADMK MLAs have gathered at a private resort in Puducherry amid uncertainty over government formation in Tamil Nadu. With TVK lacking a clear majority and seeking support, political maneuvering is underway. Heavy police security has been deployed to maintain law and… pic.twitter.com/hsUdAsgbSE— IANS (@ians_india) May 6, 2026ట్విస్ట్ ఇచ్చిన గవర్నర్ లోక్భవన్లో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ను టీవీకే నేతలు కలిశారు.విజయ్ వెంట టీవీకే ముఖ్యనేతలు బస్సీ ఎన్ ఆనంద్, ఆధవ్ అర్జున, కేఏ సెంగొట్టయాన్, సీటీ నిర్మల్కుమార్టీవీకే పార్టీలో 108 మంది ఎమ్మెల్యేలున్నా విజయ్ రెండుచోట్ల గెలవడంతో ఆ సంఖ్య 107కు తగ్గింది.వీళ్లకు కాంగ్రెస్లోని ఐదుగురి పేర్లను జతచేసి మొత్తం 112 పేర్ల జాబితాను గవర్నర్కు అందజేత.ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తిఅందుకు గవర్నర్ విముఖత.118 మంది ఎమ్మెల్యేలతో స్పష్టమైన మెజార్టీ వచ్చాక తిరిగి తన వద్దకు రావాలని విజయ్కు గవర్నర్ సూచన.దీంతో నిరాశతో వెనుతిరిగిన విజయ్. రసవత్తరంగా తమిళ రాజకీయం..గంట గంటకూ మారుతున్న తమిళనాడులో రాజకీయ సమీకరణాలుకొత్త ప్రభుత్వం ఏర్పాటుకు కొనసాగుతున్న ఉత్కంఠ..నేడు ఏం జరగబోతోందని అనేది సస్పెన్స్. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆయా పార్టీల బలం ఇలా.. టీవీకే - 108డీఎంకే - 59అన్నాడీఎంకే - 47కాంగ్రెస్ - 05పీఎంకే - 04ఐయూఎమ్ఎల్- 02సీపీఐ - 02సీవీకే - 02సీపీఎం - 02బీజేపీ - 01డీఎండీకే - 01అన్నామక్కల్ మున్నేట్ర కళగం - 01రెండు పార్టీల మంతనాలుతమిళనాట కొత్త ప్రచారం తెరపైకి వచ్చింది.డీఎంకే, అన్నాడీఎంకే తెరవెనుక రహస్యంగా మంతనాలు చేస్తున్నట్లు వార్తలుఈ రెండు పార్టీలు కలిపి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని చూస్తున్నట్లు సమాచారం.డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలుకు 106 సీట్లువామపక్షాలు మిగిలిన చిన్న పార్టీలు కూడా మద్దతు ఇచ్చేందుకు సముఖంగా ఉన్నాయట!దీంతో జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీ లేకుండానే 120 సీట్లతో ప్రభుత్వం ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం. -
తమిళ రాజకీయంలో ఊహించని ట్విస్ట్...
-
మద్దతు ఇస్తాం.. మంత్రి పదవులు కావాలి..
-
బాబొచ్చారు ఓటమి తెచ్చారు
-
ఆ పార్టీలతో విజయ్ పొత్తు ఖరారు.. ఎల్లుండే ప్రమాణ స్వీకారం
-
టీవీకే ఎఫెక్ట్.. అన్నాడీఎంకేలో బిగ్ ట్విస్ట్!
చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే విజయ్.. ప్రభుత్వ ఏర్పాటుకు అడుగులోకి ఉంది. ఎన్నికల్లో 108 స్థానాల్లో విజయం సాధించడంతో టీవీకే మరో 10 మంది బలం కావాల్సి ఉంది. ఈ క్రమంలో పది మంది కోసం టీవీకే కసరత్తు మొదలు పెట్టింది. దీంతో, అన్నాడీఎంకే లుకలుకలు మొదలైనట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. టీవీకేకి మద్దతు విషయంలో అన్నాడీఎంకేలో రెండు వర్గాల మధ్య చిన్నపాటి యుద్ధమే నడుస్తోందనే వార్తలు వినిపిస్తున్నాయి. అన్నాడీఎంకే జనరల్ సెక్రటరీ పళనిస్వామికి పార్టీలో చీలికలు చుక్కలు చూపిస్తున్నాయి. కాగా, ప్రభుత్వ ఏర్పాటు కోసం టీవీకేకు మద్దతు ఇవ్వాలని ఒక వర్గం.. మరో వర్గం ఇవ్వొద్దని వాదించుకుంటున్నట్టు సమాచారం. ఇలాంటి తరుణంలో అన్నాడీఎంకే ఎమ్మెల్యే లీమా రోజ్.. విజయ్ టీవీకేతో చర్చలు సంప్రదింపులు జరుగుతున్నాయని ప్రకటించడం సంచలనంగా మారింది. ఇక, తమిళనాడు ఎన్నికల్లో రిచ్చెస్ట్ అభ్యర్థిగా లాలూగుడి నుంచి లీమా గెలుపొందారు.అయితే, ఎన్డీయే కూటమిలో భాగంగా ఉన్న అన్నాడీఎంకే.. విజయ్కు మద్దతు ఇవ్వడంపై ఉత్కంఠ నెలకొంది. ఈ విషయమై నేడు పళనిస్వామి నేతృత్వంలో అన్నాడీఎంకే కీలక సమావేశం జరగనుంది. ప్రస్తుతానికి పళనిస్వామి.. ఎమ్మెల్యేలను చేజారకుండా అప్రమత్తమై ఉన్నారు. అయినప్పటికీ టీవీకేతో 10 మంది అన్నాడీఎంకేలు టచ్లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో, కూటమి నుంచి బయటకు వచ్చి పది మంది.. విజయ్కు మద్దతు ఇస్తారా? అనే చర్చ ఊపందుకుంది. నేడు జరగబోయే సమావేశంలో నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.మరోవైపు.. సీపీ షణ్ముగం ఆఫీసులో 35 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు రహస్యంగా భేటీ అయినట్టు తెలుస్తోంది. దీంతో, వారంతా ఏ నిర్ణయం తీసుకోనున్నారనే సస్పెన్స్ నెలకొంది. ఇదిలా ఉండగా.. అన్నాడీఎంకే మద్దతుపై విజయ్ ఏమాత్రం ఆసక్తిగా లేరనే వార్త కూడా ప్రచారంలో ఉంది. గతంలో జయలలిత టైంలో పలు చేదు అనుభవాలు దృష్ట్యా విజయ్ ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. ఇక, అసెంబ్లీ ఎన్నికల్లో 47 సీట్లతో అన్నాడీఎంకే మూడో స్థానంలో ఉంది. -
30 వేల మెజారిటీతో గెలుపు.. వెంటనే రాజీనామా..!
సాక్షి, చెన్నై: అన్నాడీఎంకేలో సీవీ షణ్ముగం సీనియర్ నేత. ఆయన మంత్రిగా కూడా పనిచేశారు. గత ఎన్నికలలో ఓటమి పాలు కావడంతో పార్టీ వద్ద పట్టుబట్టి మరీ రాజ్యసభ సీటును రాబట్టుకున్నారు. ఈ సారి ఆయన మైలం నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. డీఎంకే, టీవీకే అభ్యర్థులతో సహా 21 మంది సీవీ షణ్ముగంను ఓడించే దిశగా ఇక్కడ పోటీచేశారు.అయితే, గత కొన్నేళ్లుగా సీవీ షణ్ముగం ఇక్కడి ప్రజలతో మమేకం కావడం విజయాన్ని వరించింది. 82,535 ఓట్లను ఆయన రాబట్టుకున్నారు. సుమారు 30 వేల ఓట్లమెజారిటీతో గెలిచిన సీవీ షణ్ముగం రాష్ట్ర రాజకీయాలే తనకు ముఖ్యం అన్న నిర్ణయానికి వచ్చారు. ఎమ్మెల్యేగా ధ్రువీకరణ పత్రం అందుకున్న సీవీ షణ్ముగం అదే చేతితో రాజ్య సభ పదవికి రాజీనామా చేయడం గమనార్హం. -
DMK, AIADMK పట్టిన గతే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు
-
విజయ్ వ్యూహం.. డీఎంకే, అన్నాడీఎంకే విలవిల
టీవీకే అధినేత విజయ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. టీవీకే తరఫున నెగ్గిన ఎమ్మెల్యేలను రిసార్ట్కు తరలించాలని నిర్ణయించారు. ప్రభుత్వ ఏర్పాటు ఆలస్యం అవుతున్నందున ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే.. దీని వెనక మరో వ్యూహం ఉండొచ్చనే చర్చా జోరందుకుంది. తమిళనాడు ఎన్నికల్లో విజయ్ టీవీకే పార్టీ 108 సీట్ల విక్టరీతో సంచలన విజయం నమోదు చేసింది తెలిసిందే. డీఎంకే 59, అన్నాడీఎంకే 47 స్థానాలకు పరిమితం అయ్యాయి. అయితే ప్రభుత్వ ఏర్పాటునకు కావాల్సిన మెజారిటీకి టీవీకే దగ్గర్లోనే ఆగిపోయింది. అయినప్పటికీ తమ పార్టీకి పూర్తి మెజారిటీ ఉందని.. ప్రభుత్వ ఏర్పాటునకు రెండు వారాల గడువు ఇవ్వాలని విజయ్ తమిళనాడు గవర్నర్ను కోరారు. ఆ వెంటనే.. నెగ్గిన వాళ్లందరినీ పార్టీ ప్రధాన కార్యాలయానికి రప్పించిన ఆయన.. అటు నుంచి అటే పూంజేరీలోని ఓ స్టార్ హోటల్కు తరలించాలని నిర్ణయించారు. టీవీకే ప్రభుత్వం ఏర్పాటు అయ్యేదాకా అక్కడే వాళ్లకు బస ఏర్పాటు చేయాలని పార్టీ కీలక నేతలను ఆయన ఆదేశించారు. అయితే..విజయ్ మాస్టర్ ప్లాన్?టీవీకేకు ప్రభుత్వ ఏర్పాటునకు మరో 10 సీట్లు అవసరం. ఇప్పటికే కాంగ్రెస్, వామపక్ష పార్టీలు, ఒకట్రెండు సీట్లు నెగ్గిన పార్టీలు విజయ్ పార్టీతో అధికారంలో భాగమయ్యేందుకు ముందుకు వచ్చాయి. మద్దతు అంశం పరిశీలిస్తామని బహిరంగంగా ప్రకటనలు సైతం చేస్తున్నాయి. అయితే ఆయన ఈ విషయంలో ఆచితూచీ అడుగేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఎవరితో పొత్తు పెట్టుకోవాలనే పూర్తిగా ఆయన నిర్ణయమేనని.. అందులో తమ పాత్ర ఏదీ ఉండబోదని టీవీకే శ్రేణులు చెబుతున్నాయి. ఈ తరుణంలో.. రెండు వారాల గడువు కోరడం వెనుక వేరే ఉద్దేశం ఉండొచ్చన్న విశ్లేషణ నడుస్తోంది. ఈలోపు సమీకరణాలు ఎలాగైనా మారొచ్చని ఆయన లెక్కేస్తున్నట్లు లీకులు అందుతున్నాయి. చిన్న చిన్న పార్టీలతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఎప్పటికైనా రిస్క్ ఉండొచ్చు. అందుకే పెద్ద చేపలకే ఆయన గాలం వేసి ఉంటారనే విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ గ్యాప్లో డీఎంకే లేదంటే అన్నాడీఎంకే నుంచి పలువురు బయటకు వచ్చి విజయ్కు మద్దతు ప్రకటించే అవకాశం లేకపోలేదు(అసలే అన్నాడీఎంకేలో ఆ అసంతృప్తుల సంఖ్య మరీ ఎక్కువగా ఉంది). ఇందుకు అవకాశం ఉండడంతోనే.. డీఎంకే, అన్నాడీఎంకేలు అప్రమత్తం అయ్యాయి. ఇవాళ చెన్నైలో ఆ పార్టీలు కీలక సమావేశాలు పెట్టుకున్నాయి. ఎమ్మెల్యేలంతా చెన్నైకు తరలి రావాలని ఆదేశించాయి. అటు నుంచి అటే వాళ్లను కూడా రిసార్ట్లకు తరలించవచ్చనే చర్చా అక్కడ జోరందుకుంది. మొత్తానికి విజయ్ మాస్టర్ స్ట్రోక్కు తమిళనాట దిగ్గజ పార్టీలు విలవిలలాడిపోతున్నాయి. -
ఊరిస్తున్న సీఎం కుర్చీ.. 108 సీట్లు వచ్చినా.. విజయకి కష్టాలే
-
విజయ్ వెంట ఎవరెవరు? ఆప్షన్స్ ఇవే
-
MGR తర్వాత.. విజయ్ రికార్డ్ TVK విజయ దుందుభి
-
విజయకి జేజేలు అయ్య.. అమ్మ.. అన్న
-
TVK సంచలనం. 50 ఏళ్ల పార్టీలను మట్టి కరిపించిన విజయ్
-
హాట్ న్యూస్: ఎన్డీయే కూటమితో విజయ్ పొత్తు!
అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు తేదీ దగ్గర పడుతున్న వేళ.. తమిళనాడు రాజకీయాలు వేడెక్కాయి. డీఎంకే-అన్నాడీఎంకే-టీవీకే పార్టీలు ఇవాళ వరుస మీటింగ్లు పెట్టుకున్నాయి. అయితే ఎగ్జిట్ పోల్స్ ఫలితాల తర్వాత సమీకరణాలు మారుతున్నాయనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మొన్నటిదాకా బీజేపీని సైద్ధాంతిక శత్రువుగా అభివర్ణించిన టీవీకే అధినేత విజయ్.. ఇప్పుడు అదే ఎన్డీయే కూటమితో పొత్తుకు చేయి చాస్తాడా? అనే చర్చ జోరుందుకుంది. తమిళనాడులో డీఎంకే పార్టీదే మళ్లీ అధికారమని ఎగ్జిట్ పోల్స్లో ఎక్కువ సర్వేలు తేల్చి చెప్పాయి. ఒకటి రెండు మాత్రం అన్నాడీఎంకేకు అధికారం దక్కవచ్చని చెప్పాయి. యాక్సిస్ మై ఇండియా సర్వే మాత్రం టీవీకే ప్రభంజనం తప్పదని.. ఆ పార్టీ ఏకంగా అధికారం కైవసం చేసుకుంటుందని చెప్పింది. అయితే మిగతా సర్వేలు మాత్రం విజయ్ పార్టీ డబుల్ డిజిట్ను కైవసం చేసుకోవచ్చని అంచనా వేశాయి. ఈ తరుణంలో.. విజయ్ పార్టీలో జోష్ కనబడుతోంది. సర్వేలు అంచనా వేసినట్లు.. నిజంగానే ఫలితాల్లో టీవీకే జోరు కొనసాగుతుందా? అనే చర్చ నడుస్తోంది. ఈ తరుణంలోనే పొత్తుల సమీకరణాలు తెర మీదకు వచ్చినట్లు స్పష్టమవుతోంది. ఎన్డీయే కూటమిలో ఉన్న అన్నాడీఎంకేతో పవర్షేరింగ్ కోసం విజయ్ చేతులు కలపబోతున్నాడన్న వార్త చక్కర్లు కొడుతోంది. ఒకవేళ నిజంగా అదే జరిగితే.. తమిళ రాజకీయాల్లో విజయ్ నిర్ణయం సంచలనమనే చెప్పొచ్చు.వాస్తవానికి ఎన్నికలకు ముందు విజయ్ ఓ స్పష్టమైన ప్రకటన చేశారు. అధికారంలో భాగం కోరుకునే పార్టీలను తాము ఆహ్వానిస్తున్నట్లు ప్రకటించారు. ఆ సమయంలో చిన్నచిన్న పార్టీల నేతలతో పాటు అన్నాడీఎంకేలో అసంతృప్తితో ఉన్న కీలక నేతలు కూడా టీవీకే వైపు మొగ్గు చూపించారు. చివరకు అధిష్టానం జోక్యంతో వాళ్లంతా మెత్తబడ్డారు. మరోవైపు టీవీకే కూడా అన్నాడీఎంకేతో పొత్తు ప్రయత్నాలు ఏనాడూ చేసింది లేదు. అయినప్పటికీ.. బీజేపీ, కాంగ్రెస్లు విజయ్తో పొత్తు కోసం ఉవ్విళ్లూరాయి. సరిగ్గా అదే టైంలో TVK–AIADMK కలిసి పని చేస్తాయంటూ ఓ ప్రచారం ఉధృతంగా జరిగింది. ఇది ఇరు పార్టీల శ్రేణుల్లో గందరగోళానికి దారి తీయడంతో.. అలాంటిదేం ఉండబోదని కీలక నేతలు స్పష్టత ఇచ్చారు. అయితే.. ఇప్పుడు కూడా అలాంటిదేం ఉండబోదని.. ఎగ్జిట్పోల్స్ తర్వాత మీడియా అత్యుత్సాహం, టీఆర్పీ మోజుతోనే కొత్త ఊహాగానాలు తెరపైకి వచ్చి ఉంటాయని విశ్లేషకులు భావిస్తున్నారు. అధికారం కోసం బీజేపీతో పొత్తులో ఉన్న అన్నాడీఎంకేతో విజయ్ పొత్తుకు వెళ్తారా? అనేది ఇప్పటికైతే అనుమానామే. -
విజయ్ తో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అన్నాడీఎంకే వ్యూహం..!
-
తమిళనాడులో భారీగా ఎన్నికల పోలింగ్
తమిళనాడులో నేడు అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ జరుగుతోంది. కట్టుదిట్టమైన పోలీస్ భద్రత నడుమ ఎన్నికల సంఘం నిర్వహిస్తోంది.. -
నేడే తమిళనాడు సమరం
సాక్షి, చెన్నై: వరుసగా రెండోసారి విజయం దక్కించుకోవాలని ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎం.కె. స్టాలిన్... ఐదేళ్ల క్రితం దూరమైన అధికారాన్ని తిరిగి హస్తగతం చేసుకోవడానికి అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి... తొలి పోటీలోనే సత్తా చాటాలని సినీ నటుడు, టీవీకే అధ్యక్షుడు దళపతి విజయ్ తహతహలాడుతున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమరానికి రంగం సిద్ధమయ్యింది. గురువారం రాష్ట్రవ్యాప్తంగా 234 స్థానాల్లో ఒకే విడతలో జరిగే ఓటింగ్లో 5.73 కోట్ల మంది ఓటర్లు 4,023 మంది అభ్యర్థుల తలరాతలను నిర్దేశించబోతున్నారు. ప్రధానంగా డీఎంకే, అన్నాడీఎంకే కూటముల మధ్యే పోటీ నెలకొన్నప్పటికీ విజయ్ నేతృత్వంలోని తమిళగ వేట్రి కళగం(టీవీకే) గణనీయమైన ప్రభావం చూపడం తథ్యమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. విజయ్ పార్టీ ఏ కూటమి ఓట్లను చీలుస్తుంది? లాభపడేది ఎవరన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు ఎన్నికల సర్వేలు స్టాలిన్ పార్టీకి విజయావకాశాలు ఉన్నాయని అంచనా వేయడం గమనార్హం. డీఎంకే–కాంగ్రెస్ కూటమి 40.1 శాతం ఓట్లతో 181 నుంచి 189 స్థానాలు గెల్చుకోనున్నట్లు సర్వేలు తెలిపాయి. అన్నాడీఎంకే–బీజేపీ కూటమి 29 శాతం ఓట్లతో 38 నుంచి 42 సీట్లు సాధిస్తుందని వెల్లడించాయి. విజయ్ పార్టీ టీవీకే 23.9 శాతం ఓట్లతో 8 నుంచి 10 స్థానాలకే పరిమితం అవుతుందని అంచనా వేశాయి. యువ ఓటర్లకు గాలం ఎన్నికల్లో ప్రధాన పార్టీలు యువత ఓట్లపై గురిపెట్టినట్లు స్పష్టమవుతోంది. అధికారంలోకి వస్తే పెద్ద ఎత్తున ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు సృష్టిస్తామని హామీ ఇచ్చాయి. దేశ విదేశాల నుంచి భారీగా పెట్టుబడులు రప్పిస్తామని పేర్కొన్నాయి. తమ ఎన్నికల ప్రణాళికలో ఈ అంశానికి అధిక ప్రాధాన్యం ఇచ్చాయి. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలతోపాటు స్టార్టప్లకు ప్రోత్సాహకాలు ప్రకటించాయి. యువత పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి వీలుగా వడ్డీ లేని రుణాలు అందజేస్తామని వెల్లడించాయి. పరిశ్రమల్లో స్థానికులకు 75 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని అన్నాడీఎంకే హామీ ఇవ్వడం విశేషం. దళపతి విజయ్ యువ ఓటర్లనే నమ్ముకున్నారు. ఆయన సభలకు యువత పోటెత్తారు. విజయ్ అభిమానుల్లో యువత, మహిళలు అధికంగా ఉండడం ఆయనకు అనుకూలాంశంగా మారింది. అధికారంలోకి రాగానే నిరుద్యోగ యువతకు నెలకు రూ.4,000 చొప్పున అందజేస్తామని విజయ్ హామీ ఇవ్వడం ఆకట్టుకుంటోంది. నైపుణ్యాభివృద్ధి, ఉద్యోగాల కల్పనకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తామని ప్రకటించారు. ఇందుకోసం పలు పథకాలు ప్రకటించారు. యువతకు చేరువకావడానికి పార్టీలు తీవ్రంగా ప్రయత్నించాయి. సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం చేశాయి. తొలిసారి ఓటర్లు 14.59 లక్షల మంది అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. చివరి నిమిషంలో రాజకీయ పార్టీలు ఓటర్లను ఎలాంటి ప్రలోభాలకు గురిచేయకుండా అధికారులు నిఘా ముమ్మరం చేశారు. రాష్ట్రంలో మొత్తం 5.73 కోట్ల మంది ఓటర్లు ఉండగా, వీరిలో 2.93 కోట్ల మంది మహిళలు, 2.83 కోట్ల మంది పురుషులు, 7,728 మంది ట్రాన్స్జెండర్లు ఉన్నట్లు తమిళనాడు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ అర్చనా పటా్నయక్ తెలిపారు. 14.59 లక్షల మంది యువ ఓటర్లు తొలిసారిగా ఓటు వేయబోతున్నట్లు చెప్పారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా పోలింగ్ జరుగుతుందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 75,064 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశామన్నారు. ఎన్నికల కోసం 1,06,418 బ్యాలెట్ యూనిట్లు, 75,064 కంట్రోల్ యూనిట్లు, వీవీప్యాట్ యంత్రాలు సిద్ధం చేసినట్లు ప్రకటించారు. ఈవీఎంలలో సాంకేతిక లోపాలు తలెత్తితే ఓటింగ్లో జాప్యం జరగకుండా అదనపు యంత్రాలను సమకూర్చినట్లు వెల్లడించారు. రాష్ట్రంలో 249 మోడల్ పోలింగ్ స్టేషన్లు, పూర్తిగా మహిళలే నిర్వహించే 325 పింక్ స్టేషన్లు, దివ్యాంగులు నిర్వహించే 71 పోలింగ్ స్టేషన్లు, యువత నిర్వహించే 29 పోలింగ్ స్టేషన్లు ఉన్నట్లు చెప్పారు. ఎన్నికల నేపథ్యంలో శాంతి భద్రతలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు స్పష్టంచేశారు. 83,875 మంది స్థానిక పోలీసులతోపాటు 300 కంపెనీల కేంద్ర సాయుధ పోలీసు దళాలను మోహరించినట్లు వివరించారు. ఎన్నికల్లో అక్రమాలను చాలావరకు అరికట్టామని, ఇప్పటిదాకా స్వా«దీనం చేసుకున్న వస్తువుల విలువ రూ.1,262 కోట్లకు చేరిందని, అందులో నగదు, ఇతర సామగ్రి విలువ రూ.543 కోట్లు అని అర్చనాపట్నాయక్ తెలియజేశారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘనలకు సంబంధించి 163 ఎఫ్ఐఆర్లు నమోదైనట్లు పేర్కొన్నారు. విదేశాల నుంచి రాక తమిళనాడు ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకునేందుకు విదేశాల్లో ఉద్యోగాలు చేసుకుంటున్న వారు స్వరాష్ట్రానికి తరలివచ్చారు. గత రెండు రోజుల్లో చెన్నై, కోయంబత్తూరు, తిరుచ్చి విమానాశ్రయాలకు పది వేల మందికి పైగా తరలిరావడం విశేషం. ఓటింగ్ ప్రక్రియను స్వయంగా తిలకించడానికి కొందరు విదేశీయులు సైతం వచ్చారు. -
తమిళ పార్టీలకు చిక్కని ఓటరు నాడి
సాక్షి, చెన్నై: తమిళనాడు రాజకీయాలు మిగతా దేశానికి పూర్తి భిన్నంగా ఉంటాయి. ద్రవిడవాదం తమిళ ప్రజల గుండెల్లో పాతు కుపోయింది. ద్రవిడ మున్నేట్ర కళగం (డీఎంకే), ఆలిండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కళగం (అన్నాడీఎంకే) ఆ నినాదం దన్నుతోనే ఒకరి తర్వాత మరొకరు అధికారంలోకి వస్తున్నారు. దివంగత సీఎంలు అన్నాదురై, కరుణానిధి, ఎంజీఆర్, జయలలిత బాటలోనే ముఖ్యమంత్రి, డీఎంకే చీఫ్ ఎం.కె.స్టాలిన్ కూడా ద్రవిడ సిద్ధాంతమే ప్రధానాస్త్రంగా అధికారాన్ని నిలుపుకునేందుకు సర్వ శక్తులూ ఒడ్డుతున్నారు.స్టాలిన్ మహా మెగా కూటమిజయలలిత మాదిరిగా వరుసగా తమిళనాట రెండోసారి విజయం సాధించిన ముఖ్యమంత్రిగా స్టాలిన్ నిలుస్తారా అన్నది ఈసారి ఆసక్తికరమైన అంశంగా మారింది. ఎన్నికలను ఆయన అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కాంగ్రెస్, డీఎండీకే, సీపీఎం, సీపీఐ, వీసీకే, ఐయూఎంఎల్ వంటి 21 పార్టీలతో మహా మెగా కూటమికి తెర తీశారు. స్టాలిన్తో పాటు డిప్యూటీ సీఎం ఉదయనిధి తదితరులు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. ద్రావిడ మోడల్ 2.0 పాలన నినాదాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, గృహిణులకు రూ.1,000 ప్రోత్సాహం వంటి పథకాలను విజయవంతంగా కొనసాగిస్తున్న వైనాన్ని పదేపదే ప్రస్తావిస్తున్నారు. ఈసారి గెలిపిస్తే రూ.8,000 విలువైన కూపన్లు తదితర హామీలతో మహిళా ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నంలో పడ్డారు. అయితే అన్నాడీఎంకే సారథ్యంలోని ఎన్డీఏ కూటమి కంటే కొత్తగా బరిలో దిగిన సినీ నటుడు జోసెఫ్ విజయ్ డీఎంకేకు గుబులు పుట్టిస్తున్నారు. ఆయన ఎవరి ఓటు బ్యాంకుకు గండి కొడతారో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రజలను ఆకట్టుకోవడానికి అందివచ్చిన ఏ అవకాశాన్నీ స్టాలిన్ వదులుకోవడం లేదు. నియోజకవర్గాల పునర్ వ్యవస్థీకరణను అందివచ్చిన అస్త్రంగా వాడుకునేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. లోక్సభ స్థానాల పెంపులో తమిళనాడుకు బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేయనుందంటూ ఇప్పటికే ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. దీనిపై కేంద్రంతో ఢీ అంటే ఢీ అనడం ద్వారా ప్రధాని మోదీని ఎదుర్కొంటున్న నేతగా నిలిచే ప్రయత్నంలో పడ్డారు. మైనారిటీ ఓట్లు కూడ ఎంతో కొంత గట్టెక్కిస్తాయని డీఎంకే నమ్ముతోంది.అన్నా కూటమి ఆపసోపాలుఅన్నాడీఎంకే నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రధానంగా ప్రభుత్వ వ్యతిరేకతపైనే ఆశలన్నీ పెట్టుకుంది. బీజేపీతో పాటు అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం, అన్బుమణి రాందాసు నేతృత్వంలోని పీఎంకే, జికే వాసన్ సారథ్యంలోని తమిళ మానిల కాంగ్రెస్ తదితర పార్టీలను కలుపుకుని పోరాడుతోంది. డీఎంకే కుటుంబ రాజకీయాలు, అవినీతి, ఆశ్రిత పక్షపాతం, రాష్ట్రంలో పేట్రేగుతున్న హింస తదితరాలను అన్నాడీఎంకే చీఫ్ ఎడప్పాడి పళనిస్వామి ప్రధాన ప్రచారాస్త్రా లుగా మలచుకుంటున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ప్రధాని మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు తమిళనాడులో ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. డీఎంకే మాదిరిగానే అన్నాడీఎంకేకు కూడా విజయ్ పార్టీ గుబులు పట్టుకుంది. ఆయన పార్టీ అంతిమంగా ఎవరి ఓట్లు చీలుస్తోందన్నది ఆసక్తికరంగా మారింది. ఒంటరిగానే బరిలో ఉన్న మరో సినీ నటుడు, దర్శకుడు సీమాన్ నేతృత్వంలో నామ్ తమిళర్ కట్చి కూడా ప్రధాన కూటముల ఓట్లను చీల్చేలా కన్పిస్తోంది. గత లోక్సభ ఎన్నికల్లో ఆ పార్టీ 8 శాతానికి పైగా ఓట్లు సాధించింది. ఈసారి ఏకంగా 116 మంది మహిళలకు, ఒక ట్రాన్స్జెండర్కు కూడా టికెటిచ్చింది! వీరికి తోడు జయలలిత నెచ్చెలి శశికళ పార్టీ కూడా పలు నియోజకవర్గాల్లో బరిలో ఉంది!ఓటరు నాడి ఎటో..!ఈసారి తమిళ ఓటరు నాడి ఎవరికీ అందడం లేదు! ఇప్పటిదాకా జరిగిన సర్వేలు కూడా ఈ విషయంలో ఎటూ తేల్చిచెప్పలేకపో యాయి. కాకపోతే విజయ్ పార్టీ టీవీకే కనీసం 15 నుంచి 30 స్థానాల దాకా గెలుచుకోవచ్చని పలు సర్వేల్లో తేలింది. అయితే టీవీకే ప్రధాన కూటముల్లో దేని ఓటు బ్యాంకుకు గండి కొట్టవచ్చన్నది ఎవరికీ అంతుపట్టడం లేదు.మూడో శక్తిగా విజయ్తొలిసారి ఎన్నికల బరిలోకి దిగుతున్న నటుడు విజయ్ పార్టీ తమిళగ వెట్రి కళగం (టీవీకే) రాష్ట్రంలో మూడో శక్తిగా అవతరిస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది. ప్రజల్లో, ముఖ్యంగా యువతలో విజయ్కి ఉన్న ఆదరణనే టీవీకే నమ్ముకుంది. ఆ ఆదరణ ఏ మేరకు ఓట్ల రూపంలో ప్రతిఫలిస్తుందన్నది ప్రశ్నగా మారింది. దీనికి తోడు విజయ్ని మినహాయిస్తే పార్టీలో పెద్దగా ప్రజాదరణ ఉన్న నేతలంటూ ఎవరూ లేకపోవడం ప్రతికూలాంశంగా కనిపిస్తోంది. టీవీకేతో ఎలాగైనా పొత్తు పెట్టుకోవాలని బీజేపీ ఎంతగా ప్రయత్నించినా చివరికి ఆ పార్టీ అన్ని స్థానాల్లోనూ ఒంటరిగానే పోటీ చేస్తోంది. ఈ ఎన్నికల్లో అధికారం చేజిక్కించుకోలేక పోయినా భవిష్యత్తులో రాష్ట్రంలో ప్రధాన శక్తిగా ఎదగాలన్న భావన టీవీకేలో కనిపిస్తోంది. పార్టీలో జోష్ నింపేందుకు విజయ్ రెండుచోట్ల నుంచి పోటీ చేస్తున్నారు. యువత, మహిళల్లో డీఎంకే, అన్నాడీఎంకే ఓటు బ్యాంకుకు ఈసారి టీవీకే భారీగా గండి కొట్టవచ్చన్న విశ్లేషణలున్నాయి. -
ఎన్టీకే అభ్యర్థిగా ట్రాన్స్జెండర్ రోహిణి
విల్లివాక్కం నియోజకవర్గంలో రాజకీయ సమరం రసవత్తరంగా మారింది. డీఎంకే అభ్యర్థిగా పోటీలో ఉన్న అన్నానగర్ సిట్టింగ్ ఎమ్మెల్యే మోహన్ వారసుడు కార్తీక్ మోహన్కు విల్లివాక్కం ఓటర్లు గెలుపు కిరీటాన్ని అందించేనా అన్న ఎదురు చూపులు పెరిగాయి. అలాగే టీవీకే అభ్యర్థిగా పోటీలో ఉన్న ఆపార్టీ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి ఆధవ్ అర్జునను ఓటర్లు ఆదరించేనా అన్న చర్చ జోరందుకుంది. ఇక, ఈ ఇద్దరి మధ్య తాను సైతం అంటూ అన్నాడీఎంకే అభ్యరి్థ, మాజీ ఎంపీ ఎస్ఆర్ విజయకుమార్ దూసుకెళ్తున్నారు. తమకూ అవకాశం ఇవ్వాలని ఎన్టీకే అభ్యర్థి రోహిణి ఓట్ల వేటలో ఉన్నారు.సాక్షి, చెన్నై : చెన్నై నగరంలో విల్లివాక్కం ఒకప్పుడు దేశంలోనే అతి పెద్ద అసెంబ్లీ స్థానం. ఇక్కడ ఇప్పటి వరకు జరిగిన ఎన్నికలలో డీఎంకే ఐదుసార్లు విజయఢంకా మోగించింది. అన్నాడీఎంకే రెండు సార్లు, సీపీఐ రెండు సార్లు, కాంగ్రెస్, టీఎంసీలు తలా ఓ సారి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. చెన్నై నగరం విస్తరణ పరిధిలో శరవేగంగా దూసుకెళ్తున్న ప్రాంతంగా విల్లివాక్కం ఉంది. ఐసీఎఫ్ గడ్డగా రైల్వే కారి్మకుల ఓటు బ్యాంక్, తెలుగు వారి ఓటు బ్యాంక్ అత్యధికంగా ఉన్న ఈ నియోజకవర్గంలో సమరం రసవత్తరంగా సాగుతోంది. 2011 పునర్విభజన తర్వాత ఈ నియోజకవర్గం రూపురేఖలు మార్చుకుంది. ఈ పరిధిలో ఐసీఎఫ్, తిరుమంగళం, అన్నానగర్(కొంత భాగం), కెల్లీస్, ఐనావరం వంటి నగరంలో అత్యంత ముఖ్యమైనప్రాంతాలు అనేకం ఉన్నాయి. ప్రసిద్ధ రైలు పెట్టెల తయారీ కేంద్రం ఐసీఎఫ్తో పాటుగా సిడ్కో పారిశ్రామక వాడ, కీల్పాకం మానసిక చికిత్సాలయం వంటివి ఆధవ్ను ఆదరించేనా.. విజయ్ తమిళగ వెట్రి కళగం(టీవీకే) ఎన్నికల ప్రచార విభాగం ప్రధాన కార్యదర్శి, పార్టీ డిప్యూటీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆధవ్ అర్జున ఇక్కడ పోటీ చేస్తున్నారు. యువ ఓటర్లను గురి పెట్టడమే కాదు, మహిళా ఓటర్లను ఆకర్షించే విధంగా నియోజకవర్గంలో ఆధవ్ తిష్ట వేశారు. ప్రచారంలో దూసుకెళ్తున్నారు. అదే సమయంలో గతంలో ఇక్కడ అన్నాడీఎంకే తరపున పోటీ చేసి గెలిచిన జేసీడీ ప్రభాకర్కు మద్దతు గణం ఇక్కడ ఉంది. తాజాగా ఆయన టీవీకేలో చేరిన దృష్ట్యా, ఆ మద్దతు తనకు కలివచ్చిందన్న ధీమాతో ఆధవ్ ఉన్నారు. టీవీకే అధినేత విజయ్ పోటీ చేస్తున్న పెరంబూరు తదుపరి ఈ విల్లివాక్కం నియోజకవర్గం ఉండటంతో తమ అధినేత చరిష్మా మరింతగా కలిసి వస్తుందన్న ధీమాతో ఆధవ్ దూసుకెళ్తున్నారు. విజయకుమార్ ఎదురీత అన్నాడీఎంకే అభ్యరి్థగా ఎస్ఎస్ఆర్ విజయకుమార్ పోటీలో ఉన్నారు. ఆయన మాజీ ఎంపీ కూడా, కూటమి బలం, పార్టీకి ఇక్కడ అనాదిగా ఉన్న రెండుకుల గుర్త మద్దతు తనను గట్టెక్కిస్తాయన్న ధీమాతో ఉన్నారు. ప్రచారంలో దూసుకెళ్లడమే కాకుండా, గతంలో ఎంపీగా ఉన్నప్పుడు తాను ఈ పరిసరాలకు చేసిన మంచి పనులను గుర్తు చేస్తూ ముందుకెళ్తున్నారు. ఇక, సీమాన్ నాన్ తమిళర్ కట్చి( ఎన్టీకే ) అభ్యరి్థగా సామాజిక కార్యకర్త, ట్రాన్స్జెండర్ అయిన రోషిణిని బరిలో ఉనర్నారు.సామాజిక మార్పు కోరుకునే ఓటర్లను ఆమె ఆకట్టుకుంటున్నారు.హోరాహోరీ సమరం... విల్లివాక్కం డీఎంకే కంచుకోట. ఈ కూటమిలోని వామపక్షాలకు సైతం ఇక్కడ కారి్మక ఓటు బ్యాంక్ మరీ ఎక్కువే. అయితే ఈసారి సమీకరణాలు ఆసక్తికరంగా ఉన్నాయి. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న వెట్రి అళగన్కు ఈసారి డీఎంకే సీటు ఇవ్వలేదు. అన్నానగర్ సిట్టింగ్ ఎమ్మెల్యే ఎంకే మోహన్ కుమారుడు కార్తీక్ మోహన్ను ఈసారి డీఎంకే రంగంలోకి దించింది. అధికార డీఎంకే కూటమి బలం, పటిష్ట ఓటు బ్యాంక్ గెలుపు కిరీటాన్ని కార్తీక్ ఓటర్లకు అప్పగించే అవకాశాలు ఎక్కువే. అదే సమయంలో ఆయన స్థానికేతరుడు అన్న ముద్ర ఉండటం సవాలుగా మారింది. యువకుడైన కార్తీక్ను గెలిపించేందుకు ఓ వైపు ఆయన తండ్రి మోహన్, మంత్రి శేఖర్బాబుతో పాటూ చెన్నై మేయర్ ఆర్ ప్రియ ఉరకలు తీస్తున్నారు. ఇక, కార్తీక్ కోసం స్వయంగా సీఎం స్టాలిన్ అల్లుడైన శబరీషన్ సైతం రంగంలోకి దిగి వ్యూహాలకు పదును పెట్టడం గమనార్హం.ఓటరు ఎటో ఈ నియోజకవర పరిధిలోనే ఉన్నాయి. ఇక్కడ 76947 పురుçషులు, 82785 మహిళలు, 32 మంది ఇతరులు ఓటర్లుగా ఉన్నారు. మొత్తం ఓటర్ల సంఖ్య 1,59,765గా ఉంది. వన్నియర్, నాయుడు , ఆది ద్రావిడ సామాజిక వర్గాల ఓట్లు కూడా ఇక్కడ కీలకం. వీరితో పాటు ముదలియార్ , నాడార్ ఓట్లు కూడా గెలుపోటములను ప్రభావితం చేస్తాయి. డీఎంకే వారసత్వ రాజకీయాల పై వ్యతిరేకత అన్నది ఇక్కడ పనిచేస్తుందా లేక సంక్షేమ పథకాలు కాపాడుతాయా?, అన్నాడీఎంకే పూర్వ వైభవాన్ని తెచ్చుకుంటుందా? లేక విజయ్ పార్టీ ’విజిల్’ కొత్త చరిత్ర సృష్టిస్తుందా? అన్నది ఫలితాల వరకు వేచి చూడాల్సిందే. -
బీజేపీకి ఝలక్.. ఎన్నికల వేళ ట్విస్ట్ ఇచ్చిన అన్నామలై!
చెన్నై: తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీకి కొత్త తలనొప్పులు ఎదురవుతున్నాయి. అన్నాడీఎంకేతో సీట్లు సర్దుబాటు విషయమై రాష్ట్ర బీజేపీ మాజీ సారథి కె.అన్నామలై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇందుకు నిరసనగా ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని ఆయన నిర్ణయించుకున్నట్టు వార్తలొస్తున్నాయి.ఈ మేరకు కేంద్ర నాయకత్వానికి అన్నామలై ఇప్పటికే లేఖ కూడా రాశారు. బీజేపీ సులువుగా గెలవగలిగే కినతుకడవు వంటి స్థానాలను అన్నాడీఎంకే అట్టిపెట్టుకోవడంపై అందులో తీవ్రంగా ఆక్షేపించారు. కినతుకడవు నుంచి బీజేపీ పోటీ చేయకపోవడాన్ని నిరసిస్తూ నియోజకవర్గంలో పలుచోట్ల ఆ పార్టీ శ్రేణులు రెండు రోజులుగా ఆందోళనకు కూడా దిగుతున్నాయి. రాష్ట్రంలో అన్నాడీఎంకే 169, బీజేపీ 27 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. ఎన్డీయేలోని ఇతర భాగస్వాములు పీఎంకేకు 18, ఏఎంఎంకేకు 11 స్థానాలు దక్కాయి. బీఎల్ సంతోష్కు ఝలక్..ఇదిలా ఉండగా.. బీజేపీ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ గురువారం చైన్నెలో నిర్వహించిన సమావేశానికి అన్నామలై గైర్హాజరు కావడం చర్చకు దారి తీసింది. గురువారం బీఎల్ సంతోష్ నేతృత్వంలో బీజేపీరాష్ట్ర కమిటీ ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఇందులో మాజీ అధ్యక్షుడు అన్నామలై పాల్గొన లేదు. తాను ఎన్నికలలో పోటీ చేయడం లేదన్న లేఖను ఆయన పార్టీ అధిష్టానానికి పంపించడం చర్చకు దారి తీసింది. ఆయన కోయంబత్తూరులోని సింగానల్లూరు నియోజకవర్గంలో పోటీ చేయడానికి సిద్ధమై, గత కొంత కాలంగా తన దృష్టిని కేంద్రీకరించారు. అయితే ఆ స్థానాన్ని అన్నాడీఎంకే నుంచి రాబట్టడంలో బీజేపీ నేతలు విఫలమయ్యారు. దీంతో తాను ఎన్నికలలో పోటీ చేయడం లేదని అధిష్టానానికి అన్నామలై లేఖ పంపించడం చర్చకు దారి తీసింది. ఆయన ఎన్నికలలో పోటీ చేయాలని మహిళా నేత, ఎమ్మెల్యే వానతీ శ్రీనివాసన్ పిలుపు నిచ్చినా ఆయన స్పందించక పోవడం గమనార్హం.ఢిల్లీకి అభ్యర్థుల జాబితా27 మంది అభ్యర్థుల ప్రాథమిక జాబితాను సిద్ధం చేసి ఢిల్లీకి పంపించినట్టు సమాచారం. ఇందులో అవినాశి–కేంద్ర మంత్రి ఎల్. మురుగన్, మైలాపూర్– మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, కోయంబత్తూరు నార్త్– ఎమ్మెల్యే వనతి శ్రీనివాసన్, నాగర్కోయిల్– మాజీ కేంద్ర మంత్రి పొన్ రాధాకృష్ణన్, సాత్తూరు– బీజేపీ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్, తళి – అమరప్రసాద్ రెడ్డి, తిరుప్పూర్ సౌత్ – ఎ.పి. మురుగానందం, విలవంకోడ్ – విజయధరణి, మదురై సౌత్–రామ శ్రీనివాసన్, తిరువణ్ణామలై– అశ్వత్థామన్, తంజావూరు– కరుప్పు మురుగానందం, మొడకురిచ్చి –కృతికా శివకుమార్, పుదుక్కోట్టై– రామచంద్రన్..రామనాథపురం– జి.పి.ఎస్. నాగేంద్రన్,రాశిపురం– డాక్టర్ ప్రేమ్ కుమార్,వాసుదేవనల్లూర్ – ఆనందన్ అయ్యాస్వామి, ఆవడి– అశ్విన్, ఊటి– భోజ రాజన్ లేదా ఉమాదేవి, గంధర్వకోట్టై – పురట్చి కవి దాసన్, తిరుపత్తూరు– చోళ పళనిస్వామి, అరంతంగి– కవిత శ్రీకాంత్, రాధాపురం– బాలకృష్ణన్, తిరువారూర్ – శివ, మనమదురై– పొన్పాల గణపతి, తిరుచెందూర్– ఆర్.ఎం. రాధాకృష్ణన్, పద్మనాభపురం– ఎడ్విన్ జోస్,కులచల్– శివకుమార్ పేర్లు ఉన్నాయి. సుమారు 20 మంది కొత్త ముఖాలకు అవకాశం కల్పిస్తూ సిద్ధం చేసిన జాబితాను ఢిల్లీ ఆమోదంతో రెండు రోజులలో ప్రకటించనున్నారు. -
‘మాయ’ఫెస్టోలు!
రాజకీయ పార్టీలు ఎన్నికల సందర్భంగా విడుదల చేసే మానిఫెస్టోలు ఆర్థిక, రాజకీయ, సామాజిక సమసల్యపై వాటి వైఖరిని తేటతెల్లం చేయాలి. ఆ క్రమంలో వాగ్దానాలుంటే ఉండొచ్చు. కానీ చాలా పార్టీలకు గెలుపే లక్ష్యంగా అసంబద్ధమైన, ఆచరణ సాధ్యంకాని హామీలు గుప్పించి ఓటర్లను మాయచేసి అధికారంలోకి రావాలనే యావ తప్ప మరేమీ ఉండటం లేదు. ఈమధ్యే సుప్రీంకోర్టు ఎన్నికల ముందు ఓటర్లను ఆకర్షించటానికి పార్టీలు చేసే వాగ్దానాలపై ఆందోళన వ్యక్తం చేసింది. ఇవి ప్రజాస్వామ్యాన్ని దెబ్బ తీస్తాయన్నది. అయితే రాజ్యాంగ ఉల్లంఘనలు లేనంత కాలమూ వాటిలో జోక్యం చేసుకోవటం సాధ్యం కాదని తెలిపింది. ఈ విషయంలో చట్టం చేయటం ప్రభుత్వాల బాధ్యతేనని తేల్చిచెప్పింది. నిజానికి అతిగా వాగ్దానాలు చేయటం ఎన్నికల రంగంలో ఉండాల్సిన సమానావకాశాలను దెబ్బతీయడం కిందికి వస్తుంది. అన్నా డీఎంకే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల కోసం విడుదల చేసిన మానిఫెస్టో గత రికార్డులను తలదన్నింది. అందులో 2.22 కోట్లమందికి ఉచితంగా రిఫ్రిజిరేటర్లు పంచడం, వ్యవసాయ రుణాల మాఫీ, అన్ని కుటుంబాలకూ ‘కారుణ్య భత్యం’ కింద రూ. 10,000 చొప్పున ఇవ్వటం, మహిళలతో పాటు మగవారికి కూడా ఉచిత బస్సు సౌకర్యం, ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇవ్వటం వగైరాలున్నాయి. అధికార డీఎంకే ఇప్పటికే రెండు దఫాలుగా 1.31 కోట్లమంది మహిళల ఖాతాల్లోకి రూ. 8,000 చొప్పున బదిలీ చేసింది. తిరిగి అధికారంలోకొచ్చాక నెలకు రూ.2000 చొప్పున ఇస్తామని హామీ ఇచ్చింది.జన సంక్షేమాన్ని ఉద్దేశించి చేసే వాగ్దానాలకూ, సహేతుకత లేని ఉచితాలకూ వ్యత్యాసం ఉంటుంది. ఎన్నికల ముందు వాగ్దాన కర్ణులుగా మారడం, తీరా అధికారం రాగానే వాటిని మరిచి, ప్రశ్నించినవారిని బెదిరించటం అలవాటైపోయింది. ఈ ధోరణి ఆంధ్రప్రదేశ్లో గత రెండేళ్లుగా బాహాటంగా కనబడుతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2009 ఎన్నికల్లో ఇంటికొక కలర్ టీవీతో మొదలుపెట్టి చంద్రబాబు ఇచ్చిన హామీలకు లెక్కే లేదు. 2011లో డీఎంకే, అన్నాడీఎంకే పోటాపోటీగా చేసిన వాగ్దానాలు వేలంపాటల్ని తలపించాయి. ఇక 2014లో మరోసారి ఏపీలో చంద్రబాబు మహా వాగ్దాన కర్ణుడి అవతారం ఎత్తారు. ఆ హామీల గురించి అడిగేవారు ఎక్కువవుతుండటంతో అధికారంలోకొచ్చిన కొన్నాళ్లకే మేనిఫెస్టోను కాస్తా పార్టీ వెబ్సైట్ నుంచి తొలగించారు. 2024 ఎన్నికల్లో ఇచ్చిన హామీల గతి ఎలావుందో కనబడుతూనే ఉంది. ఇందుకుభిన్నంగా 2019 ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ మానిఫెస్టో ఆచరణ సాధ్యమైన హామీలనే పొందుపరిచింది. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నవరత్నాల పేరిట ఇచ్చిన హామీల అమలు సంగతి అందరికీ గుర్తుండేలా సెక్రటేరియట్లో ప్రముఖంగా కనబడేలా అమర్చారు. ఫలితంగా 99 శాతం హామీలు నెరవేరాయి. సంక్షేమ రాజ్యంలో పేదవర్గాలకు విద్య, వైద్యం, ఆహారం అందుబాటులో ఉండేలా చూడటం రాజ్యం కర్తవ్యం. అందుకే వాటిని నెరవేరుస్తామంటే ఎవరూ అభ్యంతర పెట్టరు. వీటితోపాటు ఆ వర్గాలు స్వశక్తిపై ఎదిగేందుకు అనువైన పథకాల రూపకల్పన వైపు ప్రభుత్వాలు దృష్టి సారించాలి. కానీ మానిఫెస్టోలంటే వేలం వెర్రిగా మారింది. కలర్ టీవీలు, గ్రైండర్లు ఇస్తామనటం నుంచి ఏకంగా రిఫ్రిజిరేటర్లు ఉచితంగా పంచిపెడ తామనే వరకూ వచ్చింది. గెలిచి అధికారంలోకొచ్చాక ఇవ్వలేకపోతే లేదా ఏవో సాకులు చూపి కొంతమందికే పరిమితం చేస్తే వీటిని న్యాయస్థానాలు ప్రశ్నించజాలవన్న ధైర్యమే పార్టీలకు ఇలాంటి బూటకపు వాగ్దానాలు చేసే సాహసాన్నిస్తోంది.పార్టీలు విడుదల చేసే మానిఫెస్టోలను నమ్మడం ‘న్యాయబద్ధమైన ఆశ’గా పరిగణించలేమనీ, కనుక వాటిని నెరవేర్చాలని ప్రభుత్వాలను ఆదేశించటం సాధ్యం కాదనీ 1995లో ఢిల్లీ హైకోర్టు తీర్పునిచ్చింది. అలాగే 2013లో తమిళనాడుకు చెందిన పౌరుడు దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు తీర్పు వెలువరిస్తూ వాగ్దానాలు చేసి, ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన పార్టీకి మానిఫెస్టో హామీలను అమలు చేయాలంటూ ఆదేశాలివ్వజాల మని తెలిపింది. అయితే ఈ విషయంలో కొన్ని మార్గదర్శకాలు రూపొందించాలని ఎన్నికల సంఘాన్ని కోరింది. అటుతర్వాత అవి రూపొందినా రాజకీయ పక్షాలపై వాటి ప్రభావం శూన్యం. కనుక మోసగాళ్లెవరో, నిజాయితీపరులెవరో... ఎవరు జవాబుదారీ తనంతో ఉంటారో గ్రహించటం ప్రజల కర్తవ్యం. -
పొసగని పొత్తులతోనే పోరాటం
తమిళనాడు శాసనసభకు ఏప్రిల్ 23న ఎన్నికలు జరుగనున్నాయి. కొన్ని దశాబ్దా లుగా రాష్ట్రం ద్విముఖ పోటీలనే చవి చూస్తూ వచ్చింది. ఇపుడు మూడవ గణనీయమైన పార్టీ ప్రవేశంతో ఎన్నికలు ఎంతో ఆసక్తి రేపుతున్నాయి. సినీ నటుడు విజయ్ రాజకీయ బరిలోకి దిగడంతో ఆయనకు విజయావకాశాలు ఎంతవరకు ఉంటాయన్న దానిపై ఎక్కువగా చర్చలు సాగుతున్నాయి. రాజకీయ అనుభవం సంపాదించడానికి కాక, ఏకంగా ముఖ్యమంత్రి పదవిని చేపట్టేందుకే బరిలోకి దిగుతున్నట్లు విజయ్ స్పష్టం చేశారు. విజయ్ నేతృత్వంలోని తమిళిగ వెట్రి కళగం (టీవీకే)ను జాతీయ ప్రజాస్వామిక కూటమి (ఎన్డీయే) లోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించిన అన్నా డీఎంకే ఆయన డిమాండ్లు చూసి ఖంగుతింది. జన నాయకుడు కాగలడా?బీజేపీ 2024 లోక్ సభ ఎన్నికలలో కన్నా మెరుగైన ఫలితాలను కోరుకుంటోంది. అన్నా డీఎంకేతో పొత్తు ఏదో ఒరగబెట్టగలదనే ఆశ బీజేపీకే లేదు. కానీ టీవీకే ఆగమనం ఈ కూటమికి ఇపుడు లేని ఆధి క్యాన్ని తెచ్చిపెట్టగలదు. ఎన్నికల ప్రచార ఖర్చులు రూ. 40 లక్షలు మించకూడదని ఎన్నికల కమిషన్ నిర్దేశిస్తోంది. వాస్తవంలో, రూ. 5 కోట్లు అవసరమవుతాయని అంచనా. టీవీకే అభ్యర్థులలో కొందరికి అంత స్తోమత లేదని ఇటీవల జరిగిన ఆ పార్టీ సమావేశంలో చర్చకు వచ్చినట్లు చెబుతున్నారు. ఫలితంగా, ఏదైనా పెద్ద పార్టీతో పొత్తు పెట్టుకుంటే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తమైంది. కానీ, దాని పైన కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయని అంటున్నారు. విజయ్ గతంలో బీజేపీని తన ‘సైద్ధాంతిక శత్రువు’గా అభివర్ణించారు. హిందుత్వ పార్టీతో పొత్తు పెట్టుకుంటే, క్రైస్తవ, ముస్లిం మైనా రిటీల ఓట్లకు గండిపడవచ్చని ఆయన సందేహిస్తున్నారు. ఆయన అనుయాయుల్లో ఆ రెండు వర్గాలవారే ఎక్కువగా ఉన్నట్లు చెబు తున్నారు. టీవీకే వచ్చి చేరడం పట్ల అన్నా డీఎంకేకు ఎలాంటి అభ్యంతరం లేదు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను అది చీలుస్తుందని దానికి తెలుసు. అయినా టీవీకే తనకు కూడా గ్రహణం పట్టిస్తుందే మోనని అన్నా డీఎంకే లోలోపల ఆందోళన చెందుతోంది. సినిమాలలో మాదిరిగానే ప్రత్యర్థుల దుమ్ము దులిపి ‘జన నాయగన్’ అనిపించుకోవాలని ఆయన ఉవ్విళ్ళూరుతున్నారు. ఎన్ని కల బరిలో నిలిచిన అభ్యర్థి హీరోగా నటించిన సినిమా విడుదల ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించడం అవుతుందా? ఇది ఎన్నికల కమిషన్కు ఎదురవుతున్న ప్రశ్న. రెండు ద్రవిడ కూట ములలో విజయ్ దేనిని దెబ్బతీస్తారనే దానిపైనే దాని జవాబు ఆధారపడి ఉంటుందని గత కొద్ది ఏళ్ళ చరిత్రను పరిశీలిస్తే తెలుస్తుంది. చిత్ర దర్శకుడు సీమాన్ కూడా నామ్ తమిళర్ కట్చి (ఎన్టీకే) పేరుతో ఒక చిన్న తమిళ జాతీయవాద పార్టీని ఇదివరకే ప్రారంభించారు. దాని ఓట్ల శాతం క్రమంగా వృద్ధి చెందుతూ వస్తోంది. విజయ్ రాకతో ఎక్కువ దెబ్బతినేది ఆ పార్టీయేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. యుద్ధం స్టాలిన్తోనే!అభిమానులు దళపతిగా పిలుచుకునే విజయ్ తన విమర్శ నాస్త్రాలన్నింటినీ పాలక డీఎంకే పైన, దాని నాయకుడు, ముఖ్య మంత్రి ఎం.కె. స్టాలిన్ పైన మాత్రమే ఎక్కుపెడుతున్నారు. విజయ్ 2025 సెప్టెంబర్లో కరూర్లో నిర్వహించిన ర్యాలీలో జరిగిన తొక్కిసలాటలో 41 మంది మరణించారు. ఆ ఘటన తర్వాత ఆయన కొద్ది బహిరంగ సభలలోనే పాల్గొన్నారు. కానీ, ఆ తర్వాత, ఏ బహిరంగ సభలో మాట్లాడినా ఆయన ఎన్నికల ‘యుద్ధం’ తనకూ, స్టాలిన్కూ మధ్యనేనని చెబుతూ వస్తున్నారు. పాలకడీఎంకే పాల్పడినట్లు చెబుతున్న అవినీతి, దుష్పరిపాలనను తొల గించగల వ్యక్తిగా విజయ్ తనను తాను చాటుకుంటున్నారు. పెరి యార్, కె. కామరాజ్, సి.ఎన్. అన్నాదురై, ఎమ్జీఆర్ల సిసలైన వారసుడిని తానేనని చెప్పుకుంటున్నారు. ఆయన అన్నా డీఎంకే ప్రస్తావనే తీసుకురావటం లేదు. తన ‘సైద్దాంతిక శత్రువు’ను కూడా విమర్శించడం లేదు. తమిళ నాడు నాయకత్వాన్ని కోరుకుంటున్నా, ఇంతకూ రాష్ట్రానికి సంబంధించి విజయ్ ప్రణాళికలేమిటో స్పష్టం కాలేదు. మీడియా ఇంటర్వ్యూలకు కూడా ఆయన దూరంగాఉంటున్నారు. స్టాలిన్ మాత్రం తన వంతుగా, అభివృద్ధికి సంబంధించి ‘ద్రావిడ నమూనా’ను పరిరక్షించుకునేందుకు సాగుతున్న నిర్ణయా త్మక పోరాటంగా ఈ ఎన్నికలను అభివర్ణిస్తున్నారు. కేంద్రం నుంచి ఒత్తిడులను ఎదుర్కొంటూ కూడా, ‘డబుల్ ఇంజిన్’ సర్కారు ఉన్న రాష్ట్రాలకన్నా తమిళనాడు మెరుగైన పనితీరును కనబరచిందని ఆయన చెబుతున్నారు. అయినా ఆయన దేనినీ తేలికగా తీసు కోవడం లేదు. ఇతర రాష్ట్రాల్లో మాదిరి కాకుండా, తమిళనాడులో ప్రభుత్వ వ్యతిరేకత ప్రతి ఐదేళ్ళ కొకసారి పొడసూపుతూఉంటుంది. జయలలిత నేతృత్వంలోని అన్నా డీఎంకే మాత్రమే గత దశాబ్దంలో ఒకేసారి 2016లో వరుసగా రెండవ విడత విజయాన్ని నమోదు చేసుకోగలిగింది. అన్నా డీఎంకే గురించి విజయ్ ఎలా ప్రస్తావించడం లేదో, అలాగే స్టాలిన్ కూడా విజయ్ పేరును ఎత్తడం లేదు. విజయ్పై ధ్వజమెత్తే పనిని ఆయన పార్టీలోని ఇతరులకు వదిలేశారు. కానీ, కరూర్ తొక్కిసలాట ఘటన తర్వాత కూడా, ఆయన జన సమ్మోహక శక్తి తరగక పోవడంతో డీఎంకే ఆందోళనకు లోనవుతోంది. పైగా, ప్రధాన మిత్రపక్షమైన కాంగ్రెస్తో డీఎంకే సంబంధాలు గత ఎన్నిక లప్పుడున్నంత బలంగా లేవు. సీట్ల పంపంకంపై అవి బాహాటంగానే కీచులాడుకున్నాయి.అన్నా డీఎంకే అంతంతే!ఈ ఎన్నికల్లో అన్నా డీఎంకే పాత్ర కుంచించుకుపోయినట్లుగా కనిపిస్తోంది. దాని కూటమిలో బీజేపీతో పాటు టి.టి.వి. దినకరన్ కూడా ఉన్నారు. జయలలితకు సన్నిహితురాలైన శశికళకు ఆయన మేనల్లుడు. కాగా, శశికళ సొంత కుంపటి ఉండనే ఉంది. ఆమె పార్టీ కొన్ని నియోజకవర్గాల్లో అన్నా డీఎంకేను చికాకు పరచగలదని భావిస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి, అంతో ఇంతో పలుకుబడి కలిగిన ఒ.పన్నీర్ సెల్వం కూడా అన్నా డీఎంకేను వీడి డీఎంకే తీర్థం పుచ్చుకున్నారు. మహారాష్ట్ర, బిహార్ వంటి రాష్ట్రాల్లో కాషాయ పార్టీతో జత కట్టిన ప్రాంతీయ పార్టీలు ఎటువంటి ఫలితాలు సాధించిందీ పార్టీ నాయకుడు ఎళప్పాడి పళనిస్వామి గమనించకపోలేదు. అన్నా డీఎంకే కూటమిలో కెమిస్ట్రీ లోపించిందని తెలుస్తూనే ఉంది. మొత్తం 234 మంది సభ్యులు గల అసెంబ్లీలో 2021 ఎన్నికల్లోడీఎంకే 133 సీట్లు సాధించింది. డీఎంకేను ఎన్డీయే ఓడించలేక పోయినా, మహా అయితే, హంగ్ అసెంబ్లీ ఏర్పడే విధంగా, డీఎంకే కూటమికి చిల్లు పెట్టవచ్చు. ఎన్డీయేతో కలిసో లేదా కలవకుండానో విజయ్ తన వంతు పాత్ర తాను పోషిస్తారు. విజయ్ ‘రాజు కాలేరు. రాజుగా ఎవరినో కూర్చోపెట్టనూ లేరు. ఓట్లను చీలుస్తారంతే’ అని తమిళనాడు బీజేపీ ఎన్నికల ఇన్చార్జ్ పీయూష్ గోయల్ అందుకే వ్యాఖ్యానించినట్లుంది!-వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్-నిరుపమా సుబ్రమణియన్ -
తమిళనాట ఎన్డీఏ డీల్ ఖరారు
చెన్నై: తమిళనాడు అసెంబ్లీకి ఏప్రిల్ 23వ తేదీన జరిగే ఎన్నికలకు ఏఐఏడీఎంకే సారథ్యంలోని ఎన్డీఏ భాగస్వామ్య పార్టీల నడుమ సీట్ల పంపిణీ దాదాపు ఖరారైంది. బీజేపీ సహా భాగస్వామ్య పార్టీలకు 56 సీట్లను కేటాయించేందుకు ఇచ్చేందుకు పళని స్వామి సారథ్యంలోని ఏఐఏడీఎంకే అంగీకరించింది. దీని ప్రకారం..బీజేపీ 27, పట్టాలి మక్కల్ కట్చి (పీఎంకే) 18, ఏఎంఎంకే 11 చోట్ల అభ్యర్థులను పోటీకి దింపనున్నాయి. ఏఐఏడీఎంకే ఎన్ని స్థానాల్లో పోటీ చేసేదీ త్వరలోనే ప్రకటిస్తామని ఆ పార్టీ అధ్యక్షుడు పళనిస్వామి తెలిపారు. మరికొన్ని భాగస్వామ్య పార్టీలతో సంప్రదింపులు జరుగుతున్నాయని ఆయన అన్నారు. సోమవారం ఏఐఏడీఎంకే ప్రధాన కార్యాలయంలో బీజేపీ నేత పీయూష్ గోయల్, పీఎంకే నేత అన్బుమణి రాందాస్, ఏఎంఎంకే చీఫ్ టీటీవీ దినకరన్లతో కలిసి పళనిస్వామి మీడియాతో మాట్లాడారు. సుహృద్భావ వాతావరణంలో చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. తమ పార్టీ ఏఐఏడీఎంకే పోటీ చేసే సీట్ల సంఖ్యపైనా త్వరలో స్పష్టత వస్తుందని చెప్పారు. కేంద్ర మాజీ మంత్రి జీకే వాసన్ సారథ్యంలోని తమిళ మానిల కాంగ్రెస్(మూపనార్), ఇందియ జననాయగ కట్చి(ఐజేకే)లతో సంప్రదింపులు కొనసాగుతున్నాయన్న పళనిస్వామి..ఆయా పార్టీలతో త్వరలోనే ఒప్పందం ఖరారవుతుందని స్పష్టం చేశారు. 234 సీట్లకు గాను తమ కూటమి కనీసం 210 చోట్ల గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. -
ముక్కోణపు పోరు
ఇటు కాంగ్రెస్ తదితర పార్టీలతో కూడిన అధికార డీఎంకే కూటమి. అటు బీజేపీ–అన్నాడీఎంకేల విపక్ష కూటమి. మరోవైపు కొత్తగా దూసుకొచ్చిన సినీ నటుడు విజయ్ సారథ్యంలోని టీవీకే. దాంతో తమిళనాడులో ఈసారి అత్యంత ఆసక్తికరమైన ముక్కోణపు పోరుకు రంగం సిద్ధమైంది. ముఖ్యంగా డీఎంకే అధినేత, సీఎం ఎంకే స్టాలిన్ నాయకత్వ పటిమకు ఈ అసెంబ్లీ ఎన్నికలు అగ్నిపరీక్షగా మారాయి. దశాబ్దాలుగా తనకు ఏ మాత్రమూ కొరుకుడు పడని తమిళ గడ్డపై ఎలాగైనా కాషాయ జెండా పాతాలని బీజేపీ పట్టుదలగా ఉంది. ప్రజల్లో, ముఖ్యంగా యువత, మహిళల విశేషమైన ఆదరణ కచి్చతంగా ఓట్ల రూపంలో ప్రతిఫలిస్తుందని విజయ్ భారీ ఆశలే పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో అన్నా కూటమిని, విజయ్ పార్టీని స్టాలిన్ ఏ మేరకు నిలువరిస్తారన్నది ఆసక్తికరం. మరోసారి అన్ని స్థానాల్లోనూ ఒంటరిగా బరిలో దిగుతున్న సీమన్ సారథ్యంలోని ఎన్టీకే ఎవరి ఓటు బ్యాంకును చీలుస్తుందన్నది కూడా కీలకంగా మారనుంది...డీఎంకే కూటమికి... మోదమో, ఖేదమో! తమిళనాడులో ఈసారి అసెంబ్లీ ఎన్నికల పోరు హోరాహోరీగా సాగనుంది. అన్నాడీఎంకే కూటమితో పాటు కొత్త పార్టీ టీవీకే నుంచి గట్టి పోటీ తప్పదని తేలిపోవడంతో అధికార డీఎంకే సర్వశక్తులూ ఒడ్డుతోంది. సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయన్స్ (ఎస్పీఏ) పేరిట కాంగ్రెస్, వామపక్షాలతో పాటు దాదాపు 20 పార్టీలతో మరోసారి జట్టు కట్టి ఎన్నికల బరిలోకి దిగుతోంది! కాంగ్రెస్, ఎండీఎంకేతో పాటు విజయ్కాంత్ స్థాపించిన డీఎంఎంకేలతో సీట్ల సర్దుబాటు ఇప్పటికే పూర్తయింది. ఎప్పట్లా ద్రవిడ నినాదంతో పాటు ప్రధానంగా సంక్షేమ పథకాలనే స్టాలిన్ పార్టీ నమ్ముకుంటోంది. విద్యార్థులకు ఉచిత అల్పాహారం, మహిళలకు నెలవారీ ఆర్థిక సాయం తదితర పథకాలే తమను ఒడ్డున పడేస్తాయని భావిస్తోంది. దీనికి తోడు తమిళ అస్తిత్వం, రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రధాని నరేంద్ర మోదీతో తలపడుతున్న యోధునిగా స్టాలిన్కు ఉన్న ఇమేజీ కూడా కలిసొస్తుందని ఆశిస్తోంది. ముస్లింలు, మైనారిటీల ఓట్లపైనా ఆశలు పెట్టుకుంది. కాకపోతే ప్రభుత్వ వ్యతిరేకత, మంత్రుల విచ్చలవిడి అవినీతి, రాష్ట్రంలో పెచ్చరిల్లుతున్న నేరాలు, డ్రగ్స్ వంటివి డీఎంకేకు పెద్ద తలనొప్పిగా మారాయి. కుటుంబ రాజకీయాల ముద్ర కూడా ప్రతికూలంగా మారుతుందేమోనన్న భయం డీఎంకేను వెంటాడుతోంది. దీనికి తోడు సీమన్ పార్టీ నామ్ తమిళార్ కట్చి (ఎన్టీకే) కూడా స్టాలిన్ పార్టీకి తలనొప్పిగా మారేలా ఉంది. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్టీకే సీట్లేమీ గెలుచుకోకపోయినా 6 శాతం ఓట్లు సాధించింది. దాని ఓటు షేరు ఈసారి 10 నుంచి 15 శాతానికి పెరగవచ్చని పలు సర్వేలు చెబుతున్నాయి! ఎన్టీకే ప్రధానంగా డీఎంకే ఓటు బ్యాంకుకే గండి కొట్టవచ్చని పరిశీలకులు భావిస్తున్నారు. ఆ అంచనాలే గనక నిజమైతే ముక్కోణపు పోరులో కోలుకోలేని నష్టం తప్పదేమోనని డీఎంకే కలవరపడుతోంది.డీఎంకే కూటమి సానుకూలతలు → భాగస్వాములతో సజావుగా సాగిన పొత్తుల ఖరారు → డీఎంకేకు బూత్ స్థాయి దాకా పటిష్టమైన నిర్మాణం → సంక్షేమ పథకాలు. ముఖ్యంగా మహిళలు, విద్యార్థులు మొదలుకుని గిగ్ వర్కర్ల దాకా నగదు బదిలీ పథకాలు → డీఎంకే వ్యతిరేక ఓట్లను టీవీకే చీల్చనుందన్న సంకేతాలు → మైనారిటీల మద్దతు ప్రతికూలతలు → మంత్రులు, నేతలపై అవినీతి ఆరోపణలు → రాష్ట్రంలో బాగా పెరిగిన నేరాలు → తీవ్రమైన ప్రభుత్వ వ్యతిరేకతఅన్నాడీఎంకే... కష్టాలకు ఎదురీత!జయలలిత మరణానంతరం పదేళ్లుగా ఒక్క ఎన్నికల్లో కూడా గెలుపు ముఖం చూడని అన్నాడీఎంకే ఈసారి కూడా కష్టాలకు ఎదురీదుతోంది. కీలక నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. మాజీ సీఎం ఒ.పన్నీర్సెల్వంతో పాటు పలువురు ఎమ్మెల్యేలు రాజీనామా చేసి డీఎంకే, టీవీకే గూటికి చేరారు. దీనికి తోడు నాయకత్వ లేమి పార్టీని తీవ్రంగా బాధిస్తోంది. అయితే క్షేత్రస్థాయిలో ఇప్పటికీ బలంగానే ఉండటం అన్నాడీఎంకేకు అతి పెద్ద సానుకూలత. దానికి బీజేపీ బలం కూడా తోడవుతోంది. కన్యాకుమారి తదితర జిల్లాలతో పాటు రాష్ట్రంలో పశి్చమ ప్రాంతాల్లో కొన్నేళ్లుగా కాషాయ పార్టీ క్రమంగా పుంజుకుంటూ వస్తోంది. తన క్షేత్రస్థాయి బలానికి బీజేపీ ఆర్థిక వెన్నుదన్ను తోడై మెరుగైన ఫలితాలు సాధిస్తానని అన్నాడీఎంకే నమ్ముతోంది. అయితే విజయ్ పార్టీని కూటమిలోకి తీసుకొచ్చేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు ఆ పార్టీకి రుచించడం లేదు. ఇది అంతిమంగా వాటి మధ్య సామరస్యాన్ని దెబ్బతీసే ఆస్కారం లేకపోలేదు. పైగా బీజేపీ హిందూత్వ ఎజెండా తమిళనాడులో పెద్దగా ఫలించకపోవచ్చని గత అనుభవాలు చాటుతున్నాయి.అంతేగాక బీజేపీకి ఉన్న మైనారిటీ వ్యతిరేక ముద్ర అంతిమంగా కూటమికి చేటు చేయవచ్చన్న అంచనాలూ లేకపోలేదు. పైగా జయలలిత నెచ్చెలి శశికళ పెట్టిన కొత్త పార్టీ కూడా అన్నాడీఎంకే ఓట్లకు ఎంతోకొంత గండి కొట్టవచ్చంటున్నారు. ఇన్ని సవాళ్ల నేపథ్యంలో పార్టీ పునాదులను పదిలంగా కాపాడుకోవడమే ఎడప్పాడి కె.పళనిస్వా మికి పరీక్షగా నిలవనుంది. అయితే కావేరీ డెల్టాలో రైతుల దుస్థితి తదితర సమస్యలపై గళమెత్తడం ద్వారా ప్రజల్లోకి వెళ్తూ ఆయన గట్టిగానే చెమటోడుస్తున్నారు.అన్నాడీఎంకే–బీజేపీ కూటమి సానుకూలతలు → బీజేపీ రూపంలో అపారమైన అర్థ, అంగ బలాలు → అన్నాడీఎంకేకు క్షేత్రస్థాయి దాకా ఉన్న పట్టు → జయలలిత పట్ల ప్రజల్లో చెక్కుచెదరని ఆదరణ ప్రతికూలతలు → నాయకత్వ లేమి → శశికళ సొంత పార్టీతో ఓట్లు చీలే ఆస్కారం → ముఖ్య నేతల వలసలు → బీజేపీపై హిందూత్వ, తమిళ వ్యతిరేక ముద్రవిజయ్ పార్టీ... ఆశల పల్లకీలో! సినీ నటుడు విజయ్ తమిళ రాజకీయాల్లో ఎక్స్ ఫ్యాక్టర్గా దూసుకొచ్చారు. ఆయన స్థాపించిన తమిళగ వెట్రి కళగం పార్టీ డీఎంకే, అన్నాడీఎంకే కూటములకు ఆందోళన కలిగించింది. వాటికి మూడో ప్రత్యామ్నాయంగా కనిపించింది. విజయ్ రోడ్ షోలు, సభలకు జనం విరగబడ్డారు. కానీ వీఎంకే జోరుకు కొన్నాళ్లుగా బ్రేకులు పడుతూ వస్తున్నాయి. గత సెప్టెంబర్లో కరూర్ బహిరంగ సభలో జరిగిన తొక్కిసలాట ఉదంతం విజయ్కి బాగా మైనస్గా మారింది. ఏకంగా 41 మంది కార్యకర్తలు దుర్మరణం పాలైతే వేదిక నుంచి హడావుడిగా నిష్క్రమించారన్న ప్రచారం చేటు చేసింది. కనీసం ఆ తర్వాతైనా చనిపోయిన వారి కుటుంబాలను కలిసేందుకు అయిష్టత వెలిబుచ్చడం విజయ్ ఇమేజీని మసకబార్చింది. తొక్కిసలాటపై ఆయన పలుమార్లు సీబీఐ విచారణకు హాజరు కావాల్సి వచి్చంది. బీజేపీతో పొత్తు దిశగా ఒత్తిడి పెంచేందుకు దీన్ని మోదీ సర్కారు వాడుకుంటోందన్న ప్రచారాన్ని విజయ్ గట్టిగా ఖండించకపోవడం టీవీకేకు మరింత చేటు చేస్తోంది. దీనికి తోడు ఎన్నికలు సమీపించిన తరుణంలో విజయ్తో విడాకులు కోరుతూ ఆయన భార్య కోర్టుకెక్కడం మరో మైనస్గా మారింది. సినీ నటి త్రిషతో ఆయన బంధమే ఇందుకు కారణమన్న ప్రచారం మహిళల్లో ప్రతికూలంగా మారేలా కనిపిస్తోంది. పైపెచ్చు డీఎంకే, అన్నాడీఎంకేలతో పోలిస్తే టీవీకేకు రాష్ట్రవ్యాప్తంగా బలమైన వ్యవస్థాగత నిర్మాణం లేకపోవడం పెద్ద లోటే. ఇప్పటికైతే ఒంటరి పోరుకే విజయ్ పార్టీ మొగ్గుతోంది. అదే జరిగితే డీఎంకే, అన్నాడీఎంకే కూటముల్లో దేని ఓట్లకు టీవీకే గండికొడుతుందన్నది అంతిమ ఫలితాల్లో నిర్ణాయకంగా మారేలా కనిపిస్తోంది.టీవీకే సానుకూలతలు → విజయ్ కరిష్మా. యువత, మహిళల్లో భారీ ఫాలోయింగ్ → కొత్త పార్టీ కావడంతో క్లీన్ ఇమేజీ → మూడో ప్రత్యామ్నాయంగా తటస్థ ఓటర్లను ఆకట్టుకునే అవకాశం ప్రతికూలతలు → బలహీనమైన వ్యవస్థాగత నిర్మాణం → ఆదరణను ఓట్లుగా మలిచే యంత్రాంగం లేకపోవడం → నాయకుల లేమి, అనుభవ రాహిత్యం → విజయ్ విడాకుల కేసు, ఆయనపై సీబీఐ విచారణ -
నాకు నయనతార కావాలి.. ఎంపీ షాకింగ్ కామెంట్స్
తమిళనాడులో ఎన్నికల సంగతేమో గానీ పలువురు అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులు.. స్టార్ హీరోయిన్లని అవసరంగా రాజకీయాల్లోకి లాగుతున్నారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. కొన్నిరోజుల క్రితం నైనర్ నాగేంద్రన్ అనే నాయకుడు.. విజయ్ని విమర్శిస్తూ, ముందు నువ్వు త్రిష ఇంటి నుంచి బయటకు రావాలి అని అనేశాడు. తర్వాత త్రిష సీరియస్ కావడంతో సదరు నాయకుడు క్షమాపణ చెప్పాడు. ఇప్పుడు ఏకంగా ఓ ఎంపీ.. నయనతారని ఉద్దేశిస్తూ చీప్ కామెంట్స్ చేశారు.(ఇదీ చదవండి: చిరంజీవితో సినిమా.. హరీశ్ శంకర్ ఆశ పెద్దదే!)మహిళల భద్రత, గౌరవం కోసం అన్నాడీఎంకే(AIADMK) పార్టీ.. మంగళవారం చెన్నైలో నిరసన ప్రదర్శన నిర్వహించింది. ఇందులోనే ఆ పార్టీకి చెందిన ఎంపీ సీవీ షణ్ముగం చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తమిళనాడు అంతటా పెను దుమారాన్ని రేపుతున్నాయి. హీరోయిన్ నయనతారని ఉద్దేశిస్తూ అసభ్యకర రీతిలో మాట్లాడేసరికి విమర్శలు గట్టిగానే వస్తున్నాయి.అసలు విషయానికొస్తే.. కొన్నిరోజుల క్రితం తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, ప్రజలని ఉద్దేశిస్తూ మాట్లాడారు. తమ కలలని పంచుకోవాలని, వాటిని ప్రభుత్వం నెరవేర్చేందుకు కృషి చేస్తుందని పిలుపునిచ్చారు. వీటి గురించి మాట్లాడిన అన్నాడీఎంకే ఎంపీ షణ్ముగం.. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలం, నయనతార పేర్లని ప్రస్తావిస్తూ అసభ్యకర కామెంట్స్ చేశారు.'అబ్దుల్ కలాం గారు మనల్ని కలలు కనమన్నారు. స్టాలిన్ కూడా తనతో కలలు పంచుకోమంటున్నారు. ఒకవేళ నాకు నయనతార కావాలని కల వస్తే.. నా కోరికని స్టాలిన్ తీరుస్తారా? ఎవరైనా వెళ్లి నయనతారతో తమకు పెళ్లి చేయమని అడిగితే.. ఆ కల కూడా నెరవేరుస్తారా?' అని ఎంపీ అన్నారు. అయితే ఈయన ఇలా మాట్లాడుతున్నప్పుడు పక్కనే నిలుచుని ఉన్న పార్టీ నేతలు.. వారించాల్సింది పోయి, నవ్వుతుండేసరికి విమర్శలు గట్టిగా వస్తున్నాయి. మరి ఈ వివాదం ఎంత దూరం వెళ్తుందో చూడాలి?(ఇదీ చదవండి: త్వరలోనే విజయ్తో పెళ్లి.. ఇలా హింట్ ఇచ్చిన త్రిష తల్లి!)‘எனக்கு நயன்தாரா வேண்டும்’சி.வி.சண்முகம் அநாகரீக பேச்சு#ADMK #CVShanmugam #SPARK pic.twitter.com/dFBcCXmGjj— Spark+ (@SparkPluz_) March 17, 2026 -
విజయ్ వైపు.. ఆ ముగ్గురి చూపు
సాక్షి, చెన్నై: తమిళనాడులో డీఎంకే, అన్నాడీఎంకే కూటముల్లో చేరే పార్టీల జాబితా దాదాపుగా ఖరారైంది. అయితే టీవీకే అధినేత విజయ్ ఇచ్చిన పిలుపునకు ఎట్టకేలకు ముగ్గురు స్పందించారు. ఈ ముగ్గురి విజయ్తో కలిసి మెగా కూటమి దిశగా కసరత్తులలో ఉన్నట్టు సమాచారాలు వెలువడ్డాయి. డీఎంకే మెగా కూటమి అధికారికంగా ఖరారు కావాల్సి ఉంది. ఇందులో ఏఏ పారీ్టలు ఉన్నాయో దాదాపుగా క్లారిటీ వచ్చినట్లే. ఇక, అన్నాడీఎంకే– బీజేపీ కూటమిలోనూ అదే పరిస్థితి. కాగా సంకీర్ణ ధర్మం మేరకు పాలనలోనూ భాగస్వామ్యం అన్న నినాదంతో తనతో కలిసి వచ్చేవారికి అధికారంలో వాటా ఇస్తానన్న విజయ్ వైపుగా ఇంత వరకు ఎవ్వరూ దృష్టి పెట్ట లేదు. చివరకు ఒంటరిగానైనా ఎన్నికలను ఎదుర్కొనేందుకు సన్నద్ధమయ్యారు. ఈ పరిణామాల నేపథ్యంలో విజయ్కు మరింత బలాన్ని ఇచ్చేందుకు పీఎంకే వ్యవస్థాపకుడు రాందాస్ ఓ వైపు ,దివంగత సీఎం జె. జయలలిత నెచ్చెలి శశికళ మరోవైపు సన్నద్ధమవుతున్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. అన్బుమణి పీఎంకే అన్నాడీఎంకే కూటమిలో చేరిన దృష్ట్యా, డీఎంకేలో తమకు అవకాశం లేక పోవడంతో ఇక విజయ్ పక్షాన నిలబడేందుకు రాజకీయ అనుభవజు్ఞడైన రాందాసు నిర్ణయించి, అందుకు సంబంధించిన సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలిసింది. అదే సమయంలో రాజకీయ పార్టీ ఏర్పాటు ప్రకటన చేసిన దివంగత సీఎం జయలలిత నెచ్చెలి చిన్నమ్మ శశికళ సైతం రాందాసు పిలుపునకు స్పందించినట్టు ప్రచారం. రహస్యంగా చర్చలు.. ఈ ప్రచారానికి అద్దం పట్టే విధంగా ఆమె మంగళవారం రాత్రి తైలాపురంలో రాందాసుతో భేటీ కావడం ప్రాధాన్యతకు దారి తీసినట్లయ్యింది. తనకు వెన్నుపోటు పొడిచిన పళణిస్వామి, టీటీవీ దినకరన్కు గట్టిగా బుద్ది చెప్పే రీతిలో అన్నాడీఎంకే కేడర్ను విజయ్ వైపుగా మళ్లించే దిశగా చిన్నమ్మవ్యూహాలకు పదును పెట్టనున్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. వన్నియర్ సామాజిక వర్గం ఓటు బ్యాంక్, ముక్కళత్తోర్ సామాజిక వర్గం ఓటు బ్యాంక్ను విజయ్ వైపుగా మళ్లించే దిశగా ఆయనకు దన్నుగా నిలబడేందుకు సన్నద్ధమవుతున్నట్టు చర్చలు జోరందుకున్నాయి. అదే సమయంలో దక్షిణ తమిళనాడులో వెనుకబడిన సామాజిక వర్గం ఓటు బ్యాంక్ను కలిగిన పుదియ తమిళగం నేత కృష్ణస్వామి సైతం విజయ్కు దన్నుగా నిలబడే రీతిలో సిద్ధమైనట్టు ఆయన మద్దతు దారులు పేర్కొంటున్నారు. అయితే సజావుగా వ్యవహారాలన్నీ సాగి, వ్యూహాలు ఫలించిన పక్షంలో విజయ్ నేతృత్వంలోమెగా కూటమి తథ్యమని రాందాసు ,చిన్నమ్మ శశికళ శిబిరంలోని కొందరు నేతలు పేర్కొంటుండటం గమనార్హం. -
డీఎంకేలో చేరిన పన్నీర్ సెల్వం
చెన్నై: అసెంబ్లీ ఎన్నికలకు ముందు తమిళనాడు రాజకీయాల్లో సంచలనాత్మకమైన మార్పులు జరుగుతున్నాయి. మాజీ ముఖ్యమంత్రి, ఏఐఏడీ ఎంకే బహి ష్కృత నేత ఓ.పన్నీర్ సెల్వం (ఓపీఎస్) డీఎంకేలో చేరారు. పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ సమక్షంలో ఆయన డీఎంకే కండువాను కప్పుకొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. డీఎంకేలో చేరడం తన సొంత ఇంటికి వచ్చినట్లుగా ఉందన్నారు. సీఎం స్టాలిన్ అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారని, అన్నాదురై, కరుణానిధి చూపిన దారిలో ప్రతి ఒక్కరినీ కలుపుకొనిపోతూ పార్టీని, ప్రభుత్వాన్ని ఆదర్శంగా నడిపిస్తున్నారని కొనియాడారు. ‘దేశం మొత్తం స్టాలిన్ నాయకత్వాన్ని నిశితంగా గమనిస్తోంది. రాజకీయ పార్టీని ఎలా నడపాలో ఆయన కొత్త వ్యాకరణం నిర్దేశించారు. తమిళనాడు ప్రజలకు సమర్థవంతమైన, గొప్ప ప్రశంసనీయమైన పరి పాలనను అందిస్తున్నారు’అని కొనియాడారు. -
అన్నా డీఎంకేకి బిగ్ షాక్.. డీఎంకే గూటికి పన్నీర్ సెల్వమ్
-
ఇక పురుషులకూ ఉచిత ప్రయాణం
తమిళనాడులో ఎన్నికల వేడి మొదలైంది. ఇతర పార్టీలు ఎన్నికల కోసం కమిటీలు ఏర్పాటు చేస్తుంటే.. ప్రతిపక్ష అన్నాడీఎంకే మాత్రం దూకుడు ప్రదర్శించింది. మొదటి దశ మేనిఫెస్టోను శనివారం ప్రకటించింది. ఎంజీఆర్ జయంతి సందర్భంగా చేసిన ఈ ప్రకటనలో.. తాము అధికారంలోకి వస్తే ఏయే హామీలను నెరవేరుస్తామని వివరించింది. ఇందులో పురుషులకు ఉచిత బస్సు ప్రయాణంతో సహా ఐదు కీలక హామీలు ఉన్నాయి.అన్నాడీఎంకే(AIADMK) జనరల్ సెక్రటరీ పళని స్వామి శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో తొలి దశ మేనిఫెస్టోను ప్రకటించారు. రేషన్ కార్డు ఉన్న కుటుంబాలకు ఆర్థిక సాయం, మగవాళ్లకు ఉచిత బస్సు ప్రయాణం, అమ్మ టూ వీలర్ స్కీమ్ తదితరాలు ఉన్నాయి. వీటి ప్రకారం..👉మహిళల సంక్షేమం కోసం.. కులవిలక్కు స్కీమ్ అమలు చేస్తామని అంటోంది. ఈ పథకం ప్రకారం రేషన్ కార్డు ఉన్న కుటుంబాలకు రూ.2 వేల సాయం అందిస్తారు. ఇవి నేరుగా ఆ ఇంటి మహిళల ఖాతాలో జమ అవుతాయి.👉ఉచిత బస్సు ప్రయాణం.. నగరాల్లోని బస్సుల్లో ప్రస్తుతం మహిళలకు మాత్రమే ఉచిత ప్రయాణం అమలవుతోంది. అధికారంలోకి వస్తే దానిని కొనసాగిస్తూ.. పురుషులకూ వర్తింపజేస్తామని తెలిపింది.👉అమ్మా ఇల్లమ్ స్కీమ్.. గ్రామీణ ప్రాంతాల్లో సొంత ఇల్లు లేని వారికి ప్రభుత్వమే జాగా కొని.. కాంక్రీట్ ఇల్లు కట్టి ఇస్తుంది. అదే పట్టణ ప్రాంతాల్లో అయితే అపార్ట్మెంట్లు నిర్మించి ఉచిత నివాసం అందిస్తుంది. ఇందులోనే దీనామణి ఉప పథకం కింద.. ఎస్సీ కులంలో పిల్లలు పెళ్లిళ్లు చేసుకుని వేరుగా నివసించాలనుకుంటే.. ప్రభుత్వమే ఆ ఇళ్లను నిర్మించి ఇస్తుంది.👉కేంద్రం 100 రోజుల పని దినాలను 125 రోజులకు పెంచిన సంగతి తెలిసిందే. దీనిని 150 రోజులకు పొడిగిస్తామని అన్నాడీఎంకే ప్రకటించింది. 👉అమ్మా.. టూ వీలర్ స్కీమ్ కింద.. మహిళలకు రూ.5 లక్షల లోన్ అందిస్తారు. ఇందులో ప్రభుత్వ సబ్సీడీ రూ.25,000 ఉంటుంది.Chennai, Tamil Nadu: AIADMK General Secretary Edappadi K Palaniswami announces the first phase of the party's election promises1) Women’s Welfare (Kulavilakku Scheme) Under the Kulavilakku Scheme, a monthly financial assistance of Rs 2,000 will be provided to all ration… pic.twitter.com/gvwHa0126I— ANI (@ANI) January 17, 2026రామచంద్రన్ 109వ జయంతి సందర్భంగా ఈ ప్రకటన చేస్తున్నట్లు పళని స్వామి తెలిపారు. అంతకు ముందు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. డీఎంకే పాలనలో మహిళలకు భద్రత లేకుండా పోయిందని.. ప్రజలు స్టాలిన్ సర్కార్పై ఆగ్రహంతో ఉన్నారని రాబోయేది ఎన్డీయే సర్కారేనని ధీమా వ్యక్తం చేశారు. 2023 నుంచి అన్నాడీఎంకే బీజేపీతో మిత్రపక్షంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.అన్నాడీఎంకే మేనిఫెస్టో.. ప్రస్తుత డీఎంకే ప్రభుత్వంలో అమలు అవుతున్న సంక్షేమ పథకాలకు కొనసాగింపుగా ఉందని, మరీ ముఖ్యమగా అమ్మ ఇల్లమ్ స్కీమ్.. కళైంగర్ హౌజింగ్ స్కీమ్ మాదిరే ఉందని తమిళ మీడియా విశ్లేషిస్తోంది. తమిళనాడులో ఏప్రిల్ లేదంటే మే నెలలో జరిగే అవకాశం ఉంది. -
తిరుమలలో రాజకీయ పోస్టర్ కలకలం
-
టీవీకేలో చేరిన సెంగొట్టయన్
చెన్నై: ఏఐఏడీఎంకే బహిష్కృత నేత సెంగొట్టయన్.. సినీ నటుడు విజయ్ స్థాపించిన తమిళిగ వెట్రి కజగం(టీవీకే) పార్టీలో చేశారు. బుధవారం శాసనసభ్యత్వానికి రాజీనామా చేసిన ఆయన, గురువారం టీవీకే అధినేత విజయ్ నేతృత్వంలో ఆ పార్టీలో చేరారు. ఆయనతో ఓ మాజీ ఎంపీతోపాటు, అతని మద్దతు దారులు కూడా చేరారు. పసుపు–ఎరుపు మిశ్రమంతో రంగులతో ఉన్న టీవీకే శాలువాను విజయ్ ఆయనకు కప్పారు. సెంగొట్టయన్కు పార్టీ ఆర్గనైజింగ్ చీఫ్ బాధ్యతలు అప్పగించారు. తరువాత విలేకరులతో మాట్లాడిన సెంగొట్టయన్ తాను రాష్ట్రంలో స్వచ్ఛమైన పాలనను తీసుకురావడానికే టీవీకేలో చేరానని చెప్పారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న డీఎంకే, ఏఐఏడీఎంకే మధ్య ఎలాంటి తేడా లేదని, ప్రజలు పారదర్శకమైన పాలనను కోరుకుంటున్నారని చెప్పారు. మంచి పాలన అందించే నాయకుడిని కోరుకుంటున్నారని, అందుకు విజయ్ సరైన వ్యక్తని సెంగొట్టయన్ అన్నారు. ఆ సమయంలోనూ ఆయన జేబులో ఏఐఏడీఎంకే వ్యవస్థాపకురాలు జయలలిత ఫొటో ఉంది. ఫొటోపై మీడియా ప్రశ్నించగా.. ‘నేను అన్నా డీఎంకేకు విధేయుడిగా ఉన్నాను. 50 ఏళ్లపాటు పార్టీ అభివృద్ధి కోసం కృషి చేశాను. చివరకు నాకు లభించిన బహుమతి పార్టీ నుంచి తొలగించటం. పార్టీని బలోపేతం చేద్దామన్న నా ఆలోచననను సమరి్థంచిన నా మద్దతుదారులు కూడా బహిష్కరణకు గురయ్యారు’అని వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో అత్యంత సీనియరైన ఆయన చేరికతో టీవీకే పార్టీ మరింత బలోపేతం అవుతుందని భావిస్తున్నారు. ముఖ్యంగా ఆయన స్వస్థలం ఈరోడ్ జిల్లాలోని 8 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ బలోపేతం అవుతుందని టీవీకే వర్గాలు భావిస్తున్నాయి. -
అన్నాడీఎంకేకు షాక్.. టీవీకే విజయ్తో ఆ ఎమ్మెల్యే భేటీ
చెన్నై: తమిళనాడులో అన్నాడీఎంకేకు షాక్ తగిలింది. సినీ నటుడు, తమిళగ వెట్రి కళగం(టీవీకే) అధ్యక్షుడు విజయ్తో ఎమ్మెల్యే సెంగొట్టయన్ భేటీ అయ్యారు. కొంతకాలంగా పళనిస్వామితో సెంగొట్టయన్కు విభేదాలు నేపథ్యంలో పార్టీ నుంచి ఎమ్మెల్యేని పళనిస్వామి సస్సెండ్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో సెంగొట్టయన్ త్వరలోనే టీవీకేలోకి చేరతారన్న ఊహాగానాలు మరింత బలపడ్డాయి.జయలలిత మృతి తర్వాత వరుసగా మూడు ఎన్నికల్లో ఓటమి పాలైన ఏఐఏడీఎంకే తిరిగి బలపడాలంటే శశికళ, పన్నీర్ సెల్వం, టి.టి.వి. దినకరన్లను తిరిగి పార్టీలోకి తీసుకోవాలంటూ ఇటీవల సెంగొట్టయ్యన్ బహిరంగంగానే తన వాదనలను వినిపించారు. ఎంజీఆర్ పార్టీని స్థాపించినప్పటి నుంచి ఏఐఏడీఎంకేలో ఉన్న సెంగొట్టయ్యన్.. పార్టీ ప్రచార రూపకల్పన చేసిన కీలక వ్యూహకర్తగా గుర్తింపు పొందారు.జయలిత పర్యటనలు, సభలు, సమావేశాలు, కేడర్ మొబిలైజేషన్ వంటి అంశాలను సమన్వయం చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. టీవీకేలోకి చేరబోతున్నారా? అంటూ మీడియా వేసిన ప్రశ్నకు ‘ఒక రోజు వేచి చూడండి’ అంటూ ఆయన సమాధానం ఇచ్చారు. 2026 ఎన్నికలకు ముందు పార్టీని బలపర్చేందుకు విజయ్, సెంగొట్టయ్యన్కు కీలక పదవి ఇవ్వవచ్చంటూ రాజకీయ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి.సెంగొట్టయన్ ఇటీవల.. పార్టీ బహిష్కృత నేతలు పన్నీరు, సెల్వం, టీటీవీ దినకరన్, దివంగత సీఎం జె. జయలలిత నెచ్చెలి శశికళతో ఆయన భేటీ కావడం చర్చకు దారి తీసింది. దీంతో ఆయన్ని పార్టీ నుంచి తొలగించారు. ప్రాథమిక సభ్యత్వం నుంచి సైతం తొలగిస్తూ ఇక అన్నాడీఎంకే వర్గాలు ఎవ్వరూ ఆయనతో సంప్రదింపు జరకూడదని పళణి స్వామి ఆదేశించారు.అన్నాడీఎంకేలో ఏకాధిపత్యం సాగుతుందని సెంగొట్టయన్ ఇటీవల తీవ్ర విమర్శలు చేశారు. అందరూ సమష్టిగా ముందుకెళ్దామని పిలుపు నిస్తే, పార్టీ పదవి నుంచి తప్పించారని, ఇప్పుడేమో పార్టీ నుంచి తొలగించారని పేర్కొన్నారు. తనను పార్టీ నిబంధనలకు విరుద్ధంగా తొలగించినట్టు స్పష్టం చేశారు. అన్నాడీఎంకే నిబంధనల మేరకు తొలగింపు జరగ లేదని, ఇది చట్ట విరుద్ధం అని వ్యాఖ్యలు చేశారు.అమ్మ జయలలిత మరణం తర్వాత పార్టీని నడిపించాలని చిన్నమ్మ శశికళ తనకు ఆదేశాలు ఇచ్చారని, అయితే పళణి స్వామి పేరును ప్రతిపాదించింది తానే అని వ్యాఖ్యలు చేశారు. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పదవిని పళణి స్వామి చేపట్టినానంతరంపార్టీ కనీసం ఒక్కటంటే ఒక్క ఎన్నికలలోకూడా గెలవ లేదని, అంతా పతనమే అంటూ సెంగొట్టయన్ ధ్వజమెత్తారు. -
విజయ్ మౌనం.. అయోమయంలో టీవీకే, అభిమానులు!
కరూర్ తొక్కిసలాట ఘటన.. తమిళగ వెట్రి కగళం(TVK) పార్టీ భవితవ్యాన్ని గందరగోళంలోకి నెట్టేసింది. అయితే తాము తొణకని కుండలా ఉంటామని టీవీకే చెబుతున్నప్పటికీ.. బీజేపీ తన మైండ్ గేమ్ ప్రారంభించిందనే విశ్లేషణ అక్కడి రాజకీయ నిపుణులు చేస్తున్నారు. అందుకు విజయ్ పాటిస్తున్న మౌనం ప్రధానమైన కారణంగా కనిపిస్తోంది.కరూర్ తొక్కిసలాట ఘటన తర్వాత.. బీజేపీ అధికార డీఎంకేనే టార్గెట్ చేసింది. భద్రత కల్పించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని అంటోంది. అయితే టీవీకే ఆరోపిస్తున్నట్లు కుట్ర కోణాన్ని మాత్రం సమర్థించడం లేదు. ఈ క్రమంలో.. ఆ పార్టీ అగ్రనేత ఒకరు విజయ్కు సంఘీభావం ప్రకటించారని, డీఎంకే గనుక లక్ష్యంగా చేసుకుంటే మద్దతు కూడా ఇస్తామని చెప్పారని తమిళ మీడియా చానెల్స్ మొన్నీమధ్య కథనాలు ఇచ్చాయి. ఆ వెంటనే.. అన్నాడీఎంకే జనరల్ సెక్రటరీ పళనిస్వామి ఓ ఆసక్తికరమైన ప్రకటన చేశారు. ఎన్డీయే కూటమి బలపడే ప్రయత్నాలు మొదలయ్యాయి అంటూ వ్యాఖ్యానించారాయన. ఆ సమయంలో అన్నాడీఎంకే ర్యాలీలో టీవీకే జెండాలు కనిపించడం ఆసక్తికర చర్చకు దారి తీసింది. అయితే.. ఆ ప్రచారాన్ని ఖండిస్తూ అక్టోబర్ 9వ తేదీన టీవీకే ఒక ప్రకటన విడుదల చేసింది. అన్నాడీఎంకే (AIADMK) ర్యాలీల్లో టీవీకే జెండాలు పట్టుకున్నవాళ్లు తమ పార్టీ వాళ్లు కాదని స్పష్టత ఇచ్చింది. కట్ చేస్తే.. తమిళనాడు బీజేపీ ఎమ్మెల్యే వనతి శ్రీనివాసన్ తాజాగా ఓ ప్రకటన చేశారు. రాబోయే రోజుల్లో బలైమన చేరికలతో ఎన్డీయే కూటమి మరింత బలోపేతం కానుందని, అదెవరనేది మీరు ఊహించుకోవచ్చు’’ అంటూ చెబుతూ నవ్వులు చిందించారామె. దీంతో అది విజయ్ అని మళ్లీ చర్చ మొదలైందక్కడ. అయితే.. కరూర్ ఘటన తర్వాత తనకు సంఘీభావం తెలిపిన రాహుల్ గాంధీకి, సదరు బీజేపీ అగ్రనేతకు విజయ్ ధన్యవాదాలు తెలిపారు. గతంలో తాను ఏ కూటమిలో ఉండబోనని, డీఎంకే తమ రాజకీయ ప్రత్యర్థి అని, బీజేపీ సైద్ధాంతిక విరోధి అని విజయ్ విమర్శలు గుప్పించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరి పోరే ఉంటుందని, కలిసొచ్చే పార్టీలను చేర్చుకుని ముందుకు వెళ్తామని స్పష్టత ఇచ్చారాయన.కరూర్ ఘటనపై సుప్రీం కోర్టు తాజాగా సీబీఐ విచారణకు ఆదేశించింది. విచారణ పర్యవేక్షణకు రిటైర్డ్ జడ్జితో సిట్ను సైతం ఏర్పాటు చేసింది. తాము కోరుకున్నట్లే సీబీఐ దర్యాప్తు రావడంతో విజయ్ సంతోషం వ్యక్తం చేశారు. సత్యం గెలుస్తుంది అంటూ ఓ పోస్ట్ కూడా చేశారు. అయితే పొత్తులపై ఉధృతంగా జరుగుతున్న ప్రచారాన్ని మాత్రం ఖండించడం లేదు. దీంతో ఇటు టీవీకే కేడర్, అటు అభిమానులు అయోమయంలో పడిపోయారు. ఎన్డీయే చేరాలనే ప్రచారంపై విజయ్ ఇప్పటిదాకా స్పందించకపోవడంపై టీవీకేలో ఇతర నేతలు అసంతృప్తిగా ఉన్నారనే కథనాలు వస్తున్నాయి. ఈ తరుణంలో.. ఆయన మౌనం తప్పుడు సంకేతాలు పంపే అవకాశం ఉందని.. పరిస్థితి మరింత ముదరక ముందే స్పందించాలని అభిమానులు కోరుకుంటున్నారు. -
తమిళనాట ప్లాన్ ‘బీ’.. కొత్త పొ(ఎ)త్తులు ఫలించేనా?
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ముందస్తు ప్రచారాల్లో.. అక్కడి పార్టీలు తలమునకలై పోయాయి. అయితే కరూర్ తొక్కిసలాట ఘటన తర్వాత ఆ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. అధికార డీఎంకేను కార్నర్ చేస్తూ.. కాంగ్రెస్ మినహా అన్ని పార్టీలు విమర్శలతో విరుచుకుపడుతున్నాయి. ఈ క్రమంలో ప్లాన్ బీపై ఆసక్తికర చర్చ నడుస్తోంది.ఎన్డీయే కూటమిలో(TN NDA Alliance) భాగంగా.. ప్రతిపక్ష అన్నాడీఎంకే బీజేపీతో పొత్తులో ఉంది. అయితే గత కొంతకాలంగా ఆ పార్టీలో అసంతృప్త నేతల సంఖ్య పెరిగిపోతూ వస్తోంది. బహిష్కృత నేత పన్నీర్ సెల్వం ఎన్డీయే నుంచి నిష్క్రమించిన తర్వాత.. మరికొందరు కూడా ఆ బాటలోనే గుడ్బై చెప్పేస్తున్నారు.ఈ క్రమంలో బీజేపీ కొత్తు పొ(ఎ)త్తులకు తెర తీసింది. డీఎంకే వ్యతిరేక ఓట్లను ఏకీకృతం చేయడం లక్ష్యంతో.. ఎన్డీయేను బలపర్చాలని బీజేపీ భావిస్తోంది. ఈ క్రమంలో చిన్న ప్రాంతీయ పార్టీలతో పొత్తులు కుదుర్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందుకు సంబంధించి.. తమిళనాడు బీజేపీ ఎన్నికల ఇన్చార్జ్ జయ్ పాండా, కో-ఇన్చార్జ్ మురళీధర్ మొహోల్ ఇటీవల రాష్ట్ర బీజేపీ నేతలు, అన్నాడీఎంకే నాయకులతో వ్యూహాత్మక చర్చలు జరిపారు.ఇందులో ప్రధానంగా.. విజయ్ టీవీకే పార్టీ(Vijay TVK Party) గురించే చర్చ నడిచినట్లు తెలుస్తోంది. ప్రస్తుత సర్వే సంస్థల అంచనాల ప్రకారం.. టీవీకే పార్టీకి 20% ఓటు షేర్ కలిగి ఉందట. ఇందులో.. 60 శాతం NDA వ్యతిరేక ఓట్లే ఉన్నాయని ఓ అంచనాకి వచ్చింది. ఈ క్రమంలో.. విజయ్ ప్రభావాన్ని ఎదుర్కొనే వ్యూహం అమలు చేస్తోంది. తాజాగా కరూర్ ఘటన తర్వాత టీవీకే అధినేత విజయ్కు బీజేపీ సంఘీభావం ప్రకటించింది. జరిగిన దానికి ప్రభుత్వ బాధ్యత కూడా ఉందని, ఏకపక్షంగా టీవీకేను లక్ష్యంగా చేసుకుంటే తమ మద్దతు ఉంటుందని బీజేపీ అగ్రనేత ఒకరు విజయ్కు హామీ ఇచ్చినట్లు జాతీయ మీడియా సంస్థలు మొన్నీమధ్యే కథనాలు ఇచ్చాయి. ఈ క్రమంలో.. విజయ్ అభిమాన గణాన్ని ఆకర్షించడంతో పాటు మరో ప్రణాళికను బీజేపీ అమలు చేస్తోందన్న విశ్లేషణ తమిళనాట జోరుగా సాగుతోంది. కరూర్ ఘటనకు ముందు దాకా.. ఏ కూటమిలో టీవీకే భాగంకాదని, అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని, అయితే అధికారం కోసం కదిలొచ్చే పార్టీలను స్వాగతిస్తామని టీవీకే అధినేత విజయ్ ప్రకటించారు. దీంతో.. తమిళనాట చిన్నపార్టీలన్నీ టీవీకే వైపు ఒక్కసారిగా తిరిగాయి. ఇది ఇక్కడితోనే ఆగిపోలేదు. మాజీ సీఎం పన్నీర్ సెల్వం, శశికకళ వర్గం, టీవీకే దినకరన్ వర్గం సహా పలు పార్టీలు ఎన్డీయే కూటమి నుంచి బయటకు రావడం.. విజయ్కి మద్దతు ఇచ్చేందుకేనని చర్చా జరిగింది. అంతెందుకు.. ఎన్డీయేలో కీలక భాగస్వామిగా ఉన్న పట్టాలి మక్కల్ కచ్చి(PMK)లోనూ అంతర్గత విభేదాలు తలెత్తి.. ఆ పార్టీ సీనియర్ నేత రామదాస్ తనయుడు ఏ రామదాస్.. టీవీకేలో చేరబోతున్నారనే ప్రచారం జోరుగా సాగింది. నవంబర్ లేదా డిసెంబర్లోపు ఆయా వర్గాలు విజయ్ కూటమికి మద్దతు ఇచ్చే ప్రకటనలు చేస్తాయని దాదాపు ఖరారైంది. అయితే.. ఈలోపు కరూర్ ఘటనతో టీవీకే పార్టీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజకీయ అనిశ్చితి నెలకొన్న సమయంలో విజయ్కు మద్దతు ప్రకటించడం మంచిది కాదనే పునరాలోచనలో ఉన్న ఆ వర్గాలకు బీజేపీ గాలం వేస్తోందని తెలుస్తోంది. తద్వారా ఓట్ల చీలికను నివారించడమే కాకుండా.. ఎన్డీయే కూటమిని బలపర్చుకునే యోచనలో బీజేపీ ఉంది. అయితే.. ఈ విషయంలో అన్నాడీఎంకే నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అయ్యే అవకాశం లేకపోలేదు. బహిష్కృత నేతలను ఎట్టి పరిస్థితుల్లో చేర్చుకునేది లేదని అన్నాడీఎంకే జనరల్ సెక్రటరీ ఈ పళనిస్వామి.. బీజేపీ అగ్రనేత అమిత్ షాతో జరిగిన భేటీలో స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. దీంతో.. వచ్చే నెల నుంచి ప్రారంభం కాబోయే డీఎంకే ప్రభుత్వ వ్యతిరేక ప్రచారంలోపు పళనిని ఒప్పించే బాధ్యతలను ఎన్నికల ఇంచార్జిలకు బీజేపీ అప్పగించినట్లు తమిళ వెబ్సైట్లు కథనాలు ఇస్తున్నాయి.ఇదీ చదవండి: అమిత్ షాపై మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు -
ప్రమాదమా.. కుట్రా?
సాక్షి, చెన్నై: తమిళనాడులోని కరూర్లో తమిళగ వెట్రికళగం (టీవీకే) పార్టీ అధినేత విజయ్ ప్రచార కార్యక్రమంలో చోటుచేసుకున్న తొక్కిసలాట ప్రమాదమా.. లేక ఏదైనా కుట్ర జరిగిందా? అనే అనుమానాలు తీవ్రమవుతున్నాయి. ఈ ఘటనపై సీబీఐ లేదా సిట్ విచారణ కోరుతూ ఆ పార్టీ న్యాయవాద విభాగం మధురై ధర్మాసనంలో పిటిషన్ దాఖలు చేసేందుకు సిద్ధమైంది. తొక్కిసలాట ఘటనతో తమిళనాడు సీఎం స్టాలిన్, డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్తో పాటు పలువురు మంత్రులు రాత్రికి రాత్రే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఏడీజీపీ డేవిడ్సన్ దేవాశీర్వాదంతో పాటు ఐదుగురు ఐజీలు, డీజీఐలు ఘటనా స్థలంలో విచారణను వేగవంతం చేశారు. ఈ ఘటనలో మొత్తం 40 మంది మరణించినట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో 14 మంది పురుషులు, 17 మంది మహిళలు, 9 మంది చిన్నారులు ఉన్నారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని, మరో వంద మందికి పైగా చికిత్స పొందుతున్నట్టు తెలిపింది. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, ప్రతిపక్ష నేత పళణిస్వామితో పాటు డీఎండీకే, బీజేపీ, తదితర పార్టీ ల నేతలంతా కరూర్కు చేరుకుని బాధితులను పరామర్శించారు. ఈ ఘటన ప్రభుత్వ భద్రతా వైఫ్యలమే కారణమని పళనిస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. జనం పెద్దఎత్తున తరలి వస్తున్నారన్న విషయాన్ని గ్రహించడంలో విఫలమయ్యారని మండిపడ్డారు. విజయ్ సైతం ముందస్తు ఏర్పాట్లు పూర్తిస్థాయిలో చేసుకుని ఉండాల్సిందని హితవు పలికారు. కాగా.. ఈ ఘటనపై 24 గంటల్లో నివేదిక సమర్పించాలని తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి డీఎంకే ప్రభుత్వాన్ని ఆదేశించారు. సీబీఐ దర్యాప్తునకు టీవీకే డిమాండ్ కరూర్లో బాధితుల సమాచారం, మరికొందరు వైరల్ చేస్తున్న వీడియోల ఆధారంగా ఈ ఘటన ప్రమాదమా? లేక కుట్ర జరిగిందా..? అన్న అనుమానాలకు దారితీసింది. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ టీవీకే న్యాయవాది విభాగం బృందం చెన్నైలో న్యాయమూర్తి దండపాణిని కలిసి సుమోటోగా కేసు నమోదు చేయాలని కోరారు. ప్రచారంలో రాళ్లు విసిరినట్టు, లాఠీచార్జ్ జరిగినట్టు వైరల్ అవుతున్న వీడియోల ఆధారంగా ఈ ఘటన పథకం ప్రకారం జరిగిన కుట్రగా న్యాయమూర్తికి వివరించారు. కేసును సీబీఐ లేదా సిట్ ద్వారా విచారించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. పిటిషన్ దాఖలు చేస్తే సోమవారం మధ్యాహ్నం విచారణకు స్వీకరిస్తామని న్యాయమూర్తి సూచించగా.. ఆ దిశగా మద్రాసు హైకోర్టు మధురై ధర్మాసనంలో పిటిషన్ దాఖలుకు చర్యలు తీసుకున్నారు. ఈ ఘటనలో మృతి చెందిన కుటుంబాల వారికి రూ.20 లక్షల చొప్పున విజయ్ ఎక్స్గ్రేషియా ప్రకటించారు. గాయపడ్డ వారికి రూ.2 లక్షల చొప్పున ప్రకటించారు. తాను సైతం కరూర్ వెళ్లేందుకు సిద్ధమైనా, పోలీసుల నుంచి అనుమతి రాలేదు. కాగా.. విజయ్ ఇంటివైపు కొన్ని విద్యార్థి సంఘాలు దూసుకెళ్లడంతో ఆ పరిసరాలన్నీ సీఆర్పీఎఫ్ భద్రతా వలయంలోకి తీసుకున్నారు. ఈ ఘటన నేపథ్యంలో విజయ్ ప్రచారాలపై నిషేధం విధించాలని కోరుతూ సెంథిల్ కన్నన్ అనే బాధితుడు హైకోర్టులో పిటిషన్ వేశాడు. ఇదిలావుండగా కరూర్ ఘటనకు బాధ్యులుగా టీవీకే పార్టీ కరూర్ పశ్చిమ జిల్లా కార్యదర్శి మది అళగన్, ప్రధాన కార్యదర్శి భుస్సీ ఆనంద్, సీనియర్ నేత నిర్మల్కుమార్తో పాటు ఇతరులు అని పేర్కొంటూ మొత్తం నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు ఈ ఘటనపై జస్టిస్ అరుణా జగదీశన్ నేతృత్వంలో ఏక సభ్య కమిషన్ విచారణ ప్రారంభించింది. వేలుస్వామిపురంలో పరిశీలన, విచారణ జరిగింది. ఘటన సమయంలో విద్యుత్ సరఫరా ఆపేశారంటూ కొందరు, ఒక్కసారిగా జనం తోసుకొచ్చారంటూ మరికొందరు, అంబులెన్స్లు వరుసగా రావడంతో వాటికి దారి ఇచ్చే సమయంలో తోపులాట జరిగిదంటూ మరికొందరు తెలిపారు. -
అన్నాడీఎంకేలో కలకలం.. రంగంలోకి అమిత్ షా!
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండడంతో తమిళనాట రాజకీయ కార్యకలాపాలు జోరందుకుంటున్నాయి. ఎన్నికల బరిలో దిగేందుకు ప్రధాన రాజకీయ పార్టీలు కసరత్తు ముమ్మరం చేశాయి. అధికార డీఏంకే మరోసారి గెలుపు కోసం ప్రయత్నిస్తుండగా, ప్రతిపక్ష అన్నాడీఎంకే ఎలాగైనా అధికారాన్ని దక్కించుకోవాలని విశ్వప్రయత్నం చేస్తోంది. అగ్ర కథానాయకుడు విజయ్.. తొలిసారిగా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అవుతున్నారు. అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం నాయకుడు టీటీవీ దినకరన్ తన ప్రయత్నాలు తాను చేసుకుంటున్నారు.ఎంకే స్టాలిన్ నాయకత్వంలోని ప్రభుత్వాన్ని ఈ సారి ఎన్నికల్లో ఎలాగైనా ఓడించాలని అన్నాడీఏంకే గట్టిగానే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగా బీజేపీతో జట్టు కట్టింది. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడపాడి కె పళనిస్వామితో (Edappadi K Palaniswami) పాటు బీజేపీ అగ్ర నేతలు ఇప్పటికే ప్రచారం ప్రారంభించారు. కేంద్ర హోంశాఖ మంత్రి, బీజేపీ జాతీయ నాయకుడు అమిత్ షా.. తమిళనాడుకు వరుస పర్యటనలు చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా నవంబర్ నుంచి వరుస పర్యటనలు చేపట్టేలా కసరత్తు జరుగుతోంది.ఇదిలావుంటే పార్టీలో అంతర్గత విభేదాలు అన్నాడీఎంకేకు తల నొప్పిగా మారాయి. పళనిస్వామి వ్యవహారంపై సొంత పార్టీ నాయకులే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మాజీ మంత్రి, సీనియర్ నేత కేఏ సెంగోట్టయన్ (KA Sengottaiyan) పట్ల వ్యవహరించిన తీరును అన్నాడీఎంకే నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయనను పార్టీ పదవుల నుంచి తప్పిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు. పళనిస్వామి ఒంటెత్తు పోకడలతో నియంతలా వ్యవహరిస్తున్నారని విమర్శిస్తున్నారు.అసలేం జరిగింది?పార్టీని వదిలిపెట్టిన వారిని, బహిష్కరించిన వారిని మళ్లీ అక్కున చేర్చుకోవాలని సెంగోట్టయన్ పిలుపు ఇవ్వడంతో అన్నాడీఏంకేలో ఒక్కసారిగా కలకలం రేగింది. పార్టీ అధినేత పళనిస్వామికి సెంగోట్టయన్ వ్యాఖ్యలు ఏమాత్రం రుచించలేదు. దీంతో ఆయనను పార్టీ పదవుల నుంచి తప్పించారు. రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, ఈరోడ్ రూరల్ పశ్చిమ జిల్లా కార్యదర్శి పదవి నుంచి సెంగోట్టయన్ను తీసిపారేశారు. అక్కడితో ఆగకుండా ఆయన మద్దతుదారులపైనా కొరడా ఝళిపించారు. సెంగోట్టయన్ మద్దతురాలైన మాజీ ఎంపీ సత్యభామను పార్టీ పదవుల నుంచి తొలగించారు.పార్టీ మంచి కోరే..పళనిస్వామి నిర్ణయంపై ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అంతా కలిసి సమిష్టిగా పోరాడితే అధికారంలోకి వస్తామన్న ఉద్దేశంతోనే తాను మాట్లాడానని అన్నారు. పార్టీ మంచి కోరే ఐక్యత రాగం అందుకున్నానని, మరో అభిప్రాయం లేదని స్పష్టం చేశారు. ఎటువంటి వివరణ అడకుండానే తనను పార్టీ పదవులకు దూరం చేయడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, సెంగోట్టయన్ వ్యాఖ్యలను బహిష్కృత నేతలతో పాటు బీజేపీ, డీఎండీకే పార్టీలు స్వాగతించగా.. పళనిస్వామి ఫైర్ కావడం చర్చనీయాంశంగా మారింది.ఓపీఎస్ భరోసా!సెంగోట్టయన్కు మాజీ సీఎం పన్నీర్ సెల్వం, టీటీవీ దినకరన్ బాసటగా నిలిచారు. సెంగోట్టయన్కు తన మద్దతు ఉంటుందని, ఆయనను త్వరలో కలుస్తానని పన్నీర్ సెల్వం (Panneerselvam) ప్రకటించారు. జయలలిత ప్రాణ స్నేహితురాలు శశికళ కూడా తెర ముందుకు వస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో అన్నాడీఎంకే అసంతృప్త నాయకులందరూ ఒక వేదికపైకి వచ్చే అవకాశముందన్న వాదనలు విన్పిస్తున్నాయి.చదవండి: డీఎంకేకు నిద్రలేకుండా చేస్తున్న విజయ్!రంగంలోకి అమిత్ షా!అన్నాడీఎంకే పార్టీలో రేగిన దుమారాన్ని కట్టడి చేసేందుకు బీజేపీ అగ్రనేత అమిత్ షా (Amit Shah) రంగంలోకి దిగినట్టు కనబడుతోంది. మంగళవారం సెంగోట్టయన్ను ఢిల్లీకి పిలిపించుకుని ఆయనతో మాట్లాడారు. అమిత్ షాతోపాటు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ అయినట్టు సెంగోట్టయన్ వెల్లడించారు. 2026 అసెంబ్లీ ఎన్నికలకు ముందు పార్టీని బలోపేతం చేయడానికి, బహిష్కృత అన్నాడీఎంకే నేతలను తిరిగి చేర్చుకోవడంపై తన అభిప్రాయాలను వారితో పంచుకున్నానని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో సెంగోట్టయన్ భవిష్యత్ కార్యాచరణపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. -
రాజీ కుదిరింది.. ఎన్డీయే తమిళనాడు సీఎం అభ్యర్థిగా ఆయనే!
తమిళనాడు రాజకీయాల్లో కీలక మలుపు చోటు చేసుకుంది. బీజేపీ మాజీ అధ్యక్షుడు కన్నన్ అన్నామలై, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి తమ మధ్య విబేధాలను పక్కనపెట్టి ఒక్కటయ్యారు. ఇద్దరూ కలిసి ఒకే వేదికపై సందడి చేయడమే కాదు.. సీఎం అభ్యర్థి ఎవరనే విషయంపైనా స్పష్టత ఇచ్చేశారు. గతంలో ఈపీఎస్ మీద అన్నామలై ఏ స్థాయిలో విరుచుకుపడిందో తెలిసిందే. ‘‘పళనిస్వామి ఓ తెలివితక్కువోడు’’.. అంటూ బహిరంగంగానే విమర్శలు గుప్పించారాయన. దీనికి కౌంటర్గా ‘‘అన్నామలై బుద్ధిహీనుడని, ఆస్పత్రిలో చేర్పించాలి’’ అని ఈపీఎస్ వర్గం కౌంటర్ ఇచ్చింది. అప్పటి నుంచి వీళ్లిద్దరి మధ్య వైరం కొనసాగుతూ వచ్చింది. అంతేకాదు.. ఈ ఇద్దరూ ఏ ఎన్డీయే మీటింగ్లోనూ కలిసి మెలిగినట్లు కనిపించేది కూడా కాదు. అలాంటిది.. శనివారం చెన్నైలో జరిగిన జీకే మూపనార్ వర్ధంతి కార్యక్రమంలో ఇద్దరూ ఒకే వేదికపై కనిపించడం రాజకీయ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేసింది. అంతేకాదు.. మాజీ ముఖ్యమంత్రి, ఎన్డీయే తరఫున సీఎం అభ్యర్థి ఎడపాడి పళనిస్వామి ఇప్పుడు మాట్లాడారు అంటూ అన్నామలై తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ‘‘2026లో మార్పు రావాలి, పేదల అభివృద్ధికి ప్రభుత్వం పని చేయాలి. ఎన్డీయే సీఎం అభ్యర్థిగా ఈపీఎస్ ఉన్నారు’’ అని అన్నారు. దీంతో వీళ్ల రాజకీయ ఐక్యతపై చర్చకు దారి తీసింది. పళనిస్వామి (EPS), అన్నామలై మధ్య విభేదాలు తమిళనాడు ఎన్డీయే కూటమిలో రాజకీయంగా గణనీయమైన ప్రభావం చూపించాయి. వ్యక్తిగత విమర్శలతో పాటు అన్నాడీఎంకే అవసరం ఎన్డీయేకు లేదన్నట్లుగా అన్నామలై వ్యవహరించారు. పైగా సీఎం అభ్యర్థిగా ఈపీఎస్ వర్గం చేసిన ప్రకటనను ఖండించారు. ఈ తీరుతో రెండు పార్టీల మధ్య దూరం పెరిగింది. అయితే.. ఈ రాజకీయంతో ఈపీఎస్ వర్గం బలపడగా.. బీజేపీ పరిస్థితి దారుణంగా తయారైంది. 2024 లోక్సభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి ఒక్క సీటు కూడా రాలేదు. దీంతో.. అన్నామలై వైఖరినే మార్చాల్సిన అవసరం బీజేపీకి ఏర్పడింది. అందుకే 2026 అసెంబ్లీ ఎన్నికల కోసం వ్యూహం మార్చి.. ఈపీఎస్ను సీఎం అభ్యర్థిగా ప్రకటించింది. అన్నామలై కూడా పార్టీ నిర్ణయాన్ని గౌరవిస్తూ EPS కు మద్దతు ప్రకటించినట్లు ఆయన మాటల్లోనే తెలుస్తోంది.వీళ్ల కలయికపై ఆదివారం అన్నామలైకి ప్రశ్న ఎదురైంది. దానికి ఆయన స్పందిస్తూ.. ‘‘పార్టీ చెప్పింది, ప్రధాని మోదీ చెప్పారు. అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటే దానిని శిరసావహించడం కేడర్గా నా బాధ్యత. అది అర్థం చేసుకోండి’’ అని అన్నామలై వ్యాఖ్యానించారు. గత విమర్శలపై ప్రశ్నించగా.. వ్యక్తిగత అభిప్రాయాలు వేరే. పార్టీ కేడర్గా క్రమశిక్షణ పాటించాలి కదా. ఉదాహరణకు డీఎంకే మంత్రిపై నాకు ఎంత కోపం ఉన్నా.. వ్యక్తిగతంగా ఆ వ్యక్తిని నేను గౌరవిస్తాను. ఇది అంతే. పార్టీ చెప్పినట్లే అన్నామలై వింటాడు’’ అని ఆయన వివరణ ఇచ్చారు.అన్నామలై 2011 బ్యాచ్కు చెందిన మాజీ IPS అధికారి. కర్ణాటకలో ఆయన పోలీసాధికారిగా సేవలందించారు. 2019లో పోలీస్ ఉద్యోగానికి రాజీనామా చేసి.. 2020లో BJPలో చేరారు. తమిళనాడు BJP అధ్యక్షుడిగా పనిచేసి.. ‘సింగం’గా ప్రజాదరణ పొందారు. అయితే వరుసగా ఎన్నికల్లో పార్టీ సరైన ఫలితాలు రాబట్టకపోవడంతో బీజేపీ అధిష్టానం ఆయన్ని అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించింది.తాజా పరిణామం.. అన్నాడీఎంకే బీజేపీల మధ్య విభేదాలు తొలిగాయనడానికి సంకేతంగా నిలిచింది. 2026 ఎన్నికల కోసం ఈపీఎస్ నాయకత్వంలో కూటమి ముందుకు సాగుతుందన్న సంకేతాలు స్పష్టంగా అందిస్తోంది. -
షాకింగ్ సర్వే.. ఆ పార్టీ నెత్తిన పాలు పోసే పనిలో విజయ్!!
ఏ పార్టీతో పొత్తు ఉండదు. సింహం ఎప్పటికీ సింహమే!. సింగిల్గానే అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగుతాం అంటూ తమిళగ వెట్రి కళగం (Tamilaga Vetri Kazhagam) అధినేత, ప్రముఖ నటుడు విజయ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే మధురైలో జరిగిన టీవీకే మానాడు సూపర్ సక్సెస్ కావడంతో విజయ్ను తమవైపు తిప్పుకునే ప్రయత్నాలను ప్రముఖ పార్టీలు ముమ్మరం చేసినట్లు సమాచారం. ఈ క్రమంలో.. తమిళనాడులో జరిగిన ఓ సర్వే వెల్లడించిన విషయాలు టీవీకే సహా అక్కడి రాజకీయ పక్షాలకు ఝలక్ ఇచ్చాయి. తమిళనాడు లోక్సభ ఎన్నికలు జరిగితే.. డీఎంకే అత్యధిక సీట్లు కైవసనం చేసుకుంటుందని తెలిపింది. ప్రతిపక్ష ఎన్డీయే కూటమికి 3 సీట్లు దక్కవచ్చని, అదే సమయంలో విజయ్ టీవీకేకు జీరో ఎదురుకావొచ్చని ఆ సర్వే పేర్కొంది. 2024 లోక్సభ ఎన్నికల్లో ఇండియా కూటమి తమిళనాడులో అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. మొత్తం 39 స్థానాలను కూటమిలోనే పార్టీలోనే కైవసం చేసుకున్నాయి. అయితే ఇప్పటికిప్పడు జరిగితే మాత్రం 36 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని సర్వే వెల్లడించింది. సంక్షేమ పథకాలతో పాటు హిందీ భాషా వ్యతిరేక ఉద్యమం, నీట్ పోరాటాలు డీఎంకే గెలుపును ప్రభావితం చేసే అంశాలుగా పేర్కొంది.ఇక.. బీజేపీ అన్నాడీఎంకే ఎన్డీయే కూటమికి మూడు స్థానాలు మాత్రమే దక్కవచ్చని పేర్కొంది. అయితే.. ఓటు శాతం మాత్రం 18% నుంచి 37%కి పెరిగే అవకాశం ఉందని వెల్లడించింది. 2024లో ఈ కూటమికి ఒక్క సీటు కూడా రాలేదు. ఇక తమిళనాడులో రాబోయే కాలంలో జరిగే ఎన్నికలకు విజయ్ టీవీకే పార్టీ అదనపు ఆకర్షణగా నిలవబోతోంది. ఈ పార్టీ ఇప్పటిదాకా ఏ ఎన్నికల్లో పోటీ చేసింది లేదు. అయితే ఇప్పటికప్పుడు లోక్సభ ఎన్నికలు జరిగితే ఏ స్థానం దక్కకపోవచ్చని(0 సీట్లు) ఆ సర్వే వెల్లడించింది. విజయ్ పార్టీ పెట్టి ఏడాది పైనే అవుతోంది. అయితే అందులో ముఖాలేవీ జనాలకు పెద్దగా తెలిసినవి కావు. జనాలకు తెలిసిన ముఖాలు టీవీకేలో చేరేందుకు ప్రయత్నిస్తున్నా.. విజయ్ అందుకు విముఖత వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. దీనికి తోడు జనాల్లోకి ఇంకా బలంగా ఆ పార్టీ చొచ్చుకుపోవాల్సిన అవసరం ఉంది. అయితే డీఎంకే వ్యతిరేకతను టీవీకే ఓట్ల రూపంలో మార్చుకోవాలని విజయ్ ప్రయత్నాలు ముమ్మరం చేశారు.ఒకవేళ ఇప్పుడు ఎన్నికలు జరిగితే.. టీవీకే పార్టీతో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లన్నీ చీలే అవకాశం ఉంది. ఇది పరోక్షంగా డీఎంకేకే లాభం కలగించవచ్చని సర్వే పేర్కొంది. తద్వారా.. టీవీకేతో ఎన్డీయే కూటమికే భారీ నష్టం కలగవచ్చని స్పష్టం చేసింది. ఇండియా టుడే సీవోటర్ Mood of the Nation ఆగస్టు 2025 పేరిట నిర్వహించిన ఈ సర్వే నిర్వహించింది. జూలై 1 నుండి ఆగస్టు 14, 2025 మధ్య 2 లక్షల మందికి పైగా ప్రజల అభిప్రాయాలను సేకరించి రూపొందించబడింది. సర్వే లోక్సభ సెగ్మెంట్ల పరిధిలో జరిగినప్పటికీ మరో ఏడేనిమిది నెలల్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకూ సమీకరణాలు ఇలాగే కొనసాగితే మాత్రం.. డీఎంకే నెత్తిన విజయ్ టీవీకే పాలు పోసినట్లే అవుతుందన్న చర్చ జోరుగా నడుస్తోందక్కడ. -
అన్నాడీఎంకేకు పునర్జీవం పోయబోతున్నా!
సాక్షి, చెన్నై: బలహీన పడ్డ అన్నాడీఎంకేకు పునర్జీవం పోయేబోతున్నానని, తనకు ఉన్న అనుభవంతో కార్యాచరణను విస్తృతం చేయనున్నట్టు దివంగత సీఎం జే జయలలిత నెచ్చెలి, చిన్నమ్మ శశికళ వ్యాఖ్యానించారు. పోయేస్ గార్డెన్లో మంగళవారం శశికళ మీడియాతో మాట్లాడారు. జయలలిత రాజకీయ ప్రయాణంలో తన పాత్రను గుర్తు చేశారు. ఆమెకు వెన్నంటి ఉంటూ అన్ని అంశాలను నిశితంగా పరిశీలించానన్నారు. 2011లో అధికారంలోకి వచ్చినానంతరం 2016లోమళ్లీ అధికారం దిశగా ముందడుగు వేసి విజయకేతనం ఎగుర వేసిన విషయాన్ని ప్రస్తావిస్తూ ఆమె మరణం గురించి పేర్కొంటూ ఉద్వేగానికి లోనయ్యారు. ప్రస్తుతం కొందరి రూపంలో అన్నాడీఎంకే బలహీన పడిఉందని, అందర్నీ ఏకం చేయడం, బలహీన పడ్డ పారీ్టకి పునర్జీవం పోయడం లక్ష్యంగా వ్యూహాలకు పదును పెట్టనున్నట్టు, క్రియా శీలక రాజకీయాలోకి రానున్నట్టు ప్రకటించారు. అన్నాడీఎంకేను అధికారంలోకి తీసుకు రావడమే తన లక్ష్యమని, ఇందుకుగాను తనవంతుగా పారీ్టకి పునర్జీవం పోయనున్నట్టు, ఇందుకు సంబంధించిన కార్యాచరణ త్వరలో ప్రకటిస్తానన్నారు. -
సీఎంల పేర్లు, ఫొటోలను పథకాలకు ఉపయోగించుకోవచ్చు
న్యూఢిల్లీ: తమిళనాడులో ఎంకే స్టాలిన్ సారథ్యంలోని డీఎంకే రాష్ట్ర ప్రభుత్వానికి సర్వోన్నత న్యాయస్థానం నుంచి భారీ ఊరట లభించింది. మీకు అండగా స్టాలిన్( విత్ యూ స్టాలిన్) పేరిట తమిళనాట డీఎంకే సర్కార్ అమలుచేస్తున్న సంక్షేమ పథకం పేరులో ముఖ్యమంత్రి(స్టాలిన్), ఇతర మంత్రుల పేర్లు ఉండటాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. సంక్షేమ పథకంలో స్టాలిన్ పేరు ఉండటంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేస్తూ అన్నాడీఎంకే నేత సీవీ షణ్ముగం మద్రాస్ హైకోర్టులో పిటిషన్ వేయగా ఆయనకు అనుకూలంగా హైకోర్టు ఉత్తర్వు వచ్చింది. దీంతో మద్రాస్ హైకోర్టు తీర్పును డీఎంకే ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్చేయగా బుధవారం ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వచ్చింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కె.వినోద్ చంద్రన్, జస్టిస్ ఎన్వీ అంజారియాల సుప్రీంకోర్టు ధర్మాసనం పిటిషనర్ షణ్ముగంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. దురుద్దేశంతో పిటిషన్ వేశారని మండిపడుతూ షణ్ముగంపై రూ.10 లక్షల జరిమానా విధించింది. ‘‘పిటిషనర్ షణ్ముగం అత్యుత్సాహాన్ని మేం ఏమాత్రం ప్రోత్సహించట్లేము. ఆయన కేవలం ఒకే ఒక్క రాజకీయ పార్టీని లక్ష్యంగా చేసుకుని పిటిషన్ వేశారు. రాజకీయ పారీ్టలు ప్రభుత్వ నిధులను నాయకుల పేర్లతో వృథాగా ఖర్చుచేస్తున్నారన్న స్పృహ ఆయనకు నిజంగా ఉంటే ఆయన దేశంలో ఇలాంటి అన్ని రాజకీయ పారీ్టలు అమలు చేస్తున్న అన్నీ పథకాలను ఆయన సవాల్చేయాలి. వాస్తవానికి దేశవ్యాప్తంగా ఇలా ముఖ్యమంత్రుల పేర్లను ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో ఉపయోగిస్తున్నారు. రాజకీయ నాయకుల పేర్లతో పథకాలు ఉండొద్దనే న్యాయబద్ధమైన నిషేధాజ్ఞలు లేవు’’ అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ‘‘ రాజకీయ యుద్ధాలను ఎన్నికల్లో తేల్చుకోవాలి. రాజకీయ యుద్ధాల కోసం కోర్టులను ఉపయోగించుకోవద్దు’’ అని ధర్మాసనం అసహనం వ్యక్తంచేసింది. ‘‘షణ్ముగం వేసిన పిటిషన్ న్యాయబద్ధంగా లేదు. చట్టప్రకారం లేదు. అందుకే ఆయనకు అనుకూలంగా గతంలో వచి్చన తీర్పును పక్కనబెడుతున్నాం. ఈమేరకు హైకోర్టు తీర్పును పక్కనబెట్టేందుకు ఉద్దేశించిన స్పెషల్ లీవ్ పిటిషన్ను అనుమతిస్తున్నాం’’ అని కోర్టు తెలిపింది. -
‘సర్’ ని ఎవరు కాపాడే యత్నం చేశారు?
చెన్నై: అన్నామలై యూనివర్శిటీ క్యాంపస్లో ఓ యువతిపై గతేడాది జరిగిన అత్యాచార కేసులో 39 ఏళ్ల జ్ఞానశేఖరన్ అనే వ్యక్తికి జీవితఖైదు విధిస్తూ చెన్నై మహిళా కోర్టు ఈరోజు(సోమవారం, జూన్ 2) తీర్పునిచ్చింది. జ్ఞానశేఖరన్ను దోషిగా తేల్చిన మహిళా కోర్టు.. కనీసం 30 ఏళ్ల జీవిత ఖైదు విధిస్తూ తీర్పును వెల్లడించింది. 2024లో అన్నామలై యూనివర్శిటీ క్యాంపస్లో జరిగిన అత్యాచార కేసుకు సంబంధించి గత కొన్నాళ్లుగా అధికార డీఎంకే, ప్రధాన ప్రతిపక్ష అన్నా డీఎంకేల మధ్య మాటల యుద్ధం జరుగుతూనే ఉంది. అయితే ఈ తీర్పులో ఇప్పటివరకూ నిందితుడిగా ఉన్న జ్ణానశేఖర్ను ఎట్టకేలకు దోషిగా తేల్చింది మహిళా కోర్టు. ఆధారాలు నిరూపణ కావడంతో జీవితఖైదు విధించింది. ఈ తీర్పు తర్వాత ప్రధాన ప్రతిపక్షం అన్నా డీఎంకే.. డీఎంకే పార్టీని టార్గెట్ చేసింది. డీఎంకే మద్దతుదారుడైన జ్ఞానశేఖరన్ను కాపాడటానికి అధికార పార్టీ తన వంతు కృషి చేసిందంటూ సెటైర్లు వేసింది. ఎఫ్ఐఆర్లో ‘సర్’ అని పేర్కొనడాన్ని ఇక్కడ ఉదహరిస్తూ అన్నాడీఎంకే నేత పళనిస్వామి.. డీఎంకే ప్రెసిడెంట్, సీఎం ఎంకే స్టాలిన్పై విమర్శలు గుప్పించారు. ‘ ఇంతకాలం ‘సర్’ని ఎవరు కాపాడారు?, ఈ కేసులో జ్ఞానశేఖరన్ తప్ప ఎవరు నిందితులు కాదు. మరి ఇంతకాలం పాటు విచారణ జరపడానికి డీఎంకే ప్రభుత్వం ఎందుకు ఆలస్యం చేసింది?, కాపాడే ప్రయత్నం చేశారు. సాక్ష్యాలన్నీ బలంగా ఉండటంతో ఇంకేమీ చేయలేకపోయారు’ అంటూ పళనిస్వామి విమర్శించారు. తమ ప్రభుత్వం ఒకసారి అధికారంలోకి వస్తే అన్నింటికీ సమాధానం దొరుకుతుందని పేర్కొన్నారు.దీనికి సీఎం స్టాలిన్ బదులిస్తూ.. ‘ మేము పారదర్శకంగా ఉన్నాం కాబట్టే.. తొందరగా తీర్పు వచ్చింది. కోర్టు కూడా ఈ కేసులో పోలీసుల సాధించిన పురోగతిని కొనియాడింది. మహిళల రక్షణ అనేది మా ప్రభుత్వానికి అత్యంత ముఖ్యం అనే విషయం గుర్తించుకోండి’ అని ట్వీట్ చేశారు. ఇంతకీ ఈ కేసు ఏంటంటే..గతేడాది డిసెంబర్ 23వ తేదీన జ్ఞానశేఖరన్ అన్నామలై క్యాంపస్లోకి ప్రవేశించాడు. ముందుగా ఆ బాధిత విద్యార్థిని స్నేహితురాలిపై దాడికి పాల్పడ్డాడు. ఆపై తాను టార్గెట్ చేసిన యువతిపై లైంగిక వేధింపులకు దిగడమే కాకుండా, యూర్శివర్శిటీ సాక్షిగా అత్యాచార యత్నం చేశాడు. దీన్ని వీడియోగా చిత్రీకరించి ఆ యువతిని అక్కడే బ్లాక్ మెయిల్ చేశాడు. దీనిపై యువతి ఫిర్యాదు చేయగా, డిసెండర్ 24వ తేదీన కేసు నమోదైంది. ఆరు నెలల తర్వాత వచ్చిన తీర్పులో అతనికి 30 ఏళ్ల పాటు జీవితఖైదుతో పాటు రూ, 90 వేల జరిమానా విధించింది మహిళా కోర్టు. రోడ్డు పక్కన బిర్యానీలు అమ్ముకునే జ్ఞానశేఖరన్పై సుదీర్ఘమైన క్రిమినల్ రికార్డు కూడా ఉన్నట్లు పోలీస్ దర్యాప్తులో తేలింది. -
కత్తులతోనే పొత్తు పొడుపు!
అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఏడాది వ్యవధి ఉండగానే తమిళనాడులో ప్రత్యర్థి పార్టీల మధ్య చిట పటలు మొదలైపోయాయి. ఈసారి ఎలాగైనా నిలదొక్కుకుని పార్టీ జెండా రెపరెపలాడించాలని బీజేపీ కృతనిశ్చయంతో ఉన్నట్టు కనబడుతోంది. అందుకే ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్పై విమర్శల జోరుపెంచారు. స్టాలిన్ కూడా అంతే దీటుగా బదులిస్తున్నారు. రెండేళ్ల క్రితం తమను వీడివెళ్లిన అన్నా డీఎంకేతో బీజేపీ చెలిమిని ఖరారు చేసుకుంది. అందుకోసం అమిత్ షా చెన్నై రావటాన్ని చూస్తే రాబోయే పోరులో తమది కీలకమైన పాత్రని ఆ పార్టీ చెప్పదల్చుకున్నట్టు అర్థమవుతుంది. అయితే ఈ సాన్నిహిత్యం ఏమంత సజావుగా లేదని జరుగుతున్న పరిణామాలు చెబుతున్నాయి. కేవలం ఈ చెలిమి కోసం బీజేపీ అన్నామలైని రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పించి ఆ స్థానంలో నయనార్ నాగేంద్రన్ను నియ మించింది. అన్నామలై గత రెండేళ్లుగా డీఎంకే సర్కారుపైకి దూకుడుగా పోతున్నారు. నిరుడు జరిగిన లోక్సభ ఎన్నికల్లో పార్టీకి ఆధిపత్య కులాల వోట్లు రాబట్టడంలో, యువతను సమీకరించటంలో ఆయన విజయం సాధించారు. సీట్లయితే రాలేదుగానీ... బీజేపీ వోటు శాతం 11.24 శాతా నికి చేరుకుంది. కానీ ఆ దూకుడు పొత్తు రాజకీయాల్లో చిచ్చు పెడుతుందన్న భయం బీజేపీ అధిష్ఠా నంలో వుంది. ఎందుకంటే లోక్సభ ఎన్నికల సందర్భంగా అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, మాజీ సీఎం పళనిస్వామిపై అన్నామలై తీవ్ర విమర్శలు చేశారు. అవి వ్యక్తిగత స్థాయికి వెళ్లి పోయాయి. అందుకే ఎన్నికల వరకూ పొత్తు సజావుగా వుండాలంటే అన్నామలైని తప్పించటమే మంచిదని కేంద్ర నాయకత్వం భావించింది. నాగేంద్రన్ అన్నాడీఎంకే నుంచి వచ్చినవారే. జయ సర్కారులో పళని స్వామి, ఆయనా సహచరులు కూడా. 2016లో జయ మరణం తర్వాత నాగేంద్రన్ బీజేపీ కండువా కప్పుకున్నారు. ఆ మాటెలావున్నా రెండు పార్టీలకూ ఇది ఇష్టం లేని పొత్తే. కొన్ని సీట్లయినా సాధించుకోగలిగితే ద్రవిడ కోటలో పాగా వేశామన్న అభిప్రాయం కలిగించ వచ్చని బీజేపీ ఆశిస్తోంది. అటు అన్నాడీఎంకే పరిస్థితీ ఏమంత బాగోలేదు. జయ మరణంతో అది అనాథగా మారింది. అంత ర్గత కీచులాటల మధ్య 2021 వరకూ ప్రభుత్వం మనుగడ సాగించినా తర్వాత అది మూడు ముక్క లైంది. పళనిస్వామి నేతృత్వంలోని అన్నాడీఎంకేకు అసెంబ్లీ ఎన్నికల్లో 66 స్థానాలొచ్చాయి. కానీ గత లోక్సభ ఎన్నికల్లో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. మొత్తం 39 స్థానాలనూ డీఎంకే కూటమి గెల్చుకుంది. అందుకే అటు బీజేపీకి, ఇటు అన్నాడీఎంకేకు ప్రస్తుత పొత్తు ప్రాణావసరమైంది.సమస్యేమంటే రెండు పార్టీల మధ్యా పొత్తు ఏర్పడినా, అది ఎన్డీయే కూటమిగా ఉంటుందని అమిత్ షా చెప్పినా ఈ చెలిమితో ఇరుపక్షాలూ ఇబ్బంది పడుతున్న వైనం కనబడుతోంది. లోక్సభ ఎన్నికల్లో అన్నాడీఎంకే లేకుండానే తాము 11.24 శాతం వోట్లు రాబట్టుకోగలిగామని బీజేపీ ధీమాగా వుంది. కానీ ఆ పరిస్థితి అన్నాడీఎంకేలో లేదు. అధికారంలో పాలుపంచుకుంటామో, లేదో ఎన్నికల తర్వాతే చెబుతామని షా అంటే... ఎన్నికల్లో పోటీవరకే పొత్తులని పళనిస్వామి ప్రక టించారు. తమిళనాడు రాజకీయ ధోరణులు గమనిస్తే అక్కడ కూటమి ప్రభుత్వాలు ఎప్పుడూ లేవు. పొత్తులున్నా రాష్ట్ర మంత్రివర్గంలో ఏనాడూ జాతీయ పార్టీలకు చోటీయలేదు. ఇప్పుడు కూడా అదే కొనసాగుతుందనుకుంటే తప్ప తమిళ వోటర్లు కనికరించరని పళనిస్వామి, అమిత్ షాలు అనుకుని వుండొచ్చు. అయితే డీఎంకేపై విరుచుకుపడటానికి తగిన ఆయుధాలు లేకపోవటం ఎన్డీయే కూటమికున్న ప్రధాన సమస్య. కాశీకి ప్రత్యేక రైలు నడపటం, కొత్త పార్లమెంట్ భవనంలో సెంగోల్, వీణ పెట్టడం ద్రవిడ రాజకీయ ప్రాబల్యంగల తమిళనాడును అంతగా ఆకర్షించినట్టు లేదు. స్టాలిన్ అమ్ములపొదిలో చాలా అస్త్రాలున్నాయి. ముఖ్యంగా ఆయన తమిళుల ఆత్మగౌరవంఅంశాన్ని ముందుకు తెచ్చారు. తమిళులు అనాగరికులని కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వ్యాఖ్యా నించటం, అనంతరం క్షమాపణ చెప్పటం ప్రస్తావిస్తున్నారు. బలవంతంగా హిందీ రుద్దాలని చూస్తు న్నారని ఆరోపిస్తున్నారు. ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో అప్పటి సీఎం నవీన్ పట్నాయక్కు సన్నిహి తుడైన తమిళ ఐఏఎస్ అధికారి వీకే పాండ్యన్పై బీజేపీ రేపిన దుమారాన్ని గుర్తుచేస్తున్నారు. ఒడిశా ప్రజలపై తమిళులు పెత్తనం ఎలా చేస్తారని ప్రశ్నించటాన్ని ఎత్తిచూపుతున్నారు. గత పదేళ్లలో తమిళ నాడుకు కేంద్ర నిధులు మూడు రెట్లు పెరిగినా కొందరికి ఏడవటం అలవాటైపోయిందన్న ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యలనూ ఆయన తనకు అనుకూలంగా మలుచుకున్నారు. తమ వంతు వాటా అడగటం తమ హక్కని, అందుకు ఏడవటం లేదా బానిసత్వం చేయటం చేతకాదని స్టాలిన్ జవాబి చ్చారు. 234 స్థానాలుగల అసెంబ్లీలో గత ఎన్నికల్లో డీఎంకే సొంతంగా 133, మిత్రులతో కలిసి 159 గెల్చుకుంది. 46 శాతం వోట్లు రాబట్టింది.ఇప్పటికైతే తమిళనాట సామాజిక న్యాయం, రాష్ట్రాల హక్కులు, ఆత్మగౌరవం ప్రధానాంశాలు. గవర్నర్ ఆర్ఎన్ రవి అసెంబ్లీ ఆమోదించిన పది బిల్లుల్ని దీర్ఘకాలం పెండింగ్లో ఉంచటం, సుప్రీంకోర్టు ఆయన్ను మందలించటంతోపాటు వాటిని ఆమోదించినట్టుగా భావించాలని చెప్పటం స్టాలిన్కు మరింత శక్తినిచ్చింది. అవినీతి పెరిగిందని, వేలకోట్ల ప్రజాధనాన్ని డీఎంకే నేతలు దోచు కుంటున్నారని, శాంతిభద్రతలు దెబ్బతిన్నాయని బీజేపీ చేస్తున్న ఆరోపణలు ప్రజల్ని ఎంతవరకూ కదలించగలవో చూడాలి. అంతకన్నా ముందు అసెంబ్లీ ఎన్నికలు జరిగే వచ్చే ఏప్రిల్నాటికైనా తమ పొత్తు విషయంలో ఆత్మవిశ్వాసాన్ని కనబర్చటం అవసరమని ఎన్డీయే గుర్తించాలి. -
వారి చేతిలో బందీగా మారిన బానిసలు: ఎంకే స్టాలిన్
చెన్నై: తమిళనాడులో అన్నా డీఎంకే, బీజేపీల పొత్తుపై ఆ రాష్ట్ర సీఎం , డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ నిప్పులు చెరిగారు. ఇదొక ఓడిపోయే అవినీతి కూటమి అంటూ ధ్వజమెత్తారు. రాష్ట్ర స్వయంప్రతిపత్తిని తాకట్టు పెట్టి అధికారం కోసం అర్రులు చాస్టున్న కూటమి, బీజేపీ చేతిలో బందీగా మారిన బానిస పార్టీ అంటూ మండిపడ్డారు. అన్నాడీఎంకేతో బీజేపీ పొత్త పెట్టుకున్న సంగతి తెలిసిందే. అన్నా డీఎంకేతో పొత్తు విషయాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిన్న(శుక్రవారం) అధికారికంగా ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో(2026 అసెంబ్లీ ఎన్నికల్లో) ప్రభుత్వ ఏర్పాటే లక్ష్యంగా ఈ కూటమి ఏర్పడినట్లు అమిత్ షా పేర్కొన్నారు.దీనిపై స్టాలిన్ మాట్లాడుతూ.. ‘ రెండు పార్టీల సిద్ధాంతాల్లో క్లారిటీ అనేది లేదు. ఏదో పొత్తు పెట్టుకోవాలి కాబట్టి.. అన్నా డీఎంకేతో సంధి కుదుర్చుకున్నారు. నీట్ అంశాన్ని ఏఐఏడీఎంకే వ్యతిరేకించింది. ఇదే తరహాలో రాష్ట్రంలో త్రి భాషా విధానంలో హిందీ భాషను రుద్దే అంశాన్ని, వక్ప్ యాక్ట్ ను, డీలిమిటేషన్ అంశాన్ని కూడా అన్నాడీఎంకే వ్యతిరేకించింది. మరి అటువంటప్పుడు బీజేపీతో అన్నాడీఎంకే ఎలా పొత్తు పెట్టుకుంది.ఇరు పార్టీలు పొత్తు పెట్టుకునేటప్పుడు కామన్ మినిమమ్ ప్రాగ్రామ్(సీఎంపీ) అనేది ఒకటి ఉంటుంది కదా. మరి వీటి గురించి హోంమంత్రి అమిత్ షా ఏమీ మాట్లాడలేదు. అలాగే అన్నాడీఎంకే నేతలు కూడా ఏమీ నోరు విప్పలేదు. ఏదో ప్రెస్ మీట్ పెట్టి పొత్తు కుదుర్చుకున్నారు. అదే పనిగా డీఎంకేపై, నాపై వ్యక్తిగత విమర్శలు గుప్పించారు. నీట్ ను సీబీఐ దర్యాప్తు చేస్తుంది కదా.. అటువంటప్పుడు రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు ఎందుకు చేశారు అమిత్ షా. సీబీఐ అనేది కేంద్రం చేతుల్లోనే కదా ఉండేది’ అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు స్టాలిన్. -
ఆపరేషన్ 2026 ఎలక్షన్స్ ... అన్నాడీఎంకేతో బీజేపీ పొత్తు
-
పళనిస్వామి (ఏఐఎడీఎంకే) రాయని డైరీ
ఢిల్లీలోని కృష్ణ మీనన్ మార్గ్లో ఉన్న అమిత్షా నివాసానికి వెళ్లి, ఆయన్ని కలిసి బయటికి రాగానే... ఆ చీకట్లో మీడియా వాళ్లు నిలబడి మిణుగురుల్లా మెరుస్తూ ఉన్నారు!‘‘సర్! వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేయబోతు న్నారట కదా? పొత్తు కుదుర్చుకోవటం కోసమే మీరు అమిత్షాను కలిసేందుకు వచ్చారా?’’ – ఆరంభ ప్రశ్న.‘‘లేదు లేదు, ఢిల్లీలో మా పార్టీ ఆఫీస్ ప్రారంభోత్సవం పని మీద వచ్చాం...’’ అన్నాను. ‘‘సర్! మీ ఢిల్లీ ఆఫీస్ని మీరు ఫిబ్రవరి 10 నే వర్చువల్గా చెన్నై నుంచి ప్రారంభించారు కదా, మళ్లీ ఇప్పుడేమిటి! అమిత్షాతోగంటన్నరకు పైగా మాట్లాడారు. ఏడాదిన్నర క్రితం బీజేపీకి బ్రేకప్ చెప్పాక, తిరిగి ఇన్నాళ్లకు ఇప్పుడే కదా మీరు అమిత్షాను కలవటం!ఇంతసేపూ ఆయనతో ఏం మాట్లాడారు సర్ మీరు?’’ – ఆరాలు తీస్తున్న ప్రశ్న. ‘‘అలా ఏం లేదు. అమిత్జీని అనుకోకుండా కలిశాం...’’ అన్నాను.‘‘కానీ సర్, చెన్నై నుంచి ఉదయాన్నే మీరు ఢిల్లీ వచ్చారు. మధ్యాహ్నానికి మీ పార్టీ డిప్యూటీ జనరల్ సెక్రెటరీ కేపీ మునుస్వామి, సీనియర్ లీడర్ వేలుమణి మీ వెనుకే ఢిల్లీకి రీచ్ అయ్యారు. సాయంత్రానికి ఢిల్లీలోనే ఉంటున్న మరో ఇద్దరు సీనియర్ లీడర్లు తంబిదొరై,సీవీ షణ్ముగం మీతో జాయిన్ అయ్యారు.అంతా కలిసి చీకటి పడ్డాక అమిత్షా నివాసానికి వెళ్లారు. అమిత్షాను కలవాలని అందరూ అనుకునే కలిశాక, అదెలా సర్ అమిత్షాను అనుకోకుండా కలవటం అవుతుంది?’’ – ఆధారాలు సేకరించిన ప్రశ్న!‘‘మీరనుకుంటున్నట్లు మేమేమీ చీకటి పడ్డాక అమిత్జీని కలవలేదు. అమిత్జీని కలిసేటప్పటికే చీకటి పడినట్లుంది. వెళ్లి కలిశాం, శాలువా కప్పాం, కాసేపు మాట్లాడాం. వచ్చేశాం...’’ అని నవ్వుతూ చెప్పాను.‘‘మరి, బీజేపీ వాళ్లు ఇంకోలా చెబుతు న్నారు కదా సర్?’’ – చీకట్లో విసిరిన ప్రశ్న!‘‘మేము లోపలికి వెళ్లినప్పుడు లోపల ఉన్నది మీరంటున్న బీజేపీ వాళ్లలో అమిత్జీ ఒక్కరే. ఆయనే మీకు చెప్పారంటారా,ఇంకోలా?’’ అని అడిగాను. ‘‘లేదు సర్, ‘కలిసి పోటీ చేద్దాం’ అని మీరు అమిత్షాను అడిగినప్పుడు, అందుకాయన ‘మీరు 117 సీట్లలో, మేము 117 సీట్లలో సగం సగం పోటీ చేయటానికి ఒప్పుకుంటేనే మీతో కలుస్తాం...’ అని మీకు కండిషన్ పెట్టారట కదా?! – ఊహించి వేసిన ప్రశ్న.‘‘ఇంకా?!’’ అన్నాను.‘‘పార్టీ నుంచి బహిష్కరించిన దినకరన్ని, శశికళను, పన్నీర్సెల్వంను తిరిగి పార్టీలోకి ఆహ్వానించాలని కూడా అమిత్షా మీకు కండి షన్ పెట్టారట కదా సర్...’’ – ఇదైతే కచ్చితంగా బీజేపీ స్టేట్ చీఫ్ అన్నామలై వేయించిన ప్రశ్న!పొత్తు కోసం నేను అమిత్జీ దగ్గరకు వెళ్లకుండా, అమిత్జీనే పొత్తు కోసం నా దగ్గరకు వచ్చి ఉంటే, ముందు ఆ అన్నామలైని మార్చి, వేరెవరినైనా బీజేపీ ఛీప్గా పెట్టమని నేనే కండిషన్ పెట్టి ఉండేవాడిని.‘‘చెప్పండి సర్! బీజేపీతో పొత్తు కోసం కాదా మీరు అమిత్షాను కలిసింది?’’ – తిరిగి మళ్లీ అదే ఆరంభ ప్రశ్న. ‘‘తమిళనాడులో డ్యామ్ల సమస్య ఉంది. స్కామ్ల సమస్య ఉంది. లాంగ్వేజీల సమస్య ఉంది. డీ–లిమిటేషన్ సమస్య ఉంది. డీఎంకే సమస్య ఉంది. ఇన్ని సమస్యలు ఉన్నప్పుడు మేము వాటి గురించి మాట్లాడి ఉండొచ్చని మీరెందుకు అనుకోరు?’’ అని అడిగాను. ‘‘బీజేపీతో పొత్తు కోసం మీరిక్కడికి వస్తే, అక్కడ చెన్నైలో అన్నామలై మీరంటే పడని వాళ్లందరితో పొత్తు పెట్టుకుంటున్నారు. దీనికేమంటారు సర్?’’ – ఇంకేదో రాబట్టే ప్రశ్న. నేనేమీ అనలేదు. డ్యామ్లు, స్కామ్లు, లాంగ్వేజీలు, డీ–లిమిటేషన్, డీఎంకే... వీటన్నిటికన్నా తమిళనాడుకు అతి పెద్ద సమస్య అన్నామలై... అని నాతో చెప్పించటానికే ఈ మిణుగురులు ఇక్కడికి చేరినట్లు నాకర్థమైంది! -
తమిళనాట ‘విజయ్’ ట్విస్ట్.. పీకే కీలక ప్రకటన
సాక్షి, చైన్నె: తమిళనాట రాజకీయం ఆసక్తికరంగా మారింది. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో పార్టీ పొత్తులు, కీలక నేతల పోటీ విషయంలో ఆసక్తి నెలకొంది. ఇక, సినీ నటుడు విజయ్ కొత్త పార్టీ స్థాపించి ప్రజల్లోకి వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల వ్యూహకర్త, జన్ సురాజ్ పార్టీ నేత ప్రశాంత్ కిషోర్ కీలక ప్రకటన చేశారు.తమిళనాడులో 2026 ఎన్నికలలో విజయ్ తమిళగ వెట్రి కళగం అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని ఎన్నికల ప్రశాంత్ కిషోర్ స్పష్టం చేశారు. తమిళగ వెట్రి కళగం నేత విజయ్ రాజకీయ వ్యూహాలకు పదును పెట్టిన విషయం తెలిసిందే. ఆయన్ని సీఎం చేయడమే లక్ష్యంగా రంగంలోకి ప్రశాంత్ కిషోర్ దిగారు. గత వారం జరిగిన విజయ్ పార్టీ రెండో ఆవిర్భావ వేడుక వేదికపై ప్రశాంత్ కిషోర్ సైతం కూర్చున్నారు. ప్రత్యేక ప్రసంగం కూడా చేశారు.2026లో విజయ్ను సీఎం చేయడమే లక్ష్యంగా తన సహకారం, మద్దతును ప్రకటించారు. ఈ పరిస్థితుల్లో తాజాగా ఓ తమిళ చానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యలు శనివారం వైరల్ అయ్యాయి. 2026 ఎన్నికలలో విజయ్ పార్టీ అన్నాడీఎంకేతో కలిసి ఎన్నికలను ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయన్న చర్చకు ముగింపు పలికే విధంగా ప్రశాంత్ కిషోర్ స్పందించారు. అన్నాడీఎంకేతో విజయ్ పొత్తు ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఆయన ఒంటరిగానే ఎన్నికలను ఎదుర్కొంటారని, ఆ దిశగానే వ్యూహ రచనలు జరుగుతున్నట్టు పేర్కొన్నారు. ఒంటరిగానే తన బలాన్ని చాటి, అధికారం చేజిక్కించుకునే దిశగా ముందుకెళ్తున్నట్టు ప్రశాంత్ కిషోర్ పేర్కొనడం గమనార్హం. -
విజయ్ Y కేటగిరీ భద్రతపై రాజకీయ దుమారం
చెన్నై: అగ్రనటుడు, టీవైకే పార్టీ అధినేత విజయ్కు కేంద్రం ‘వై’ కేటగిరీ భద్రతను కేటాయించింది. రాజకీయాల్లో ఆయన క్రియాశీలకంగా మారడం, పైగా తరచూ జనాల్లోకి వెళ్తుండడంతో ఆయన ప్రాణాలకు ముప్పు కలగవచ్చని నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఈ నేపథ్యంతోనే హోం శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ వ్యవహారం ఇప్పుడు రాజకీయ దుమారం రేపుతోంది.నటుడు, రాజకీయనేత అయిన విజయ్(Vijay)తో పాటు పలువురు ప్రముఖుల ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు తాజాగా కేంద్ర హోం శాఖకు నివేదికలు ఇచ్చాయి. ఇంటెలిజెన్స్ బ్యూరో(Intelligence Bureau) సూచనల మేరకు వాళ్లందరికీ ‘ఎక్స్, వై, జెడ్’ కేటగిరీల కింద ప్రత్యేక భద్రత కల్పించేందుకు కేంద్ర హోం శాఖ ముందుకు వచ్చింది. ఈ మేరకు ఫిబ్రవరి 13వ తేదీన ఓ నోటిఫికేషన్ కూడా రిలీజ్చేసింది. తాజా నిర్ణయంతో.. ఒకరు లేదా ఇద్దరు కమాండోలతో పాటు 8-11 మంది సీఆర్పీఎఫ్ సిబ్బంది విజయ్కు భద్రతగా ఉండనున్నారు. అయితే..ఈ వ్యవహారం(Vijay Security Row) తమిళనాట రాజకీయ విమర్శలకు దారి తీసింది. విజయ్కు రాష్ట్ర ప్రభుత్వమే ఇలాంటి భద్రత ఎందుకు కల్పించలేకపోయిందని బీజేపీ ప్రశ్నలు సంధించింది. ‘‘విజయ్ తమిళనాట ప్రజాదరణ ఉన్న వ్యక్తి. అలాంటి వ్యక్తి భద్రతకు ముప్పు పొంచి ఉందనే సమాచారం ఉన్నప్పుడు.. ఇక్కడి ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు. డీఎంకే ప్రభుత్వం ఆయనకు భద్రత కల్పించేందుకు ముందుకు రావొచ్చు కదా?’’ అని తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై ప్రశ్నించారు. దీనిపై డీఎంకే నుంచి బదులు రావాల్సి ఉంది.మరోవైపు.. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు ఉండడంతో విజయ్ను ప్రసన్నం చేసుకోవడానికి బీజేపీ ఆడుతున్న డ్రామా ఇదని అన్నాడీఎంకే(AIADMK) ఆరోపిస్తోంది. నిజాయితీగా విజయ్కు కేంద్రం భద్రతను ఇచ్చి ఉంటే ఫర్వాలేదు. కానీ, రాజకీయం కోసం చేసి ఉంటే మాత్రం.. తమిళనాడులో అలాంటి పాచికలు పారవు’’ అని అన్నాడీఎంకే నేత మునుస్వామి చురకలటించారు.కోలీవుడ్ స్టార్ హీరో విజయ్కు తమిళనాడులో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కిందటి ఏడాది ఫిబ్రవరిలో తమిళగ వెట్రి కజగం అనే పార్టీని ప్రకటించారు. రాష్ట్రంలో డీఎంకే, కేంద్రంలోని బీజేపీకి తన పార్టీ ప్రత్యామ్నాయమని ప్రకటించారాయన. ఆ మధ్య నిర్వహించిన ఓ బహిరంగ సభకు అశేషమైన స్పందన లభించింది కూడా. తరచూ జనాల్లో వెళ్తున్నారు కూడా. ఇక విజయ్ కదలికలను రాజకీయ వర్గాలు నిశితంగా పరిశీలిస్తూ వస్తున్నాయి. అలాగే.. మాజీ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తోనూ ఆయన తరచూ భేటీ అవుతూ వస్తున్నారు. వచ్చే ఏడాది జరగబోయే అసెంబ్లీ ఎన్నికలనే లక్ష్యంగా ఆయన టీవీకేను ముందుకు తీసుకెళ్తున్నారు.ఇదీ చదవండి: కళ్లు చెదిరిపోయేలా.. జయలలిత ఆస్తులు! -
అవును.. నిందితుడు మా పార్టీ మద్దతుదారుడే: సీఎం స్టాలిన్
చెన్నై: అన్నా యూనివర్సిటీలో విద్యార్థినిపై జరిగిన లైంగిక దాడి ఘటన తమిళనాట రాజకీయ దుమారం రేపుతోంది. అసెంబ్లీని సైతం దద్దరిల్లిపోయేలా చేసిన ఈ ఘటనపై బుధవారం ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ స్పందించారు. నిందితుడు తమ పార్టీ మద్దతుదారుడేనని ప్రకటించారాయన. అయితే..అసెంబ్లీ సమావేశాల్లో మూడో రోజు సీఎం స్టాలిన్(CM Stalin) మాట్లాడుతూ.. ‘‘అన్నా వర్సిటీ ఘటనలో నిందితుడు కేవలం డీఎంకే మద్దతుదారుడేనని, ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నట్లు పార్టీ సభ్యుడు ఎంతమాత్రం కాదు’’ స్పష్టత ఇచ్చారు. అంతేకాదు.. మహిళల భద్రతే ప్రాధాన్యంగా పని చేస్తున్న తమ ప్రభుత్వం.. నిందితుడికి రక్షణ కల్పించలేదని, భవిష్యత్తులోనూ కల్పించబోదని, పైగా అతనిపై గుండా యాక్ట్ ప్రయోగించామని ప్రకటించారు. అన్నా వర్సిటీ ఘటన.. ప్రతిపక్షాలు వ్యవహరిస్తున్న తీరును సీఎం స్టాలిన్ తీవ్రంగా తప్పుబట్టారు.‘‘విద్యార్థినిపై లైంగిక దాడి(Sexual Assault) క్రూరమైన ఘటన. అయితే.. చట్ట సభ్యులు ఇవాళ ఈ అంశం మీద ఇక్కడ మాట్లాడుతున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వాన్ని విమర్శించడమే అంతా పనిగా పెట్టుకున్నారు. బాధితురాలి తరఫు నిలబడి సత్వర న్యాయం చేకూర్చాలనే మా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. సాధారణంగా.. ఘటన జరిగాక నిందితుడు తప్పించుకుంటేనో.. అరెస్ట్లో జాప్యం జరిగితేనో.. లేకుంటే నిందితుడ్ని రక్షించే ప్రయత్నాలు జరిగితేనో విమర్శలు వినిపిస్తాయి. కానీ, ఇక్కడ వీలైనంత త్వరగా అరెస్ట్ చేసినా ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. ఇది రాజకీయ ప్రయోజనాల కోసం చేసే రాద్ధాంతం కాకపోతే ఇంకేంటి?’’ అని ప్రశ్నించారాయన. అన్నా వర్సిటీ(Anna University) ఘటనకు నిరసనగా ప్రతిపక్ష అన్నాడీఎంకే సభ్యులు నల్లదుస్తులతో అసెంబ్లీకి వచ్చారు. వాళ్లను ఉద్దేశిస్తూ సీఎం స్టాలిన్ తీవ్ర విమర్శలు గుప్పించారు.గతంలో ఇదే ప్రతిపక్ష అన్నాడీఎంకే అధికారంలో ఉండగా.. పొల్లాచ్చి లైంగిక దాడి కేసు సంచలనం సృష్టించింది. ఆ టైంలో ప్రభుత్వం ఏం చేసింది?.. ఆలస్యంగా స్పందించడంతో నిందితుడు పారిపోలేదా? అని ప్రశ్నించారాయన. ప్రతిపక్షాలంతా నిందితుడు ఎవరు? మీ పార్టీ వాడు కాదా అని ప్రశ్నిస్తున్నాయి. అవును.. అతను మా పార్టీ మద్దతుదారుడే. కానీ, సభ్యుడు మాత్రం కాదు. ఈ విషయాన్ని మేం ముందు నుంచే చెబుతున్నాం. అరెస్ట్ విషయంలోనూ ఎక్కడా రాజకీయ జోక్యం జరగలేదు. ఒకవేళ.. అలా జరిగిందని ఆధారాలు ఉంటే సిట్కు సమర్పించండి. దర్యాప్తు అయ్యేదాకా ఎదురుచూడడండి. అంతేగానీ స్వప్రయోజనాల కోసం చిల్లర రాజకీయాలు చేయొద్దు అని ప్రతిపకక్షాలను ఉద్దేశించి హితవు పలికారాయన. ఈ తరుణంలో అసెంబ్లీ నుంచి అన్నాడీఎంకే సభ్యులు వాకౌట్ చేశారు. ఇదిలా ఉంటే.. అన్నా వర్సిటీ ఉందంతంపై దాఖలైన ఓ పిటిషన్ విషయంలోనూ మదద్రాస్ హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ‘‘అసలు మహిళల భద్రతపై ఎవరికీ అసలు చిత్తశుద్ధి లేదు. అన్నా యూనివర్సిటీ లైంగిక దాడి కేసును అంతా రాజకీయం చేస్తున్నారు. కేవలం వాళ్ల అవసరం వాడుకుంటున్నారు’’ అని వ్యాఖ్యానించింది. డిసెంబర్ 23వ తేదీన రాత్రి 8గం. ప్రాంతంలో క్యాంపస్లో ఇంజినీరింగ్ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థిని(19) తన స్నేహితుడితో మాట్లాడుతుండగా.. దాడి చేసి ఆమెను బలవంతంగా పొదల్లోకి లాక్కెళ్లి అత్యాచారం చేశారు. ఈ ఘటనపై విద్యార్థి సంఘాలు భగ్గుమన్నాయి. నిందితులను కఠినంగా శిక్షించాలంటూ ఆందోళనకు దిగాయి. అదే సమయంలో.. క్యాంపస్కు దగ్గర్లో బిర్యానీ సెంటర్ నడిపే జ్ఞానేశ్వర్ను నిందితుడిగా పేర్కొంటూ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే అతను డీఎంకే సభ్యుడంటూ ప్రతిపక్షాలు విమర్శలకు దిగాయి. మరోవైపు.. ఈ కేసులో ఇంకొంతమంది నిందితులు ఉన్నారని.. వాళ్లను రక్షించే ప్రయత్నం జరుగుతోందంటూ డీఎంకే ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నాయి ప్రతిపక్షాలు.ఇదీ చదవండి: బీజేపీ నేత నోటి దురుసు! ఫలితంగా.. -
సోషల్మీడియాలో వివాదస్పద పోస్టు.. నటుడికి జైలు శిక్ష
సినీ నటుడు, రాజకీయ ప్రముఖుడు ఎస్వీ శేఖర్కు నెల రోజులు జైలు శిక్షను ఖరారు చేస్తూ మద్రాసు హైకోర్టు గురువారం తీర్పు వెలువరించింది. 2018లో ఎస్వీ శేఖర్ సామాజిక మాధ్యమాలలో పెట్టిన ఓ పోస్టు వివాదానికి దారి తీసింది. ఈ వ్యవహారంలో ఆయన చేసిన వ్యాఖ్యలు రచ్చకెక్కాయి. మహిళా జర్నలిస్టును ఉద్దేశించి ఆయన ఈ అనుచిత వ్యాఖ్యలు చేసినట్టు విచారణలో తేలింది. చైన్నె మీడియా ప్రతినిధులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మహిళా జర్నలిస్టులకు వ్యతిరేకంగానే ఆయన నోరు జారినట్టు విచారణలో వెలుగు చూసింది. అదే సమయంలో పశ్చాత్తాపం వ్యక్తంచేస్తూ ఎస్వీ శేఖర్ క్షమాపణ చెప్పుకున్నా, కేసు మాత్రం కొనసాగుతూ వచ్చింది. ఈ కేసును రద్దు చేయాలని హైకోర్టును సైతం శేఖర్ ఆశ్రయించారు. విచారణను ఎదుర్కోవాల్సిందేనని హైకోర్టు సైతం స్పష్టం చేసింది. దీంతో ఈ కేసు చైన్నె కలెక్టరేట్ ఆవరణలోని ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి జయ వేల్ విచారించారు. విచారణను ముగించిన ప్రత్యేక కోర్టు గత ఏడాది ప్రారంభంలో తీర్పు వెలువరించింది. ఎస్వీశేఖర్కు నెల రోజులు జైలు శిక్ష, రూ. 15 వేలు జరిమాన విధించారు. అదే సమయంలో అప్పీల్కు అవకాశం కల్పించాలని ఎస్వీశేఖర్ తరపున న్యాయమూర్తికి న్యాయవాదులు విజ్ఞప్తి చేయడంతో సమయం కేటాయించారు. అప్పీలు పిటిషన్ను హైకోర్టు విచారణకు స్వీకరించడంతో జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి రాలేదు. ఈ పిటిషన్ విచారణ ప్రస్తుతం ముగిసింది. తీర్పును న్యాయమూర్తి వేల్ మురుగన్ వెలువరించారు. ప్రత్యేక కోర్టు విధించిన నెల రోజుల జైలు శిక్షను ఖరారు చేశారు. అప్పీల్ పిటిషన్ను తోసిపుచ్చారు. ఎస్వీ శేఖర్ తెలుగు వారికి కూడా పరిచయమే.. ఆకలి రాజ్యం,అందమైన అనుభవం,వల్లభ,ఒకే ఒక్కడు వంటి చిత్రాలలో ఆయన నటించారు. 100కు పైగా తమిళ సినిమాలలో మెప్పించారు. 2006లో ఏఐఏడీఎంకే పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచాడు.మహిళా జర్నలిస్ట్పై నీచమైన కామెంట్తమిళనాడులో చదువుకోని, ఇంగితజ్ఞానం లేని అమ్మాయిలే ఎక్కువగా మీడియాలో పనిచేస్తున్నారని ఒక మహిళా జర్నలిస్ట్ను ఉద్దేశిస్తూ.. 2018లో ఆయన ఒక పోస్ట్లో పేర్కొన్నారు. 'విశ్వవిద్యాలయాల కంటే, మీడియాలో లైంగిక వేధింపులు ఎక్కువగా ఉన్నాయి. వారు తమ బాస్లతో సన్నిహితంగా ఉంటూ అందుకు ఫలితంగా రిపోర్టర్లు, న్యూస్ యాంకర్లుగా ఉద్యోగాలు పొందుతున్నారు. సాధారణంగా, తమిళనాడులోని మీడియా మొత్తం నేరస్థులు, కిరాతకులు, దోపిడీదారుల చేతుల్లో చిక్కుకుంది.' అని పేర్కొన్నాడు. -
తమిళగ వెట్రి కళగం పార్టీపై వార్తలు.. నిజమేనా?
చెన్నై : 2026 అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ తమిళగ వెట్రి కగళం (టీవీకే) పార్టీని స్థాపించారు. అయితే ఆ పార్టీ గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇంతకి నెటింట్లో ట్రెండ్ అవుతున్న ఆ వార్త నిజమేనా? దీనిపై దళపతి విజయ్ ఏమన్నారు2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే- ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం పొత్తు పెట్టుకోనున్నాయని తమిళ ప్రధాన మీడియా సంస్థలు పలు కథనాల్ని ప్రచురించాయి. అందుకు గత అక్టోబర్ నెలలో టీవీకే పార్టీ తొలి బహిరంగ సభలో విజయ్ చేసిన వ్యాఖ్యలే నిదర్శనమని కొన్ని ఆధారాల్ని జత చేశాయి.అక్టోబర్లో విల్లుపురం జిల్లా విక్రవాండిలోని వీసాలై గ్రామంలో తమిళగ వెట్రి కళగం ఆవిర్భావోత్సవం, సిద్ధాంతాల వేడుకైన పార్టీ తొలి బహిరంగ సభ జరిగింది. ఆ సభలో విజయ్ డీఎంకే, బీజేపీని టార్గెట్ చేస్తూ మాట్లాడారు. అయితే ఎక్కడా ఏఐఏడీఎంకే గురించి ఎక్కడా మాట్లాడలేదని హైలెట్ చేశాయి.అయితే, ఈ కథనాలపై విజయ్ ఎక్స్ వేదికగా స్పందించారు. ఏఐఏడీఎంకేతో టీవీకే పొత్తు అనేది పూర్తిగా అబద్ధమని ఖండించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మిత్రపక్షాలు లేకుండా టీవీకే ఒంటరిగా పోటీ చేస్తుంది. ప్రజల మద్దతుతో మెజారిటీ స్థానాల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. రాజకీయ విశ్లేషకుల ముసుగులో మీడియా సంస్థలు, సోషల్ మీడియాలో అసత్య ప్రచారం జరుగుతుందని, ఇలాంటి అవాస్తవ, తప్పుడు వార్తలను పట్టించుకోవద్దని తమిళనాడు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను’అని టీవీకే ఎక్స్ వేదికగా వివరణిచ్చింది. தலைமை நிலையச் செயலக அறிவிப்புதமிழக வெற்றிக் கழகத்தின் முதல் மாநில மாநாட்டில் கழகத்தின் கொள்கைகள், கொள்கை எதிரி, அரசியல் எதிரி, தேர்தல் நிலைப்பாடு குறித்தும் தமது உரையில் கழகத் தலைவர் அவர்கள் தெளிவாக, விளக்கமாக எடுத்துரைத்துள்ளார். கழகத் தலைவர் அவர்களின் வழிகாட்டுதலின்படி…— TVK Party Updates (@TVKHQUpdates) November 18, 2024 -
‘విజయ్ పార్టీది.. కాపీ, కాక్టెయిల్ భావజాలం’
చెన్నై: తమిళనాడు స్టార్ హీరో విజయ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టి.. ఇప్పటికే తమిళగ వెట్రి కళగం(టీవీకే) పేరుతో పార్టీని స్థాపించారు. ఆయన పార్టీ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలవనుంది. ఈ సందర్భంగా ఆదివారం విల్లుపురంలో నిర్వహించిన సభలో.. టీవీకే పార్టీ సిద్ధాంతాలు, భవిష్యత్ కార్యాచరణను ప్రకటించారు. ఈ భారీ బహిరంగ సభకు లక్షల సంఖ్యలో విజయ్ అభిమానులు హాజరైన విషయం తెలిసిందే.అయితే.. తాజాగా రాజకీయాల్లో విజయ్ చెప్పిన భావజాలాన్ని డీఎంకే పార్టీ కొట్టిపారేసింది. ఆయన పార్టీ సిద్ధాంతాలపై అధికార డీఎంకే పార్టీ నేత విమర్శలు గుప్పించారు. విజయ్ తన పార్టీ సిద్ధాంతాలు, భావజాలాన్ని ఇతర పార్టీల నుంచి కాపీ కొట్టారని డీఎంకే నేత టీకేఎస్ ఇలంగోవన్ అన్నారు. విజయ్ పార్టీ సిద్ధాంతాలు, భావజాలం.. ప్రధాన ప్రతిపక్షమైన ఏఐఏడీఎంకే, ఇతర పార్టీల ప్రస్తుత రాజకీయ దృక్కోణాల ‘కాక్టెయిల్’ అని ఎద్దేవా చేశారు. ‘‘అవన్నీ మా విధానాలు, కానీ విజయ వాటిని కాపీ చేశాడు. ఆయన ఏది చెప్పినా.. అది మేం ఇప్పటికే చెప్పాం, ఇప్పటికీ మేం వాటిని అనుసరిస్తున్నాం’’అని అన్నారు.ఇక.. నిన్న( ఆదివారం) విజయ్ తన తొలి బహిరంగ సభ ప్రసంగంలో అధికార డీఎంకే పార్టీ లక్ష్యంగా విమర్శలు చేశారు. ద్రవిడియన్ మోడల్ పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. అదేవిధంగా ద్రవిడ, తమిళ జాతీయవాద సిద్ధాంతాలను తమ పార్టీ అనుసరిస్తామని తెలిపారు. తమిళనాడు గడ్డకు అవీ రెండు కళ్ల లాంటివన్నారు. లౌకిక, సామాజిక న్యాయ సిద్ధాంతాలే మా పార్టీ భావజాలమని ఆయన స్పష్టం చేశారు. పెరియార్ ఈవీ రామస్వామి, కె.కామరాజ్, బాబాసాహెబ్ అంబేడ్కర్, వేలు నాచియార్, అంజలి అమ్మాళ్ ఆశయాలతో పార్టీని ముందుకు తీసుకెళ్తామని విజయ్ వెల్లడించారు. నాకు రాజకీయ అనుభవం లేకపోయినా భయపడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. తొలి సభలోనే డీఎంకే, బీజేపీపై విమర్శలు గుప్పించారు. -
జ్యోతిష్యం ఫలిస్తుంది!
సాక్షి, చెన్నై: జ్యోతిష్యం ఫలిస్తుందని, 2026లో రాష్ట్రంలో అన్నాడీఎంకే అధికార పగ్గాలు చేపట్టడం ఖాయమని ఆపార్టీ ప్రధాన కార్యదర్శి పళణిస్వామి ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం సేలంలో జరిగిన పార్టీ నేతల సమావేశానంతరం పళణిస్వామి మీడియాతో మాట్లాడారు. డీఎంకే కూటమిలో పొగచిచ్చుగా మారడం ఖాయం అన్నారు. 41 నెలల డీఎంకే పాలనలో నోరెత్తని కూటమి పారీ్టల నేతలు ఇప్పడు విమర్శలు గుప్పించడాన్ని ప్రతిఒక్కరూ పరిగణించాలన్నారు. ఈ పరిణామం చీలిక కాదా అని ప్రశ్నించారు. పళని స్వామి జ్యోతిష్కుడు అయ్యాడని సీఎం వ్యాఖ్యలు చేశారని గుర్తుచేశారు. వాస్తవమే జ్యోతిష్యం ఫలిస్తుందని 2026లో రాష్ట్రంలో అధికారం అన్నాడీఎంకే గుప్పెట్లోకే అని ధీమా వ్యక్తంచేశారు. దేశంలోనే తమిళనాడు అవినీతిలో ముందంజలో ఉందని ధ్వజమెత్తారు. అన్నాడీఎంకేలో యువత రావాలని, యువతను ఆకర్షించే కార్యక్రమాలు విస్తృతంచేయనున్నట్టు పేర్కొన్నారు. పళణికి నోటీసులు.. పళణిస్వామికి మద్రాసు హైకోర్టు శుక్రవారం నోటీసులు జారీ చేసింది. మాదక ద్రవ్యాల అక్రమ రవాణాలో గతంలో సినీ నిర్మాత జాఫర్ సాధిక్ అరెస్టయిన విషయం తెలిసిందే. ఈ ఘటనను అస్త్రంగా చేసుకుని డీఎంకేపై పళణిస్వామి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పార్టీ పేరుకు కళంగం తెచ్చే విధంగా వ్యవహరించారని ఆయనపై డీఎంకే సీనియర్ నేత ఆర్ఎస్ భారతీ రూ.కోటి పరువు నష్టం దావా దాఖలు చేశారు. ఈ పిటిషన్ను న్యాయమూర్తి టికారాం విచారించారు. వాదనల అనంతరం వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని పళణిస్వామికి నోటీసులు జారీ చేశారు. -
టైం వచ్చింది.. నా రీఎంట్రీ మొదలైంది: శశికళ
సాక్షి, చైన్నె: అన్నాడీఎంకే రాజకీయాలలో తన ప్రవేశానికి సమయం ఆసన్నమైందని దివంగత సీఎం జయలలిత నెచ్చెలి శశికళ వ్యాఖ్యానించారు. చైన్నెలో ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడారు. అన్నాడీఎంకే కార్యకర్తల పార్టీ అని అన్నారు. ఈ పార్టీని దివంగత నేతలు ఎంజీఆర్, జయలలిత చెక్కు చెదరకుండా పరిరక్షించారని వివరించారు. అయితే, ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు తీవ్ర ఆందోళన, మనో వేదనకు గురి చేస్తున్నాయన్నారు. కుల మతాలకు అతీతంగా అన్నాడీఎంకేలో అందర్నీ దివంగత నేత జయలలిత చూసే వారు అని గుర్తుచేశారు. కుల, మతం చూసి ఉంటే తనను దగ్గర చేర్చి ఉంటారా? అని ప్రశ్నించారు. ఆమెకు అందరూ సమానం అని, అందుకే ఆమెను ప్రజలు అమ్మగా కొలుస్తూ వస్తున్నారన్నారు. అయితే ప్రస్తుతం అన్నాడీఎంకేలోకి కులం ప్రవేశించిందని, ఓ సామాజిక వర్గంకు చెందిన వారు వ్యక్తిగత స్వలాభం, ఆధిపత్యం దిశగా చేస్తున్న ప్రయత్నాలు పార్టీని పాతాళంలోకి నెడుతున్నదని ఆరోపించారు. అన్నాడీఎంకే అంటే ఒకే కుటుంబం అని, ఇది కార్యకర్తల పార్టీ అని వ్యాఖ్యలు చేశారు. డీఎంకే అంటే ఒకే కుటుంబం అని ఆ కుటుంబానికి చెందిన వారికే అందులో పదవులు ఉంటాయని విమర్శించారు. డీఎంకే విధానాన్ని అన్నాడీఎంకేలోకి అనుమతించే ప్రసక్తేలేదన్నారు. తన లక్ష్యం ఒక్కటే అని అందర్నీ ఏకం చేయడం అన్నాడీఎంకేను బలోపేతం చేసి రానున్న ఎన్నికలలో విజయంతో అధికారం చేజిక్కించుకోవడమేనని అన్నారు. ఇందుకోసం తన ప్రయత్నం మొదలెట్టానని, తన ప్రవేశానికి సమయం ఆసన్నమైందని, ఇక, మరింత వేగంగా ముందుకెళ్లబోతున్నట్టు శశికళ తెలిపారు. -
అన్నాడీఎంకేలో నా పార్టీ విలీనం చేయను: టీటీవీ దినకరన్
చెన్నై: తమిళనాడు లోక్సభ ఎన్నికల ఫలితాలపై అన్నాడీఎంకే ఘోర ఓటమికి ఆ పార్టీ నేత ఎడప్పాడి కె పళనిస్వామి క్షమాపణలు చెప్పాలని అమ్మ మక్కల్ మున్నేట్ర కజగం (ఏఎంఎంకే) జనరల్ సెక్రటరీ టీటీవీ దినకరన్ అన్నారు. తంజావురులో ఆయన మీడియాతో మాట్లాడారు. అన్నాడీఎంకే పార్టీ ప్రస్తుతం డబ్బులు ఉన్నవారి చేతిలో చిక్కుకుందన్నారు.కేవలం కార్యర్తలు మాత్రమే దివంగత జయలలిత అభిమానులని తెలిపారు. ప్రస్తుతం అన్నాడీఎంకే పార్టీకి నాయకత్వం దారితప్పిందని విమర్శలు చేశారు. అటువంటి పార్టీలో తన పార్టీని ఎట్టిపరిస్థితుల్లోను విలీనం చేయబోనని నకరన్ అన్నారు. అన్నాడీఎంకే తన పార్టీని విలీనం అస్సలు సాధ్యంకాదని తేల్చిచెప్పారు. లోక్సభ ఎన్నికల్లో సుమారు 20 స్థానాల్లో అన్నాడీఎంకే ఓటు షేర్ తగ్గిందని తెలిపారు. మరోవైపు ఎన్డీయే కూటమి అనూహ్యంగా 18.5 శాతం ఓటు షేర్ను సాధించిందని అన్నారు. అన్నాడీఎంకే తగ్గిన ఓటు షేర్ను గమనిస్తే.. ఆ పార్టీకి మైనార్టీ కులాల నుంచి మద్దతు పడిపోయిందన్నారు. విక్రవంది అసెంబ్లీ ఉప ఎన్నిక అభ్యర్థిని ఎన్డీయే కూటమి పక్షాలు అన్నీ చర్చించుకోని నిర్ణయిస్తామని అన్నారు. ఇక.. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ కూటమికి ఎలాంటి నిబంధనలు లేకుండా టీటీవీ దినకరన్ మద్దతు ఇచ్చిన విషయం తెలిసిందే. -
TN: జయలలితపై అన్నామలై సంచలన వ్యాఖ్యలు
సాక్షి, చెన్నై: తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై మాజీ సీఎం, దివంగత జయలలితపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు రాష్ట్రంలో జయలలిత ‘‘హిందుత్వ నాయకురాలి’గా ఉందని అన్నారు. ఆమె అందరికంటే ఉన్నతమైన హిందుత్వ నాయకురాలిగా అభివర్ణించారు. ఇటీవల ఆయన జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. జయలలిత మరణం తరువాత అన్నాడీఎంకే హిందుత్వ భావజాలానికి దూరమైందని అన్నారు. అనంతరం తమిళనాడులో ఏర్పడిన శూన్యతను పూరించడానికి బీజేపికీ మంచి అవకాశం ఉందని అన్నారు.‘జయలలిత జీవించి ఉన్నంత వరకు ఆమె తమిళనాడులో అందరికన్నా చాలా ఉన్నతమైన హిందుత్వ నాయకురాలు. 2014కి ముందు, బీజేపీతొ జయలలిత వంటి లీడర్లు కలిసి ఉన్నప్పుడు, హిందుత్వ భావజాలం ఉన్న ఓటర్ల సహజంగానే జయలలితను తమ ఛాయిస్గా ఎన్నుకుంటారు. ఆమె తన హిందూత్వ భావజాలాన్ని బహిరంగంగా ప్రదర్శించేవారు’ అని అన్నామలై పేర్కొన్నారు. బీజేపీ నేతలు కాకుండా అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి మద్దతు పలికిన వారిలో దేశంలోనే తొలి రాజకీయ నాయకురాలు జయలలిత అని తెలిపారు. 2002-03లో తమిళనాడులో మతమార్పిడి నిరోధక చట్టాన్ని రూపొందించారని ప్రస్తావించారు. మరోవైపు అన్నామలై ప్రకటనపై జయలలిత సన్నిహితురాలు వీకే శశికళ ఘాటుగా స్పందించారు., అన్నామలై చేసిన ఈ వ్యాఖ్యలు జయలలితపై ఆయనకున్న అజ్ఞానాన్ని, అపార్థాన్ని తెలియజేస్తున్నాయని పేర్కొంది. జయలలిత లాంటి ప్రజానాయకురానికి ఎవరూ ఇరుకున పెట్టలేరని శశికళ అన్నారు.జయలలిత తన చివరి శ్వాస వరకు ఎంజీఆర్ చూపిన బాటలోనే నిజమైన ద్రవిడ నాయకురాలిగా జీవించారని తెలిపారు. హిందువులు, క్రైస్తవులు, ముస్లింలు ఇలా అన్ని వర్గాల వారు కీర్తించుకునే నాయకురాలని, అమ్మ కుల మత అడ్డంకుల్ని అధిగమించిన గొప్ప నాయకురాలని కొనియాడారు. ప్రజల జీవితాలను మెరుగుపరిచేందుకు ఆమె తన జీవితాన్ని అంకితం చేశారని అన్నారు. జయలలితకు దేవుడిపై నమ్మకం ఉందనే విషయం అందరికీ తెలిసిందేనని, అయితే ఆమె ఎప్పుడూ ఒకే మతాన్ని నమ్మలేదని శశికళ అన్నారు. అందరినీ సమానంగా చూసే ఏకైక నాయకురాలు జయలలిత అని శశికళ అన్నారు. -
Lok sabha elections 2024: ఆ ఏడు స్థానాల్లోబిగ్ ఫైట్
లోక్సభ సీట్లపరంగా దక్షిణాదిన అతి పెద్ద రాష్ట్రమైన తమిళనాడులో పోలింగ్కు సర్వం సిద్ధమైంది. మొత్తం 39 స్థానాలకూ శుక్రవారం తొలి దశలోనే ఎన్నికలు పూర్తవనున్నాయి. ఈ ద్రవిడనాడులో ఎప్పుడూ డీఎంకే, అన్నాడీఎంకే మధ్య ద్విముఖ పోటీయే రివాజు. ఈసారి అన్నాడీఎంకే బలహీనపడిపోగా దాని స్థానాన్ని క్రమంగా బీజేపీ చేజిక్కించుకుంటున్నట్టు కని్పస్తోంది. డీఎంకేకు కమళదళం గట్టి పోటీ ఇస్తోందని పరిశీలకులు చెబుతున్నారు. సొంతంగా రికార్డు సంఖ్యలో స్థానాలు గెలిచినా ఆశ్చర్యం లేదంటున్నారు. అంతేగాక చాలా స్థానాల్లో డీఎంకే భాగ్యరేఖలను బీజేపీ మార్చేసేలా కని్పస్తోందని సమాచారం. గత లోక్సభ ఎన్నికల్లో డీఎంకే, కాంగ్రెస్ కూటమి ఏకంగా 38 సీట్లు కైవసం చేసుకుంది. ఈ విడత వాటికి సీట్లు బాగా తగ్గుతాయని అంచనా. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై పాదయాత్రతో బీజేపీకి తమిళనాట సానుకూల వాతావరణం ఏర్పడినట్టు కనిపిస్తోంది. దీంతో బీజేపీ ఓటు బ్యాంక్ ఏకంగా రెండంకెలకు చేరుతుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో పలు హాట్ సీట్లలో పోటీ మరింత రసవత్తరంగా మారింది... కోయంబత్తూర్ బీజేపీ గెలుపుపై గట్టిగా నమ్మకం పెట్టుకున్న స్థానాల్లో ఇదొకటి. అన్నామలై ఇక్కడ పోటీలో నిలిచారు. తాను గెలిస్తే నియోజకవర్గంలో ఐఐఎంతో పాటు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ), నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) శాఖలను ఏర్పాటు చేయిస్తానని ఆయన హామీ ఇచ్చారు. దివంగత సీఎం కె.కామరాజ్ పేరిట 24 గంటలూ మొబైల్ ఆహారశాలలు అందుబాటులో ఉండేలా చూస్తామన్నది బీజేపీ హామీల్లో మరొకటి. ఇక్కడ 1999లో బీజేపీ తరఫున సి.పి.రాధాకృష్ణన్ విజయం సాధించారు. తర్వాత డీఎంకే మిత్రపక్షాలైన సీపీఐ, సీపీఎం గెలుస్తూ వస్తున్నాయి. 2014లో మాత్రం అన్నాడీఎంకే అభ్యర్థి పి.నాగరాజన్ నెగ్గారు. అయితే గత రెండు లోక్సభ ఎన్నికల్లోనూ బీజేపీ ఇక్కడ రెండో స్థానంలో ఉండటం విశేషం. ఈసారి మోదీ మేనియాకు అన్నామలై పాపులారిటీ తోడై బీజేపీ గెలుస్తుందన్న అంచనాలున్నాయి. డీఎంకే నుంచి పి.రాజ్కుమార్, అన్నాడీఎంకే నుంచి సింగై రామచంద్రన్ పోటీలో ఉన్నారు. తూత్తుకుడి ఇక్కడ త్రిముఖ పోటీ నెలకొంది. డీఎంకే తరఫున సిట్టింగ్ ఎంపీ, దివంగత సీఎం కరుణానిధి కూతురు, సీఎం స్టాలిన్ సోదరి కనిమొళి మరోసారి బరిలోకి దిగారు. ఎన్డీఏ భాగస్వామి తమిళ మానిల కాంగ్రెస్ (మూపనార్) నుంచి విజయశీలన్, అన్నాడీఎంకే నుంచి ఆర్.శివస్వామి వేలుమణి బరిలో ఉన్నారు. కనిమొళి 2019లో వేలుమణిపై ఏకంగా 3.47 లక్షల మెజారిటీతో ఘనవిజయం సాధించడం విశేషం. అయితే వేలుమణి స్థానికంగా బాగా పట్టున్న నేత. పుత్తూర్ బోన్ అండ్ జాయింట్ సెంటర్ అధినేత. చారిత్రకంగా ఇక్కడి నుంచి డీఎంకే లేదంటే అన్నాడీఎంకే గెలుస్తూ వస్తున్నాయి. ఈసారి మాత్రం స్థానిక అంశాలను బాగా ప్రస్తావిస్తూ విజయశీలన్ ఓటర్లకు దగ్గర అవుతున్నారు. బీజేపీ దన్ను కూడా ఆయనకు బాగానే కలిసొస్తోంది. ఈసారి సౌత్ నుంచి బీజేపీ నుంచి పోటీ చేస్తున్న తమిళసై సౌందరరాజన్ 2019 తూత్తుకుడిలో 2,15,934 ఓట్లు సాధించి రెండో స్థానంలో నిలవడం విశేషం! చెన్నై సౌత్ ఈ ఎన్నికల ముందు దాకా తెలంగాణ గవర్నర్గా ఉన్న తమిళిసై సౌందరరాజన్ హుటాహుటిన రాజీనామా చేసి చెన్నై సౌత్ నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగారు. బీజేపీ నేతగానే గాక డాక్టర్గా కూడా ఈ నియోజకవర్గానికి ఆమె చిరపరిచితులే. దీనికి తోడు ఇక్కడ బ్రాహ్మణ ఓటర్లు బాగా ఉండడం ఆమెకు మరింత కలిసొచ్చే అంశం. 2019లో ఇక్కడ డీఎంకే తరఫున తమిళాచి తంగపాండియన్ 2.62 లక్షల ఓట్ల మెజారిటీతో అన్నాడీఎంకే అభ్యర్థి జయవర్ధన్పై గెలిచారు. ఆమె మాజీ మంత్రి తంగపాండియన్ కుమార్తె కావడంతో తమ సంస్థాగత బలంతో మరోసారి గెలుపు తమదేనన్న ధీమాతో డీఎంకే ఉంది. ఇక్కడ కూడా త్రిముఖ పోటీ ఉంది. నీలగిరీస్ ఇది ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం. డీఎంకే నేత ఎ.రాజా ఇక్కడ బలమైన నేతగా ఉన్నారు. 2009, 2019 లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించారు. 2019లోనైతే ఏకంగా 5.47 లక్షల ఓట్లు (54.2 శాతం) సొంతం చేసుకున్నారు! అయితే యూపీఏ హయాంలో కేంద్ర మంత్రిగా 2జీ కుంభకోణం ఆరోపణల దెబ్బకు 2014 ఎన్నికల్లో ఇక్కడ ఆయన ఓటమి చవిచూశారు. గత రెండు ఎన్నికల్లో బీజేపీ ఇక్కడ పోటీ చేయలేదు. ఈ విడత కేంద్ర మత్స్య శాఖ మంత్రి ఎల్.మురుగన్ను బరిలో దింపింది. ఈ నియోజకవర్గంలో బడగాస్ సామాజికవర్గ ప్రాబల్యం ఎక్కువ. సనాతన ధర్మాన్ని హేళన చేస్తూ రాజా చేసిన వ్యాఖ్యలు వారిలో తీవ్ర ఆగ్రహం కలిగించాయి. దాంతో ఈసారి రాజా గెలుపు సులభం కాదన్నది విశ్లేషకుల అంచనా. కృష్ణగిరి ఒకప్పుడు మూడు రాష్ట్రాల పోలీసులను గజగజలాడించిన గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ పెద్ద కుమార్తె విద్యారాణి వీరప్పన్ బరిలో దిగడంతో ఇక్కడ పోటీ ఆసక్తికరంగా మారింది. వృత్తిరీత్యా ఆమె న్యాయవాది అయిన ఆమె నామ్ తమిళార్ కచ్చి (ఎన్టీకే) పార్టీ తరఫున తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. విద్యారాణి 2020లో బీజేపీలో చేరి పార్టీ యువజన విభాగం వైస్ ప్రెసిడెంట్గా చేశారు. ఇక్కడ కాంగ్రెస్ నుంచి కె.గోపీనాథ్, అన్నాడీఎంకే నుంచి వి.జయప్రకాశ్, బీజేపీ నుంచి సి.నరసింహన్ పోటీలో ఉన్నారు. 2019లో కాంగ్రెస్ తరఫున ఎ.చెల్లకుమార్ ఘన విజయం సాధించారు. 1991 దాకా ఇక్కడ కాంగ్రెస్ హవాయే నడిచింది. తర్వాత ప్రధానంగా డీఎంకే, అన్నాడీఎంకే పోటీ ఉండేది. ఈ విడత కాంగ్రెస్ సిటింగ్ ఎంపీని మార్చడం, వీరప్పన్ కుమార్తె బరిలో ఉండటం పోటీపై ఆసక్తిని పెంచింది. రామనాథపురం ఏకంగా మూడుసార్లు తమిళనాడు ముఖ్యమంత్రిగా (రెండుసార్లు జయలలిత న్యాయ సమస్యల్లో చిక్కినప్పుడు, మూడోసారి ఆమె మరణానంతరం) పనిచేసిన ఒ.పన్నీర్సెల్వం రాజకీయ భవిష్యత్ ఇప్పుడు రామనాథపురం ఓటర్ల చేతిలో ఉంది. జయలలితకు అత్యంత విశ్వాసపాత్రుడైన ఆయనను అంతా ఓపీఎస్ అని పిలుచుకుంటారు. జయ మరణానంతరం అన్నాడీఎంకే ఆయన్ను బయటకు పంపేసింది. దాంతో ఓపీఎస్ ఈసారి బీజేపీ మద్దతుతో రామనాథపురం నుంచి పోటీలో ఉన్నారు. దీనికి తోడు ఇక్కడి కుల సమీకరణాలు కూడా ఓపీఎస్కు బాగా అనుకూలంగా ఉన్నాయి. సిట్టింగ్ ఎంపీ కె.నవాన్ ఖని (ఐయూఎంఎల్) ఓపీఎస్కు గట్టి పోటీ ఇస్తున్నారు. మత్య్సకారుల సమస్య ఇక్కడ ప్రధానాంశం. ఈ నేపథ్యంలో కచ్చతీవు దీవి అంశాన్ని బీజేపీ ఇటీవల ప్రముఖంగా ప్రస్తావిస్తుండడం ఓపీఎస్కు మరింత కలిసొస్తుందని భావిస్తున్నారు. తేని జయలలిత తర్వాత అన్నాడీఎంకే సారథి కావాలన్న శశికళ కల కూడా నెరవేరకపోయినా ఆమె వారసుడైన టీటీవీ దినకరన్ తేని లోక్సభ స్థానం నుంచి బరిలో ఉన్నారు. ఆయన అమ్మ మక్కల్ మున్నేట్ర కజగం (ఏఎంఎంకే) పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆయనకు ఓపీఎస్ దన్నుంది. వీరిద్దరూ ఒకే కులానికి చెందినవారు. ఒకరి విజయానికి ఒకరు సంపూర్ణంగా సహకరించుకుంటున్నారు. వీరిద్దరికీ బీజేపీ మద్దతిస్తోంది. పైగా తేని సిట్టింగ్ ఎంపీ పి.రవీంద్రనాథ్ పన్నీర్సెల్వం కుమారుడే. తండ్రి ఆదేశాల మేరకు ఆయన కూడా దినకరన్ విజయానికి పూర్తిగా సహకరిస్తున్నారు. దీనికి తోడు ఓపీఎస్ స్వస్థలం తేని జిల్లాయే. దాంతో ఇక్కడ ఆయనకున్న పట్టు దినకరన్కు మరింత కలిసొస్తుందని భావిస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
త్రిముఖ పోరు : తెలంగాణ మాజీ గవర్నర్ తమిళసై గెలిచేనా?
చెన్నై : దక్షిణ చెన్నై పార్లమెంట్లో త్రిముఖ పోరు సాగుతోంది. గెలుపుపై ఎవరి ధీమా వారు వ్యక్తం చేసుకుంటూ ప్రచారంలో దూసుకెళ్తున్నారు. పార్లమెంట్ స్థానం అధికార పార్టీ డీఎంకేకి కంచుకోటే అయినప్పటికీ అక్కడ హోరాహోరీ పోరు కొనసాగనుంది. అయితే ఈ త్రిముఖ పోరులో తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ విజయం సాధిస్తారా? తమిళనాడులో దక్షిణ చెన్నై లోక్సభ స్థానం హాట్సీట్ మారింది. డీఎంకే కంచుకోటలో త్రిముఖపోరు జరగబోతుంది. ప్రస్తుత డీఎంకే సిట్టింగ్ అభ్యర్ధి తమిళచి తంగపాండియన్పై తమిళనాడు మాజీ గవర్నర్ తమిళసై సౌందరరాజన్, ఏఐఏడీఎంకే తరుపున జే. జయవర్ధన్ తలపడనున్నారు. గవర్నర్ పదవినే వదులుకున్నా ఈ తరుణంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా తమిళసై సౌందరరాజన్ జాతీయ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో తమిళసై మాట్లాడుతూ.. ‘ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. లోక్సభ ఎన్నికల్లో విజయం సాధిస్తాననే నమ్మకం నాకుంది. గెలిచిన వెంటనే దక్షిణ చెన్నైలో మంచి మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ నియోజకవర్గంతో నాకు ఎనలేని అనుంబంధం ఉంది. నియోజకవర్గ ప్రజలకు సేవ చేసేందుకు గవర్నర్ పదవిని సైతం వదులుకున్నట్లు తెలిపారు. నియోజకవర్గానికి రోగ నిరోధక శక్తి పెరగాలి తమిళసై స్వతహాగా వైద్యురాలు కావడంతో ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం దక్షిణ చెన్నైకి ఎలాంటి మందులు ఇస్తారంటూ మీడియా అడిగిన ప్రశ్నలకు నియోజకవర్గం మొత్తం చెత్త, డంపింగ్ యార్డులతో నిండిపోయింది. ముందు నియోజకవర్గానికి రోగనిరోధక శక్తి పెరగాలి. ఆపై రవాణా, పరిశుభ్రత, దోమల బెడదపై దృష్టి సారిస్తామని సూచించారు. వారిదే కీలకం ఈసారి లోక్సభ ఎన్నికల్లో బీజేపీ పట్టాలి మక్కల్ కట్చి (పీఎంకే)తో సైతం పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో పోటి చేస్తుంది. తమిళనాడులోని ఉత్తర ప్రాంతంలో పీఎంకే ప్రాభవం ఎక్కువగా ఉంది. ఇక్కడ అత్యంత వెనుకబడిన తరగతులకు (ఎంబీసీలు) చెందిన వన్నియార్లు ఎక్కువ శాతం నియోజకవర్గాల్లో ఆయా పార్టీల అభ్యర్ధుల గెలుపు, ఓటుముల్ని నిర్ధేశించడంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. మరి ఈ సారి లోక్సభ ఎన్నికల్లో అదృష్టం ఎవరిని వరిస్తుందో చూడాల్సి ఉంది. -
ద్రవిడ నేలపై కమలం వికసించేనా?
స్టేట్ స్కాన్ దక్షిణాదిని పాదాక్రాంతం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతున్న బీజేపీ ఈ లోక్సభ ఎన్నికల్లో ప్రధా నంగా తమిళనాడుపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. ద్రవిడ పార్టీల ఆవిర్భావంతో దశాబ్దాలుగా జాతీయ పార్టీలకు ఆ రాష్ట్రం కొరకరాని కొయ్యగా మారిపోయింది. డీఎంకే, అన్నాడీఎంకేల్లో ఏదో ఒకదానికి తోక పార్టీగా కొనసాగడం మినహా కాంగ్రెస్, బీజేపీలకు మరో దారి లేని పరిస్థితి! ఈసారి ఈ పరిస్థితిని ఎలాగైనా మార్చాలని బీజేపీ కంకణం కట్టుకుంది. కె.అన్నామలై రాష్ట్ర బీజేపీ పగ్గాలు చేపట్టిన నాటినుంచీ దూకుడుగా వెళ్తున్నారు. రాష్ట్రమంతటా కలియదిరుగుతూ ఇటు జనాన్ని ఆకట్టుకుంటున్నారు. మంత్రుల అవినీతిపై వీడియోలు విడుదల చేస్తూ అటు అధికార డీఎంకేకు వణుకు పుట్టిస్తున్నారు. రాష్ట్రంలోని మొత్తం 39 లోక్సభ స్థానాలకూ ఏప్రిల్19న తొలి విడతలోనే పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో తమిళనాట ఎన్నికల వేడి ఇప్పటికే పరాకాష్టకు చేరింది... జాతీయ పార్టీలతో కుర్చిలాట తమిళనాట 50 ఏళ్లుగా ద్రవిడ పార్టీలైన డీఎంకే, అన్నాడీఎంకేలదే హవా. రాష్ట్రంలో కాంగ్రెస్కు 1967లో డీఎంకే తొలిసారి ఓటమి రుచి చూపింది. 234 అసెంబ్లీ స్థానాలకు గాను ఏకంగా డీఎంకే 179 చోట్ల గెలవగా కాంగ్రెస్ 51 స్థానాలకు పరిమితమైంది. నాటినుంచి నేటిదాకా రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాలేకపోయింది! కరుణానిధితో విభేదాలతో 1972లో ఎంజీ రామచంద్రన్ డీఎంకేను చీల్చి అన్నాడీఎంకేను ఏర్పాటు చేశారు. నాటినుంచీ వాటి మధ్యే ప్రధాన పోరు సాగుతూ వస్తోంది. జాతీయ రాజకీయాల్లో సంకీర్ణ యుగం ఆవిర్భావంతో 1989 నుంచి రెండు దశాబ్దాల పాటు కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటులో డీఎంకే, అన్నాడీఎంకే కీలక పాత్ర పోషించాయి. ఆ క్రమంలో రాష్ట్రంలోనూ కాంగ్రెస్, బీజేపీలతో మార్చి మార్చి పొత్తు పెట్టుకుంటూ వస్తున్నాయి. డీఎంకే 2004 దాకా కాంగ్రెస్కు బద్ధ విరోధిగా కొనసాగింది. అన్నాడీఎంకే కేంద్రంలో వాజ్పేయి ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించడంతో 1999లో బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమిలో చేరింది. కానీ 2004లో అన్నాడీఎంకే మళ్లీ ఎన్డీఏ గూటికి చేరడంతో డీఎంకే తన వైఖరి మార్చుకుని కాంగ్రెస్తో చేతులు కలిపింది. నాటినుంచీ 2014లో మినహాయిస్తే వాటి బంధం అన్ని ఎన్నికల్లోనూ కొనసాగుతూ వస్తోంది. ఇక అన్నాడీఎంకే తాను తొలిసారి ఎన్నికల బరిలో 1977లో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంది. తర్వాత 1984 నుంచి 1991 ఎన్నికల దాకా వాటి బంధం సాగింది. 1998లో తొలిసారి బీజేపీతో చేతులు కలిపినా ఏడాదికే మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరింది. 2004లో మళ్లీ బీజేపీతో జట్టు కట్టింది. అప్పటినుంచీ కాంగ్రెస్ను దూరం పెట్టింది. 2004 లోక్సభ ఎన్నికల్లో ఘోర పరాజయం నేపథ్యంలో 2009, 2014 ఎన్నికల్లో బీజేపీతో బంధం తెంచుకుంది. 2019లో మళ్లీ ఎన్డీఏలో చేరినా ఈసారి మాత్రం ఒంటరిగానే పోటీ చేస్తోంది. చిన్న పార్టీలైన పీఎంకే, ఎండీఎంకే కూడా పరిస్థితిని బట్టి డీఎంకే, అన్నాడీఎంకేలతో పొత్తు పెట్టుకుంటూ వస్తున్నాయి. పొత్తులు ఇలా... డీఎంకే ఈసారి కూడా చిరకాల మిత్రులు కాంగ్రెస్, వామపక్షాలతో పొత్తు పెట్టుకోగా అన్నాడీఎంకే మాత్రం బీజేపీతో దూరం పాటిస్తోంది. దివంగత నటుడు విజయ్కాంత్కు చెందిన డీఎండీకేతో పొత్తు పెట్టుకుంది. ఇక బీజేపీ ఈసారి పీఎంకే, ఏఎంఎంకే, టీఎంసీ (ఎం) వంటి చిన్న పార్టీలతో జట్టు కట్టింది. 1999లో రాష్ట్రంలో అత్యధికంగా 4 లోక్సభ స్థానాల్లో నెగ్గిన బీజేపీ ఈసారి ఆ రికార్డును అధిగమించాలని పట్టుదలతో ఉంది. పోలింగ్ తేదీ సమీపిస్తుండటంతో ప్రధాని నరేంద్ర మోదీ తమిళనాట పర్యటనలతో హోరెత్తిస్తున్నారు. ఈ మధ్యకాలంలోనే రాష్ట్రానికి ఆయన ఏకంగా ఆరుసార్లు వచ్చారు. ఎవరి సర్వేలు ఏమంటున్నాయి... సీఎన్ఎన్–న్యూస్ 18 సర్వే ఈసారి ఎన్డీఏకు రాష్ట్రంలో 5 సీట్ల దాకా వస్తాయని పేర్కొనగా ఇండియాటుడే సర్వే మాత్రం మొత్తం 39 సీట్లనూ విపక్ష ఇండియా కూటమి క్లీన్స్వీప్ చేస్తుందని జోస్యం చెప్పింది. ఎవరెన్ని సీట్లలో... తమిళనాట ఎన్డీఏ, ఇండియా, అన్నాడీఎంకే కూటముల మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. ఇండియా కూటమిలో డీఎంకే 22 లోక్సభ స్థానాల్లో పోటీ చేస్తోంది. కాంగ్రెస్కు 9, వామపక్షాలకు 4, ఇతర పార్టీలకు మరో 4 స్థానాలు కేటాయించింది. ఎన్డీఏ కూటమి విషయానికొస్తే బీజేపీ 20 చోట్ల, పీఎంకే 10, టీఎంసీ(ఎం) 3, ఏఎంఎంకే 2 చోట్ల, ఇతర పార్టీలు మూడింట బరిలో ఉన్నాయి. మరోచోట ఎన్డీఏ మద్దతుతో ఒ.పనీర్సెల్వం స్వతంత్రునిగా బరిలో దిగుతున్నారు. ఇక అన్నాడీఎంకే 32 స్థానాల్లో పోటీ చేస్తోంది. డీఎండీకేకు 5, ఇతరులకు 2 సీట్లు కేటాయించింది. యువ ఓటర్లపైనే బీజేపీ ఆశలు... తమిళనాట బీజేపీ ప్రధానంగా యువ ఓటర్లపైనే ఆశలు పెట్టుకుంది. ద్రవిడ పార్టీలతో విసిగిపోయారని, మార్పు కోసం చూస్తున్నారని నమ్ముతోంది. బీజేపీ రాష్ట్ర సారథి అన్నామలైకి వారిలో ఆదరణ నానాటికీ పెరుగుతోందని పరిశీలకులు చెబుతున్నారు. దీనికితోడు ద్రవిడ పార్టీల నేతలపైనా బీజేపీ కన్నేసింది. ఇప్పటికే అన్నాడీఎంకేకు చెందిన ఒక మాజీ ఎంపీ, 17 మంది మాజీ ఎమ్మెల్యేలు ఇటీవలే బీజేపీలో చేరారు. దక్షిణ తమిళనాట పదేళ్లుగా తమకు గట్టి పునాదే ఏర్పడిందని పార్టీ భావిస్తోంది. అక్కడి కొంగు ప్రాంతంలో పార్టీకి సంస్థాగతంగా చెప్పుకోదగ్గ బలమే ఉంది. దీనికితోడు కోయంబత్తూరు నుంచి రాష్ట్ర పార్టీ సారథి అన్నామలై పోటీ చేస్తున్నారు. పీఎంకేతో పొత్తు ద్వారా ఉత్తర తమిళనాడులో తన బలహీనతను అధిగమిస్తానని బీజేపీ భావిస్తోంది. 2014లోనూ ఇలాగే చిన్న పార్టీలతో జట్టు కట్టి బీజేపీ ఏకంగా 19 శాతం ఓట్లు రాబట్టడమే గాక ఒక లోక్సభ స్థానాన్ని గెలుచుకుందని ఆ పార్టీ అభిమానులు గుర్తు చేస్తున్నారు. కాకపోతే అప్పటి భాగస్వాముల్లో డీఎండీకే, ఎండీఎంకే ఇప్పుడు ఎన్డీఏతో లేవు. పైగా ముక్కోణపు పోటీలో విపక్షాల ఓట్లు చీలి ఇండియా కూటమికే లబ్ధి చేకూరవచ్చన్న విశ్లేషణలున్నాయి. ఇక 2019 లోక్సభ ఎన్నికల్లో ప్రస్తుత ఇండియా కూటమి ఏకంగా 53 శాతం ఓట్లు ఒడిసిపట్టింది! ఎన్డీఏ కేవలం 10 శాతంతో సరిపెట్టుకోగా అన్నాడీఎంకే కూటమికి 21 శాతం వచ్చాయి. అయితే ఈసారి ఏఎంఎంకే వంటి భాగస్వాములు అన్నాడీఎంకే ఓటు శాతానికి గండి కొట్టి తమవైపు మళ్లిస్తాయని బీజేపీ ఆశ పెట్టుకుంది. అన్నాడీఎంకే ఓట్లను ఏకంగా మూడొంతల దాకా ఒడిసిపట్టడంతో పాటు మోదీ చరిష్మా, స్టాలిన్ సర్కారుపై వ్యతిరేకత సాయంతో ఇండియా కూటమి ఓట్లలోనూ 10 శాతం దాకా ఎన్డీఏ కొల్లగొట్టగలిగితే 7 సీట్ల దాకా నెగ్గవచ్చని విశ్లేషకుల అంచనా. కాకపోతే అన్నాడీఎంకే ఓటు శాతానికి అంతగా గండి పెట్టడం బీజేపీకి పెనుసవాలే! ప్రచారంలో సినీ తళుకులు.. బీజేపీ తరఫున సినీ నటులు ఖుష్బూ, ఇటీవలే తన పార్టీని విలీనం చేసిన శరత్ కుమార్, సెంథిల్ ప్రచారంలో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నారు. డీఎంకేకు కమల్హాసన్, అన్నాడీఎంకేకు గౌతమి, గాయత్రీ రఘురాం తదితర సినీ స్టార్లు ప్రచారం చేయనున్నారు. -
డీఎంకే ప్రజా వ్యతిరేకం.. మండిపడ్డ అన్నాడీఎంకే నేత
తమిళనాడు: సార్వత్రిక ఎన్నికలకు దేశం మొత్తం సిద్ధమవుతోంది. జాతీయ పార్టీల దగ్గర నుంచి ప్రాంతీయ పార్టీల వరకు అన్నీ కూడా తమదైన రీతిలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాయి. ఈ తరుణంలో తమిళనాడులో డీఎంకే, ఏఐఏడీఎంకే కూడా పోటాపోటీగా బరిలో నిలిచాయి. ప్రస్తుతం డీఎంకే ప్రభుత్వం ప్రజా వ్యతిరేక ప్రభుత్వమని, ప్రజలకు చేసిందేమీ లేదని ఏఐఏడీఎంకే అభ్యర్థి జే జయవర్ధన్ ఆరోపించారు. ఈయన సౌత్ చెన్నై లోక్సభ స్థానం నుంచి ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (ఏఐఏడీఎంకే) అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. డీఎంకే ప్రజావ్యతిరేక పార్టీ, ప్రజావ్యతిరేక ప్రభుత్వం అని జయవర్ధన్ పేర్కొన్నారు. డీఎంకే ప్రభుత్వంలో ఏ నియోజక వర్గంలోనూ అభివృద్ధి జరగలేదని అన్నారు. ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం ఏమీ చేయలేదని, హామీలను నెరవేర్చలేదని ఆరోపించారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో దక్షిణ చెన్నై నియోజకవర్గంలో ఏఐఏడీఎంకే తప్పకుండా గెలుస్తుంది. పార్టీ విజయం కోసం కార్యకర్తలు ఎంతో ఉత్సాహంతో పనిచేస్తున్నట్లు కనిపిస్తోందని అన్నారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తుది జాబితాను గురువారం అన్నాడీఎంకే ప్రకటించింది. అన్నాడీఎంకే కూటమిలో ఏఐఏడీఎంకే 32 స్థానాల్లో, డీఎండీఎంకే 5 స్థానాల్లో, ఎస్డీపీఐ 1 స్థానంలో, పుతియా తమిళగం 1 స్థానంలో పోటీ చేయనున్నాయి. మొత్తమ్ ఈ 39 స్థానాలకు ఏప్రిల్ 19న సార్వత్రిక ఎన్నికల తొలి దశలో ఓటింగ్ జరగనుంది. ఆ తరువాత జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. #WATCH | Tamil Nadu: Dr J Jayavardhan, AIADMK candidate from South Chennai says, "This is a consultation meeting with regards to how to work for the coming Lok Sabha election in South Chennai constituency...It is very well seen that the party cadres are with much enthusiasm… pic.twitter.com/Ff6u5pa6CA — ANI (@ANI) March 26, 2024 -
లోక్సభ ఎన్నికల బరిలో ‘కెప్టెన్’ విజయ్ కాంత్ కుమారుడు
చెన్నై, తమిళనాడు : డీఎండీకే అధినేత, దివంగత నటుడు విజయ్కాంత్ తనయుడు వి.విజయ్ ప్రభాకర్ లోక్సభ ఎన్నికల బరిలో దిగుతున్నారు. రానున్న లోక్సభ ఎన్నికల్లో నేషనల్ ప్రోగ్రెసివ్ ద్రావిడియన్ లీగ్ (డీఎండీకే) పార్టీ, రాష్ట్ర ప్రతిపక్ష పార్టీ ఏఐఏడీఎంకేల మధ్య పొత్తు కుదిరింది. అలయన్స్లో భాగంగా విజయ్ ప్రభాకర్ విరుధ్ నగర్ నుంచి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. ఇదే స్థానం నుంచి ప్రముఖ నటి రాధికా శరత్ కుమార్ బీజేపీ తరుపున టికెట్ దక్కించుకున్నారు. డీఎంకే - ఇండియా అలయన్స్ మాత్రం అభ్యర్ధిని ప్రకటించలేదు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి కెప్టెన్ కుమారుడు తమిళనాడు ప్రతిపక్ష పార్టీ ఏఐఏడీఎంకే విడుదల చేసిన 16 మంది లోక్సభ అభ్యర్ధుల జాబితాలో కెప్టెన్ విజయ్ కాంత్ కొడుకు విజయ్ ప్రభాకర్ పేరును ప్రకటించింది. ఈ సందర్భంగా డీఎండీకే జనరల్ సెక్రటరీ, విజయ్ కాంత్ సతీమణి ప్రేమలత మాట్లాడుతూ.. తన కుమారు విజయ్కి రాజకీయాల పట్ల నిబద్ధత, ఇష్టం ఉన్నాయని, రానున్న లోక్సభ ఎన్నికలతో ప్రత్యక్ష రాజకీయాల్లో అడుగు పెడుతున్నట్లు తెలిపారు. ఏఐఏడీఎంకే మేనిఫెస్టో విడుదల ఏఐఏడీఎంకే పలు పార్టీలతో పొత్తు కుదుర్చుకుంది. వాటిల్లో డీఎండీకే, సోషల్ డెమోక్రాటిక్ పార్టీ ఆఫ్ ఇండియా, పుతియా తమిజగం నేతృత్వంలో మొత్తం 39 లోక్సభ స్థానాలకు గాను 32 స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ సందర్భంగా ఎన్నికల మేనిఫెస్టోని సైతం విడుదల చేసింది. -
‘హలో.. నేను మీ జయలలితను మాట్లాడుతున్నా’
చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత జయలలిత మరణించి ఏడేళ్లు అవుతోంది. నేడు(శనివారం) ఆమె 76వ జయంతి సందర్భంగా ఏఐఏడీఎంకే జనరల్ సెక్రటరీ ఎడప్పాడి పళనిస్వామి(ఈపీఎస్), పలువురు సీనియర్ నేతలు, కార్యకర్తలు జయలలిత(అమ్మ)కు నివాళులు అర్పించారు. అయితే ఈసారి వినూత్నంగా ‘అమ్మ’ జయంతిని పురస్కరించుకొని.. పార్టీ కేడర్లో ఉత్సాహం నింపడానికి ఏఐఏడీఎంకే సరికొత్తగా ఆలోచించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)తో తయారుచేసిన ‘అమ్మ’వాయిస్ క్లిప్ను పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రదర్శించారు. ఈ సందర్భంగా ‘అమ్మ’తో ఉన్న అనుబంధాన్ని నేతలు గుర్తు చేసుకున్నారు. ఏఐ వాయిస్ క్లిప్లో అచ్చం ‘అమ్మ’నే పార్టీ నేతలు, కార్యకర్తలు ఉద్దేశించి మాట్లాడినట్టు ఉండటం విశేషం. ఆ ఏఐ క్లిప్లో దివంగత నేత జయలలిత ప్రసంగం ఇలా ఉంది... ‘హలో.. నేను మీ జయలలితను మాట్లాడుతున్నా. ఈ సాంకేతికతకు నా కృతజ్ఞతలు తెలుపుతున్నా. ఎందుకుంటే నేను మీతో మాట్లాడే అవకాశం ఇచ్చింది. మన పార్టీ చాలా ఎత్తుపల్లాలను చూసింది. మనం అధికారంలో ఉన్నో సమయంలో మహిళలు, విద్యార్థులకు అనేక సంక్షేమ పథకలు ప్రవేశపెట్టి అమలు చేశాం. மாண்புமிகு இதயதெய்வம் புரட்சித்தலைவி அம்மா அவர்களின் 76வது பிறந்தநாள் விழாவினை முன்னிட்டு, மாண்புமிகு கழக பொதுச்செயலாளர் புரட்சித்தமிழர் @EPSTamilNadu அவர்களின் வழிகாட்டுதலின்படி இன்றைக்கு தகவல் தொழில்நுட்பத்தின் உச்சமாகக் கருதப்படும் செயற்கை நுண்ணறிவு (Artificial Intelligence)… pic.twitter.com/APuSq7u6AW — AIADMK (@AIADMKOfficial) February 24, 2024 ...ప్రస్తుతం ఒకవైపు మనకు ద్రోహం చేసే కేంద్ర ప్రభుత్వం ఉంది. మరోవైపు అవినీతితో నిండిపోయిన పనికిరాని రాష్ట్ర ప్రభుత్వం ఉంది. నా పుట్టిన రోజు సందర్భంగా ఒకటి చెబుతున్నా.. మన పార్టీ నేతృత్వంలో ప్రజల ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రావాలి. మన కార్యకర్తలంతా నా మార్గంలో పార్టీ కోసం నడవాలని కోరుతున్నా. పార్టీకి, సోదురుడు ఎడప్పాడి పళనిస్వామి(ఈపీఎస్) మద్దతుగా నిలవాలి. ఈపీఎస్ నాయకత్వాని బలోపేతం చేయాలి. ఎందుకంటే మనం ప్రజల కోసమే ఉన్నాం’ అని జయలలిత స్వయంగా మాట్లాడినట్లు వాయిస్ వచ్చింది. దీంతో జయలలిత ఏఐ వాయిస్ క్లిప్ విన్న కార్యకర్తలంతా తమ అధినేత్రి జీవించి ఉన్నట్లుగానే అనిపించిందని భావోద్వేగం వ్యక్తం చేశారు. ఎడప్పాడి పళనిస్వామి(ఈపీఎస్) 2022లో ఏఐఏడీఎంకేకు నాయకత్వం వహిస్తున్నారు. పన్నీర్ సెల్వం పార్టీ నుంచి తొలగించబడిన అనంతరం ఎడప్పాడి పళనిస్వామి(ఈపీఎస్) పార్టీ చీఫ్గా కొనసాగుతున్నారు. -
రాజకీయ నాయకుడు అసభ్యకర కామెంట్స్.. త్రిష కీలక నిర్ణయం!
అన్నాడీఎంకే బహిష్కృత నేత ఏవీ రాజు హీరోయిన్ త్రిషపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆయన చేసిన కామెంట్స్పై పలువురు సినీతారలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతే కాకుండా ఈ విషయంలో త్రిష చట్టపరమైన చర్యలు తీసుకుంటానని ఇప్పటికే వెల్లడించింది. తన లీగల్ టీం దీనిపై న్యాయపరంగా ముందుకెళ్తుందని తెలిపింది. తాజాగా ఏవీ రాజు కామెంట్స్పై త్రిష టీం చర్యలకు దిగింది. ఆయనపై త్రిష పరువునష్టం దావా కేసు వేశారు. దీనికి సంబంధించిన నోటీసులను తన ట్విటర్లో పంచుకున్నారు. తన లీగల్ టీం ద్వారా ఏవీ రాజుకు నోటీసులు పంపించారు. కాగా.. గతంలో త్రిషపై లియో నటుడు మన్సూర్ అలీ ఖాన్ అసభ్యకర కామెంట్స్ చేశారు. కానీ ఆ తర్వాత తన వ్యాఖ్యల పట్ల క్షమాపణలు కోరారు. తాజాగా మరోసారి అన్నాడీఎంకే మాజీ లీడర్ ఏవీ రాజు త్రిషను ఉద్దేశించి చేసిన కామెంట్స్ కోలీవుడ్లో చర్చనీయాంశంగా మారాయి. ఆయన చేసిన కామెంట్లను కోలీవుడ్ సినీ తారలంతా మూకుమ్మడిగా ఖండించారు. త్రిషకు మద్దతుగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. గతంలో ఓ ఎమ్మెల్యే త్రిషకు డబ్బులిచ్చి రిసార్ట్కు తీసుకొచ్చారంటూ ఏవీ రాజు చేసిన కామెంట్స్ కోలీవుడ్లో హాట్ టాపిక్గా మారాయి. pic.twitter.com/DmRXHibIYx — Trish (@trishtrashers) February 22, 2024 -
'త్రిషపై వ్యాఖ్యలను ఖండించడం ఇష్టం లేదు'.. విశాల్ ట్వీట్ వైరల్!
స్టార్ హీరోయిన్ త్రిషపై అన్నాడీఎంకే మాజీ లీడర్ చేసిన కామెంట్స్ కోలీవుడ్లో హాట్ టాపిక్గా మారాయి. త్రిషను ఉద్దేశించి ఏవీ రాజు చేసిన కామెంట్స్ తీవ్ర దుమారానికి దారితీశాయి. తాజాగా దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో పెద్దఎత్తున వైరలైంది. ఈ నేపథ్యంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు త్రిష కూడా ట్వీట్ చేసింది. దీనిపై మా లీగల్ డిపార్ట్మెంట్ చర్యలు తీసుకుంటుందని తెలిపింది. ఏవీ రాజు వ్యాఖ్యలపై పలువురు సినీ తారలు మండిపడుతున్నారు. త్రిషకు మద్దతుగా ట్వీట్ చేస్తున్నారు. తాజాగా ఈ విషయంపై హీరో విశాల్ స్పందించారు. ఇలాంటి కామెంట్స్పై ట్విటర్ వేదికగా మండిపడ్డారు. ఒక రాజకీయ పార్టీకి చెందిన ఒక మూర్ఖుడు మా ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి గురించి చాలా అసహ్యంగా మాట్లాడారని విన్నా.. ఇదంతా కేవలం పబ్లిసిటీ కోసమే చేస్తారని నాకు తెలుసు అన్నారు. సెలబ్రిటీల గురించి నెగిటివ్ ప్రచారం చేసి డబ్బు సంపాదించడం ఇప్పుడు ట్రెండ్గా మారింది. భూమిపై ఉన్న అలాంటి రాక్షసుడిపై ప్రతీకారం తీర్చుకోవడానికి ట్వీట్ చేయడం నాకు నిజంగా బాధ కలిగించిందని విశాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాల్ తన ట్వీట్లో రాస్తూ..'ఒక రాజకీయ పార్టీకి చెందిన తెలివితక్కువ మూర్ఖుడు. మన సినీ వర్గానికి చెందిన ఒకరి గురించి చాలా అసహ్యంగా మాట్లాడారని విన్నా. ఇది పబ్లిసిటీ కోసం చేశారని నాకు తెలుసు. కాబట్టి మీ పేరును ప్రస్తావించను. మీరు టార్గెట్ చేసిన తన పేరును కూడా ప్రస్తావించను. ఎందుకంటే మేము మంచి స్నేహితులం మాత్రమే కాదు.. సినిమాల్లో సహచరులం కూడా. మీరు చేసిన పని తర్వాత మీ ఇంట్లో ఉన్న స్త్రీలు క్షేమంగా ఇంటికి తిరిగి రావాలని నేను కోరుకుంటున్నా.' అని రాసుకొచ్చారు. ఆ తర్వాత ప్రస్తావిస్తూ..' ఈ భూమిపై ఉన్న ఇలాంటి రాక్షసుడిపై ప్రతీకారం తీర్చుకోవడానికి ట్వీట్ చేయడం నాకు నిజంగా బాధ కలిగించింది. మీరు చేసిన పనిని చెప్పేందుకు కూడా మాటలు రావడం లేదు. నిజాయితీగా చెప్పాలంటే నాకు నిన్ను ఖండించడం ఇష్టం లేదు.. ఎందుకంటే నీకు ఇది చాలా తక్కువే అవుతుంది. అందుకే మీరు నరకంలో కుళ్లిపోవాలని కోరుకుంటున్నా. కళాకారుల సంఘం ప్రధాన కార్యదర్శిగా ఈ ప్రకటన చేయాలనే ఉద్దేశ్యం నాకు లేదు. కానీ ఒక మనిషిగా చెబుతున్నా. మీరు భూమిపై ఉన్నంత వరకు మనిషిలాగా ఎప్పటికీ ఉండలేరు. ప్రస్తుతం సెలబ్రిటీల గురించి నెగిటివ్ ప్రచారం చేసి డబ్బు సంపాదించడం ఒక ట్రెండ్గా మారింది. డబ్బు కోసమే అయితే మంచి ఉద్యోగం సాధించండి. లేదా కనీసం ప్రాథమిక క్రమశిక్షణ నేర్చుకోవడానికి బిచ్చగాడిగానైనా కెరీర్ ప్రారంభించండి' అంటూ తనదైన శైలిలో విశాల్ కౌంటరిచ్చారు. I just heard that a stupid idiot from a political party spoke very ill and disgustingly about someone from our film fraternity. I will not mention your name nor the name of the person you targeted because I know you did it for publicity. I definitely will not mention names… — Vishal (@VishalKOfficial) February 20, 2024 -
త్రిషపై మరోసారి అలాంటి కామెంట్స్.. ఇంతటి నీచానికి దిగుజారుతారా?
గతేడాది లియోతో సూపర్ హిట్ కొట్టిన భామ త్రిష. విజయ్ సరసన హీరోయిన్గా నటించి బ్లాక్బస్టర్ను తన ఖాతాలో వేసుకుంది. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా సూపర్ హిట్గా నిలిచింది. అయితే ఈ చిత్రంలో ఓ పాత్ర పోషించిన నటుడు మన్సూర్ అలీ ఖాన్ చేసిన కామెంట్స్ పెద్దఎత్తున వివాదస్పదమయ్యాయి. ఏకంగా కోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. మన్సూర్ అలీ ఖాన్ చేసిన వ్యాఖ్యలపై పలువురు సినీతారలు మండిపడ్డారు. అయితే తాజాగా అన్నాడీఎంకే మాజీ లీడర్ ఏవీ రాజు చేసిన అసభ్యకర కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. త్రిషపై ఆయన మాట్లాడిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇది చూసిన అభిమానులు, నెటిజన్స్ అతనిపై మండిపడుతున్నారు. తక్షణమే అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంలో త్రిషకు పలువురు అండగా నిలుస్తున్నారు. త్రిషను ఉద్దేశించి ఏవీ రాజు చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో పెద్దఎత్తున వైరలవుతోంది. (ఇది చదవండి: త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యలు.. ఫైనల్గా వివరణ ఇచ్చిన మన్సూర్!) తాజాగా ఈ విషయంపై హీరోయిన్ త్రిష స్పందించింది. ఫేమస్ కావడం కోసం ఏంతటి నీచానికైనా దిగజారిపోయే జీవితాలు అవీ.. పదే పదే ఇలాంటి నీచమైన మనుషులను చూస్తుంటే చాలా అసహ్యంగా ఉంది. దీనిపై త్వరలోనే న్యాయపరంగా కఠిన చర్యలు తీసుకుంటానని తెలిపింది. దీనిపై మా లీగల్ డిపార్ట్మెంట్ తదుపరి చర్యలు తీసుకుంటుందని ట్విటర్లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ టాపిక్ కోలీవుడ్ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కాగా.. త్రిష ప్రస్తుతం మెగాస్టార్ సరసన విశ్వంభర చిత్రంలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. అసలేం జరిగిందంటే.. గతంలో ఓ ఎమ్మెల్యే డబ్బులిచ్చి త్రిషను రిసార్ట్కు తీసుకొచ్చారని ఇటీవలే పార్టీ నుంచి బహిష్కరణకు గురైన ఏవీ రాజు కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు కోలీవుడ్ తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇది చూసిన పలువురు ఇండస్ట్రీ ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా త్రిషపై అసభ్యంగా మాట్లాడిన ఏవీ రాజును అరెస్ట్ చేయాలని నటుడు, దర్శకుడు చేరన్ డిమాండ్ చేశారు. ఇలాంటి వారిపై నటీనటుల సంఘం తగిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఎలాంటి సాక్ష్యాధారాలు లేకుండా బహిరంగంగా సినీ పరిశ్రమలోని సభ్యులను కించపరిచేలా మాట్లాడుతున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు. WTF this Trisha should file legal action against him,nowdays these guys are behaving very cheaply #Trisha | #TrishaKrishnan pic.twitter.com/Ip1ZClB8xS — Sekar 𝕏 (@itzSekar) February 20, 2024 It's disgusting to repeatedly see low lives and despicable human beings who will stoop down to any level to gain https://t.co/dcxBo5K7vL assured,necessary and severe action will be taken.Anything that needs to be said and done henceforth will be from my legal department. — Trish (@trishtrashers) February 20, 2024 வன்மையாக கண்டிக்கிறேன்.. எந்த ஆதரமுமின்றி பொது வெளியில் திரைத்துறையினர் பற்றி பெயர் சொல்லி அவதூறு கிளப்பிய இவரை சட்டமும் காவல்துறையும் உரிய நடவடிக்கை எடுக்க வேண்டும்... @VishalKOfficial @Karthi_Offl நடிகர் சங்கம் இதற்கு தகுந்த பதிலும் நடவடிக்கையும் எடுக்கும் என நம்புகிறேன் https://t.co/fRNYxH5DAV — Cheran (@directorcheran) February 20, 2024 Shocked & disgusted by the behaviour of Ex AIADMK functionary A. V. Raju for making unwarranted , baseless, loose and completely false allegations about Trisha. It is 2024; we talk about women empowerment & equality - why drag an unrelated person into personal mud slinging. There… — Aditi Ravindranath (@aditi1231) February 20, 2024 -
అన్నాడీఎంకేలో చేరిన సీనియర్ నటి గౌతమి
-
ట్రాన్స్ జెండర్పై అనుచిత వ్యాఖ్యలు..
చెన్నై: ట్రాన్స్జెండర్ వ్యాపారవేత్త, ఏఐఏడీఎంకే అధికారి ప్రతినిధి అప్సరా రెడ్డిని అప్రతిష్టపాలు చేసిన ఓ యూట్యూబర్కు మద్రాస్ హైకోర్టు రూ.50 లక్షల జరిమానా విధించింది! ఆమె ప్రొవోగ్ మేగజీన్లో పని చేసిన రోజుల్లో మైకేల్ ప్రవీణ్ అనే సహోద్యోగితో విభేదాలొచ్చాయి. దాంతో అతను అప్సరను కించపరుస్తూ 10 వీడియోలను యూట్యూబ్లో పోస్ట్ చేశాడు. ప్రవీణ్ నుంచి రూ.1.25 కోట్లు పరిహారం కోరుతూ కోర్టులో పిటిషన్ వేశారు. ఆమెకు రూ.50 లక్షలు చెల్లించాలని కోర్టు ఆదేశించింది. ‘‘సోషల్ మీడియాలో పోస్టులతో ఇతరుల గోప్యతకు భంగం కలిగించొద్దు. ఏ హక్కయినా పరిమితులకు లోబడి ఉంటుంది’’ అని పేర్కొంది. -
తమిళనాడు డిప్యూటీ సీఎంగా ఉదయనిధి స్టాలిన్?
చెన్నై: డీఎంకే నేత, క్రీడా శాఖా మంత్రి ఉదయనిధి స్టాలిన్ను తమిళనాడు ఉపముఖ్యమంత్రిగా చేయనున్నారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఫిబ్రవరిలో స్టాలిన్ విదేశీ పర్యటనకు వెళ్లే క్రమంలో ఉదయనిధిని డిప్యూటీ సీఎం హోదాలో ఉంచనున్నారని డీఎంకే వర్గాలు తెలిపాయి. జనవరి 21న సేలంలో జరగనున్మ పార్టీ యూత్ వింగ్ సమావేశం తర్వాత దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఉదయనిధిని డిప్యూటీ సీఎంగా చేసేది ముఖ్యమంత్రి మాత్రమేనని డీఎంకే ఆర్గనైజేషనల్ సెక్రటరీ ఎళంగోవన్ అన్నారు. ఉదయనిధిని డిప్యూటీ సీఎంగా చేయనున్నారనే విషయం తనకు తెలియదని చెప్పారు. అయినప్పటికీ ఉదయనిధి పార్టీలో చాలా చురుకుగా ఉంటారు.. డిప్యూటీ సీఎం హోదా ఇవ్వడంలో ఎలాంటి తప్పులేదని చెప్పారు. ఈ అంశంపై ఉదయనిధిని ప్రశ్నించగా.. ఆయన పుకారుగా పేర్కొన్నారు. ఉదయనిధిని ఉపముఖ్యమంత్రిగా చేస్తున్నారనే వార్తలపై అన్నా ద్రవిడ మున్నేట్ర కళగం(ఏఐఏడీఎంకే) విమర్శించింది. ఉదయనిధికి ఎన్నికల్లో టికెట్ ఇచ్చారు.. ఆ తర్వాత మంత్రిగా అవకాశం ఇచ్చారు. ఇప్పుడు ఏకంగా ఉపముఖ్యమంత్రిగా ఎన్నుకుంటారు. 2026లో ఉదయనిధిని ముఖ్యమంత్రిని కూడా చేయాలనుకుంటారు. డీఎంకేలో పరివార్ వాదానికే ప్రాధాన్యం ఉందని, ప్రజాస్వామ్యం లేదని ఏఐఏడీఎంకే నేతలు విమర్శించారు. ఇదీ చదవండి: మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జుపై అవిశ్వాసానికి పిలుపు -
అన్నాడీఎంకేలో చీలికకు బీజేపీ యత్నం
అన్నాడీఎంకేలో చిచ్చుపెట్టే దిశగా బీజేపీ వ్యూహాలు పన్నుతోందనే ప్రచారం ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఆ పార్టీలో సీనియర్గా ఉన్న ఎస్పీ వేలుమణిని అస్త్రంగా చేసుకుని పళణి స్వామికి వ్యతిరేకంగా కేంద్రపెద్దలు పావులు కదుపుతున్నట్లు సమాచారం. ఫలితంగా అన్నాడీఎంకే నుంచి త్వరలో ఓ ఏక్నాథ్ షిండే వస్తారని, మహారాష్ట్ర తరహా రాజకీయం తమిళనాడులో చూడబోతున్నామనే ప్రచారం సామాజిక మాధ్యమాల్లో ఊపందుకుంది. సాక్షి, చైన్నె: ఎన్డీయే కూటమి నుంచి అన్నాడీఎంకే ఇటీవల బయటకు వచ్చిన విషయం తెలిసిందే. అదే సమయంలో పళణిస్వామి నేతృత్వంలోని అన్నాడీఎంకే వర్గాలు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలైను టార్గెట్ చేసి విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టే పనిలో పడ్డారు. రాయబారానికి, సామరస్యానికి చోటు లేదని స్పష్టం చేస్తూ, ఇక బీజేపీతో పొత్తు ప్రసక్తే లేదని తేల్చి చెబుతున్నారు. ఈ పరిణామాలను బీజేపీ అధిష్టానం పెద్దలు నిశితంగా పరిశీలిస్తున్నారు. అయితే అన్నాడీఎంకేకు వ్యతిరేకంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా సంయమనం పాటిస్తున్నారు. అదే సమయంలో కొత్త వ్యూహాలకు సైతం పదును పెట్టినట్లు తెలుస్తోంది. చిచ్చు ప్రయత్నాలు అన్నాడీఎంకే సీనియర్లలో ఎస్పీ వేలుమణి కీలక నేత. ఆయనపై అనేక కేసులు సైతం పెండింగ్లో ఉన్నాయి. ఈ కేసులను అస్త్రంగా చేసుకుని ఆయన్ని తమ దారికి తెచ్చుకునేందుకు బీజేపీ వ్యూహ రచన చేస్తున్నట్టు ప్రచారం ఊపందుకుంది. ఎస్పీ వేలుమణి ద్వారా అన్నాడీఎంకేలో చిచ్చు పెట్టే అస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నట్లు చర్చ జోరందుకుంది. అన్నాడీఎంకేలో ఎస్పీ వేలుమణి ఓ ఏక్నాథ్ షిండే (మహారాష్ట్ర సీఎం) అన్న ట్యాగ్లైన్తో సామాజిక మాధ్యమాల్లో పోస్టులు వైరల్గా మారాయి. మహారాష్ట్రలో శివసేన నేత ఉద్దవ్ ఠాక్రేను ఏవిధంగా ఏక్నాథ్ షిండే కూల దోశాడో..అదే తరహాలో పళణిస్వామికి ఎస్పీ వేలుమణి చుక్కలు చూపించబోతున్నట్లు ప్రచారం ఊపందుకుంది. ఇది కాస్త అన్నాడీఎంకేలో కొత్త చర్చకు దారి తీశాయి. దీంతో ఎస్పీ వేలుమణి స్పందించారు. తాను అప్పుడు.. ఇప్పుడు..ఎల్లప్పుడూ అన్నాడీఎంకేకు విశ్వాస పాత్రుడినే అని స్పష్టం చేశారు. తాను సైకిల్ యాత్ర చేసిన ఫొటోను ట్యాగ్ చేస్తూ తన సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారాలకు ముగింపు పలికే ప్రయత్నం చేశారు. ఇదిలా ఉండగా, అన్నాడీఎంకే కూటమి సీఎం అభ్యర్థిగా అన్నామలైను ప్రకటించాలని బీజేపీ ఒత్తిడి తీసుకు రావడంతోనే కూటమి నుంచి తాము బయటకు వచ్చామని అన్నాడీఎంకే సీనియర్ నేత, మాజీ మంత్రి కరుప్పన్నన్ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. బీజేపీకి వారి బలం ఏమిటో లోక్ సభ ఎన్నికలు స్పష్టం చేస్తాయని మరో సీనియర్ నేత కేపీ మునుస్వామి వ్యాఖ్యానించారు. నేడు అమిత్ షాతో అన్నామలై అన్నాడీఎంకే కటీఫ్ ప్రకటన నేపథ్యంలో ఢిల్లీ నుంచి వచ్చిన పిలుపుతో అన్నామలై అన్ని అస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నారు. ఆదివారం ఢిల్లీలో కేంద్ర హోంశాఖమంత్రి అమిత్ షాతో ఆయన భేటీ కానున్నారు. దూకుడు మీదున్న అన్నామలై అమిత్ షా ముందు కొత్త ప్రతిపాదనను ఉంచేందుకు సిద్ధమైనట్లు చర్చ ఊపందుకుంది. రాష్ట్రంలో ఒంటరిగా పోటీ చేయడానికి అనుమతి ఇవ్వాలని అమిత్షాను ఆయన కోరే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. అప్పుడే తమిళనాడులో బీజేపీ బలం ఏమిటో తెలుస్తుందని, అందుకు అనుగుణంగా భవిష్యత్తుకు కార్యాచరణ సిద్ధం చేయవచ్చు అనే విషయాన్ని తెలియజేస్తూ ఓ నివేదికను సిద్ధం చేసుకుని మరీ ఆయన ఢిల్లీ వెళ్తున్నట్లు బీజేపీ వర్గాలు పేర్కొంటున్నాయి. పళణి కొత్త ప్రయత్నాలు బీజేపీతో ఇక దోస్తీ లేదని తేల్చిన అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి స్వామి కొత్త కూటమి ప్రయత్నాల్లో నిమగ్నమైనట్లు సమాచారం. బలమైన కూటమి దిశగా తమతో కలిసి రావాలని పీఎంకే, తమిళ మానిల కాంగ్రెస్, డీఎండీకేలకు ఆహ్వానం పలికేవిధంగా రాయబార ప్రయత్నాలు మొదలెట్టినట్లు సంకేతాలు వెలువడ్డాయి. ఈ మూడు పార్టీలతోపాటు కొన్ని చిన్న పార్టీలను తన వైపునకు తిప్పుకునే దిశగా ప్రయత్నాలను జరుగుతున్నట్లు చర్చ జరుగుతోంది. డీఎంకేలో అసంతృప్తిగా ఉన్న కొన్ని చిన్న పార్టీలను సైతం కలుపుకునే ప్రయత్నంలో పళణిస్వామి ఉన్నట్లు అన్నాడీఎంకే నేతలు పేర్కొంటున్నారు. -
తమిళనాట బీజేపీ పాలి‘ట్రిక్స్’.. మరో కొత్త ఎత్తుగడ?
చెన్నై: తమిళనాడులో పొలిటికల్ హీట్ కొనసాగుతున్న వేళ మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. అన్నాడీఎంకే బహిష్కృత నేత, తమిళనాడు మాజీ సీఎం పన్నీర్సెల్వం ఆసక్తికర కామెంట్స్ చేశారు. బీజేపీ జాతీయ నాయకత్వం తనతో సంప్రదింపులు జరుపుతోందని వ్యాఖ్యలు చేశారు. దీంతో, తమిళనాడు రాజకీయం హాట్ టాపిక్గా మారింది. బీజేపీ కొత్త ప్లాన్.. అయితే, తమిళనాడులో అన్నాడీఎంకే.. ఎన్డీయే కూటమి నుంచి బయటకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కొత్త కూటమిని ఏర్పాటు చేయనున్నట్టు పార్టీ ప్రతినిధి మునుస్వామి స్పష్టం చేశారు. 2024 ఎన్నికల నాటికి కొత్త కూటమితోనే బరిలోకి దిగుతామన్నారు. మరోవైపు.. అన్నాడీఎంకే బహిష్కృత నేత పన్నీరు సెల్వం బాంబు పేల్చారు. పళనిస్వామి.. బీజేపీతో తెగదెంపులు చేసుకున్న వెంటనే ఆ పార్టీ తనను సంప్రదించినట్టు తెలిపారు. బీజేపీ జాతీయ నాయకత్వం తనతో సంప్రదింపులు జరుపుతున్నదని, కూటమిపై బీజేపీ ప్రకటన చేసిన తర్వాతనే తన వైఖరి వెల్లడిస్తానని ఆయన పేర్కొన్నారు. Chennai | Former Tamil Nadu CM O Panneerselvam said, "The BJP leadership has been in regular touch with me (in recent times)... Will the AIADMK accept if the BJP asks for replacing (AIADMK general secretary) Palaniswami? Will they replace him? Then how can they ask to change BJP… pic.twitter.com/7xCrBCzHbZ — ANI (@ANI) September 29, 2023 పళణిస్వామిపై సెటైర్లు.. ఇదే సమయంలో అన్నాడీఎంకేపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ రాష్ట్ర చీఫ్ అన్నామలైని మార్చాలని అన్నాడీఎంకే.. కమలం పార్టీపై ఒత్తిడి తీసుకువచ్చిందనే ప్రచారంపై ఆయన స్పందించారు. అన్నాడీఎంకేకు పళనిస్వామిని మార్చాలని బీజేపీ కోరితే ఆ పార్టీ అంగీకరిస్తుందా అని ఎదరు ప్రశ్నించారు. బీజేపీ ఒత్తిడికి తలొగ్గి పళనిస్వామిని మార్చేస్తుందా అని అన్నారు. బీజేపీ రాష్ట్ర నాయకత్వాన్ని మార్చాలని ఎలా అడుగుతారని విమర్శలు చేశారు. అలా అడిగే హక్కు పళనిస్వామి పార్టీకి లేదని సీరియస్ అయ్యారు. అయితే, పన్నీరు సెల్వం.. బీజేపీతో కలిస్తే ఇప్పటి వరకు అన్నాడీఎంకేతో ఉన్న కేడర్ కమలం పార్టీ సపోర్టు చేసే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. దీంతో, పళనిస్వామి వర్గానికి ఎదురుదెబ్బ తగిలే ఛాన్స్ ఉందంటున్నారు. ఇది కూడా చదవండి: ఇస్కాన్పై సంచలన ఆరోపణలు.. మేనకా గాంధీకి బిగ్ షాక్ -
తమిళనాట రసవత్తర రాజకీయం.. అన్నాడీఎంకే కీలక ప్రకటన
చెన్నై: తమిళనాడు రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఇటీవలే ఎన్డీయేకు గుడ్ బై చెప్పిన అన్నాడీఎంకే తాజాగా మరో కీలక ప్రకటన చేసింది. వచ్చే పార్లమెంటు ఎన్నికల కోసం కొత్త కూటమిని ఏర్పాటు చేస్తామని అన్నాడీఎంకే వెల్లడించింది. ఈ క్రమంలో తమిళనాడులో అధికార పార్టీ డీఎంకే, బీజేపీ పార్టీపై అన్నాడీఎంకే నేతలు ఘాటు విమర్శలు చేశారు. 2024 ఎన్నికల నాటికి కొత్త కూటమి.. అయితే, తమిళనాడులోకి క్రిష్ణగిరిలో అన్నాడీఎంకే నేత మునుస్వామి మీడియాతో మాట్లాడుతూ.. తమిళనాడు సీఎం స్టాలిన్, ఆయన కొడుకు ఉదయనిధి స్టాలిన్ చెబుతున్నట్టు తాము బీజేపీతో తాము కూటమిలో లేమని స్పష్టం చేశారు. మేం బీజేపీతో పొత్తు తెంచుకుంటే ఎలా ఉంటుందో వారికి తెలుసు. అందుకే భయంతో వారు ఈ వ్యాఖ్యలు చేస్తున్నారు. బీజేపీతో నాలుగేళ్ల బంధాన్ని తెంచుకున్నట్టు తెలిపారు. పళానిస్వామి సారథ్యంలో కొత్త కూటమిని ఏర్పాటు చేసి నాయకత్వం వహిస్తామన్నారు. 2024 లోక్సభ ఎన్నికల కోసం కొత్త కూటమిని ఏర్పాటు చేస్తామన్నారు. అన్నామలైపై కీలక ప్రకటన.. ఇదే సమయంలో తాము తమిళనాడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అన్నమలైని పదవి నుంచి తొలగించాలని కోరలేదని స్పష్టం చేశారు. అన్నాడీఎంకే వంటి పెద్ద పార్టీ ఒక పార్టీని వారి రాష్ట్ర అధ్యక్షుడిని తొలగించాలని కోరుతుందని అనుకోవడం చిన్నపిల్లల మనస్తత్వం. మేం అలాంటి పొరపాటు ఎప్పుడూ చేయం. వేరే పార్టీ ఎలా పని చేయాలో చెప్పే అనాగరిక నేతలం మేం కాము. అన్నాడీఎంకే అలాంటి పార్టీ కాదని వివరణ ఇచ్చారు. మరోవైపు.. అన్నాడీఎంకే సీనియర్ నేత జయకుమార్ మీడియాతో మాట్లాడుతూ, పార్టీ బలోపేతమే లక్ష్యంగా ఇకపై కార్యక్రమాలను విస్తృతం చేస్తామన్నారు. కొత్త కూటమి విషయంగా ఎన్నికల సమయంలో నిర్ణయం ఉంటుందని, తమ ప్రధాన కార్యదర్శి పళణిస్వామి అన్ని విషయాలను త్వరలో ప్రకటిస్తారన్నారు. స్పీడ్ పెంచిన పళణిస్వామి.. ఇదిలా ఉండగా.. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పగ్గాలు చేపట్టిన అనంతరం పళణి స్వామి పార్టీలో మార్పులు చేర్పులకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా ఖాళీగా ఉన్న ఆరు జిల్లాలకు కొత్త కార్యదర్శులను బుధవారం నియమించారు. మరికొన్ని జిల్లాల కార్యదర్శులలో స్వల్ప మార్పులు చేశా రు. అనుబంధ విభాగాలకు కార్యదర్శులను నియమించారు. ఈ మేరకు కన్యాకుమారి జిల్లా కార్యదర్శిగా మాజీ మంత్రి దళవాయి సుందరం, తిరుచ్చి మహానగర కార్యదర్శిగా మాజీ డిప్యూటీ మేయర్ శ్రీనివాసన్, పెరంబలూరు జిల్లా కార్యదర్శిగా మాజీ ఎమ్మెల్యే తమిళ్ సెల్వం, తంజావూరు తూర్పు కుంబకోణం కార్యదర్శి రామనాథన్, తంజావూరు సెంట్రల్ జిల్లా కార్యదర్శిగా శరవణన్, తేని జిల్లా (తూర్పు) కార్యదర్శిగా రామర్, (పశ్చిమం) జక్కయ్యన్ను నియమించారు. అలాగే, రాణి పేట, తిరువణ్ణామలై, తిరునల్వేలి, తదితర మరికొన్ని జిల్లాలలో కార్యదర్శులు మార్పు జరిగింది. అయితే, ఒక జిల్లా నుంచి మరోజిల్లాకు కార్యదర్శుల పోస్టులను బదిలీ చేసే రీతిలో నియామకాలు జరిగాయి. అన్నామలైకి ఢిల్లీ నుంచి పిలుపు.. ఇదిలా ఉండగా, అన్నాడీఎంకే తమను పక్కన పెట్టిన నేపథ్యంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అన్నామలైకు ఢిల్లీ నుంచి పిలుపురావడం గమనార్హం. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో అన్నామలై భేటీలో ఎలాంటి అంశాలు చర్చకు రానున్నాయో వేచి చూడాల్సిందే. అదే సమయంలో ఈ భేటీ తర్వాత తమను టార్గెట్ చేసి ఐటీ, ఈడీ దాడులకు బీజేపీ సిద్ధమయ్యే అవకాశాలు ఉన్నట్లు కొందరు అన్నాడీఎంకే సీనియర్లు పేర్కొంటుండడం గమనార్హం. ఇది కూడా చదవండి: మణిపూర్లో మళ్లీ ఉద్రిక్తతలు.. రంగంలోకి సీనియర్ ఐపీఎస్.. ఎవరీ రాకేష్ బల్వాల్! -
బీజేపీ – అన్నాడీఎంకే బంధానికి బ్రేక్.. ఎన్డీఏ కూటమికి బై..బై!
అనుకున్నదే అయ్యింది.. విమర్శలు ప్రతివిమర్శలు, అపనమ్మకాలు..ఆరోపణలు, ఎత్తులు.. పైఎత్తులతో ఇన్నాళ్లూ పడుతూ లేస్తూ సాగిన అన్నాడీఎంకే– బీజేపీ బంధానికి సోమవారం తెరపడింది. ఎన్డీయే కూటమని నుంచి ప్రధాన భాగస్వామి అయిన అన్నాడీఎంకే బయటకు వచ్చినట్లు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి పళణిస్వామి ప్రకటించారు. ఈ మేరకు పార్టీ జిల్లా కార్యదర్శుల సమావేశంలో స్పష్టం చేశారు. రాష్ట్రంలోని బీజేపీ నేతల తీరే ఈ నిర్ణయానికి కారణమని వెల్లడించారు. సాక్షి, చైన్నె: బీజేపీ – అన్నాడీఎంకే బంధానికి బ్రేక్ పడింది. ఎన్డీఏ కూటమికి బై..బై చెబుతూ సోమవారం అన్నాడీఎంకే కీలక ప్రకటన చేసింది. 2024 లోక్సభ ఎన్నికల్లో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి స్వామి నేతృత్వంలోనే కూటమి ఏర్పాటు అవుతుందని స్పష్టం చేశారు. ఈ మేరకు చైన్నెలో జరిగిన పార్టీ జిల్లా కార్యదర్శులు, రాష్ట్ర కమిటీ నేతలు, ఎంపీ, ఎమ్మెల్యేల సమావేశంలో నిర్ణయించారు. ఈ ప్రకటనతో అన్నాడీఎంకే వర్గాలు సంబరాల్లో మునిగిపోయాయి. వివరాలు.. అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మరణం తదుపరి చోటు చేసుకున్న పరిణామాలతో ఈ పార్టీ ప్రభుత్వంలో బీజేపీ జోక్యం పెరిగిన విషయం తెలిసిందే. సీఎంగా పగ్గాలు చేపట్టినానంతరం పళణి స్వామి 2017 నుంచి బీజేపీతో స్నేహ పూర్వకంగా మెలుగుతూ వచ్చారు. 2019 లోక్సభ ఎన్నికలతో పాటు 2021 అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలలోనూ బంధం పదిలం అన్నట్లుగానే ముందుకు సాగారు. అయితే, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా అన్నామలై పగ్గాలు చేపట్టినానంతరం రెండు పార్టీల మధ్య క్రమంగా దూరం పెరుగుతూ వచ్చింది. బీజేపీని బలోపేతం చేయడమే లక్ష్యంగా మిత్రపక్షం అన్నాడీఎంకేను సైతం అన్నామలై టార్గెట్ చేయడం వివాదానికి ఆజ్యం పోసింది. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణిస్వామితో పాటు దివంగత నేతలు అన్నాదురై, జయలలితకు వ్యతిరేకంగా అన్నామలై తీవ్ర వ్యాఖ్యలు చేయడం వివాదంగా మారింది. ఢిల్లీ పర్యటన తర్వాత మారిన సీను.. వారం క్రితం అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి స్వామి ఢిల్లీ పర్యటన అనంతరం పరిణామాలు వేగంగా మారాయి. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో చర్చల సమయంలో చోటు చేసుకున్న పరిణామాలను పళణి తీవ్రంగా పరిగణించినట్లు తెలుస్తోంది. తమ శత్రువులు పన్నీరు, దినకరన్ను బీజేపీ అక్కున చేర్చుకునే ప్రయత్నాలు చేస్తుండ డం, పుదుచ్చేరితోపాటు తమిళనాడులో 20 సీట్లను ఆశించడం వంటి సమాచారంతో బీజేపీతో ఇక కటీఫ్ అన్న నినాదాన్ని అన్నాడీఎంకే నేతలు అందుకున్నారు. సుదీర్ఘచర్చ తర్వాత కఠిన నిర్ణయం.. అన్నాడీఎంకే జిల్లాల కార్యదర్శుల సమావేశం సోమవారం సాయంత్రం రాయపేటలోని ఎంజీఆర్ మాళిగైలో జరిగింది. గంటన్నర పాటు జరిగిన ఈ సమావేశంలో జిల్లాల కార్యదర్శులు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర కమిటీ నేతలు ముక్తకంఠంతో బీజేపీతో తెగతెంపులు చేసుకోవాలని నినాదించారు. ఢిల్లీలో అమిత్షా చర్చల సమయంలో చోటు చేసుకున్న పరిణామాలు, అన్నామలైపై ఫిర్యాదు చేయడానికి వెళ్లిన పార్టీ నేతలకు ఎదురైన నిరాశపూరిత పరిణామాల గురించి సైతం ఈ సమావేశంలో చర్చించడం గమనార్హం. కూటమి నుంచి బయటకు వచ్చిన పక్షంలో ఎదురయ్యే పరిణామాలు, ఈడీ, ఐటీ, సీబీఐ దాడులు, వాటిని తిప్పికొట్టే విధంగా నేతలు సిద్ధమయ్యే విధంగా చర్చించారు. సుదీర్ఘర సమాలోచన అనంతరం పార్టీ నేతలు మునుస్వామి, జయకుమార్, ఎస్పీ వేలుమణి, నత్తం విశ్వనాథన్, దిండుగల్ శ్రీనివాసన్ మీడియా ముందుకు వచ్చారు. పళణి నేతృత్వంలోనే కూటమి మీడియాతో నేతలు మాట్లాడుతూ, తమ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో జరిగిన సమావేశంలో నేతలందరూ ఏకగ్రీవంగా తీర్మానం చేశామని వివరించారు. గత ఏడాది కాలంగా పథకం ప్రకారం రాష్ట్ర బీజేపీ నేతలు అన్నాడీఎంకే దివంగత నేతలను, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని గురిపెట్టి తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారని గుర్తు చేశారు. పురట్చి తమిళర్ పళణి స్వామి నేతృత్వంలో మదురై వేదికగా జరిగిన భారీ మహానాడును సైతం విమర్శించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు కోట్ల మంది అన్నాడీఎంకే కేడర్ మనోభావాలకు వ్యతిరేకంగా బీజేపీ చర్యలు ఉంటున్నాయని ధ్వజమెత్తారు. అందుకే ఆ పార్టీకి దూరంగా ఉండాలని నిర్ణయించామన్నారు. ఎన్డీఏ కూటమి నుంచి తాము బయటకు వచ్చేశామని ప్రకటించారు. కేవలం రాష్ట్రంలోని బీజేపీ నేతల తీరు కారణంగానే కూటమి నుంచి బయటకు వచ్చేశామని, ఇక, బీజేపీతో పొత్తు ప్రసక్తే లేదని స్పష్టంచేశారు. 2024 లోక్సభ ఎన్నికలలో అన్నాడీఎంకే నేతృత్వంలో కూటమి అని, దీనికి తమ ప్రధాన కార్యదర్శి పళణి స్వామి నేతృత్వం వహిస్తారని ప్రకటించారు. స్వీట్లు పంచి.. ఎన్డీఏకు బై..బై....చెప్పేశామని మునుస్వామి ప్రకటన చేయడంతో రాష్ట్రవ్యాప్తంగా అన్నాడీఎంకే వర్గాలు సంబరాల్లో మునిగిపోయాయి. ఇక బీజేపీతో ఆరేళ్ల బంధం వీడడంతో అన్నాడీఎంకే వర్గాలు బాణా సంచా పేల్చుతూ సందడి చేశారు.ి అన్నాడీఎంకే కార్యాలయం ఎంజీఆర్మాళిగై పరిసరాలు సంబరాల కోలాహలంలో మునిగింది. ఆనంద తాండవం చేస్తూ నేతలు పళణికి మద్దతుగా నినాదాలు చేశారు. ఇదిలా ఉండగా, జాతీయస్థాయిలో ఎన్డీఏ కూటమిలో అన్నాడీఎంకే కీలంగా ఉన్న నేపథ్యంలో తాజా నిర్ణయం మున్ముందు ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో అనే ఉత్కంఠం ప్రస్తుతం నెలకొంది. రాష్ట్రనేతలెవరూ మాట్లాడొద్దు– బీజేపీ అధిష్టానం అన్నాడీఎంకే నిర్ణయంపై తమ పార్టీ అధిష్టానం సరైన సమయంలో స్పందిస్తుందని బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు అన్నామలై వ్యాఖ్యానించారు. కోయబత్తూరులో నా మట్టి... నా ప్రజలు యాత్రలో పాల్గొంటున్న ఆయన్ని మీడియా ప్రతినిధులు సాయంత్రం అన్నాడీఎంకే నిర్ణయంపై ఆయన్ని ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ అధిష్టానం అన్ని అంశాలను గమనిస్తోందని, తగిన సమయంలో స్పందిస్తుందని స్పష్టం చేశారు. ప్రస్తుతం తన యాత్ర విజయవంతంగా కొనసాగుతోందని, తమ పార్టీకి ఏ నిర్ణయమైనా అధిష్టానం తీసుకోవాల్సి ఉంటుందని వెల్లడించారు. తాను కూడా త్వరలో మీడియా ముందుకు వచ్చి అన్ని వివరాలను తెలియజేస్తానని ముగించారు. బీజేపీ ఎమ్మెల్యే, జాతీయ మహిళా మోర్చా అధ్యక్షురాలు వానతీ శ్రీనివాసన్ కూడా అన్నామలై తరహాలోనే స్పందించారు. ఇక అన్నాడీఎంకే ప్రకటనపై బీజేపీ అధిష్టానం సోమవారం రాత్రి స్పందించింది. పొత్తు అంశంపై రాష్ట్రనేతలెవరూ మాట్లాడకూడదని స్పష్టం చేసింది. ఈమేరకు ఆదేశాలు జారీ చేసింది. ముందే చెప్పిన ‘సాక్షి’ అన్నాడీఎంకే, బీజేపీ మధ్య అంతరాలు అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో ఈ రెండు పార్టీల మధ్య పొత్తు బెడిసికొట్టే అవకాశం ఉందనే విషయంపై గతంలోనే ‘సాక్షి’ పలుమార్లు విశ్వసనీయ కథనాలు ప్రచురించింది. అన్నాడీఎంకే కార్యదర్శుల సమావేశంలో పళణి స్వామి ఈమేరకు ఎన్డీఏ నుంచి బయటకు వస్తున్నట్లు ప్రకటించే అవకాశం ఉందని స్పష్టం చేసింది. సోమవారం అదే నిజమైంది. -
NDA నుంచి బయటకు వచ్చిన అన్నాడీఎంకే
-
తమిళనాట ట్విస్ట్.. ఎన్డీఏకు అన్నాడీఎంకే గుడ్బై..
సాక్షి, చెన్నై: దేశ, తమిళనాడు రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఎన్డీఏ కూటమి నుంచి తాము వైదొలగుతున్నట్టు అన్నాడీఎంకే ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. ఈ సందర్బంగా అన్నాడీఎంకే నేతలు తమిళనాడు బీజేపీ నేతలపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ సందర్బంగా అన్నాడీఎంకే డిప్యూటీ కోఆర్డినేటర్ కేపీ మునుస్వామి సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ఈరోజు నుంచి బీజేపీ, ఎన్డీయే కూటమితో అన్నాడీఎంకే తెగతెంపులు చేసుకుంటోంది. నేడు జరిగిన పార్టీ సర్వసభ్య సమావేశంలో ఈ మేరకు అన్నాడీఎంకే ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. బీజేపీ రాష్ట్ర నాయకత్వం మా పార్టీ నేతలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపణలు చేశారు. గత ఏడాది కాలంగా మా పార్టీ జనరల్ సెక్రటరీ పళనిస్వామి, పార్టీ కేడర్పై అనవసర రాద్దాంతం చేస్తున్నారని మండిపడ్డారు. VIDEO | AIADMK announces to break alliance with BJP in #TamilNadu. "We are breaking our alliance with BJP and NDA. AIADMK will form a new alliance and face upcoming Parliamentary elections," says party. pic.twitter.com/TWpbMrQKPT — Press Trust of India (@PTI_News) September 25, 2023 ఇదే సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు మునుస్వామి. వచ్చే సార్వత్రిక ఎన్నికల కోసం తాము సిద్ధంగా ఉన్నామన్నారు. అన్నాడీఎంకే కొత్త కూటమిని ఏర్పాటు చేసి ఎన్నికలకు వెళ్తుందని స్పష్టం చేశారు. ఇక, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే, బీజేపీ కలిసి పోటీ చేసిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో డీఎంకే భారీ మెజార్టీతో విజయం సాధించింది. Chennai, Tamil Nadu | K P Munusamy, AIADMK Deputy Coordinator says, "AIADMK unanimously passed a resolution in the meeting. AIADMK is breaking all ties with BJP and NDA alliance from today. The state leadership of the BJP has been continuously making unnecessary remarks about our… pic.twitter.com/HSx3NJKKOJ — ANI (@ANI) September 25, 2023 అయితే, తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై దివంగత ముఖ్యమంత్రి జయలలితను విమర్శించడంతో మొదలుపెట్టి ఆ పార్టీ హయాంలో జరిగిన అవినీతి జాబితాను విడుదల చేస్తానని అనడం, అలాగే, దివంగత సీఎం అన్నాదురై పైనా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం అన్నాడీఎంకే నేతలకు అస్సలు మింగుడుపడలేదు. దీంతో ఆ పార్టీలో సీనియర్లంతా అన్నామలై తీరుపై నిప్పులు చెరిగారు. ఇదే తరుణంలో మాజీ మంత్రి జయకుమార్ సైతం అన్నామలై తీరుపై ఇటీవల కాస్త ఘాటుగానే స్పందించడం, ఢిల్లీలో బీజేపీ నేతలను అన్నాడీఎంకే నేతలు కలవడం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. కాగా, అన్నామలై తీరుపై బీజేపీ పెద్దలకు చెప్పినా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం, వారి ప్రోద్బలం లేకుండా ఆయన అలా మాట్లాడి ఉండరని పళనిస్వామి భావించినట్టు కూడా ఇటీవల వార్తలు వచ్చాయి. దీంతో అన్నాడీఎంకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. మరోవైపు.. ఎన్డీయే కూటమి నుంచి అన్నాడీఎంకే బయటకు రావడంతో ఆ పార్టీ నేతలు తమిళనాడులో సంబురాలు చేసుకున్నారు. పలు ప్రాంతాల్లో బాణాసంచా కాల్పి సంబురాలు జరుపుకుంటున్నారు. #WATCH | Tamil Nadu | AIADMK workers burst crackers in Chennai after the party announces breaking of all ties with BJP and NDA from today. pic.twitter.com/k4UXpuoJhj — ANI (@ANI) September 25, 2023 అన్నాడీఎంకే ప్రకటనపై తమిళనాడు బీజేపీ చీఫ్ కే. అన్నామలై స్పందించారు. ప్రస్తుతం తాను దుర్గ పూజలో ఉన్నానని చెప్పుకొచ్చారు. ఇప్పుడు రాజకీయాలు మాట్లాడదలచుకోలేదని స్పష్టం చేశారు. దీనిపై తర్వాత మాట్లాడుతానని తెలిపారు. #WATCH | Coimbatore | On AIADMK breaking alliance with BJP and NDA, Tamil Nadu BJP president K Annamalai says, "I will speak to you later, I don't speak during Yatra. I will speak later." pic.twitter.com/yObr5hSeT3 — ANI (@ANI) September 25, 2023 ఇది కూడా చదవండి: మీరు డమ్మీ సీఎం, అబద్దాల కోరు.. అందుకే పక్కన పెట్టేశారు -
చరిత్ర లేని వాళ్లకు చరిత్ర గురించి మాట్లాడే అర్హత లేదు
సాక్షి, చైన్నె : కమలంతో కటీఫ్...ఇదే పార్టీ నిర్ణయం అని అన్నాడీఎంకే సీనియర్ నేత జయకుమార్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో తీవ్ర చర్చకు దారి తీశాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలైను టార్గెట్ చేసి అన్నాడీఎంకే మాజీ మంత్రులు మాటల దాడికి దిగారు. ఇదే సమయంలో ఇరు పార్టీల మధ్య మంగళవారం పోస్టర్ల యుద్ధం జోరందుకుంది. వివరాలు.. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి స్వామి శుక్రవారం ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సమావేశమైన విషయం తెలిసిందే. ఆ తదుపరి పరిణామాలతో కమలానికి వ్యతిరేకంగా పళణి సేన రూ టు మార్చడం ఎన్డీఏ కూటమిలో కొత్త చర్చకు దారి తీసింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై తమను టార్గెట్ చేసి గతంలో తీవ్ర విమర్శలు చేసినా, దివంగత అమ్మ జయలలితకు వ్యతిరేకంగా ఆరోపణలు గుప్పించినా స్పందించని అన్నాడీఎంకే వర్గాలు, తాజా ఆయనపై ముప్పెట దాడికి దిగడం గమనార్హం. నా మాటే పార్టీ శాసనం.. దివంగత ముఖ్యంత్రి అన్నాదురైకు వ్యతిరేకంగా అన్నామలై చేసిన కొన్ని వ్యాఖ్యలను అస్త్రంగా చేసుకుని అన్నాడీఎంకే మాజీ మంత్రులు విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలో ఓ అడుగు ముందుకు వేసిన అన్నాడీఎంకే సీనియర్ నేత జయకుమార్ మాట్లాడుతూ, ఇక కమలంలో కటీఫ్ అని ప్రకటించారు. తన వ్యాఖ్యలే పార్టీ నిర్ణయం అని స్పష్టం చేయడం చర్చకు దారి తీసింది. ఇక అన్నామలైపై మాజీ మంత్రి ఆర్బీ ఉదయకుమార్ కూడా తీవ్రంగా మండిపడ్డారు. చరిత్ర లేని వాళ్లకు చరిత్ర గురించి మాట్లాడే అర్హత లేదని మండిపడ్డారు. తమ నేతకు ఎన్డీఏ కూటమి ప్రాధాన్యతను ఇస్తుంటే, ఎలాంటి అర్హత, అనుభవం లేని అన్నామలై విమర్శలు ఎక్కుబెట్టడం మంచి పద్ధతేనా..? అని ప్రశ్నించారు. నేడు చస్తే..రేపు పాలు అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని హితవు పలికారు. మరో మాజీ మంత్రి ఎస్పీ వేలు మణి మాట్లాడుతూ, చరిత్రనే మార్చేయడమే ఒక పార్టీ అధ్యక్షుడికి తగదు అని చురకలు అంటించారు. అన్నా గురించి మాట్లాడే అర్హత అన్నామలైకు లేదని మండి పడ్డారు. మాజీ డిప్యూటీ స్పీకర్ పొల్లాచ్చి జయరామన్ మాట్లాడుతూ, అన్నాడీఎంకే కూటమిలోకి ఉండే వారు డాలర్ నోటుతో సమానం అని వ్యాఖ్యలు చేశారు. అదే కూటమి నుంచి బయటకు వెళ్లే వారి పరిస్థితి చెల్లని నోటే అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని అన్నామలైకు హితవు పలికారు. తమ కూటమిలో ఉంటూ, తమనే విమర్శిస్తే,సహంచబోమని హెచ్చరించారు. బీజేపీ, అన్నాడీఎంకే మధ్య పోస్టర్ల యుద్ధం ఓవైపు మాజీ మంత్రులు ఈ మాటల తూటాలను పేల్చుతున్న నేపథ్యంలో తూత్తుకుడిలో అన్నాడీఎంకే వర్గాల నేతృత్వంలో వెలిసిన పోస్టర్లు మరో చర్చకు దారి తీశాయి. ఇదే మంచి నిర్ణయం. ఇక కాషాయానికి ఫుల్స్టాప్ పెట్టేద్దామనే నినాదాలతో ఆ పోస్టర్లు ఉండడం గమనార్హం. అదే సమయంలో మదురైలో బీజేపీ నేతలు ఏర్పాటు చేసిన పోస్టర్లు వివాదానికి దారి తీశాయి. ఇక, చర్చల్లేవు...దాడులే అన్న నినాదాలతో అన్నాడీఎంకేకు ఆ పోస్టర్ల ద్వారా హెచ్చరికలు చేశారు. అలాగే, ఈరోడ్తో పాటు మరికొన్ని చోట్ల అన్నాడీఎంకే నుంచి తాము కూడా బయటకు వచ్చేశామంటూ కమలనాథులు స్వీట్లు పంచుకోవడం గమనార్హం. అన్నామలై, జయకుమార్ కారణం ఇదేనా..? ఢిల్లీలో జరిగిన భేటీలో పుదుచ్చేరితోపాటు రాష్ట్రంలోని 40 ఎంపీ స్థానాల్లో 20 సీట్లను బీజేపీ ఆశిస్తున్నట్లు తెలిసింది. 14 సీట్లు తమకు, మిగిలిన సీట్లు మిత్రులకు తామే పంచే యోచనలో బీజేపీ ఉన్నట్లు సంకేతాలు వెలువడ్డాయి. ఇందులో పుదియ తమిళగం, ఐజేకే, పుదియ నీధి కట్చి, తమిళ మానిల కాంగ్రెస్ ఉన్నాయి. అలాగే తమ శతృవులుగా ఉన్న పన్నీరు సెల్వం శిబిరానికి రెండు , దినకరన్ నేతృత్వంలోని అమ్మమక్కల్ మున్నేట్ర కళగంకు శివగంగై సీటును కట్టబెట్టే యోచనలో బీజేపీ ఉన్నట్లు సమాచారం. ఇక తాము దూరం పెట్టిన వ్యక్తులను బీజేపీ అక్కున చేర్చుకోబోతుండడాన్ని గ్రహించే, తాజాగా అన్నామలైను టార్గెట్ చేసి కాషాయంతో కటీఫ్ అన్న నినాదాన్ని పళణి శిబిరం అందుకుందనే చర్చ సాగుతోంది. -
'బీజేపీతో, అన్నాడీఎంకే పొత్తు ఉండదు'
చెన్నై: తమిళనాట బీజేపీ, అన్నాడీఎంకే మధ్య విబేధాలు తారాస్థాయికి చేరుకున్నాయి. దీంతో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీతో పొత్తు ఉండబోదని అన్నాడీఎంకే స్పష్టం చేసింది. ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్నా.. ఎన్నికల సమయంలోనే చూసుకుంటామని పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు డీ జయకుమార్ సోమవారం చెప్పారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి సీఎన్ అన్నాదురైపై ఇటీవల తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై తీవ్ర విమర్శలు చేశారు. దీనిపై ఏఐడీఎంకే తీవ్రంగా స్పందించింది. దివంగత నేత జయలలితతో సహా అన్నాడీఎంకే నేతలపై అన్నామలై ఇటీవల విమర్శనాత్మక వ్యాఖ్యలు చేశారని అన్నారు. అన్నామలైపై విమర్శలు గుప్పిస్తూ.. అన్నాదురైని అవమానిస్తే పార్టీ కార్యకర్తలు సహించరని అన్నాడీఎంకే సీనియర్ నాయకుడు డి జయకుమార్ అన్నారు. బీజేపీ కార్యకర్తలు కోరుకుంటున్నప్పటికీ అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకోవడానికి అన్నామలైకి ఇష్టం లేనట్లుంది. మా నేతలపై చేస్తున్న ఈ విమర్శలన్నీ మేం సహించాలా? బీజేపీ ఇక్కడ ఖాతా ఓపెన్ చేయలేదు. బీజేపీ ఓటు బ్యాంకు రాజకీయాలు మాకు తెలుసు.” అని అన్నాడీఎంకే నేత జయకుమార్ మండిపడ్డారు. ఇది మీ వ్యక్తిగత అభిప్రాయమా అని జయకుమార్ను ప్రశ్నించగా.. వ్యక్తిగతంగా తాను మీడియాతో ఇలా మాట్లాడనని, పార్టీ ఏం నిర్ణయం తీసుకుంటుందో మాత్రమే మాట్లాడతానన్నారు. ఇదీ చదవండి: తల్లిగా లాలిస్తూ.. మేయర్గా పాలన చేస్తూ.. -
మాజీ ఎమ్మెల్యే ఇంట్లో డీవీఏసీ సోదాలు
సాక్షి, చైన్నె: అన్నాడీఎంకే నేత, టీనగర్ మాజీ ఎమ్మెల్యే సత్యను డీవీఏసీ బుధవారం టార్గెట్ చేసింది. చైన్నె, కోయంబత్తూరు తదితర 16కు పైగా ఆయనకు సంబంధించిన ప్రాంతాల్లో సోదాలు చేపట్టింది. ఈ తనిఖీలకు వ్యతిరేకంగా పలు చోట్ల అన్నాడీఎంకే వర్గాలు ఆందోళనకు దిగడంతో పోలీసులు అడ్డుకున్నారు. వివారాలు.. డీఎంకే అధికారంలోకి వచ్చినానంతరం అన్నాడీఎంకే మాజీ మంత్రులను, పలువురు మాజీ ఎమ్మెల్యేలను టార్గెట్ చేసిన విషయం తెలిసిందే. తమకు గతంలో అందిన సమాచారం, ఆధారాలు, ఫిర్యాదుల మేరకు డైరెక్టరేట్ ఆఫ్ విజిలెన్స్ అండ్ యాంటీ కరెప్షన్ (డీవీఏసీ – అవినీతి నిరోధక శాఖ) వర్గాలు దూకుడుగా ముందుకెళ్తున్నాయి. మాజీ మంత్రులు ఎస్పీ వేలుమణి, తంగమణి, వీరమణి, విజయ భాస్కర్, ఎంఆర్ విజయ భాస్కర్ , కేపీ అన్భళగన్ల తదితరులతో పాటు మాజీ సీఎం పళని స్వామి సన్నిహితులు, కాంట్రాక్టర్లు తదితరుల ఇళ్లు, వారికి సంబంధించిన సంస్థలు, కార్యాలయాలు, సన్నిహితులను గురిపెట్టి ఇప్పటికే సోదాలు ముగిశాయి. ఈ కేసులన్నీ ప్రస్తుతం విచారణలో ఉన్నాయి. అదే సమయంలో తాజాగా టీ నగర్ సత్యను ఏసీబీ టార్గెట్ చేసింది. కోర్టు ఆదేశాలతో దూకుడు.. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆస్తుల వివరాలను సత్య దాచి పెట్టి తప్పుడు సమాచారం నామినేషన్లో పేర్కొన్నట్లు ఇప్పటికే ఫిర్యాదులు హోరెత్తాయి. అలాగే ఆదాయానికి మించి ఆయన ఆస్తులు గడించినట్లు వచ్చిన ఫిర్యాదులను డీవీఏసీ విచారించింది. అదే సమయంలో హైకోర్టులో న్యాయమూర్తి ఆనంద వెంకటేషన్ బెంచ్ సైతం ఈ ఫిర్యాదులపై దృష్టి పెట్టింది. రెండు నెలల్లో కేసును ముగించాలని, విచారణ వేగవంతం చేయాలని ఆదేశించారు. ఇదే అదనుగా అస్సలే అన్నాడీఎంకే వర్గాల మీద తీవ్ర ఆక్రోశంతో ఉన్న పాలకులు తాజాగా కోర్టు ఆదేశాలతో సత్యను టార్గెట్ చేసి దూకుడు పెంచారు. భారీగా అక్రమాస్తులు.. తమ విచారణలో వెలుగు చూసిన అంశాల మేరకు మాజీ ఎమ్మెల్యే సత్య అధికార దుర్వినియోగానికి పాల్పడినట్టు ఏసీబీ గుర్తించింది. 2016–21లో ఆయన ఆదాయానికి మించి రూ. 2.64 కోట్లు ఆస్తులు గడించినట్టు గుర్తించిన డీవీఏసీ కేసు నమోదు చేసింది. సత్యతో కలిసి పలు వ్యాపారాలు చేస్తున్నట్టుగా పేర్కొంటున్న, అన్నాడీఎంకే ఉత్తర చైన్నె తూర్పు జిల్లా కార్యదర్శి రాజేష్ను కూడా టార్గెట్ చేశారు. తండయార్ పేటలోని రాజేష్ నివాసంలో ఐదుగురు అధికారులతో కూడిన బృందం సోదాలు చేపట్టింది. వడపళణిలోని సత్య నివాసంతో పాటు చైన్నె, కోయంబత్తూరు, తిరువళ్లూరు తదితర 16 ప్రాంతాలలో పలు బృందాలుగా ఏసీబీ అధికారులు సోదాల్లో నిమగ్నమయ్యారు. గుమ్మిడి పూండి సమీపంలోని ఆరపాక్కంలోని సత్య మిత్రుడు దిలీప్కుమార్కు చెందిన కల్యాణ మండపం, రియల్ ఎస్టేట్ సంస్థలలోనూ సోదాలు చేపట్టారు. ఈ సోదాల సమాచారంతో సత్య మద్దతు అన్నాడీఎంకే వర్గాలు రంగంలోకి దిగాయి. అధికారపక్షం కక్ష సాధింపు చర్యలలో భాగంగా ఏసీబీని ఉసిగొల్పి దాడులు చేయిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి. ఆందోళన కారులను అడ్డుకున్నారు. ఆయా ప్రాంతాలలో తిష్ట వేసిన అన్నాడీఎంకే వర్గాలు ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనంను సత్య మద్దతుదారులు సరఫరా చేయడం గమనార్హం. గట్టి భద్రత నడుమ అనేక చోట్ల పొద్దుపోయే వరకు సోదాలు జరిగాయి. ఇందులో పలు రికార్డులు, ఆస్తులకు సంబంధించిన దస్తావేజులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. -
అమ్మ డీఎంకే పేరుతో సెల్వం కొత్తపార్టీ..!
సాక్షి, చైన్నె: మాజీ సీఎం పన్నీరు సెల్వం కొత్త పార్టీ కసరత్తుల్లో ఉన్నట్టు సంకేతాలు వెలువడ్డాయి.ఈ పార్టీకి అమ్మ డీఎంకే అనే పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం. వివరాలు.. అన్నాడీఎంకేను కై వశం చేసుకునేందుకు మాజీ సీఎం పన్నీరు సెల్వం చేసిన ప్రయత్నాలు బెడిసి కొట్టిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టులో, కేంద్ర ఎన్నికల కమిషన్ వద్ద చుక్కెదురైంది. పళణి స్వామి అనుకూలంగా తీర్పులు వెలువడ్డాయి. చివరకు సర్వ సభ్య సమావేశ తీర్మానాల విషయంలో తమకు అనుకూలంగా తీర్పు వస్తుందని ఎదురుచూసి భంగ పడ్డారు. ఈ వ్యవహారంలోనూ పళణి స్వామినే విజయం వరించింది. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా ఆ పార్టీ పగ్గాలను పూర్తిగా పళణి స్వామి తన గుప్పెట్లోకి తెచ్చుకున్నారు. దీంతో పన్నీరుకు భంగపాటు తప్పలేదు. ఇక, అన్నాడీఎంకే కై వశం ప్రయత్నాలను పక్కన పెట్టి తనను నమ్మి వచ్చిన వారి కోసం, తనకు అండగా ఉన్న కేడర్ చేజారకుండా జాగ్రత్తలకు పన్నీరు సెల్వం సిద్ధమయ్యారు. ఇందుకోసం కొత్త పార్టీకి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే తమ కంటూ ఓ పత్రికను ఏర్పాటు చేశారు. ఈ పత్రిక ద్వారా పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా కొత్త వ్యూహాలకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా ఆయన అన్నాడీఎంకేను ఇరకాటంలో పెట్టే రీతిలో కొత్త పార్టీ వైపుగా అడుగులు వేస్తున్నట్టు మద్దతుదారులు పేర్కొంటున్నారు. ఈ పార్టీకి అమ్మడీఎంకే అన్న పేరును పరిశీలిస్తున్నట్లు సంకేతాలు వెలువడ్డాయి. ఇప్పటికే అన్నాడీఎంకే నుంచి చీలికతో దినకరన్ నేతృత్వంలో అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం ఆవిర్భవించి ఉంది. ఇది విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లి ఉంది. ఈ దృష్ట్యా, అన్నా డీఎంకేకు ప్రత్యామ్నాయంగా అమ్మడీఎంకే అన్న పేరును పరిశీలిస్తున్నామని ఓ నేత పేర్కొన్నారు. మరికొద్ది రోజుల్లో పార్టీ ప్రకటన, మహానాడుకు సిద్ధమవుతున్నామని ఆ నేత తెలిపారు. లోక్సభ ఎన్నికలలో పన్నీరు పార్టీ పోటీకి దిగడం ఖాయం అని ధీమా వ్యక్తంచేశారు. కేంద్రంలోని బీజేపీ తమను మోసం చేసిందని అందుకే ఆ కూటమికి ప్రత్యామ్నాయంగా అమ్మ డీఎంకే అడుగుల వేగం పెంచడం ఖాయం అని మరో నేతపేర్కొనడం గమనార్హం. -
మాజీ సీఎం పన్నీరుసెల్వంకు షాక్
సాక్షి, చైన్నె: అన్నాడీఎంకే పూర్తిగా పళణిస్వామి గుప్పెట్లోకి చేరింది. ఆయన నేతృత్వంలో జరిగిన సర్వసభ్య సమావేశ తీర్మానాలన్నీ చెల్లుతాయని శుక్రవారం హైకోర్టు తీర్పు వెలువరించింది. దీంతో మాజీ సీఎం పన్నీరుసెల్వంకు షాక్ తప్పలేదు. పళణిస్వామి మద్దతు నేత డాక్టర్ సునీల్ నేతృత్వంలో పార్టీ ప్రధాన కార్యాలయం ఆవరణలో భారీ విజయోత్సవ సందడి నెలకొంది. కోర్టు తీర్పులు, ఎన్నికల కమిషన్ ఉత్తర్వులతో అన్నాడీఎంకేను పళణిస్వామి తన గుప్పెట్లోకి తెచ్చుకున్న విషయం తెలిసిందే. పార్టీ ప్రధాన కార్యదర్శిగా మదురై వేదికగా బ్రహ్మాండ మహానాడును పళణిస్వామి విజయవంతం చేశారు. అదేసమయంలో అన్నాడీఎంకేను కై వసం చేసుకుంటాననే ధీమాను మాజీ సీఎం పన్నీరుసెల్వం వ్యక్తం చేస్తూ వచ్చారు. ఇప్పటివరకు వచ్చిన తీర్పులు ఓ ఎత్తు అయితే, అన్నాడీఎంకే తీర్మానాలకు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ తనకు అనుకూలంగానే ఉంటుందని పన్నీరు ధీమా వ్యక్తం చేస్తూ వచ్చారు. తీర్మానంలోని అంశం ఇదే.. గత ఏడాది వానగరంలో పళణిస్వామి నేతృత్వంలో జూలై 11న సర్వసభ్య సమావేశం జరిగింది. ఇందులో పన్నీరుసెల్వంతో పాటు ఆయన మద్దతుదారులను తొలగిస్తూ తీర్మానం చేశారు. పళణిస్వామిని తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా తమను తొలగించారని సర్వసభ్య సమావేశానికి, తీర్మానాలకు వ్యతిరేకంగా పన్నీరుసెల్వం, ఆయన మద్దతుదారులు వైద్యలింగం, మనోజ్ పాండియన్, జేసీటీ ప్రభాకర్లు కోర్టు తలుపుతట్టారు. సర్వసభ్య సమావేశానికి అనుకూలంగా ఇప్పటికే హైకోర్టు, ఆతర్వాత సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. దీంతో పళణిస్వామి పార్టీని తన గుప్పెట్లోకి తెచ్చుకుని ఎన్నికల ప్రక్రియ ద్వారా అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పగ్గాలు ఏకగ్రీవంగా చేపట్టారు. అయితే, తీర్మానాల వ్యవహారం సుప్రీంకోర్టు నుంచి హైకోర్టుకు చేరడంతో ఈ విచారణలో తీర్పు ఉత్కంఠ తప్పలేదు. తమకు అనుకూలంగానే ఈ తీర్పు ఉంటుందని భావించిన పన్నీరుసెల్వంకు పెద్ద షాక్ తగిలింది. పళణికి అనుకూలంగా తీర్పు.. పన్నీరు అండ్ బృందం దాఖలు చేసిన ఈ పిటిషన్ పై కొన్ని నెలలుగా విచారణ జరిగింది. వాదనలు ముగిశాయి. ఇటీవల లిఖిత పూర్వక వాదనలు సైతం పళణి, పన్నీరులు వేర్వేరుగా కోర్టు ముందు ఉంచారు. శుక్రవారం న్యాయమూర్తులు ఆర్ మహదేవన్, మహ్మద్ షఫిక్ బెంచ్ తీర్పు వెలువరించింది. సర్వసభ్య సమావేశంలో చేసిన తీర్మానాలు చెల్లుతాయని ప్రకటించింది. పన్నీరుసెల్వం పిటిషన్ను తోసిపుచ్చారు. అలాగే, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా పళణి ఎంపికను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్ను తిరస్కరించారు. దీంతో పళణిస్వామి గుప్పెట్లోకి పూర్తిగా అన్నాడీఎంకే చేరినట్లైంది. అనంతరం మీడియాతో పళణిస్వామి మాట్లాడుతూ న్యాయానికి, ధర్మానికి, నిజాయితీకి దక్కిన గెలుపుగా అభివర్ణించారు. లోక్సభ ఎన్నికలలో మరింత ఉత్సాహంతో పనిచేస్తామని, పుదుచ్చేరితో పాటు రాష్ట్రంలోని 40 స్థానాలను కై వసంచేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. సంబరాలు... పళణిస్వామికి అనుకూలంగా కోర్టు తీర్పు రావడంతో అన్నాడీఎంకే వర్గాలు సంబరాలు చేసుకున్నాయి. బాణసంచాలు పేల్చాయి. స్వీట్లు పంచి పెట్టి ఆనందాన్ని పంచుకున్నాయి. చైన్నె రాయపేటలోని పార్టీ ప్రధాన కార్యాలయం ఆవరణలో ఎంజీఆర్ యువజన విభాగం సంయుక్త కార్యదర్శి డాక్టర్ సునీల్ నేతృత్వంలో మద్దతుదారుల విజయోత్సవాలు జరిగాయి. దివంగత నేతలు ఎంజీఆర్, జయలలిత ఫ్లెక్సీలు, ప్రధాన కార్యదర్శి పళణిస్వామి ఫ్లెక్సీలను ఊరేగించారు. బాణసంచాలు పేల్చుతూ ఆనంద తాండవం చేశారు. ఈసందర్భంగా అందరికీ కొబ్బరి బొండాల పంపిణీ జరిగింది. మాజీమంత్రి జయకుమార్ కొబ్బరి బొండాలను అందజేశారు. పార్టీ నేతలు తమిళ్ మగన్ హుస్సేన్, ఇలంగోవన్ పాల్గొని ఆనందాన్ని పంచుకున్నారు. -
డీఎంకే మంత్రులకు హైకోర్టు ఝలక్
సాక్షి, చైన్నె: రాష్ట్రంలో డీఎంకే ప్రభుత్వం 2006–11 మధ్య అధికారంలో ఉన్న విషయం తెలిసిందే. ఈ కాలంలో మంత్రులుగా ఉన్న వారి భరతం పట్టే విధంగా ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన అన్నాడీఎంకే దూకుడు పెంచింది. డైరెక్టర్ ఆఫ్ విజిలెన్స్ అండ్ యాంటీ కరెప్షన్(డీవీఏసీ) విభాగాన్ని రంగంలోకి దించింది. డీఎంకే మాజీ మంత్రులే కాదు, పలువురు ఎమ్మెల్యేలపై కేసుల మోత మోగించారు. ఈ క్రమంలో అక్రమాస్తులు, స్థలాల కబ్జా, ఆదాయానికి మించిన ఆస్తులు కూడ బెట్టారని, ప్రభుత్వ నిధులను మింగేశారని అనేక కేసులు పలువురిపై నమోదు అయ్యాయి. మరికొందరిపై పరువు నష్టం దావాలు కూడా దాఖలయ్యాయి. అక్రమాస్తుల కేసులు అత్యధికంగా అప్పటి డీఎంకే సీనియర్లు, మాజీ మంత్రులపై నమోదు అయ్యాయి. రాష్ట్రంలో అన్నాడీఎంకే పదేళ్లు అధికారంలో ఉండడంతో ఈ కేసుల విచారణ నిమిత్తం డీఎంకే నేతలు కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి తప్పలేదు. అధికారంలోకి వచ్చాక.. వరుస తీర్పులు... డీఎంకే 2021లో మరోసారి అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. 10 ఏళ్ల అనంతరం అధికారం చేజిక్కించుకున్న తర్వాత గతంలో మంత్రులుగా పనిచేసిన సీనియర్లు అధిక శాతం మంది మళ్లీ పదవులు దక్కించుకున్నారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి అయ్యింది. అయితే, ఆదాయానికి మించిన ఆస్తులు, అక్రమాస్తుల కేసులలో పలువురు మంత్రులకు కింది కోర్టులో ఆగమేఘాలపై విముక్తి కల్గించే తీర్పులు ఇస్తుండటాన్ని హైకోర్టు పరిగణనలోకి తీసుకుంది. గత కొన్ని నెలల్లో ఆర్థిక మంత్రి తంగం తెన్నరసు, రెవెన్యూ మంత్రి కేకేఎస్ఎస్ ఆర్. రామచంద్రన్, ఉన్నత విద్యా మంత్రి పొన్ముడి వంటి వారిపై , వారి బంధువులు, కుటుంబీకులపై నమోదైన కేసుల్లో కింది కోర్టులు ఇస్తున్న తీర్పులు రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారి తీశాయి. జస్టిస్ ఆనంద్ వెంటకేషన్ కన్నెర్ర కింది కోర్టులు తీర్పు వెలువరించి నెలలు గడస్తున్నా అవినీతి నిరోధక శాఖ అప్పీల్కు వెళ్లక పోవడం అనుమానాలకు దారి ల్సింది. పొన్ముడిని అక్రమాస్తుల కేసులో విడుదల చేస్తూ వేలూరు కోర్టు ఇచ్చిన తీర్పును పరిశీలించిన హైకోర్టు న్యాయమూర్తి ఆనంద్ వెంకటేషన్ అప్పీల్ వ్యవహారంపై స్పందించని అవినీతి ని రోధక శాఖకు అక్షింతలు వేసే విధంగా వ్యాఖ్యలు చేశారు. అలాగే, పొన్ముడి విడుదలను వ్యవహారంలో సుమోటోగా కేసు నమోదు చేసి విచారించనుల్ట్లు ప్రకటించారు. ఈ పరిస్థితుల్లో బుధవారం మరో ఇద్దరు మంత్రులను ఆనంద్ వెంకటేషన్ టార్గెట్ చేశారు. గతంలో విద్యాశాఖ మంత్రి ఉన్నప్పుడు తంగం తెన్నరసు, బీసీ సంక్షేమ మంత్రిగా ఉన్నప్పుడు కేకేఎస్ఎస్ఆర్లపై నమోదైన కేసులలో తాజాగా వెలువడ్డ తీర్పులు ఒకే రకంగా ఉండడాన్ని న్యాయమూర్తి ఆనంద్ వెంకటేషన్ తీవ్రంగా పరిగణించారు. డీఎంకే మంత్రులు, వారి బంధువులు, కుటుంబీకులను విడుదల చేస్తూ కింది కోర్టులు ఇస్తున్న తీర్పులన్నీ ఒకే విధంగా ఉండడంతో అనుమానించారు. న్యాయమూర్తి ఆనంద్ వెంకటేషన్ బుధవారం ఓ కేసు విచారణ సమయంలో మంత్రులను విడుదల చేస్తూ కింది కోర్టులు ఇస్తున్న తీర్పులను ప్రస్తావించారు. ఈ తీర్పులను చదివినానంతరంమూడు రోజులు తనకు నిద్ర రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తంగం తెన్నరసు, కేకేఎస్ఎస్ఆర్ను విడుదల చేస్తూ అనుసరించిన విధానం సరిగ్గా లేదని, కింది కోర్టుల తీర్పు అసంతృప్తిని కలిగించినట్లు పేర్కొన్నారు. తీర్పుల తేదీలను మార్చారేగానీ, సారంశమంతా ఒకే విధంగా ఉందని అభిప్రాయపడ్డారు. ఎవరు అధికారంలోకి వచ్చినా తమపై కేసులను నిర్వీర్యం చేసుకోవడం, నీరుగార్చి విముక్తి పొందడం పరిపాటిగా మారిందన్నారు. తన మనసాక్షికి కట్టుబడి ఈ కేసులను సుమోటోగా విచారించేందుకు నిర్ణయించానని తెలిపారు. తాను కూడా కళ్లు మూసుకుంటే , న్యాయ వ్యవస్థ తన బాధ్యతల నుంచి తప్పుకున్నట్టేనని అందుకే కింది కోర్టులు ఇచ్చిన తీర్పులపై విచారించేందుకు సిద్ధమైనట్టు ప్రకటించారు. న్యాయమూర్తి వ్యా ఖ్యలు డీఎంకే మంత్రులకు షాక్ గురి చేశాయి. ఇప్పటికే పదేళ్లు న్యాయ పోరాటం చేసిన, తమకు మళ్లీ విచారణ తప్పదన్న బెంగ వారిలో కనిపిస్తోంది. అలాగే ఈ వ్యవహారంలో అవినీతి నిరోధక శాఖ స్పందించాలని ఆదేశిస్తూ, విచారణను సెప్టెంబరు 20వ తేదీకి వాయిదా వేశారు. సుమోటోగా కేసులు అధికారంలోకి వచ్చినానంతరం డీఎంకే మంత్రులు పలువురికి ఆదాయానికి మించిన ఆస్తులు, అవినీతి తదితర కేసుల నుంచి క్రమంగా విముక్తి కలుగుతోంది. అయితే కింది కోర్టు తీర్పులన్నీ ఒకే రకంగా ఉండడం పలు అనుమానాలకు దారి తీశాయి. ఈ తీర్పులను చదివిన హైకోర్టు న్యాయమూర్తి ఆనంద్ వెంకటేషన్ తీవ్రంగా స్పందించారు. జిల్లా కోర్డులు ఇచ్చిన ఆదేశాలను పరిశీలించిన అనంతరం మూడు రోజులు తనకు నిద్ర రాలేదని, అందుకే ఆ కేసులను సుమోటోగా విచారించేందుకు సిద్ధమవుతున్నట్లు బుధవారం సంచలన ప్రకటన చేశారు. ఇప్పటికే గవర్నర్ తీరుతో తలబొప్పికట్టిన స్టాలిన్ ప్రభుత్వానికి హైకోర్టు నిర్ణయం అశనిపాతంగా మారే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. -
నాయకుడొచ్చాడు..! అన్నాడీఎంకే పూర్తిగా పళణి స్వామి గుప్పెట్లోకి
అనుమానాలు తొలగిపోయాయి.. ఉత్కంఠకు తెరపడింది. సుదీర్ఘ పోరాటం తర్వాత ఎట్టకేలకూ అన్నాడీఎంకే పూర్తిగా పళణి స్వామి గుప్పెట్లోకి చేరింది. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఆయనకి కేంద్ర ఎన్నికల కమిషన్ గుర్తింపు కల్పించింది. ఆయన నేతృత్వంలో 79 మంది రాష్ట్ర కమిటీ, 69 జిల్లాల కార్యదర్శులు, ఇతర రాష్ట్రాలలోని కార్యదర్శులకు ఆమోద ముద్ర వేస్తూ.. ఆ వివరాలను మంగళవారం కేంద్ర ఎన్నికల కమిషన్ వెబ్సైట్లో పొందుపరిచింది. ఇది అన్నాడీఎంకే శ్రేణుల్లో అమితానందాన్ని నింపింది. సాక్షి, చైన్నె: అమ్మ జయలలిత మరణం తర్వాత అన్నాడీఎంకేలో చోటు చేసుకున్న అనూహ్య పరిణామాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కాల క్రమంలో ఆ పార్టీలోని ముఖ్య నేతలు నాలుగు శిబిరాలుగా విడిపోయి ముందుకెళ్తున్నారు. ఓ ఓ వైపు తానే ఆ పార్టీ ప్రధాన కార్యదర్శినంటూ జయలలిత నెచ్చెలి శశికళ, మరోవైపు పార్టీలో చీలిక కారణంగా ఏర్పడిన అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం గొడుగు నీడన దినకరన్, ఇంకో వైపు సమన్వయ కమిటీ కన్వీనర్ హోదాతో అంటూ పన్నీరు సెల్వం శిబిరం అన్నాడీఎంకేను కై వశం చేసుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తూ వస్తున్నాయి. అయితే, కేడర్ బలం, ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీల మద్దతుతో అన్నాడీఎంకే తనదే అని చాటే విధంగా పళణి స్వామి నిత్యం వ్యూహాలకు పదును పెట్టి చివరికి సఫలీకృతులయ్యారు. అన్నాడీఎంకే వ్యవహారాలు అనేకం కోర్టుల్లో ఉన్నా, పార్టీకి కీలకం ఎవరు? అనే విషయాన్ని కేంద్ర ఎన్నికల కమిషన్ తాజాగా మరోమారు తేల్చింది. సర్వ సభ్య సమావేశం, పార్టీ నిబంధనలకు అనుగుణంగా సంస్థాగత ఎన్నికలు, ఏకగ్రీవంగా పదవులకు ఆమోదం లభించడంతో పళనిస్వామి పై చేయి సాధించారు. నూతనోత్సాహంతో.. సుప్రీంకోర్టు ఇటీవల వచ్చిన తీర్పు, అందుకు అనుగుణంగా కేంద్ర ఎన్నికల కమిషన్ జారీ చేసిన ఉత్తర్వులతో వ్యూహాలకు పదును పెట్టి అన్నాడీఎంకేలో ఏక నాయకత్వం దిశగా పళణి స్వామి అడుగులు వేసి విజయం సాధించారు. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి పగ్గాలు చేపట్టి బలోపేతం దిశగా పరుగులు తీస్తున్నారు. ఆగస్టులో మదురై వేదికగా భారీ మహానాడు నిర్వహణకు సిద్ధమవున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రధాన కార్యదర్శిగా తన ఎంపికతో పాటుగా, రాష్ట్ర కమిటీ, జిల్లాల కమిటీ, ఇతర రాష్ట్రాల కమిటీల ఎంపిక వివరాలను కేంద్ర ఎన్నికల కమిషన్కు అన్నాడీఎంకే వర్గాలు పంపించాయి. ఇందుకు కేంద్ర ఎన్నికల కమిషన్ ఆమోద ముద్ర వేసింది. ఇక, అన్నాడీఎంకేను సొంతం చేసునే అవకాశం ఇతర గ్రూపులకు లేని విధంగా కేంద్ర ఎన్నికల కమిషన్ వెబ్సైట్లో పెట్టిన ఉత్తర్వులు మంగళవారం పళణి స్వామికి అందాయి. ఇందులో అన్నాడీఎంకేలో ఇక ఏక నాయకత్వం అని చాటే విధంగా ఆ పార్టీ ప్రధాన కార్యదర్శిగా పళణి స్వామికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అలాగే, 69 జిల్లాలకు కార్యదర్శులు, రాష్ట్ర కమిటీలో జంబో జట్టుగా 79 మంది నియామకానికి, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరి, ఢిల్లీ, తెలంగాణ, అండమాన్ తదితర ప్రాంతాలకు పార్టీ కార్యదర్శుల గుర్తింపునకు ఆమోదం లభించింది. దీంతో ఆపార్టీలో నూతనోత్సాహం కనిపిస్తోంది. రాష్ట్ర కమిటీలో 79 మందికి చోటు పార్టీ ప్రిసీడియం చైర్మన్గా తమిళ్ మగన్ హుస్సేన్, డిప్యూటీ ప్రధాన కార్యదర్శులుగా కేపీ మునుస్వామి, నత్తం ఆర్. విశ్వనాథన్, కోశాధికారిగా దిండుగల్ శ్రీనివాసన్, ఆల్ ఇండియా ఎంజీఆర్ మండ్రం కార్యదర్శిగా సి. పొన్నయ్యన్ను నియమించారు. పార్టీ సిద్ధాంతాల ప్రచార కార్యదర్శిగా సి. తంబి దురై, నిర్వాహక కార్యదర్శులుగా సెంగోట్టయన్, తంగమణి, జయకుమార్, సీవీ షణ్ముగం, సెమ్మలై, దళవాయి సుందరం, పార్టీ ప్రధాన కార్యాలయ కార్యదర్శిగా ఎస్పీ వేలుమణి, పార్టీ ఎన్నికల విభాగం కార్యదర్శిగా పొల్లాచ్చి వి. జయరామన్, మహిళా విభాగం కార్యదర్శిగా వలర్మతికు పదవులు కల్పించారు. కేంద్ర ఎన్నికల కమిషన్ తమకే అన్నాడీఎంకే అని స్పష్టం చేయడంతో పళణి స్వామి మద్దతు దారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక, అన్నాడీఎంకే జెండాను గానీ,పార్టీ చిహ్నాన్ని గానీ మరెవరైనా ఉపయోగిస్తే చట్ట పరంగా చర్యలు తీసుకుంటామని జయకుమార్ హెచ్చరించారు. పళణిస్వామికి అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి గుర్తింపు వచ్చిందో లేదో వెంటనే ఏన్డీఏ కూటమి ఆహ్వానం కూడా దక్కింది. ఈనెల 18వ తేదీ ఢిల్లీలో జరగనున్న ఎన్డీఏ పార్టీల సమావేశానికి అన్నాడీఎంకే తరపున హాజరు కావాలంటూ పళణికి పిలుపు రావడం విశేషం. ఈ పరిణామాలతో అన్నాడీఎంకే వర్గాలు ఆనంద తాండవం చేస్తున్నాయి. అంగీకరించే ప్రసక్తే లేదు.. కేంద్ర ఎన్నికల కమిషన్ ఉత్తర్వులను తాము అంగీకరించే ప్రసక్తే లేదని పన్నీరు సెల్వం స్పష్టం చేశారు. మంగళవారం ఆయన తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ.. ఈ వ్యవహారం కోర్టులో ఉందని, తమకు అనుకూలంగా తీర్పు వస్తుందనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. పళణి సీఎంగా ఉన్నప్పుడు చోటు చేసుకున్న (దివంగత సీఎం జయలలితకు చెందిన ఎస్టేట్) కొడనాడు ఘటనను ఈసందర్భంగా పన్నీరు సెల్వం ప్రస్తావిస్తూ, ఈ కేసు విచారణను రాష్ట్ర ప్రభుత్వం వేగవంతం చేయాని కోరారు. ఈ విషయంపై ఆగస్టు 1వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నామని ప్రకటించారు. కాగా, ఎన్డీఏ కూటమి సమావేశానికి పళణి స్వామికి, పీఎంకే తరపున అన్భుమణి రాందాసుకు, తమిళ మానిల కాంగ్రెస్ తరపున జీకే వాసన్కు ఆహ్వానాలు వచ్చినా తనకు మాత్రం ఎలాంటి ఆహ్వానం అందలేని పన్నీరు పేర్కొనడం గమనార్హం. -
తమిళనాట మరో ట్విస్ట్.. అన్నాడీఎంకేకు షాక్!
చెన్నై: తమిళనాడులో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. అన్నాడీఎంకే ఎంపీ ఓపీ రవీంద్రనాథ్కు షాక్ తగిలింది. తేనీ నియోజకవర్గం నుంచి గెలుపొందిన ఆయన ఎన్నిక చెల్లదంటూ మద్రాస్ హైకోర్టు తీర్పు వెల్లడించింది. దీంతో ఆయన ఎన్నికను హైకోర్టు రద్దు చేసింది. వివరాల ప్రకారం.. పన్నీరు సెల్వం కుమారుడు రవీంద్రనాథ్కు ఎదురుదెబ్బ తగలింది. పార్లమెంట్ ఎన్నికల్లో అన్నాడీఎంకే నుంచి ఎంపీగా గెలుపొందిన రవీంద్రనాథ్ ఎన్నికను రద్దు చేస్తూ మద్రాస్ హైకోర్టు తీర్పు వెల్లడించింది. అయితే, ఎన్నికల్లో డీఎంకే-కాంగ్రెస్ కూటమి అభ్యర్థి ఈవీకేఎస్ ఎలంగోవన్పై 76,672 ఓట్ల ఆధిక్యతతో రవీంద్రనాథ్ గెలుపొందారు. కాగా, ఆయన ఎన్నికపై మిలానీ అనే వ్యక్తి కోర్టును ఆశ్రయించారు. ఎన్నికల సందర్భంగా రవీంద్రనాథ్ ఆస్తులకు సంబంధించి తప్పుడు పత్రాలు ఇచ్చారని ఆరోపించారు. అలాగే, గెలుపు కోసం అవినీతికి పాల్పడినట్టు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇక, ఈ పిటిషన్పై కోర్టులో విచారణ చేపట్టింది. ఈ క్రమంలో ఆయన ఎన్నికను మద్రాస్ హైకోర్టు రద్దు చేస్తున్నట్టు తీర్పు వెల్లడించింది. ఇదిలా ఉండగా.. అన్నాడీఎంకే నుంచి రవీంద్రనాథ్ 2022లో పార్టీ నుంచి బహిష్కరించింది. పార్టీపై తిరుగుబాటు చేసిన నేపథ్యంలో అన్నాడీఎంకే ఈ నిర్ణయం తీసుకుంది. మరోవైపు.. 2019లో జరిగిన సాధారణ ఎన్నికల్లో అన్నాడీఎంకే-బీజేపీ కూటమి నుంచి రవీంద్రనాథ్ మాత్రమే గెలుపొందడం గమనార్హం. డీఎంకే-కాంగ్రెస్ కూటమి రాష్ట్రంలోని మొత్తం 39 సీట్లలో 38 గెలుచుకుంది. ఇది కూడా చదవండి: ఎన్సీపీ విద్యార్ధి నాయకుల వినూత్న పోస్టర్ -
పళనికి ప్రత్యేక అనుమతి
సాక్షి, చైన్నె: అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, ప్రధాన ప్రతిపక్ష నేత ఎడపాడి కే పళనిస్వామికి కేంద్ర విమానయాన శాఖ ప్రత్యేక అనుమతి ఇచ్చింది. ఆయన తన కారులో నేరుగా విమానం వద్దకు వెళ్లే అవకాశం కల్పించారు. భద్రతా కారణాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నారు. పళనిస్వామి గతంలో సీఎంగా ఉన్నప్పుడు వీఐపీ, వీవీఐపీ ప్రోటోకాల్ మేరకు రన్ వేకు సమీపంలో ఆగి ఉండే విమానం వద్దకు ఆయన వాహనానికి అనుమతి ఉండేది. పదవి కోల్పోవడంతో సాధారణ ప్రయాణికుడిలా ఆయన బోర్డింగ్ వ్యవహారాలు ముగించుకుని ఆయా విమాన సంస్థల బస్సులో విమానం వద్దకు ప్రయాణించాల్సి ఉంది. ఇటీవల ఈ ప్రయాణ సమయంలో చోటు చేసుకున్న పరిణామాలతో పళనిస్వామికి భద్రత కల్పించాల్సిన అవశ్యం విమాన యాన శాఖకు ఏర్పడింది. మదురైలో బస్సు ప్రయాణం సమయంలో ఆయనకు వ్యతిరేకంగా రాజేశ్వరన్ అనే వ్యక్తి తీవ్ర వ్యాఖ్యలు చేయడం, పళని భద్రతా సిబ్బంది అడ్డుకోవడం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. దీంతో పళనిస్వామికి అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, తమిళనాడు ప్రధాన ప్రతి పక్ష నేత హోదాలో నేరుగా విమానం వద్దకు కారులో వెళ్లేందుకు వీలు కల్పిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. రోడ్డు ట్యాక్స్కు వ్యతిరేకత.. రాష్ట్ర ప్రభుత్వం రోడ్డు ట్యాక్స్ను పెంచేందుకు కసరత్తులు చేపట్టిన విషయం తెలిసిందే. ఐదు శాతం మేరకు పన్ను వడ్డనకు సిద్ధమవుతున్నారు. దీనిని వ్యతిరేకంగా పళనిస్వామి ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ మంగళవారం ప్రకటన చేశారు. డీఎంకే ప్రభుత్వం అధికారంలోకి వచ్చినానంతరం ఆస్తి, నీటి పన్నులు, విద్యుత్ చార్జీలను వడ్డించినట్టు ధ్వజమెత్తారు. ప్రస్తుతం రోడ్డు ట్యాక్స్ పెంపుతో సామన్యుడి సొంత వాహన కలను చెదరగొట్టే ప్రయత్నంలో ఉన్నారని ఽఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల్ని దోచుకోవడం లక్ష్యంగా డీఎంకే పాలకులు ముందుకెళ్తున్నారని, తక్షణం ఈ ప్రయత్నం వీడాలని డిమాండ్ చేశారు. పదేళ్ల పాటు తమ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు ఏ ఒక్క భారం ప్రజల నెత్తిన వేయలేదని, ఈ డీఎంకే పాలకులు రెండేళ్లల్లో ప్రజల జేబులు చిల్లు చేసే విధంగా నిర్ణయాలు తీసుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. -
తమిళనాడు నుంచి ప్రధాని మోదీ పోటీ?
సాక్షి, చైన్నె: రాష్ట్రం నుంచి ఈసారి ఎలాగైనా తమ ప్రతినిధులు పార్లమెంట్లో అడుగు పెట్టాలన్న లక్ష్యంగా బీజేపీ తీవ్ర కసరత్తులు చేస్తోంది. ఇందులోభాగంగా తమిళనాడులో కీలక స్థానాలపై గురి పెట్టి కార్యక్రమాలను విస్తృతం చేయబోతున్నది. మదురై నుంచి ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్, కోయంబత్తూరు నుంచి ఎమ్మెల్యే వానతీ శ్రీనివాసన్ను పోటీలో నిలబెట్టేందుకు తగిన చర్యలు తీసుకున్నట్లు తెలిసింది. రాష్ట్రంలో తమ బలాన్ని చాటుకునేందుకు బీజేపీ తీవ్రంగానే ప్రయత్నాలు చేస్తోంది. అన్నాడీఎంకే కూటమిలో బీజేపీ ఉన్నట్టు ౖపైపెకి చెప్పకుంటున్నా, లోలోపల ఆ పార్టీకి ఎసరు పెట్టే పరిస్థితులకు సంబంధించిన వ్యూహాలకు బీజేపీ పెద్దలు పదును పెట్టారు. ఈసారి ఎలాగైనా తమిళనాడు నుంచి ప్రతినిధి పార్లమెంట్లో అడుగు పెట్టడమే కాకుండా, అధిక స్థానాలను కై వసం చేసుకుని తీరాలన్న లక్ష్యంతో కార్యక్రమాలను విస్తృతం చేశారు. డీఎంకే, అన్నాడీఎంకేలను అవినీతి పార్టీలుగా చిత్రీకరించి తాము లాభపడే విధంగా వ్యూహాలకు పదును పెట్టారు. అదే సమయంలో తమిళనాడు నుంచే ప్రధాని అంటూ రెండు రోజుల క్రితం చైన్నె, వేలూరు పర్యటన సందర్భంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కొత్త ప్రకటనను తెరపైకి తెచ్చి వెళ్లారు. దీంతో ప్రధాని నరేంద్ర మోదీ తమిళనాడు నుంచి పోటీ చేస్తారా అనే చర్చ ఊపందుకుంది. అదే సమయంలో తమిళనాడులో ఏకంగా 15కు పైగా స్థానాలను గురి పెట్టి బీజేపీ కార్యక్రమాలను విస్తృతం చేసి ఉండడం గమనార్హం. ఈ పరిస్థితులలో తమిళనాడులో పోటీ చేసే అభ్యర్థుల జాబితా కసరత్తుల్లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా బిజీగా ఉన్నట్టు సమాచారం. ఈమేరకు కొందరు ముఖ్య అభ్యర్థుల పేర్లను ముందుగానే వెల్లడించి, ఆయా నియోజకవర్గాలపై వారు పూర్తి స్థాయిలో పట్టు బిగించేందుకు తగిన కార్యాచరణలో ఉన్నట్టుంది. ఇందులో భాగంగా తాజాగా రెండు కీలక నియోజకవర్గాల అభ్యర్థుల పేర్లు సూచనప్రాయంగా వెలుగులోకి వచ్చాయి. ఈ మేరకు మదురై లోక్సభ నుంచి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కోయంబత్తూరు లోక్సభ నుంచి ఎమ్మెల్యే వానతీ శ్రీనివాసన్ పోటీలోకి దిగడం ఖాయం అన్నట్టుగా ఢిల్లీ నుంచి సమాచారాలు వెలువడుతున్నాయి. ఇది వరకటి వరకు రాజ్యసభ పదవితో ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ వ్యవహరిస్తూ వచ్చారు. ఈ సారి ఆమె ప్రత్యక్ష ఎన్నికలలో తనకు నచ్చిన మదురై నుంచి పోటీ చేయడానికి ఉత్సాహంగానే ఉన్నట్టు బీజేపీలో ప్రచారం ఊపందుకుంది. -
అన్నామలైకి వ్యతిరేకంగా అన్నాడీఎంకే తీర్మానం
చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే మాజీ చీఫ్ దివంగత జయలలితను ఉద్దేశించి పరోక్షంగా ఆ రాష్ట్ర బీజేపీ చీఫ్ అన్నామలై చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. అమ్మను తెరపైకి తెచ్చి అవినీతి విమర్శ చేశాడంటూ అన్నామలైపై ఏఐఏడీఎంకే కార్యకర్తలు రగిలిపోతున్నారు. ఈ నేపథ్యంలో మిత్రధర్మాన్ని బీజేపీ పాతరేస్తోందని మండిపడుతోంది. అదే టైంలో పొత్తు తెగిపోతోందనే ఊహాగానాల నడుమ ఇవాళ(మంగళవారం) మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీజేపీ అన్నామలైకి వ్యతిరేకంగా అన్నాడీఎకేం ఓ తీర్మానం చేసి.. ఆమోదించింది. అన్నామలై చేసిన వ్యాఖ్యలు అనుభవలేమి, బాధ్యతారాహిత్యంతో కూడుకున్నవంటూ ఆ తీర్మానంలో పేర్కొంది పార్టీ. గత కొంతకాలంగా మిత్రపక్షంతో అన్నామలై తీరు సరిగా ఉండడం లేదని, తన వ్యాఖ్యలకు గానూ ఆయన వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందని, ఈ విషయంలో మిత్రపక్షం(బీజేపీ) దృష్టిసారించాల్సిన అవసరం ఉందంటూ అందులో పేర్కొంది. వాస్తవానికి ఇవాళ జరిగిన ఏఐఏడీఎంకే జిల్లా కార్యదర్శలు సమావేశమే. కొత్త సభ్యత్వం నమోదు గురించి చర్చించాల్సి ఉంది. అయితే అన్నామలై వ్యాఖ్యలు మంట పుట్టించిన నేపథ్యంలో అనూహ్యంగా ఇలా ఆయనకు వ్యతిరేక తీర్మానం ఆమోదించింది పార్టీ. ఓ ప్రముఖ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నామలై.. జయలలితపై నమోదు అయిన అక్రమాస్తుల కేసు గురించి పరోక్షంగా ప్రస్తావించాడు. ‘‘ఈ రాష్ట్రంలో(తమిళనాడు) అవినీతి పేరుకుపోయి ఉంది. మాజీ ముఖ్యమంత్రులు సైతం అవినీతి కేసుల్లో దోషులుగా తేలారు. ఈ కారణం వల్లే తమిళనాడు ఇవాళ దేశంలోనే అవినీతి రాష్ట్రాల జాబితాలో నిలిచింది. అలాంటి ప్రభుత్వాలను బీజేపీ నిలదీసి తీరుతుంది’’ అంటూ వ్యాఖ్యానించారాయన. దీంతో ఏఐఏడీఎంకే క్యాడర్ నొచ్చుకుంది. 1998లో బీజేపీ అధికారంలోకి రావడానికి జయలలిత నేతృత్వంలోని అన్నాడీఎంకే సాయం చేసిన విషయాన్ని మరిచిపోయి ఉంటుందంటూ అన్నామలైకు చరకలు అంటించారు పలువురు నేతలు. ఈ నేపథ్యంలో తన వ్యాఖ్యలపై అన్నామలై వెనక్కి తీసుకోకపోతే.. పొత్తు తెంచుకునే విషయంపై ఆలోచన చేయాల్సి ఉంటుందని హెచ్చరించింది పార్టీ. ఇక ఇవాళ ఏకంగా అన్నామలైకి వ్యతిరేకంగా తీర్మానం చేయడం గమనార్హం. ఇక బీజేపీ కూడా ఈ విషయంలో తగ్గడం లేదు. అన్నామలై వ్యాఖ్యలను అన్నాడీఎంకే తప్పుగా అర్థం చేసుకుందని అంటోంది. మరోవైపు తీవ్ర వ్యాఖ్యలు చేసిన అన్నాడీఎంకే నేత డీ జయకుమార్పై బీజేపీ మండిపడింది. అన్నామలై అసలు ఓ పార్టీ చీఫ్గా ఉండేందుకు అర్హుడే కాదు. ఆయన మాటలు జారవిడిచి ఉండాల్సింది కాదు. ఆయన తీరు చూస్తుంటే మాతో పొత్తు కొనసాగించేందుకు ఆసక్తితో లేనట్లు కనిపిస్తోంది. లేదంటే.. మోదీని మరోసారి ప్రధానిగా గెలిపించాలని అనుకోవట్లేదమో అంటూ జయకుమార్ మండిపడ్డారు. ఇక అక్రమాస్తుల కేసులో A1 నిందితురాలుగా జయలలితే ఉన్నారు. అయితే తీర్పు వెలువడడానికి కంటే ముందే జయలలిత కన్నుమూశారు. ఈ కేసులో ఆమె నిచ్చెలి శశికళ, మరొకందరికి జైలు శిక్ష పడింది. జయలలిత అక్రమాస్తుల కేసు.. ఇవీ పూర్తి వివరాలు -
చిన్నమ్మ షాక్
సాక్షి, చైన్నె: ప్రధాన ప్రతిపక్షం అన్నాడీఎంకేలో నెలకొన్న వర్గ విభేదాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. న్యాయ పోరాటం ద్వారా, మెజారిటీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్య నేతల మద్దతుతో అన్నాడీఎంకేను మాజీ సీఎం పళని స్వామి తన గుప్పెట్లోకి తెచ్చుకున్నారు. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శిగా రాజకీయ వ్యూహాలకు పదును పెట్టారు. ఇక పళణి స్వామి తనను దూరం పెట్టడంతో వేరు కుంపటి పెట్టిన మరో మాజీ సీఎం పన్నీరు సెల్వం ఆ పార్టీని ఎలాగైనా కై వసం చేసుకోవడం లక్ష్యంగా వ్యూహాలకు పదును పెట్టి ఉన్నారు. ఇందులో భాగంగా గతంలో అన్నాడీఎంకే నుంచి బయటకు వచ్చి అమ్మ మక్కల్ మున్నేట్ర కళగంతో రాజకీయ పయనం సాగిస్తున్న టీటీవీ దినకరన్ను చేతులు కలిపారు. ఒకప్పుడు బద్ద శత్రువులుగా ఉన్న ఈ ఇద్దరు ప్రస్తుతం మంచి మిత్రులయ్యారు. అలాగే టీటీవీ దినకరన్ ద్వారా దివంగత సీఎం జయలలిత నెచ్చెలి, చిన్నమ్మ శశికళను ప్రసన్నం చేసుకుని అన్నాడీఎంకే కై వశం లక్ష్యంగా మరింతగా వ్యూహాలకు పదును పెట్టాలనే ఆశతో ఉన్న పన్నీరుకు ప్రస్తుతం షాక్ తప్పలేదు. పెద్ద దిక్కుగా ఉండాలని.. అన్నాడీఎంకేలో తాజా పరిణామాల వ్యవహారంలో ఎవరో ఒకరి వైపుగా నిలబడకుండా తటస్థంగా వ్యవహరించి పార్టీకి పెద్ద దిక్కుగా నిలబడాలనే వ్యూహంతో చిన్నమ్మ ఉన్నట్టు సమాచారాలు వెలువడ్డాయి. అందుకే ఆమె పన్నీరు, టీటీవీ దినకరన్ హాజరైన ఈ వివాహ వేడుకకు దూరంగా ఉన్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే ఈ వివాహ వేడుకకు చిన్నమ్మ వస్తారనే ఎదురు చూపుల్లో దక్షిణ తమిళనాడులోని కీలక సామాజిక వర్గం వేచి ఉన్నా, చివరకు ప్రయోజనం లేకుండా పోయింది. అదే సమయంలో చిన్నమ్మ శశికళ అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణిస్వామితో భేటీకి ప్రయత్నాల్లో ఉన్నట్టు తెలుస్తోంది. దక్షిణ తమిళనాడులోని బలమైన సామాజికవర్గం తన వెంట, పన్నీరు, దినకరన్ వెనుక ఉన్నా, ప్రస్తుతం పార్టీతో పాటుగా ముఖ్య నేతల బలం, మద్దతు పళణిస్వామి చేతిలో ఉండడాన్ని చిన్నమ్మ పరిగణనలోకి తీసుకుని ఉన్నారు. అందుకే పళణిస్వామితో సంప్రదింపులతో రాష్ట్రవ్యాప్తంగా అన్నాడీఎంకే ఐక్యతను చాటే విధంగా కొత్త ప్రయత్నాలకు చిన్నమ్మ సిద్ధమై తాజాగా తటస్థంగా వ్యవహరించే పనిలో పడ్డట్టు ఆమె సన్నిహితులు పేర్కొంటున్నారు. అలాగే, పళణికి రాయబారానికి దక్షిణ తమిళనాడుకు చెందిన మాజీ మంత్రులు నలుగుర్ని చిన్నమ్మ రంగంలోకి దించినట్లు చెబుతున్నారు. ఈ నలుగురు ప్రస్తుతం పళణి స్వామి వెన్నంటే ఉన్నా, లోక్సభ ఎన్నికల నాటికి అందరూ ఐక్యతతో అన్నాడీఎంకేకు తిరుగులేని విజయం అందించాలన్న కాంక్షతో ఈ రాయబార ప్రయత్నాలకు సిద్ధమైనట్టు చర్చ జరుగుతోంది. -
పళణి కేసులో సాక్షిగా పన్నీరు
సాక్షి, చైన్నె: అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి స్వామిపై దాఖలైన కేసులో ఆ పార్టీ సమన్వయ కమిటీ కనీ్వనర్ పన్నీరు సెల్వంను సాక్షిగా పోలీసులు చేర్చారు. ఇది కాస్త కొత్త చర్చకు దారి తీసింది. వివరాలు.. అన్నాడీఎంకేలో పళని, పన్నీరు మధ్య జరుగుతున్న వార్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం పార్టీని పళణి స్వామి పూర్తిగా తన ఆ«దీనంలోకి తెచ్చుకున్నారు. పన్నీరు సెల్వం, ఆయన మద్దతుదారులకు ఉద్వాసన పలికారు. అయితే, తనదే నిజమైన అన్నాడీఎంకే అని, ఆ పార్టీ సమన్వయ కమిటీ కనీ్వనర్గా తనకే అధికారాలు ఉన్నాయంటూ పన్నీరు సెల్వం న్యాయ పోరాటం చేస్తూ వస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఎన్నికల సమయంలో ఎన్నికల కమిషన్ను బురిడి కొట్టించే విధంగా పళణి స్వామి ప్రదర్శించిన మాయకు ప్రస్తుతం పన్నీరు సాక్షి అయ్యారు. 2021 ఎన్నికల నామినేషన్ సమయంలో పళణి స్వామి దాఖలు చేసిన ప్రమాణ పత్రంలో ఆస్తుల వివరాలన్నీ తప్పుల తడకగా ఉన్నాయని, అనేక ఆస్తుల వివరాలను ఆయన దాచి పెట్టినట్టు తేనికి చెందిన జిలానీ కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ కేసును సేలం పోలీసులు విచారిస్తున్నారు. పళణి స్వామిపై మూడు సెక్షన్లతో కేసు పెట్టారు. ఈ కేసు విచారణను ముగించిన నివేదికను శుక్రవారం కోర్టుకు సేలం పోలీసులు సమరి్పంచారు. ఈ నివేదికలో పళణి స్వామి చేసిన తప్పుకు సాక్షులుగా ఉన్న వారి పేర్లను పొందుపరిచి ఉండడం శనివారం వెలుగులోకి వచ్చింది. సేలం సబ్ రిజిస్టార్, బ్యాంక్ మేనేజర్తో పాటు పన్నీరు సెల్వంను కూడా సాక్షిగా చేర్చారు. ఆ ఎన్నికల సమయంలో పళణి, పన్నీరు ఐక్యంగా ఉన్న విషయం తెలిసిందే. సమన్వయ కమిటీ కనీ్వనర్ హోదాలో పళణి స్వామి నామినేషన్ను బలపరిచే విధంగా పన్నీరు సైలం సంతకం చేసి ఉండటంతో ఆయనన్ి ఈ కేసులో సాక్షిగా చేర్చినట్టు పోలీసులు పేర్కొనడం గమనార్హం. మిత్రులు, ప్రస్తుతం బద్ద శత్రువులుగా మారిన నేపథ్యంలో కేసు విచారణ సమయంలో పళణిని మరింత ఇరకాటంలో పెట్టే విధంగా పన్నీరు సెల్వం వాంగ్మూలం ఇచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. -
పేరుకే ఎమ్మెల్యేని.. వీఏఓ కూడా పట్టించుకోవడం లేదు!
సాక్షి, చైన్నె: ఎస్సీ సామాజికవర్గానికి చెందిన వ్యక్తిని కావడంతో తనను వీఏఓ మొదలు తహసీల్దార్ వరకు చిన్నచూపు చూస్తున్నారని భవానీసాగర్ అన్నాడీఎంకే ఎమ్మెల్యే ఎ.బన్నారి ఆవేదన వ్యక్తం చేశారు. పేరుకే తాను ఏమ్మెల్యేగా కొనసాగుతున్నానని, కనీసం తనకు గౌరవం ఇచ్చే వాళ్లుకూడా లేదని ఉద్వేగానికి లోనయ్యారు. ఈరోడ్ జిల్లా భవానీసాగర్ నియోజకవర్గం(ఎస్సీ) ఎమ్మెల్యే బన్నారి మీడియాతో ఆవేదనను వ్యక్తం చేస్తూ చేసిన వ్యాఖ్యలను శుక్రవారం అన్నాడీఎంకే తన వెబ్సైట్లో పొందుపరిచింది. ఆ వివరాల మేరకు.. తాను ఎమ్మెల్యేగా గెలిచి రెండేళ్లు పూర్తి అయిందని, ఇంతవరకు తన నియోజకవర్గంలో ఒక్క అభివృద్ధి పథకం కూడా జరగలేదన్నారు. తాను ఏదేని సిఫారసు చేసినా, ఆదేశాలు ఇచ్చినా వాటిని వీఏఓ మొదలు తహసీ ల్దార్ వరకు భేఖాతరు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు ఓట్లు వేసిన ప్రజలకు న్యాయం చేయలేని పరిస్థితుల్లో ఉన్నట్టు ఉద్వేగానికి లోనయ్యారు. ఇంటి పట్టాలు, పింఛన్లు, ప్రభుత్వ పథకా ల కోసం తన వద్ద కు వచ్చే వాళ్లకు న్యా యం చేసే విధంగా అధికారులకు సిఫారసులు, ఆదేశాలు చేస్తూనే ఉన్నానని, ఇంతవరకు ఒక్కటి కూడా అమలుకు నోచుకోకపోవడం శోచనీయమన్నారు. పోలీసులు, పంచాయతీరాజ్, రెవెన్యూ అధికారులు అయితే, తనను చిన్నచూపు చూస్తున్నారని పేర్కొన్నారు. తాను ప్రశ్నించినా, సమాధానం కూడా ఇవ్వకుండా ఎమ్మెల్యే అనే మర్యాద కూడా ఇవ్వకుండా వెళ్లి పో తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. తాను ఎస్సీని కా వడంతో ఇక్కడున్న అధికారులు మరీ చిన్నచూపు చూస్తున్నారని, ఈ విషయాన్ని ఇంతవరకు తన పా ర్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లలేదన్నారు. ప్రభుత్వ అధికారిక వేడుకలకు ఆహ్వానాలు అంతంత మాత్రమేనని, తనను ప్రజాప్రతినిధిగా కాకుండా, వెనుకబడిన కులానికి చెందిన వ్యక్తిగానే అందరూ చూస్తున్నారని ఉద్వేగ భరితంగా వ్యాఖ్యలు చేశారు. తనతో స్థానికంగా ఉన్న అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై పలుమార్లు కలెక్టర్కు ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యమే అని పేర్కొన్నారు. -
బీజేపీలోకి పన్నీరు సెల్వం తనయుడు?
సాక్షి, చైన్నె: అన్నాడీఎంకే సమన్వయ కమిటీ కన్వీనర్ పన్నీరు సెల్వం తనయుడు, ఎంపీ రవీంద్రనాథ్ కొత్తవ్యూహాలకు పదును పెట్టారు. సొంత నియోజకవర్గం నుంచి ఈసారి ఆయన కమలం (తామర) చిహ్నంతో పోటీకి సిద్ధమవుతున్నట్లు సమాచారం. వివరాలు.. అన్నాడీఎంకేను ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి హోదాలో పళణి స్వామి పూర్తిగా తన గుప్పెట్లోకి తెచ్చుకున్న విషయం తెలిసిందే. అయితే ఎలాగైనా న్యాయ పోరాటం ద్వారా ఆ పార్టీని తన వశం చేసుకునే వ్యూహాలకు సమన్వయ కమిటీ కన్వీనర్ పన్నీరు సెల్వం యత్నిస్తున్నారు. అయితే అన్నాడీఎంకే తన గుప్పెట్లోకి చేరేనా అన్న కలవరంలో పన్నీరు సెల్వం ఉన్నట్టు సమాచారం. అదే సమయంలో ఆయన వారసుడు, ఎంపీ పి. రవీంద్రనాథ్ కొత్త వ్యూహాలకు పదును పెట్టారు. అన్నాడీఎంకే నుంచి తనకు అవకాశం దక్కేది అనుమానం కావడంతో ఈసారి కాషాయం కండువాతో కాకుండా, కమలం చిహ్నంతో ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్నారు. గత ఎన్నికల్లో డీఎంకే కూటమి రాష్ట్రంలో 38 స్థానాలు కై వసం చేసుకోగా, వ్యక్తిగత చరిష్మా, పార్టీ బలంతో అన్నాడీఎంకే తరపున రవీంద్రనాథ్ మాత్రమే పార్లమెంట్ మెట్లు ఎక్కారు. తాజాగా తన కుటుంబ వ్యక్తిగత చరిష్మతో మళ్లీ గెలవవచ్చు అనే ఽధీమాతో ఆయన ఉన్నా, చిహ్నం ఎక్కడ ఇరకాటంలో పెడుతుందో అనే బెంగ తప్పడం లేదటా...! అందుకే ఈ సారి ఆయన కమలం చిహ్నంతో పోటీ చేసి తేని లోక్సభ నియోజకవర్గంలో తమ బలాన్ని చాటే ప్రయత్నంలో ఉన్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. అదే సమయంలో తనకు తామర చిహ్నంలో పోటీ చేసే అవకాశం కల్పించిన పక్షంలో దక్షిణ తమిళనాడులోని తన సామాజిక వర్గం ఓటు బ్యాంక్ బీజేపీ అభ్యర్థులకు అనుకూలంగా మారుస్తామనే విషయాన్ని ఢిల్లీలో తను సన్నిహితంగా ఉన్న కేంద్రం పెద్దల దృష్టికి రవీంద్రనాథ్ తీసుకెళ్లినట్టు సమాచారం. అందుకే ప్రస్తుతం బీజేపీ తన సీట్ల సంఖ్యను 13కు పెంచినట్లు చర్చ జరుగుతోంది. ఇప్పటికే 11 నియోజకవర్గాలపై గురి పెట్టి బీజేపీ విస్తృతంగా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. తాజాగా రవీంద్రనాథ్ కోసం తేని సీటు, పుదయ నిధి కట్చి నేత ఏసీ షణ్ముగం కోసం వేలూరు సీటును ప్రస్తుతం బీజేపీ తెర మీదకు తెచ్చినట్లు సంకేతాలు వెలువడ్డాయి. అన్నాడీఎంకే నుంచి ఈ 13 సీట్లను రాబట్టుకునే వ్యూహాలకు పదును పెట్టే విధంగా బీజేపీ ఢిల్లీ నేతలు ముందుకెళ్తున్నట్లు సమాచారం. -
పళనికి అమిత్ షా అభయం
సాక్షి, చైన్నె : అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి హోదాలో తొలిసారిగా ఎడపాడి కే పళనిస్వామి బుధవారం ఢిల్లీకి వెళ్లారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో ఆయన భేటీ అయ్యారు. ఈసందర్భంగా పళనికి తన అభయాన్ని అమిత్ షా ఇస్తూ కొన్ని సూచనలు చేసినట్టు సమాచారం. అన్నాడీఎంకేలో పళని స్వామి, పన్నీరుసెల్వం మధ్య జరుగుతున్న వార్ క్లైమాక్స్కు చేరిన విషయం తెలిసిందే. కోర్టు, ఎన్నికల కమిషన్ ఉత్తర్వులతో అన్నాడీఎంకేను పూర్తిగా పళని స్వామి తన గుప్పెట్లోకి తెచ్చుకున్నారు. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి రాజకీయ వ్యూహాలకు పదును పెట్టే పనిలో పడ్డారు. ఇందులో భాగంగా ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి హోదాలో బుధవారం ఢిల్లీకి పళని వెళ్లారు. ముందుగా సేలంలోని తన స్వగ్రామం శిలువం పట్టిలోని మారియమ్మన్ ఆలయంలో పూజలు నిర్వహించారు. అక్కడ జరిగిన కుంభాభిషేక ఉత్సవానికి కుటుంబ సమేతంగా హాజరు అయ్యారు. అనంతరం కోయంబత్తూరు చేరుకున్న పళనిస్వామి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఆయనకు కోయంబత్తూరు విమానాశ్రయంలో అన్నాడీఎంకే వర్గాలు ఘనంగా వీడ్కోలు పలికాయి. పార్టీ నేతలు తంగమణి, ఎస్పీ వేలుమణిలతో కలిసి రాత్రి ఏడు గంటలకు ఢిల్లీకి పళనిస్వామి చేరుకున్నారు. అక్కడి విమానాశ్రయంలో పార్టీ నేతలు, ఎంపీలు సీవీ షణ్ముగం, తంబిదురై, చంద్రశేఖర్ పళనికి ఆహ్వానం పలికారు. రాత్రి తొమ్మిది గంటల సమయంలో అమిత్ షాతో పళనిస్వామి భేటీ అయ్యారు. ఈ ఇద్దరి మధ్య అర గంటకు పైగా తమిళ రాజకీయ అంశాలపై చర్చ జరిగినట్టు సమాచారం. అలాగే, రాష్ట్రంలో అన్నాడీఎంకే కూటమిలో గందరగోళం సృష్టించే విధంగా బీజేపీ అధ్యక్షుడు అన్నామలై తరచూ చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలపై అమిత్ షాకు పళణి ఫిర్యాదు చేసినట్టు సమాచారం. అలాగే, లోక్సభ ఎన్నికల కూటమి గురించి చర్చించినట్టు తెలిసింది. ఈసందర్భంగా పళని స్వామికి అమిత్ షా అభయాన్ని ఇచ్చినట్టు తెలిసింది. అన్ని వ్యవహారాలను తాను చూసుకుంటానని, తమిళనాడులో కూటమి అధిక స్థానాల్ని కై వసం చేసుకోవడం లక్ష్యంగా కార్యక్రమాలు విస్తృతం చేయాలని అమిత్ షా పళనికి సూచించినట్టు తెలిసింది. -
తిరుచ్చి వేదికగా పన్నీరు బల ప్రదర్శన
సాక్షి, చైన్నె: మాజీ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం తిరుచ్చి వేదికగా సోమవారం తన బలాన్ని చాటుకునే ప్రయత్నం చేశారు. మద్దతుదారులు రెండు లక్షల మేరకు ఈ మహానాడుకు మద్దతుదారులు తరలిరావడం గమనార్హం. వివరాలు.. అన్నాడీఎంకేను చేజిక్కించుకునే విషయంపై ఆ పార్టీకి చెందిన మాజీ సీఎంలు పన్నీరు, పళణి స్వామి మధ్య పెద్ద పోరాటం జరుగుతున్న విషయం తెలిసిందే. న్యాయ పోరాటంతో పాటు కేంద్ర ఎన్నికల కమిషన్తో జరిపిన సంప్రదింపులతో అన్నాడీఎంకేను పళణి స్వామి కై వసం చేసుకున్నారు. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా పళణి స్వామిరాజకీయ చక్రం తిప్పుతున్నారు. అయితే న్యాయ పోరాటంలో తుది గెలుపు తనదే అన్న ధీమాతో ఉన్న పన్నీరు సెల్వం సోమవారం తిరుచ్చి వేదికగా తన బలాన్ని చాటుకునే ప్రయత్నం చేశారు. తిరుచ్చి వేదికగా ముప్పెరుం విళాగా సాయంత్రం ఐదున్నర గంటల నుంచి మహానాడు ప్రారంభమైంది. గంట పాటుగా దివంగత నేతలు ఎంజీఆర్, జయలలితలు నటించిన చిత్రాలలోని పాటలను గాయకులు పాడుతూ పన్నీరు మద్దతు దారులలో ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం చేశారు. రాత్రి ఏడున్నర గంటలకు వేదికపై పన్నీరు సెల్వం, ఆయన తనయుడు, ఎంపీ రవీంద్రనాథ్, పార్టీ నేతలు బన్రూటి రామచంద్రన్, వైద్యలింగం, మనోజ్ పాండియన్, జేసీటీ ప్రభాకర్, వెల్లమండి నటరాజన్, కూపా కృష్ణన్లు వచ్చారు. మద్దతు దారులను పలకరించేందుకు వీలుగా పన్నీరు సెల్వం కోసం ప్రత్యేక ర్యాంప్ ఏర్పాటు చేశారు. మద్దతు దారుల వద్దకు నడుచుకుంటూ వెళ్లి ఆయన అభివాదం తెలియజేశారు. పళణి స్వామి, ఆయన బృందాన్ని ఉద్దేశించి పన్నీరు సెల్వం తన ప్రసంగంలో విరుచుకు పడ్డారు. కోర్టు తుది తీర్పుతో అన్నాడీఎంకేను కై వసం చేసుకుంటామన్న ధీమాను వ్యక్తం చేశారు. కాగా, తన సామాజిక వర్గం వెన్నంటి ఉంటుందని, లక్షల్లో తరలి వస్తారని భావించిన పన్నీరు సెల్వం చివరకు రెండు లక్షల మంది మేరకు మద్దతుదారులతో సర్దుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందనే ప్రచారం సాగుతుండడం గమనార్హం. -
తమిళనాట పొలిటికల్ ట్విస్ట్.. పన్నీర్ సెల్వానికి షాక్
చెన్నై: తమిళనాట రాజకీయాల్లో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. ఏఐడీఎంకే పన్నీర్ సెల్వానికి ఊహించని షాక్ తగిలింది. పన్నీర్ సెల్వానికి ఎన్నికల కమిషన్ బిగ్ షాక్ ఇచ్చింది. అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎడప్పాడి కే పళనిస్వామి నియామకాన్ని కేంద్రం ఎన్నికల సంఘం ఆమోదించింది. దీంతో, రెండాకుల గుర్తను పళనిస్వామి దక్కించుకున్నారు. ఇక, ఈసీ నిర్ణయంతో పన్నీరు సెల్వం వర్గానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వివరాల ప్రకారం.. అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎడప్పాడి పళనిస్వామి నియామకాన్ని కేంద్రం ఎన్నికల సంఘం ఆమోదించింది. కాగా ఈ విషయాన్నిఆ పార్టీ ధ్రువీకరించింది. ఈ క్రమంలో ఎలక్షన్ కమిషన్ పంపిన నోట్ను అన్నాడీఎంకే అధికార ప్రతినిధి ఆర్ఎం బాబీ మురగవేల్ గురువారం ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు. ఇక, అన్నాడీఎంకే చేసిన పార్టీ రూల్స్ అండ్ రెగ్యులేషన్ మార్పులు, ప్రధాన కార్యదర్శి ఎన్నిక, కొత్త ఆఫీస్ బేరర్ల నియామకానికి ఈసీ ఆమోదం తెలిపినట్లు పేర్కొంది. ఇదిలా ఉండగా.. పార్టీ అధ్యక్షురాలు, దివంగత మాజీ సీఎం జయలలిత మరణం తర్వాత ఇద్దరు నేతలు పార్టీపై పట్టుకోసం ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇరువర్గాల మధ్య వివాదం కొనసాగుతున్నది. ఇంతకు ముందు ఈ-రోడ్ స్థానానికి ఉప ఎన్నికలు జరగ్గా.. ఇద్దరు నేతలు వేర్వేరుగా అభ్యర్థులను కూడా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక, పళనిస్వామి ప్రస్తుతం తమిళనాడు శాసనసభలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ నిర్ణయంతో పన్నీరు సెల్వానికి బిగ్ షాక్ తగిలింది. మరోవైపు, పన్నీర్ సెల్వం దాఖలు చేసిన పిటిషన్పై మద్రాస్ హైకోర్టు విచారిస్తున్నది. Election Commission approves Edappadi K Palaniswami as the general secretary of AIADMK.#EdappadiPalaniswami #AIADMK pic.twitter.com/Nuobq4IVzj — Shankar (@Shankar38630530) April 20, 2023 -
తమిళనాడు అసెంబ్లీలో ఐపీఎల్ టికెట్ల పంచాయతీ
సాక్షి, చెన్నై: తమిళనాడులో ప్రస్తుతం ఐపీఎల్ టికెట్లు, చెన్నై సూపర్ కింగ్స్ కేంద్రంగా రాజకీయాలు సాగుతున్నాయి. ఐపీఎల్ టికెట్లపై రాష్ట్ర అసెంబ్లీలో పెద్ద పంచాయతే జరిగింది. ఈ సందర్భంగా మాజీ మంత్రి, అన్నాడీఎంకే విప్ ఎస్పీ వేలుమణి ఓ ఆసక్తికర అంశాన్ని మంగళవారం తెర మీదకు తెచ్చారు. క్రీడల శాఖకు సంబంధించి చేపట్టిన చర్చలో ఆయన ఐపీఎల్ టికెట్లు ఇప్పించాలని సదరు మంత్రి ఉదయ నిధి స్టాలిన్ను కోరారు. పళణిస్వామి నేతృత్వంలోని అన్నాడీఎంకే ప్రభుత్వం ఇది వరకు ఎమ్మెల్యేలు అందరికీ ఐపీఎల్ టికెట్లు కొని ఇచ్చామని ప్రస్తావించారు. ఈ ఏడాది ఐపీఎల్ మ్యాచ్లు చూసేందుకు ప్రభుత్వం టికెట్లు కొని ఎమ్మెల్యేకు ఇవ్వాలని కోరారు. దీనిపై మంత్రి ఉదయనిధి స్టాలిన్ ఘాటుగా స్పందించారు. ఐపీఎల్ నిర్వహించేది మీ మిత్రుడైన కేంద్రమంత్రి అమిత్ షా కుమారుడు జైషానే అని, మేమే అడిగితే మాకు ఇవ్వరు, మీరు అడిగితే ఇస్తారంటూ చురకలు అంటించారు. అంతేగాక చెన్నైలో గత నాలుగేళ్లుగా ఐపీఎల్ మ్యాచ్లే జరగనప్పుడు, టికెట్లు కొని ఎవరికి ఇచ్చారని సూటిగా ప్రశ్నించారు. దీంతో అన్నాడీఎంకే సభ్యులు కంగుతిన్నారు. అధికారపక్ష సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. చదవండి: చెన్నై సూపర్ కింగ్స్ జట్టుని బ్యాన్ చేయాల్సిందే.. ! -
శశికళ, దినకరన్కు ఆహ్వానం
సాక్షి, చైన్నె: తిరుచ్చి వేదికగా జరగనున్న మహానాడుకు శశికళ, దినకరన్ను ఆహ్వానించనున్నట్లు అన్నాడీఎంకే సమన్వయ కమిటీ కన్వీనర్ పన్నీరు సెల్వం తెలిపారు. అన్నాడీఎంకేలో విభేదాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ పార్టీని పూర్తిగా ప్రధాన కార్యదర్శి హోదాలో పళనిస్వామి తన గుప్పెట్లో తెచ్చుకున్నారు. అయితే న్యాయ పోరాటం ద్వారా పార్టీ మళ్లీ సత్తా చాటాలని సమన్వయ కమిటీ కన్వీనర్ పన్నీరుసెల్వం ప్రయత్నిస్తున్నారు. తన బలాన్ని చాటుకునే విధంగా ఈనెల 24వ తేదీన తిరుచ్చి వేదికగా భారీ మహానాడుకు సిద్ధమయ్యారకు. ముప్పెరుం విళాగా ఈ వేడుకకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మహానాడు విజయవంతం కోసం తన శిబిరం తరపున జిల్లాల కార్యదర్శులుగా ఉన్న నేతలతో సమావేశాల్లో పన్నీరు నిమగ్న మయ్యారు. మంగళవారం జరిగిన సమావేశానంతరం మీడియాతో పన్నీరు సెల్వం మాట్లాడుతూ, ముప్పెంరు విళా అన్నది అన్నాడీఎంకే కార్యకర్తలకు దివంగత నేత ఎంజీఆర్ ఇచ్చిన హక్కులను కాపాడే విధంగా ఉంటుందని వివరించారు. పదవీ వ్యామోహంతో నిబంధనలు ఉల్లంఘించి సర్వాధికారంతో విర్ర వీగుతున్న ముఠాకు గుణపాఠం చెప్పే వేదిక అవుతుందన్నారు. ఈ మహానాడుకు చిన్నమ్మ శశికళ, అమ్మ మక్కల్ మున్నేట్రకళగం నేత టీటీవీ దినకరన్ను ఆహ్వానించనున్నట్లు ప్రకటించారు. వారు తప్పకుండా ఈ మహానాడుకు వస్తారంటూ ధీమా వ్యక్తం చేశారు. కాగా, పన్నీరు వ్యాఖ్యలపై పళని శిబిరం సీనియర్నేత జయకుమార్ స్పందిస్తూ, ఆ మహానాడును తాము లెక్కలోకి తీసుకోవడం లేదన్నారు. అలాంటప్పుడు ఆయన ఎవరిని ఆహ్వానిస్తే తమకేంటిని ప్రశ్నించారు. -
కర్ణాటక ఎన్నికల్లో పన్నీరు శిబిరం
సాక్షి, చెన్నై: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే పోటీచేస్తున్నట్టు ఆ పార్టీ సమన్వయ కమిటీ కనీ్వనర్ పన్నీరు సెల్వం శిబిరం ప్రకటించింది. కర్ణాటక బీజేపీ నేత యడ్యూరప్పతో ఆ శిబిరం ముఖ్యనేత పుహలేంది శుక్రవారం భేటీ అయ్యారు. మెజారిటీ శాతం నేతలు, సభ్యుల మద్దతుతో అన్నాడీఎంకేను పళనిస్వామి కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఆయన పగ్గాలు కూడా చేపట్టారు. అయితే, ఇవన్నీ తాత్కాలికమేనని కోర్టులో జరుగుతున్న న్యాయ పోరాటంలో గెలుపు తమదే ధీమాను ఆ పార్టీ సమన్వయ కమిటీ కనీ్వనర్ పన్నీరుసెల్వం వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో పళనిస్వామి కన్నా ముందుగా బీజేపీకి దగ్గరయ్యే విధంగా పన్నీరుసెల్వం ఓ అడుగు ముందుకు వెళ్లారు. కర్ణాటకలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీతో కలిసి పయనించేందుకు అన్నాడీఎంకే సిద్ధంగా ఉన్నట్టు పన్నీరు ప్రకటించారు. అలాగే, తన మద్దతు నేత పుహలేందిని కర్ణాటక బీజేపీ నేత యడ్యూరప్పతో భేటీకి పంపించారు. ఆయన్ను కలిసిన పుహలేంది పోటీ విషయంగా చర్చించి రావడం గమనార్హం. పోటీ తథ్యం.. మీడియాతో పన్నీరు సెల్వం మాట్లాడుతూ కర్ణాటక ఎన్నికలలో తమ శిబిరం తరఫున అన్నాడీఎంకే అభ్యర్థులు పోటీలో ఉండడం తథ్యమని స్పష్టం చేశారు. తాము పోటీ చేస్తున్నామని ఇందులో మార్పులేదన్నారు. కోర్టు తుది తీర్పు అన్నాడీఎంకేకు గట్టి సమాధానంగా ఉంటుందని ధీమా వ్యక్తంచేశారు. నిబంధనలకు విరుద్ధంగా, నోట్ల కట్టలతో ప్రధాన కార్యదర్శి పగ్గాల చేపట్టిన పళణిస్వామికి మున్ముందు ఆ శిబిరం నేతలు బుద్ధి చెప్పే రోజులు రాబోతున్నాయన్నారు. ప్రధాని మోదీని కలిసే అవకాశం కోరినట్టు, పిలుపువస్తే కలిసేందుకు సిద్ధమని పన్నీరుసెల్వం తెలిపారు. -
జమిలీ ఎన్నికలు తథ్యం..
సాక్షి, చైన్నె: అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడపాడికే పళణి స్వామి సేలం పర్యటన ఆదివారం రోడ్షోను తలపించింది. దారి పొడవునా ఆయనకు అభిమానులు, కార్యకర్తలు బ్రహ్మరథం పట్టారు. కాగా లోక్సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీకి సైతం ఎన్నికలు రాబోతున్నాయని, ప్రతి ఒక్కరూ దీనికి సిద్ధంగా ఉండాలని కేడర్కు ఈ సందర్భంగా పళణి స్వామి సూచించారు. వివరాలు.. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా మూడు రోజుల క్రితం ఎడపాడి కె. పళణిస్వామి పగ్గాలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ హోదాలో ప్రపథమంగా ఆదివారం చైన్నె నుంచి సొంత జిల్లా సేలంకు ఆయన బయలుదేరారు. మొదట గ్రీన్ వేస్ రోడ్డులోని ఆయన ఇంటి వద్ద నుంచే అన్నాడీఎంకే వర్గాల హడావుడి మొదలైంది. వేద పండితుల పూర్ణ కుంభ స్వాగతం పలికారు. తర్వాత సేలానికి పళణిస్వామి రోడ్డు మార్గంలో బయలు దేరారు. ఆలందూరులోని ఎంజీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం ఆయన పర్యటన రోడ్ షోను తలపించే విధంగా జరిగింది. మార్గం మధ్యలో తాంబరం, చెంగల్పట్టు, మదురాంతకం, దిండివనం, విల్లుపురం, అంటూ ప్రతి చోటా ఆయన కాన్వాయ్ ఆగింది. పార్టీ కేడర్ ఈ మేరకు పళణిస్వామికి బ్రహ్మరథం పట్టేవిధంగా ఆహ్వానం పలికారు. దారి పొడవున కేడర్ను పలకరిస్తూ వెళ్లడంతో సేలం చేరేలోపు రాత్రి ఏడు దాటింది. సేలంలోనూ ఆయనకు ఘన స్వాగతం లభించింది. జమిలీ ఎన్నికలు తథ్యం.. దారి పొడవున తనకు బహ్మ్రరథం పట్టిన కార్యకర్తలను ఉద్దేశిస్తూ పళణి స్వామి ప్రసంగాలు జరిగాయి. లోక్సభ ఎన్నికలతో పాటు రాష్ట్ర అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. లోక్సభ ఎన్నికలలో రాష్ట్రంతో పాటు పుదుచ్చేరిలో ఈసారి 40 స్థానాలు అన్నాడీఎంకే కూటమి చేజిక్కించుకోవడం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు. అసెంబ్లీకి ఎన్నికలు వస్తే అధికార పగ్గాలు చేపట్టడం తథ్యమని, ఇందులో మరో ఆలోచన లేదని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం తనకు శుభాకాంక్షలు, ఆహ్వానం తెలిపిన వారందరికి కృతజ్ఞతలు తెలుపుతూ పళణి స్వామి ఓ ప్రకటన విడుదల చేశారు. దివంగత నేతలు ఎంజీఆర్, అమ్మజయలిత మార్గంలోనే తన ప్రయాణం ఉంటుందని స్పష్టంచేశారు. ఇదిలా ఉండగా, ఈనెల 7వ తేదీన అన్నాడీఎంకే కార్యదర్శులు, జిల్లాల కార్యదర్శుల సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు పళణి స్వామి తెలిపారు. అలాగే, సోమవారం మదురైలో పర్యటించాలని నిర్ణయించారు. దేవర్ సామాజిక వర్గాన్ని ఆకర్షించే విధంగా ఈ పర్యటన ఉంటుందని భావిస్తున్నారు. -
పన్నీర్ సెల్వంకు భారీ షాక్
తమిళనాడు రాజకీయాల్లో ఇవాళ ఆసక్తికర పరిణామం ఒకటి చోటుచేసుకుంది. ప్రతిపక్ష అన్నాడీఎంకేలో వర్గ పోరులో.. కోర్టు తీర్పు ద్వారా పళనిస్వామి మళ్లీ పైచేయి సాధించారు. పార్టీ నుంచి తనను బహిష్కరించడంతో పాటు ఏఐఏడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి పళనిస్వామి చేపట్టడాన్ని సవాల్ చేస్తూ పన్నీర్సెల్వం మద్రాస్ హైకోర్టును ఆశ్రయించగా.. కోర్టు ఇవాళ(మంగళవారం) ఆ పిటిషన్ను తిరస్కరించింది. మద్రాస్ హైకోర్టు తీర్పు వెలువడినవెంటనే.. అన్నాడీఎంకే పార్టీ అధికారికంగా ఈపీఎస్(ఎడపాడి కే పళనిస్వామి)ని పార్టీ ప్రదాన కార్యదర్శిగా ప్రకటించింది పార్టీ సీఈసీ. ఈ మేరకు చెన్నైలోని పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద సంబురాలు జరుగుతున్నాయి. ఇక తాజా తీర్పుతో ఓపీఎస్(ఓ పన్నీర్ సెల్వం).. ఇద్దరు న్యాయమూర్తుల బెంచ్ను ఆశ్రయించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక.. అన్నాడీఎంకే పార్టీ కార్యదర్శి (తాత్కాలిక) పదవికి పళనిస్వామి నియామకాన్ని వ్యతిరేకిస్తూ మద్రాస్ హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలు అయ్యాయి. కిందటి ఏడాది జులైలో పార్టీ జనరల్ కౌన్సిల్ ద్వారా ఈ నియామకం జరగ్గా.. దానిని వ్యతిరేకిస్తూ పన్నీర్ సెల్వం వర్గం న్యాయస్థానాలను ఆశ్రయించింది. ఈ క్రమంలో సుప్రీం కోర్టు అన్నాడీఎంకే సాధారణ కౌన్సిల్ను చట్టబద్ధమైనదిగానే సమర్థించింది. అయితే తీర్మానాల చట్టబద్ధతపై నిర్ణయం మాత్రం మద్రాసు హైకోర్టుకు వదిలివేసింది. ఇదిలా ఉంటే.. గత శనివారం పార్టీ జనరల్ సెక్రటరీ పదవి ఎన్నికకు ఈపీఎస్ నామినేషన్ దాఖలు చేయగా.. ఇదంతా దొంగచాటు వ్యవహారమంటూ పన్నీర్సెల్వం మండిపడ్డారు. అంతలోనే మద్రాస్ హైకోర్టు ఈపీఎస్కు అనుకూలంగా తీర్పు ఇవ్వడం గమనార్హం. -
కలిసికట్టుగా లోక్సభ ఎన్నికల్లోకి..
సాక్షి, చైన్నె: అన్నాడీఎంకేలోని అందరూ కలిసికట్టుగా లోక్సభ ఎన్నికలను ఎదుర్కొనేందుకు సమయం ఆసన్నం అవుతోందని దివంగత సీఎం జయలలిత నెచ్చెలి, చిన్నమ్మ శశికళ వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆమె నాగపట్నం, తిరువారూర్లలో పర్యటించారు. ఈసందర్భంగా మీడియాతో మాట్లాడుతూ అసెంబ్లీ వేదికగా అన్నాడీఎంకే విభేదాల గురించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రజాసమస్యలపై చర్చించాల్సిన వేదికపై వివాదాలు శోచనీయమన్నారు. దీనిని తాను తీవ్రంగా ఖండిస్తున్నట్టు పేర్కొన్నారు. అసెంబ్లీలో ప్రజా ప్రతినిధులు ఎవరైనా ప్రశ్నించవచ్చునని, అభిప్రాయాలు వ్యక్తం చేయవచ్చునని, వ్యాఖ్యలు, ప్రసంగాలు చేయడానికి వీలుందన్నారు. అయితే, పన్నీరుసెల్వంను అడ్డుకోవడం శోచనీయమన్నారు. తాను ఖండించినంత మాత్రాన పన్నీరుకు మద్దతు ఇచ్చినట్టు కాదన్నారు. అన్నాడీఎంకే ఎవరి చేతిలో ఉంటే భవిష్యత్తు ఉంటుందో అన్నది కేడర్ ఆలోచించాలని, సమాధానం కేడర్ చెప్పాలని కోరారు. త్వరలో తనను పన్నీరుసెల్వం కలిసే అవకాశాలు ఉన్నాయని ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. లోక్ సభ ఎన్నికలలో అందరూ కలిసికట్టుగా ఎదుర్కొంటామని ధీమా వ్యక్తం చేశారు. డీఎంకేకు ఈసారి గెలుపు కష్టమేనని, ఆ మేరకు తాము వ్యూహాలకు పదును పెడతామన్నారు. -
స్టాలిన్ ప్రభుత్వానికి కొత్త తలనొప్పి
చెన్నై: తమిళనాడులో స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే ప్రభుత్వానికి కొత్త తలనొప్పి వచ్చిపడింది. సోషల్ మీడియాలో.. మరీ ముఖ్యంగా అక్కడి ప్రజలు బాగా యాక్టివ్గా ఉండే ట్విటర్లోనే ప్రభుత్వ వ్యతిరేక ప్రచారం ఎడాపెడా సాగుతోంది. అందునా తమిళ చిత్రాల ఫన్నీ వీడియోలతో రూపొందుతున్న మీమ్స్ విపరీతంగా వైరల్ అవుతున్నాయి. కట్టడికి చేస్తున్న ప్రయత్నాలు ఫలించకపోగా.. అణచివేతకు దిగుతోందంటూ ప్రభుత్వంపైనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా తమిళనాడు బడ్జెట్కు సంబంధించిన ఓ మీమ్ విపరీతంగా ట్రెండ్ అయ్యింది. బడ్జెట్ 2023-24లోభాగంగా మహిళలకు(ప్రత్యేకించి గృహిణులకు) నెలవారీ సహాయ పథకం ఏడువేల కోట్ల రూపాయలను కేటాయించింది స్టాలిన్ ప్రభుత్వం. సెప్టెంబర్ 15వ తేదీ నుంచి నెలవారీగా ఒక్కో మహిళకు వెయ్యి రూపాయలు అందించనుంది ప్రభుత్వం. అయితే ఈ కేటాయింపులపై తీవ్ర విమర్శలు మొదలయ్యాయి. ఎన్నికల మేనిఫెస్టోలో.. 2.2 కోట్ల రేషన్ కార్డు హోల్డర్లకు సాయం అందిస్తామన్న హామీని డీఎంకే ప్రభుత్వం, ఆ హామీని నెరవేర్చకుండా తాజా పథకంతో చిల్లర విసురుతోందంటూ విమర్శలు వెల్లువెత్తాయి. ఈ తరుణంలో.. సోషల్ మీడియాలో మీమ్స్ను వైరల్ చేస్తున్నారు. తాజాగా.. వాయిస్ ఆఫ్ సవుక్కు అనే ట్విటర్ పేజీ అడ్మిన్ను తమిళనాడు పోలీసులు అరెస్ట్ చేశారు. మహిళా పథకాన్ని వెటకారం చేస్తూ.. హాస్యద్వయం గౌండమణి, సెంథిల్లు ఉన్న ఓ వీడియోను ఎడిట్ చేశాడు ఆ పేజీ అడ్మిన్ ప్రదీప్. అందులో ఒకరిని స్టాలిన్గా మరొకరిని ఆర్థిక మంత్రిగా చూపించాడు. దీంతో.. ఈ వీడియోను నేరంగా పరిగణించిన పోలీసులు ఐటీ చట్టంలోని పలు సెక్షన్ల కింద అతన్ని అరెస్ట్ చేశారు. Sources : Pradheep one of the admins of @voiceofsavukku has been arrested in Cr No 52/2023 under sections 153, 505 (1) (b) and 509 IT Act for this video meme. pic.twitter.com/dT7LcsLorF — Savukku Shankar (@Veera284) March 22, 2023 తమిళనాడులో రాజకీయ వేడిని పుట్టించిన ఈ మీమ్-అరెస్ట్ పరిణామంపై అధికార, ప్రతిపక్షాలు పోటాపోటీగా విమర్శించుకుంటున్నాయి. బీజేపీ, అన్నాడీఎంకేలు అరెస్ట్ను ఖండిస్తున్నాయి. పార్టీల నేతలేకాదు.. ఉద్యమకారులు, హక్కుల సాధన సమితిలు, నెటిజన్లు.. #ArrestMeToo_Stalin పేరుతో హ్యాష్ ట్యాగ్ను వైరల్ చేస్తున్నారు. అయితే.. ఈ ఒక్క ఘటనే కాదు. ఆమధ్య స్టాలిన్ తనయుడు ఉదయ్నిధి స్టాలిన్కు క్రీడామంత్రిత్వ శాఖను అప్పగించడంపైనా సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ నడిచింది. తాజాగా.. తమిళనాడు పోలీసులు, బీజేపీ కార్యకర్తలను అరెస్ట్ చేసేందుకు గుజరాత్ దాకా వెళ్లిన పరిణామంపైనా స్టాలిన్ను, ఆయన తండ్రి దివంగత కరుణానిధిని కలిపి మరీ ట్రోల్ చేశారు నెటిజన్లు. -
అన్నాడీఎంకే కేసులో పళనిస్వామికి భారీ విజయం
సాక్షి, ఢిల్లీ: అన్నాడీఎంకే కేసులో పళనిస్వామికి భారీ విజయం దక్కింది. ఆయనకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఇటీవలే అన్నాడీఎంకే సెక్రటరీగా పళనిస్వామి ఎన్నికయిన సంగతి తెలిసిందే. పళనిస్వామి ఎన్నిక సరైనదేనని సుప్రీంకోర్టు పేర్కొంది. మద్రాస్ హైకోర్టు తీర్పును అత్యున్నత న్యాయస్థానం సమర్థించింది. దీంతో అన్నాడీఎంకే తాతాల్కిక ప్రధాన కార్యదర్శిగా కొనసాగేందుకు ఈపీఎస్కు లైన్ క్లియర్ అయింది. దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణం తర్వాత అన్నాడీఎంకేలో ద్వంద్వ నాయకత్వం అమలులోకి వచ్చింది. పళనిస్వామి, పన్నీరు సెల్వం ఉమ్మడిగా బాధ్యతలు నిర్వర్తించేవారు. అయితే గత ఏడాది జూలైలో నిర్వహించిన సమావేశంలో ద్వంద్వ నాయకత్వ విధానాన్ని అన్నాడీఎంకే జనరల్ కౌన్సిల్ రద్దు చేసింది. పార్టీ తాత్కాలిక కార్యదర్శిగా పళనిస్వామిని సభ్యులు ఎన్నుకున్నారు. ఈ నిర్ణయాన్ని పన్నీరు సెల్వం హైకోర్టులో సవాల్ చేశారు. అక్కడ ఎదురుదెబ్బ తగలడంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. -
ఉప ఎన్నికల వేళ తమిళనాడులో ట్విస్ట్.. సీఎం స్టాలిన్ కీలక నిర్ణయం!
ఎడతెగని వ్యూహాలు.. ఎత్తులకు పైఎత్తులతో ప్రధాన పార్టీలన్నీ ఈరోడ్ ఉప సమరానికి సిద్ధమయ్యాయి. బుధవారం నామినేషన్లను ఎన్నికల అధికారి ఆమోదించడంతో ప్రచార పర్వానికి తెరలేపాయి. ముఖ్యంగా నాలుగు ప్రధాన పారీ్టలకు చెందిన అభ్యర్థులు గెలుపే లక్ష్యంగా ప్రజా క్షేత్రంలో నువ్వా..నేనా అన్నట్లు ముందుకు సాగుతున్నాయి. సాక్షి, చెన్నై: ఈరోడ్ తూర్పు అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నిక కీలక దశకు చేరుకుంది. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, అన్నాడీఎంకే, డీఎండీకే, నామ్ తమిళర్ కట్చిల అభ్యర్థుల నామినేషన్లను ఎన్నికల అధికారి శివకుమార్ బుధవారం ఆమోదించారు. పరిశీలనలో మరో 76 నామినేషన్లు కూడా ఓకే అయ్యాయి. ఈ ఎన్నికల రేసుల నుంచి తాము తప్పుకుంటున్నట్లు అన్నాడీఎంకేలో చీలిక కారణంగా ఆవిర్భవించిన అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం ప్రకటించడం చర్చకు దారి తీసింది. కాంగ్రెస్ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా సీఎం ఎంకే స్టాలిన్ నియోజకవర్గంలో ఓట్ల వేటకు సిద్ధమయ్యారు. రసవత్తరంగా.. ఈరోడ్ తూర్పు నియోజకవర్గ ఉప ఎన్నిక అన్నాడీఎంకే రాజకీయాలను రసవత్తరంగా మార్చింది. ఆ పార్టీ శిబిరాల అభ్యర్థులుగా తెన్నరసు, సెంథిల్ మురుగన్, ఆ పార్టీలో చీలికతో ఆవిర్భవించిన అమ్మమక్కల్ మున్నేట్ర కళగం అభ్యర్థిగా శివ ప్రశాంత్ నామినేషన్లు వేశారు. చివరకు సర్వసభ్య సభ్యుల మెజారిటీ మద్దతుతో అన్నాడీఎంకే సమన్వయ కమిటీ కన్వీనర్ పన్నీరు సెల్వం తన అభ్యర్థి సెంథిల్ మురుగన్ను పోటీ నుంచి తప్పించారు. అదే సమయంలో తాజాగా తమకు కుక్కర్ గుర్తు కేటాయించబోమని ఎన్నికల కమిషన్ స్పష్టం చేయడాన్ని నిరసిస్తూ అమ్మ మక్కల్మున్నేట్ర కళగం కూడా ఎన్నికల నుంచి తప్పుకోవడం రాజకీయంగా చర్చకు దారి తీసింది. ఢిల్లీ పెద్దల నుంచి వచ్చిన ఒత్తిళ్లకు ఏ విధంగా పన్నీరు సెల్వం తలొగ్గారో, అదే తరహాలో అమ్మమక్కల్ మున్నేట్ర కళగం నేత టీటీవీ దినకరన్ కూడా వెనక్కి తగ్గినట్టు చర్చ సాగుతోంది. క్షణంలో ఎన్నికల రేసులో నుంచి తప్పుకున్నా, తాము ఎవరి ఒత్తిళ్లకూ తలొగ్గేది లేదని, తమకు అనుకూలమైన గుర్తు కేటాయించక పోవడం వల్లే బరిలో నుంచి తప్పుకున్నట్లు టీటీవీ స్పష్టం చేశారు. దుష్ట శక్తి డీఎంకే, ద్రోహ శక్తి అన్నాడీఎంకే అభ్యర్థులకు మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. దీంతో అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి పళణి స్వామి శిబిరం అభ్యర్థి తెన్నరసు మాత్రమే అధికారికంగా ఆ పార్టీ తరపున పోటీలో మిగిలారు. 121లో 80 నామినేషన్లకు ఆమోదం ఉప ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల వద్ద గత నెల 31 నుంచి ఈనెల 7వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరించారు. మొత్తంగా 121 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు ఆరుగురు ఉన్నారు. ఇందులో ఇద్దరు వెనక్కి తగ్గారు. బుధవారం నామినేషన్ల పరిశీలన చేపట్టారు. ఎన్నికల పర్యవేక్షకుడు రాజ్ మోహన్ యాదవ్, ఎన్నికల అధికారి శివకుమార్ అన్ని నామినేషన్లను క్షుణ్ణంగా పరిశీలించారు. మొత్తం 121 నామినేషన్లు దాఖలు కాగా, 80 ఆమోదం పొందాయి. ఇందులో తొలి ఆమోదం ఎన్నికల వీరుడు, స్వతంత్ర అభ్యర్థి పద్మరాజన్ది కావడం విశేషం. ఆ తర్వాత కోవైకు చెందిన స్వతంత్ర అభ్యర్థి నూర్ మహ్మద్ నామినేషన్ను ఆమోదించారు. మూడో నామినేషన్ కాంగ్రెస్ అభ్యర్థి ఈవీకేఎస్ ఇలంగోవన్. అలాగే అన్నాడీఎంకే డీఎంకే అధికారిక అభ్యర్థి తెన్నరసు, డీఎండీకే అభ్యర్థి ఆనంద్, నామ్ తమిళర్ కట్చి అభ్యర్థి మేనక నామినేషన్లకు కూడా ఆమోదం లభించింది. ఇక ఎన్నికల నుంచి తప్పుకున్న పన్నీరు సెల్వం వర్గం అభ్యర్థి సెంథిల్ మురుగన్, టీటీవీ అభ్యర్థి శివ ప్రశాంత్ నామినేషన్లు ఆమోదం పొందినా, వారు గురువారం ఉప సంహరించాలని నిర్ణయించారు. కాంగ్రెస్సా.. డీఎంకేనా..? ఎన్నికల్లో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, అన్నాడీఎంకే, డీఎండీకే, నామ్ తమిళర్ కట్చి అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అయితే సమరం కాంగ్రెస్, అన్నాడీఎంకే అభ్యర్థులు ఈవీకేఎస్, తెన్నరసు మధ్య ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. డీఎండీకే, నామ్ తమిళర్ కట్చి అభ్యర్థులు చీల్చే ఓట్లే కాంగ్రెస్, అన్నాడీఎంకే అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్ణయించే అవకాశం ఉంది. అన్నాడీఎంకే అభ్యర్థికి మద్దతుగా ఆయా కూటమి పక్షాలైన బీజేపీ, తమిళ మానిల కాంగ్రెస్ తదితర పారీ్టలు ప్రచారానికి సిద్ధమయ్యాయి. బుధవారం పళని స్వామి నేతృత్వంలో మిత్ర పక్షాల నాయకులు సమావేశమయ్యారు. ఈనెల 12వతేదీ నుంచి నియోజకవర్గంలో పళని స్వామి ఇంటింటా సుడిగాలి ప్రచారం చేయనున్నట్లు ప్రకటించారు. కాగా అన్నాడీఎంకే అభ్యర్థి గెలుపు కోసం తమ శిబిరం తరపున కూడా స్టార్ క్యాంపెయినర్ల జాబితాను పన్నీరు సెల్వం ఇప్పటికే ప్రకటించడం గమనార్హం. ఇక కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతుగా ఇప్పటికే డీఎంకే మంత్రులు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. సీఎం ఎంకే స్టాలిన్ కూడా ప్రచారంలో పాల్గొనాలని నిర్ణయించారు. ఈనెల 24, 25 తేదీల్లో ఈరోడ్లో 10 చోట్ల సీఎం ప్రసంగించనున్నారు. అలాగే సీఎం తనయుడు, మంత్రి ఉదయ నిధి స్టాలిన్ కూడా ఈనెల 19, 20 తేదీల్లో ఇలంగోవన్ కోసం ప్రచారం చేయనున్నారు. -
అన్నాడీఎంకే మరో ట్విస్ట్.. పన్నీరు సెల్వం ప్లాన్ ఫలించేనా?
సాక్షి, చెన్నై: సర్వసభ్య సమావేశం సభ్యుల మద్దతు కోసం అన్నాడీఎంకే ప్రిసీడియం చైర్మన్ తమిళ్ మగన్ హుస్సేన్ పంపిన దరఖాస్తును ఆ పార్టీ సమన్వయ కమిటీ కన్వీనర్ పన్నీరు సెల్వం శిబిరం తీవ్రంగా వ్యతిరేకించింది. ఇందులో ఏక పక్షంలో అభ్యర్థి పేరును సూచించారని, తమ మద్దతుదారు పేరు లేకుండా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వివరాల ప్రకారం.. ఈరోడ్ తూర్పు నియోజకవర్గం ఉప ఎన్నికల్లో శనివారం నాటికి 46 మంది నామినేషన్లు వేశారు.ఇందులో కాంగ్రెస్, డీఎండీకే, నామ్ తమిళర్ కట్చి, అమ్మమక్కల్ మున్నేట్ర కళగం అభ్యర్థులు కూడా ఉన్నారు. అయితే అన్నాడీఎంకేలో విబేధాల నేపథ్యంలో ఆ పార్టీలోని తాత్కాలిక ప్రధాన కార్యదర్శి పళనిస్వామి, సమన్వయ కమిటీ కన్వీనర్ పన్నీరు సెల్వం శిబిరాలకు చెందిన అభ్యర్థులు ఇంత వరకు నామినేషన్లు దాఖలు చేయలేదు. మంగళవారంతో నామినేషన్లు ముగియనున్నాయి. ఈ పరిస్థితుల్లో రెండాకుల చిహ్నం వ్యవహారంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు సర్వ సభ్య సమావేశం సభ్యుల మద్దతు సేకరణకు అన్నాడీఎంకే ప్రిసీడియం చైర్మన్ తమిళ్ మగన్ హుస్సేన్ శనివారం చర్యలు చేపట్టారు. ఇందుకోసం ప్రత్యేకంగా దరఖాస్తును సిద్ధం చేశారు. ఆదివారం రాత్రిలోపు ఈ దరఖాస్తులను పూర్తి చేసి సమర్పించాలని సర్వసభ్య సమావేశం సభ్యులకు సమాచారం పంపించారు. మెజారిటీ మద్దతు అనుగుణంగా ఎన్నికల కమిషన్ను సోమవారం కలిసేందుకు తమిళ్ మగన్ హుస్సేన్ సిద్ధమవుతున్నారు. ఈ సమయంలో ఆ దరఖాస్తుకు వ్యతిరేకంగా పన్నీరు సెల్వం శిబిరం ఆదివారం గళం విప్పింది. తీవ్ర వ్యతిరేకత.. దరఖాస్తును ఏక పక్షంగా సిద్ధం చేశారని పన్నీరు శిబిరం నేతలు బన్రూటి రామచంద్రన్, వైద్యలింగం ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రీన్ వేస్ రోడ్డులోని పన్నీరు సెల్వం ఇంట్లో జరిగిన సమావేశం అనంతరం మీడియాతో వారు మాట్లాడారు. ఆ దరఖాస్తులో పళణిస్వామి ప్రకటించిన అభ్యర్థి తెన్నరసు పేరును మాత్రం సూచించారని, తమ అభ్యర్థి పేరును నమోదు చేయలేదని మండిపడ్డారు. సుప్రీంకోర్టు ఉత్తర్వులకు వ్యతిరేకంగా తమిళ్ మగన్ హుస్సేన్ వ్యవహరిస్తున్నారని, ఈ దరఖాస్తును తాము అంగీకరించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఈ విషయంపై ఫిర్యాదు చేయాల్సిన చోట ఫిర్యాదు చేస్తామన్నారు. ఇదిలా ఉండగా, అన్నాడీఎంకేలోని సర్వసభ్య సభ్యుల్లో పళనిస్వామి శిబిరానికి 2,662 మంది మద్దతు ఉంది. అలాగే ముగ్గురు ఎంపీలు, 61 మంది ఎమ్మెల్యేలు, 70 మంది జిల్లాల కార్యదర్శుల మద్దతు కూడా ఆయన ప్రకటించిన అభ్యర్థి తెన్నరసుకే ఉండటం గమనార్హం. ఇక, పన్నీరు సెల్వం శిబిరానికి 148 మంది సర్వసభ్య సభ్యులు, ఇద్దరు ఎంపీలు, నలుగురు ఎమ్మెల్యేలు , ఐదుగురు జిల్లాల కార్యదర్శుల మద్దతు మాత్రమే ఉండడం గమనార్హం. మద్దతు తక్కువగా ఉన్నా, రెండాకుల వివాదాన్ని మళ్లీ మొదటికి తెచ్చే విధంగా దరఖాస్తును అస్త్రంగా చేసుకుని ఫిర్యాదు చేయడానికి పన్నీరు శిబిరం సిద్ధం అవుతోండడం అన్నాడీఎంకేలో ఆసక్తి రేపుతోంది. -
అన్నాడీఎంకే శిబిరాల్లో కొత్త టెన్షన్ .. ప్రధాని మోదీతో కీలక భేటీ!
సాక్షి, చెన్నై: ఈరోడ్ తూర్పు అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో రెండాకుల గుర్తు ఎవరికి దక్కుతుందో అనే ఉత్కంఠ అన్నాడీఎంకే శిబిరాల్లో నెలకొంది. బంతిని తమ వద్ద నుంచి ఆ నియోజకవర్గ ఎన్నికల అధికారి కోర్టులోకి నెట్టే విధంగా కేంద్ర ఎన్నికల కమిషన్ వ్యూహాత్మకంగా వ్యవహరించడం గురువారం వెలుగులోకి వచ్చింది. వివరాల ప్రకారం.. ఈరోడ్ తూర్పు నియోజకవర్గంలో ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ మొదలు కావడంతో అభ్యర్థుల్లో హడావుడి పెరిగింది. కాంగ్రెస్ డీఎండీకే అభ్యర్థి ఆనందన్ ఇప్పటికే నామినేషన్ వేశారు. గురువారం నామ్ తమిళర్ కట్చి అభ్యర్థి మేనకా నవనీతన్తో పాటు పలువురు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఇక అన్నాడీఎంకేలో చీలికతో ఆవిర్భవించిన అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం అభ్యర్థిగా శివ ప్రశాంత్, కాంగ్రెస్ అభ్యర్థి ఈవీకేఎస్ ఇళంగోవన్ శుక్రవారం నామినేషన్ దాఖలు చేయడానికి సిద్ధమాయ్యరు. అలాగే అన్నాడీఎంకేలో పళణిస్వామి, పన్నీరు సెల్వం శిబిరాల మధ్య వార్ ఆ పార్టీ కేడర్ను నిరుత్సాహంలోకి నెట్టింది. పళని శిబిరం అభ్యర్థిగా తెన్నరసు, పన్నీరు శిబిరం అభ్యరి్థగా సెంథిల్ మురుగన్ పేరు ఖరారు చేసినా రెండాకుల చిహ్నం ఎవరికి చిక్కేనో అన్న ఉత్కంఠతో రోజురోజుకూ తీవ్రమవుతోంది. శివకుమార్ కోర్టులోకి బంతి.. రెండాకుల గుర్తు తమకే అప్పగించే విధంగా కేంద్ర ఎన్నికల కమిషన్ను ఆదేశించాలని ఇప్పటికే పళనిస్వామి సుప్రీంకోర్టు తలుపు తట్టారు. దీనిని వ్యతిరేకిస్తూ పన్నీరుసెల్వం గురువారం అప్పీలు పిటిషన్ వేశారు. ఈ పిటిషన్లు శుక్రవారం విచారణకు రానున్నాయి. ఈ సమయంలో తమ కోర్టులో ఉన్న బంతిని ఈరోడ్ ఎన్నికల అధికారి శివకుమార్ కోర్టులోకి నెట్టే విధంగా కేంద్ర ఎన్నికల కమిషన్ వ్యూహాత్మకంగా వ్యవహరించడం వెలుగులోకి వచ్చింది. సుప్రీంకోర్టుకు గురువారం కేంద్ర ఎన్నికల కమిషన్ దాఖలు చేసిన నివేదికలో ఆ గుర్తు కోసం తమను ఎవరు సంప్రదించలేదని పేర్కొనడం గమనార్హం. అలాగే చిహ్నం కేటాయింపుల వ్యవహారంలో తుది నిర్ణయం ఆ నియోజకవర్గ ఎన్నికల అధికారి చేతిలోనే ఉందని ఆ నివేదికలో పొందు పరిచి ఉండడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. శుక్రవారం సుప్రీం కోర్టు ఎలాంటి ఉత్తర్వులు వెలువరించనున్నదో అనే టెన్షన్ సర్వత్రా నెలకొంది. దీంతో ఆ రెండు శిబిరాల అభ్యర్థులు రెండాకుల కోసం ఎదురు చూస్తూ నామినేషన్ దాఖలు చేయలేని పరిస్థితుల్లో పడ్డారు. 7వ తేదీ వరకు సమయం ఉండడంతో ఇరు వర్గాలు ధీమాగా ఉన్నాయి. అదే సమయంలో పళని శిబిరం నేత తంబిదురై గురువారం ప్రధాని నరేంద్రమోదీని కలిసినట్టు సమాచారం వెలువడడం గమనార్హం. పోస్టర్ టెన్షన్.. పళని స్వామి శిబిరం బీజేపీ తీరుపై గుర్రుగా ఉన్న విషయం తెలిసిందే. ఇంత వరకు ఆ పార్టీ తమ నిర్ణయాన్ని స్పష్టం చేయకపోవడంతో ఆయన మద్దతుదారులు కేంద్రంపై కన్నెర్ర చేశాయి. నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్(ఎన్డీఏ) కూటమిలో ముర్పొక్కు( ముందుస్తు ప్రణాళిక) అన్న పదాన్ని చేర్చడం చర్చకు దారి తీసింది. ప్రధాని నరేంద్ర మోదీ చిత్ర పటాన్ని కూడా ఆ కూటమి పేరులో తొలగించారు. నేషనల్ డెమోక్రటిక్ ముర్పొక్కు అలయన్స్ (ఎన్డీఎంఏ) అన్న పేరుతో ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం బీజేపీ వర్గాలను షాక్కు గురి చేశాయి. ఈ సమాచారంతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి పళని స్వామితో మాట్లాడినట్లు సమాచారం. ఆ తర్వాత ఆగమేఘాలపై ముర్పొక్కు అన్న పదాన్ని తొలగించడం గమనార్హం. ఈ విషయంగా అన్నాడీఎంకే నేత జయకుమార్ను ప్రశ్నించగా, ఈరోడ్లో ఏర్పాటు చేసినట్లుందని దాట వేశారు. అయితే, ఈరోడ్ నియోజకవర్గంలో ఒక్కో బూత్కు 5 నుంచి 10 మంది నకిలీ ఓటర్లు ఉన్నారని, మొత్తంగా 30 వేల మంది ఉన్నట్లు తమ పరిశీలనలో తేలిందన్నారు. ఓటర్ల జాబితాను పరిశీలించి, నకిలీ ఓటర్ల భరతం పట్టాలని ఎస్ఈసీ సత్యబ్రత సాహూకు విజ్ఞప్తి చేశానని తెలిపారు. -
తమిళనాట బిగ్ ట్విస్ట్.. బీజేపీకి షాక్ తప్పదా?
చెన్నై: రసవత్తరంగా సాగుతున్న తమిళనాట రాజకీయంలో.. నేడు కీలక పరిణామం చోటు చేసుకునే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రధాన ప్రతిపక్షం అన్నాడీఎంకే.. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిలో ఉంటుందా? గుడ్బై చెప్పేస్తుందా? అనేది తేలనుంది. ఈరోడ్ ఈస్ట్ నిజయోకవర్గ ఉప ఎన్నిక.. ఈ రెండు పార్టీల మధ్య రాజేసిన చిచ్చు ఏ క్షణాన అయినా ఉవ్వెత్తున్న ఎగసేలా కనిపిస్తోంది. ఇదిలా ఉంటే.. ఎడప్పాడి పళనిస్వామి నేతృత్వంలోని అన్నాడీఎంకే ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్డీయే కూటమిలో భాగమైన అన్నాడీఎంకే.. బీజేపీ ప్రాధాన్యత తగ్గించాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు పార్టీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన పోస్టర్లలో ఎక్కడా మిత్రపక్ష బీజేపీ ప్రస్తావనగానీ, చివరికి నరేంద్ర మోదీ ఫొటోగానీ లేకుండా చూసుకుంది. అంతేకాదు ఎన్డీయే(నేషనల్ డెమొక్రటిక్ అలయన్స్) బదులు.. నేషనల్ డెమొక్రటిక్ ప్రొగ్రెసివ్ అలయన్స్ పేరును హైలైట్ చేసింది. అయితే.. ఈ పరిణామంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై స్పందిస్తూ.. ‘సరైన బదులు ఇవ్వాల్సి ఉంది’ అని వ్యాఖ్యానించగా.. వెంటనే కూటమి పేరును మార్చేస్తూ మరో ప్రకటన విడుదల అయ్యింది. కానీ, పోస్టర్లను మాత్రం సరిదిద్దలేదు. తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై అయితే.. పోస్టర్ల పరిణామంపై అన్నాడీఎంకే నేత ఒకరు స్పందించారు. పళనిస్వామి బీజేపీకి ఓ స్పష్టమైన సందేశం ఇవ్వదల్చుకున్నారు. తమిళనాడులో వాళ్ల(బీజేపీ) వాళ్ల స్థానం ఎక్కడ ఉందో గుర్తించాలి అని వ్యాఖ్యానించారు. 234 మంది సభ్యులున్న తమిళనాడు అసెంబ్లీలో.. బీజేపీకి ఉంది కేవలం నాలుగు స్థానాలు మాత్రమే. అయితే అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షం తామే అన్నచందాన వ్యవహరిస్తూ వస్తోంది బీజేపీ. గత ఏడాదిన్నర కాలంగా బీజేపీ వ్యవహరిస్తున్న తీరు.. పైగా ఈపీఎస్-ఓపీఎస్ గ్రూపు తగాదాలను తమకు అనుకూలంగా మార్చుకోవాలని చేస్తున్న ప్రయత్నాలను అన్నాడీఎంకే తీవ్రంగా పరిగణించినట్లు స్పష్టమవుతోంది. సంకీర్ణ ధర్మాన్ని పక్కనపెడుతున్న కమలం పార్టీని.. దూరంగా పెట్టడమే మంచిదన్న యోచనలో రెండాకుల పార్టీ ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. వీటికి తోడు.. దివంగత నేత జయలలిత గతంలో ఏనాడూ బీజేపీతో జట్టు కట్టాలని చూడలేదు. అయితే.. ఆమె మరణాంతరం పన్నీర్ సెల్వం-పళని స్వామి నేతృత్వంలో పార్టీ.. అమ్మ సిద్ధాంతాన్ని పక్కనపెట్టి బీజేపీకి చేతులు కలిపింది. ఫలితంగా.. లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల్లో దారుణ పరాభవం చెందింది. బీజేపీతో ఉండడం వల్లే తమకు ఈ పరిస్థితి దాపురించిందనే భావనలో ఉంది అన్నాడీఎంకే. అందుకే నెమ్మదిగా దూరం జరగాలని యత్నిస్తోంది. ఇంతేకాదు.. కోర్టు తీర్పుతో పళనిస్వామి పార్టీ పగ్గాలు పూర్తిస్థాయిలో అందుకున్న తర్వాత జరుగుతున్న తొలి ఎన్నిక ఇది. ఇప్పటికే బీజేపీ మద్ధతు కోరగా.. అవతలి నుంచి ఎలాంటి స్పందన రాలేదు. పైగా వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు ఉన్న నేపథ్యంలో.. పళనిస్వామి ఈరోడ్(ఈస్ట్) ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుని తన రాజకీయ బలం ప్రదర్శించాలని ఉవ్విళ్లూరుతున్నారు. అన్నాడీఎంకే అభ్యర్థి తెన్నరసును అభినందిస్తున్న పళనిస్వామి, తదితరులు ఇదిలా ఉంటే.. తమిళనాడు కాంగ్రెస్ కమిటీ మాజీ చీఫ్ ఈవీకేఎస్ ఇలంగోవన్ తనయుడు తిరుమహాన్ ఈవెరా మరణంతో ఈరోడ్ ఈస్ట్ నిజయోకవర్గ ఉప ఎన్నిక అనివార్యమైంది. అధికార డీఎంకే.. కాంగ్రెస్ దిగ్గజం ఈవీకేఎస్ ఇలంగోవన్ అభ్యర్థిత్వానికి మద్ధతు ప్రకటించింది. ఫిబ్రవరి 27వ తేదీన ఈ ఉప ఎన్నిక జరగనుంది. ఈ ఉప ఎన్నికలో ఎలాగైనా తమ పార్టీ అభ్యర్థిని నిలబెట్టాలని బీజేపీ తీవ్రంగా యత్నిస్తోంది. ఇప్పటికే అభ్యర్థి పేరును సైతం పరిశీలనలో ఉంచింది కూడా. ఈలోపు బీజేపీ మరో మిత్రపక్షం తమిళ్ మానిల కాంగ్రెస్ తమ అభ్యర్థిని ఖరారు చేయగా.. ఇప్పుడు అన్నాడీంకే సైతం అభ్యర్థిని(అభ్యర్థులను.. ఈపీఎస్ వర్గం మాజీ ఎమ్మెల్యే తెన్నరసు , ఓపీఎస్ వర్గం సెంథిల్ మురుగన్) బరిలో దించడం బీజేపీకి మింగుడు పడనివ్వడం లేదు. ఈ తరుణంలో రాష్ట్ర బీజేపీ చీఫ్ అన్నామలై ఢిల్లీ పర్యటన సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ విషయంలో బీజేపీ వెనక్కి తగ్గుతుందా?.. ఒకవేళ.. అధిష్టానం సూచనలతో తమిళనాడు బీజేపీ ఉప ఎన్నిక కోసం నేడు అభ్యర్థిని ప్రకటిస్తే మాత్రం.. అన్నాడీఎంకే-బీజేపీ పొత్తు కథ కంచికి చేరినట్లేనని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే.. బీజేపీ ఉపాధ్యక్షుడు నారాయణన్ తిరుపతి మాత్రం ఈ పరిణామాలపై భిన్నంగా స్పందించారు. అభ్యర్థి ఎంపిక మిత్రపక్షం చేసిన పొరపాటు చర్య. ఒకసారి సర్దకుంటే.. వాళ్లే పరిస్థితిని అర్థం చేసుకుంటారు. మా మధ్య వైరానికి ఎలాంటి కారణం లేదు అని పేర్కొన్నారు. మొత్తంగా చూసుకుంటే గురువారం నాటి పరిణామాలే.. తమిళనాట రాజకీయాల్లో కీలక మార్పు తీసుకొచ్చే ఆస్కారం కనిపిస్తోంది. -
తమిళనాట అన్నాడీఎంకే పాలి‘ట్రిక్స్’.. ఇరకాటంలో బీజేపీ!
గత అసెంబ్లీ ఎన్నికల తరువాత ముక్కలు చెక్కలైన అన్నాడీఎంకేలో మరోసారి రాజకీయం రసవత్తరంగా మారింది. ఇప్పటికే పారీ్టపై పట్టు కోసం నానా పాట్లు పడుతున్న పళని స్వామి, పన్నీరు సెల్వం ఈరోడ్ ఉప ఎన్నికల బరిలో తమ అనుచరులను నిలపాలని నిర్ణయించారు. ఈ క్రమంలో బుధవారం తమ అభ్యర్థుల పేర్లను కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలో సంకీర్ణ ధర్మానికి కట్టుబడి బీజేపీ ఏ వర్గానికి మద్దతు ఇస్తుందనే అంశంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. దీంతో అధిష్టానం నిర్ణయమే శిరోధార్యమంటూ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై ఢిల్లీకి పయనమయ్యారు. సాక్షి, చెన్నై: ఈరోడ్ తూర్పు అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో బుధవారం కీలక పరిణామం చోటు చేసుకుంది. తీవ్ర తర్జనభర్జల మధ్య అన్నాడీఎంకేలోని ఇరు వర్గాలు తమ అభ్యర్థులను ప్రకటించాయి. అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి పళని స్వామి శిబిరం నుంచి మాజీ ఎమ్మెల్యే తెన్నరసు పోటీకి దిగారు. ఆ పార్టీ సమన్వయ కమిటీ కనీ్వనర్ పన్నీరు సెల్వం శిబిరం అభ్యరి్థగా సెంథిల్ మురుగన్ రంగంలోకి వచ్చారు. ఇప్పటికే కాంగ్రెస్ అభ్యర్థి ఈవీకేఎస్ ఇలంగోవన్కు మద్దతుగా డీఎంకే కూటమి ప్రచారంలో దూసుకుపోతోంది. ఇక డీఎండీకే అభ్యర్థి ఆనందన్, అన్నాడీఎంకేలో చీలికతో ఆవిర్భవించిన అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం అభ్యర్థిగా శివ ప్రశాంత్ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నాల్లో ఉన్నారు. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావడంతో తొలి రెండు రోజులు 10 మంది వరకు స్వతంత్ర అభ్యర్థులే బరిలో దిగారు. బీజేపీ బరిలో దిగితే.. ఉదయాన్నే పళని తమ అభ్యర్థిని.. ప్రకటించారో లేదో.. సాయంత్రానికి పన్నీరు సెల్వం సైతం తమ వర్గం నేత పేరును వెల్లడించారు. సెంథిల్కుమార్ పోటీ చేస్తారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీకి పన్నీరు సెల్వం మరోసారి ఆహా్వనం పలికారు. భారతీయ జనతా పార్టీ ఈ ఎన్నికల్లో అభ్యర్థిని నిలబెట్టిన పక్షంలో, తమ వర్గం వెనక్కి తగ్గేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించడం గమనార్హం. హస్తినకు అన్నామలై.. సంకీర్ణ ధర్మంలో భాగంగా అన్నాడీఎంకేకు తమ మద్దతు ఉంటుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే సహకారం అందించేది పన్నీరు శిబిరానికా, పళని శిబిరానికా అనే విషయంపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. గత రెండు రోజులుగా చెన్నైలో ఈ విషయంపై అన్నామలై పార్టీ వర్గాలతో సుదీర్ఘంగా చర్చించారు. ఇక అధిష్టానంతో సంప్రదింపులు జరిపి తుది నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా బుధవారం ఆయన ఢిల్లీ బయలు దేరి వెళ్లినట్లు బీజేపీ వర్గాలు వెల్లడించాయి. జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అనంతరం గురు లేదా శుక్రవారం బీజేపీ తన నిర్ణయాన్ని తెలియజేసే అవకాశం ఉంది. నువ్వానేనా.. అన్నాడీఎంకేలో పళని, పన్నీరు శిబిరాల మధ్య ఉన్న విభేదాలు ఈ ఎన్నికల్లో డీఎంకే కూటమికి అనుకూలంగా మారే అవకాశం కనిపిస్తోంది. రెండాకుల గుర్తు, బీజేపీ మద్దతు కోసం ఇరు శిబిరాలు గత కొన్ని రోజులుగా పావులు కదుపుతున్నాయి. చివరకు ఎవరు సహకారం అందించినా, అందించకున్నా.. తన బలాన్ని చాటే విధంగా పళణి స్వామి బుధవారం తమ అభ్యరి్థగా మాజీ ఎమ్మెల్యే, ధన బలం కలిగిన తెన్నరసును రంగంలోకి దించారు. ఇతడి పేరును మాజీ మంత్రి ఎస్పీ వేలుమణి ప్రకటించారు. అన్నాడీఎంకేలో ఈరోడ్ తూర్పు సీటు కోసం పది మందికి పైగా నేతలు పోటీ పడ్డారని, వీరిలో ఒకరిని ఎంపిక చేయడంలో జాప్యం తప్పలేదన్నారు. ఈ ఎన్నికల్లో తమ అభ్యర్థి 50 వేల మెజారిటీతో విజయకేతనం ఎగుర వేయడం ఖాయమంటూ ధీమా వ్యక్తం చేశారు. తన పేరు ఖరారు చేయడంతో సేలంలో ఉన్న పళనిస్వామిని కలిసి తెన్నరసు ఆశీస్సులు అందుకున్నారు. ఈసందర్భంగా ఆ పార్టీ సీనియర్ నేత సెంగోట్టయన్ మీడియాతో మాట్లాడుతూ ఉప ఎన్నికల్లో తప్పక విజయపబావుటా ఎగుర వేస్తామని ధీమా వ్యక్తం చేశారు. -
తమిళనాట ట్విస్ట్.. పళనిస్వామి సంచలన నిర్ణయం?
సాక్షి, చెన్నై: భారతీయ జనతా పార్టీతో తెగదెంపులకు పళని శిబిరం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. తమకు రెండాకుల గుర్తు దక్కినా..దక్కకున్నా ఈ ఉప ఎన్నికలో తమ అభ్యర్ధిని నిలబెట్టి తీరుతారలని పళని స్వామి భావిస్తున్నారు. ఈ మేరకు పార్టీ వర్గాలతో ఆదివారం జరిపిన చర్చల్లో నిర్ణయించినట్లు సమాచారం. కాంగ్రెస్ పరుగులు.. మరోవైవు ఈరోడ్ తూర్పు నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి ఈవీకేఎస్ ఇలంగోవన్ గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. ఇక కాంగ్రెస్ అభ్యర్ధికి మద్దతుగా డీఎంకే దూసుకెళ్తోంది. 50 వేల ఓట్ల మెజారిటీ సాధించడమే లక్ష్యంగా 11 మంది మంత్రులు, 22 మంది ముఖ్య నేతలు ఇంటింటికీ వెళ్లి ఓట్ల వేటలో ఉన్నారు. అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం, డీఎండీకే కూడా అభ్యర్థులను ప్రకటించి ఎన్నికల పనులు ప్రారంభించారు. అయితే అన్నాడీఎంకేలో విభేదాల నేపథ్యంలో ఆ పార్టీ చర్చలు, సమీక్షలు, సమావేశాలకే పరిమితమైంది. ప్రధానంగా జాతీయ పార్టీ బీజేపీ మద్దతు కోసం అన్నాడీఎంకేలోని పన్నీరు సెల్వం, పళణి స్వామి శిబిరాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలైతో పాటు ముఖ్య నేతలను ఇప్పటికే ఇరు శిబిరాల ప్రతినిధులు వేర్వేరుగా కలిసి మద్దతు కోరారు. అధికారికంగా బీజేపీ నుంచి ఇంత వరకు ఏ శిబిరానికీ మద్దతు దక్కలేదు. దీంతో తమ అభ్యర్థిని ప్రకటించాలని పళని శిబిరం నిర్ణయించింది. తీవ్ర ప్రయత్నాలు.. రెండాకుల గుర్తు కోసం సోమవారం సుప్రీంకోర్టులో పళని స్వామి శిబిరం చివరి ప్రయత్నం చేయనుంది. కేంద్రం మద్దతు ఉన్న పక్షంలో ఎన్నికల యంత్రాంగం ద్వారా గుర్తుతో పాటు, బీఫాంలో సంతకం పెట్టే అధికారం తనకు దక్కుతుందని ఇన్నాళ్లూ పళని స్వామి భావించారు. అయితే బీజేపీ ఏ విషయాన్నీ స్పష్టం చేయకపోవడం ఆయన్ని కలవరంలో పడేసింది. దీంతో, ఆదివారం ఈరోడ్లో జరిగిన పార్టీ నేతల సమావేశంలో రెండాకుల చిహ్నం కోసం చివరి వరకు ప్రయత్నిద్దామని, అది దక్కని పక్షంలో స్వతంత్రంగానైనా పోటీ చేయడానికి సిద్ధంగా ఉండాలని నేతలకు ఆయన తేల్చిచెప్పినట్లు తెలిసింది. కాగా ఈ పరిస్థితుల్లో బీజేపీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోననే ఉత్కంఠ నెలకొంది. రేపటి నుంచి నామినేషన్ల స్వీకరణ ఈరోడ్ తూర్పు నియోజకవర్గ ఉప ఎన్నికకు గాను.. మంగళవారం నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. ఇందుకోసం ఈరోడ్ కార్పొరేషన్ ఆవరణలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా శివకుమార్ వ్యవహరించనున్నారు. నామినేషన్ దాఖలుకు వచ్చే అభ్యర్థులకు కఠిన ఆంక్షలు విధించారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు మాత్రమే నామినేషన్లు స్వీకరిస్తారు. అభ్యర్థితో పాటు కార్యాలయంలోకి నలుగురిని మాత్రమే అనుమతిస్తారు. ఊరేగింపుగా వచ్చే వాహనాలను 100 మీటర్ల దూరంలోనే ఆపేయాల్సి ఉంటుంది. అభ్యర్థుల సైతం తమ వాహనాలను అక్కడే ఆపేసి నడుచుకుంటూ రావాల్సి ఉంటుంది. నియోజకవర్గంలో ఎన్నికల కోడ్ ఉల్లంఘన, ఎన్నికల ఖర్చు తదితర వ్యవహారాల పర్యవేక్షణకు ప్రత్యేక అధికారుల బృందం మంగళవారం ఈరోడ్కు రానుంది. ఇప్పటికే అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం, డీఎంకే వర్గాలపై పదుల సంఖ్యలో కోడ్ ఉల్లంఘన కేసులు నమోదయ్యాయి. ఇదిలా ఉండగా, తూర్పు నియోజకవర్గ పరిధిలో గత కొద్ది రోజులుగా రూ. 2 వేలు, రూ. 500 నోట్ల చెలామణి పెరగడం గమనార్హం. -
ప్లాన్ మార్చిన పళణి స్వామి.. జంబో జట్టుతో వ్యూహరచన!
సాక్షి, చెన్నై: ఈరోడ్ తూర్పు నియోజకవర్గంలో గెలుపు బావుటా ఎగురవేడయమే లక్ష్యంగా అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి పళణి స్వామి వ్యూహాలకు పదును పెట్టారు. ఎమ్మెల్యే కేఏ సెంగోట్టయన్ నేతృత్వంలో జంబో జట్టును గురువారం రంగంలోకి దించారు. ఇందులో పార్టీ మాజీ మంత్రులు, ముఖ్య నేతలు 106 మంది ఉన్నారు. వివరాల ప్రకారం.. ఈరోడ్ తూర్పు నియోజకవర్గంలో ఇప్పటికే కాంగ్రెస్ అభ్యర్థి ఈవీకేఎస్ ఇలంగోవన్ ప్రచారంలో ఉరకలు తీస్తున్నారు. ఆయనకు మద్దతుగా డీఎంకే మంత్రులు 11 మందితో పాటుగా ముఖ్య నేతలు 31 మంది ఓట్ల వేటలో ఉన్నారు. వీరంతా ఒక్కో ప్రాంతాన్ని ఎంపిక చేసుకుని అక్కడి ఓటర్లను ఆకర్షించే పనిలో నిమగ్నం అయ్యారు. అదే సమయంలో తానేమి తక్కువ కాదని చాటే విధంగా తన సొంత జిల్లా సేలంకు పొరుగున ఉన్న ఈరోడ్ తూర్పు స్థానాన్ని కైవసం చేసుకునేందుకు అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి పళణి స్వామి వ్యూహాలకు పదును పెట్టారు. పార్టీ సమన్వయ కమిటీ కన్వీనర్ పన్నీరు సెల్వం శిబిరం రూపంలో ఏదేని చిక్కులు , సమస్యలు ఎదురైనా తిప్పికొట్టేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా ఈరోడ్ తూర్పులో గెలుపే లక్ష్యంగా ఎన్నికల కోసం జంబో జట్టును రంగంలోకి దించారు. ఎమ్మెల్యే కేఏ సెంగోట్టయన్ నేతృత్వంలోని ఈ జట్టులో పార్టీ ప్రిసీడియం చైర్మన్, మాజీమంత్రులు, ముఖ్య నేతలు 106 మంది ఉన్నారు. వీరందరితో గురువారం ఈరోడ్లో పళణి స్వామి భేటీ అయ్యారు. ఢిల్లీ పెద్దలే కారణం.. అన్నాడీఎంకేలో నెలకొన్న పరిస్థితులకు ఢిల్లీ పెద్దలే కారణం అని అమ్మమక్కల్ మున్నేట్ర కళగం నేత టీటీవీ దినకరన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శక్తివంతమైన పార్టీని చిన్నాభిన్నం చేయడంలో ఢిల్లీ పాత్రే ఎక్కువగా ఉందని గురువారం ఓ మీడియాతో మాట్లాడుతూ ధ్వజమెత్తారు. ఇక ఉప ఎన్నికల విషయంపై పన్నీరుసెల్వం మంతనాలు కొనసాగిస్తూనే ఉన్నారు. మిత్రులను కలిసి మద్దతు వేటలో ఉన్న ఆయన శిబిరం నేతలు ఇప్పటి వరకు తూర్పు నియోజకవర్గం వైపుగా వెళ్లక పోవడం గమనార్హం. ఇదిలా ఉండగా ఈవీకేఎస్కు మద్దతు ప్రకటించిన మక్కల్ నీది మయ్యం నేత కమలహాసన్, స్వయంగా ప్రచారానికి వెళ్లాలని నిర్ణయించారు. ఆ నియోజకవర్గంలో నాలుగైదు రోజుల పాటు పర్యటించేందుకు కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నా రు. ఇక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నుంచి నామినేషన్ల స్వీకరణ ఏర్పాట్లపై అధికారులు దృష్టి పెట్టారు. అలాగే ఎన్నికల విధుల్లోకి రానున్న 550 మంది టీచర్ల జాబితాను సిద్ధం చేసి ప్రకటించారు. ఇది కూడా చదవండి: కాంగ్రెస్ చీఫ్ ఖర్గేకు షాకిచ్చిన సీఎం నితీశ్ కుమార్ -
మద్దతుదారులతో చిన్నమ్మ మంతనాలు.. టార్గెట్ అదే!
సాక్షి, చెన్నై: దివంగత సీఎం జయలలిత నెచ్చెలి శశికళ తన మద్దతు దారులతో బుధవారం చెన్నైలో సమావేశమయ్యారు. అదే సమయంలో ఆమె ప్రతినిధి టీటీవీ దినకరన్ మీడియాతో మాట్లాడుతూ, అన్నాడీఎంకేతో కలిసే ప్రసక్తేలేదని పేర్కొనడం గమనార్హం. వివరాలు.. అన్నాడీఎంకేలో చీలికల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇందులో తాత్కాలిక ప్రధాన కార్యదర్శి పళణి స్వామి టీం బలంగా ఉంది. పన్నీరు సెల్వం శిబిరం ఆ తర్వాతి స్థానంలో ఉందని చెప్పవచ్చు. ఇక అన్నాడీఎంకే నుంచి చీలికతో ఆవిర్భవించిన అమ్మమక్కల్ మున్నేట్ర కళగం నేత టీటీవీ దినకరన్ బలోపేతమే లక్ష్యంగా కుస్తీలు పడుతున్నారు. ఇక అన్నాడీఎంకేకు తానే ప్రధాన కార్యదర్శి అని, కోర్టు తీర్పు సైతం తనకు అనుకూలంగా వస్తుందన్న ఆశతో దివంగత సీఎం జయలలిత నెచ్చెలి, చిన్నమ్మ శశికళ ఉన్నారు. అన్నాడీఎంకేలోని అందరినీ ఒకే వేదిక మీదకు తీసుకొచ్చేందుకు ఆమె పదేపదే పిలుపునిస్తున్నా స్పందించే వాళ్లు కరువయ్యారు. గత వారం జరిగిన పన్నీరు శిబిరం సమావేశంలో గానీయండి, మంగళవారం జరిగిన పళనిస్వామి శిబిరం సమావేశంలో కానీయండి ఎవరికి వారు పార్టీని పూర్తిగా తమ గుప్పెట్లోకి తెచ్చుకునే వ్యూహంతో ఉండడంతో చిన్నమ్మ సైతం స్పందించారు. తన మద్దతు దారులతో కలిసి తనదైన వ్యూహ రచనలో నిమగ్నమయ్యారు. బుధవారం చెన్నైలో మద్దతు నాయకులందరిని పిలిపించి తదుపరి కార్యచరణపై దృష్టి పెట్టారు. లోక్ సభ ఎన్నికలలోపు అన్నాడీఎంకేలో ఉన్న వారందరీని ఒకే వేదిక మీదకు తీసుకు వచ్చేందుకు, ప్రజలలోకి చొచ్చుకెళ్లి తన బలాన్ని మరింతగా పెంచుకునే విధంగా చిన్నమ్మ నిర్ణయాలు తీసుకున్నట్టు మద్దతు నేత ఒకరు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, చిన్నమ్మ ప్రతినిధిగా అమ్మమక్కల్ మున్నేట్రకళగంకు నేతృత్వం వహిస్తున్న టీటీవీ దినకరన్ మీడియాతో స్పందిస్తూ, తాను అన్నాడీఎంకేతో కలిసే ప్రసక్తే లేదని, తన బలాన్ని తాను చాటుకుంటానని పేర్కొనడం గమనార్హం. -
నమ్మక తప్పని నిజం.. అన్నాడీఎంకే నాయకులపై సీఎం స్టాలిన్ గురి!
డీఎంకే, అన్నాడీఎంకే.. ఈ రెండు పార్టీల చరిత్రే.. మొత్తం తమిళనాడు రాజకీయ చరిత్ర అంటే అతిశయోక్తి కాదు. సిద్ధాంత పరంగానే కాదు.. భావజాలం పరంగానూ విభేదించుకునే ఈ పార్టీలకు చెందిన నాయకులు బద్ధ శత్రువుల కంటే దారుణంగా వ్యవహరిస్తుంటారు. నిప్పుకు చెద పట్టదు అన్నది ఎంత నిజమో.. వీరు ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి వెళ్లరు అనేది కూడా అంతే నిజమని భావిస్తుంటారు. ఎందుకంటే అత్యంత అరుదైన పరిస్థితుల్లోనూ వారు తమ సిద్ధాంతాలను వదులుకుని ప్రత్యర్థి పార్టీలో చేరేందుకు ఇష్టపడరు. అలాంటిది ఇప్పుడు కాలం మారింది. అమ్మ మరణంతో దారీతెన్నులేని అన్నాడీఎంకే నుంచి నాయకులు ఒక్కొక్కరిగా బయటకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. అలాంటి వారికి బీజేపీ రెడ్ కార్పెట్ పరిచేందుకు యత్నిస్తోంది. తద్వారా తమిళనాట బలపడాలని పావులు కదుపుతోంది. దీంతో బీజేపీకి ఆ అవకాశం ఇవ్వరాదని భావిస్తున్న స్టాలిన్ అన్యమనస్కంగానే ఆపరేషన్ ఆకర్ష్కు పచ్చజెండా ఊపేశారు. దీంతో ఈ అరుదైన పరిస్థితి ఒకవిధంగా.. ‘‘నమ్మక తప్పని నిజం’’.. అంటూ విశ్లేషణలు వినిపిస్తున్నాయి. సాక్షి, చెన్నై: అన్నాడీఎంకేలో అసంతృప్త నేతలను గురి పెట్టి తమ పార్టీలోకి ఆహ్వానించాలని అధికార డీఎంకే భావిస్తోంది. అన్నాడీఎంకే వర్గాలు బీజేపీ వైపుగా చూడకుండా ఉండేందుకే స్టాలిన్ ప్రస్తుతం కొంత.. రాజీ ఫార్ములాను అవలంభిస్తున్నట్లు తెలుస్తోంది. వివరాలు.. అన్నాడీఎంకే జిల్లా స్థాయి నేతలను డీఎంకేలోకి చేర్చుకునేందుకు ఆ పార్టీ నాయకులు సాధారణంగా ఇష్టపడారు. ఒకవేళ తప్పని పరిస్థితుల్లో చేర్చుకోవాల్సి వస్తే.. సవాలక్ష కట్టుబాట్లు ఉండేవి. పారీ్టలోకి వచ్చినా.. వారికి తగిన ప్రాధాన్యం కూడా ఉండేది కాదు. దీంతో ఒక పార్టీలోకి వారు మరోపార్టీలోకి వచ్చేవారు కాదు. చదవండి: ఢిల్లీకి కేసీఆర్.. బీఆర్ఎస్ కార్యాలయం సిద్ధం సీనియారిటీ, సామాజిక, ఆర్థిక బలం కలిగిన కొన్ని వర్గాలకు మాత్రం మినహాయింపు ఉండేది. ఇలా.. జయలలిత మరణం తర్వాత ఒకరిద్దరు అన్నాడీఎంకే ముఖ్య నాయకులు డీఎంకే గూటికి వచ్చారు. తర్వాత పరిస్థితి యథా ప్రకారం ఉప్పు..నిప్పులాగా ఉండేది. అయితే ప్రస్తుతం అన్నాడీఎంకే అసంతృప్తి నేతలను తమ వైపునకు తిప్పుకోవాల్సిన అవసరం డీఎంకేకు ఏర్పడినట్లు కనిపిస్తోంది. ఇందుకోసం డీఎంకే సీనియర్లు కొన్ని కీలక జిల్లాలోని అన్నాడీఎంకే నేతలపై గురిపెట్టి అక్కున చేర్చుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి స్టాలిన్ సమక్షంలో డీఎంకేలో చేరిన అన్నాడీఎంకే మాజీ ఎమ్మెల్యే కోవై సెల్వరాజ్(ఫెల్) బీజేపీ వైపు వెళ్లకుండా.. అన్నాడీఎంకేలో పన్నీరు సెల్వం, పళణి స్వామి మధ్య నెలకొన్న విభేదాలతో అనేక మంది అసంతృప్తి నేతలు పార్టీ మారేందుకు యత్నిస్తున్నారు. అయితే డీఎంకే నుంచి వీరికి పిలుపు రాకపోవడంతో బీజేపీలో చేరుతున్నారు. ఫలితంగా బీజేపీ క్షేత్రస్థాయిలో బలపడుతోంది. ఇది డీఎంకేకు గట్టి దెబ్బగా మారుతోంది. దీంతో అన్నాడీఎంకే నుంచి వచ్చే వారికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేందుకు డీఎంకే సిద్ధమైంది. ప్రధానంగా కొంగు మండలంగా భావించే కోయంబత్తూరు, తిరుప్పూర్, సేలం, ఈరోడ్, నామక్కల్, నీలగిరి తదితర జిల్లాలు, కృష్ణగిరి, ధర్మపురి జిల్లాలకు చెందిన అన్నాడీఎంకే అసంతృప్తి నేతలకు గాలం వేసేందుకు డీఎంకే సిద్ధమైంది. ఈ ఆపరేషన్ ఆకర్ష్ పనిని.. ఆయా జిల్లాలోని డీఎంకే సీనియర్లకు అధిష్టానం అప్పగించినట్లు తెలుస్తోంది. పార్టీ ఎక్కడెక్కడ బలహీనంగా ఉందో గుర్తించి.. అక్కడ అన్నాడీఎంకే నాయకులకు వల వేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగానే కోవై సెల్వరాజ్ను డీఎంకేలోకి ఆహ్వనించినట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. ఆయన రాకతో కోయంబత్తూరు జిల్లాలో అసంతృప్తితో ఉన్న అన్నాడీఎంకే నేతలు డీఎంకే వైపుగా క్యూ కట్టేందుకు రెడీ అయ్యారు. ఇదే ఊపుతో పెద్దఎత్తున అన్నాడీఎంకే నాయకులను డీఎంకేలోకి ఆహా్వనించే దిశగా ఆ పార్టీ సీనియర్లు స్కెచ్ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. -
బీజేపీ పొలిటికల్ గేమ్.. పన్నీరు సెల్వానికి ఊహించని షాక్!
సాక్షి, చెన్నై: ఎన్డీఏ కూటమితో కలిసే లోక్సభ ఎన్నికలను అన్నాడీఎంకే ఎదుర్కొంటుందని, ఇందులో ఎలాంటి మార్పు లేదని మాజీ మంత్రి, ఆపార్టీ సీనియర్ నేత వైద్యలింగం స్పష్టం చేశారు. ఇది కాస్త పన్నీరు శిబిరాన్ని ఇరకాటంలో పడేసినట్లయ్యింది. వివరాల ప్రకారం.. అన్నాడీఎంకేలో పన్నీరు, పళణి వర్గాలు వేర్వేరు గ్రూపులుగా పయనిస్తున్న విషయం తెలిసిందే. లోక్సభ ఎన్నికలు తమ నేతృత్వంలోనే సాగుతాయని, తామిచ్చిన సీట్లతో మిత్రులు సర్దుకోవాల్సి ఉంటుందనేలా ఇప్పటికే బీజేపీ నాయకులు వ్యాఖ్య లు చేస్తున్న విషయం తెలిసిందే. దీనిని అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి పళణిస్వామి తిప్పికొట్టారు. అన్నాడీఎంకే నేతృత్వంలోనే రాష్ట్రంలో కూటమి అని, ఎవరైనా తమ గొడుగు నీడన మాత్ర మే ముందుకు సాగాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. అయితే, పన్నీరు సెల్వం మాత్రం ఈ వ్యవహారంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. కేంద్రం మద్దతు తనకు అవశ్యం కావడంతో ఆయన కూటమి విషయంపై ఇప్పటి వరకు స్పందించ లేదు. అయితే, ఆయన శిబిరంలో సీనియర్గా ఉన్న వైద్యలింగం సోమవారం చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయంశంగామారింది. ఇది కాస్త పళణిస్వామి శిబిరానికి అను కూలంగా మారిందనే వాదనలు వినిపిస్తున్నాయి. కూటమిపై స్పష్టత.. పుదుకోట్టైలో వైద్యలింగం మీడియాతో మాట్లాడుతూ, అన్నాడీఎంకే సమన్వయ కమిటీ నేత పన్నీరు సెల్వం శిబిరానికి ఆపార్టీ చిహ్నం రెండాకులు చిక్కడం ఖాయమని అన్నారు. లోక్సభ ఎన్నికలను ఎన్డీఏ కూటమితోనే కలిసి ఎదుర్కొంటామని, ఆ కూటమిలోనే అన్నాడీఎంకే ఉంటుందని స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి మార్పులేదన్నారు. ఎన్డీఏలో అన్నాడీఎంకే భాగస్వామ్యం ఉందని, అధిక సీట్లలో తమ అభ్యర్థులే రాష్ట్రంలో పోటీ చేస్తారని తెలిపారు. అయితే, ఈ వ్యాఖ్యలను అస్త్రంగా చేసుకుని పన్నీరుకు వ్యతిరేకంగా పళణి శిబిరం వ్యూహాలకు పదునుపెట్టింది. అన్నాడీఎంకేను తాకట్టు పెట్టేందుకు పన్నీరు సిద్ధమయ్యారని విమర్శలు గుప్పించే పనిలో పడ్డారు. -
తమిళనాట శశికళకు మరో ఊహించని షాక్!
సాక్షి, చెన్నై: తమిళనాడు పాలిటిక్స్లో మరో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. దివంగత ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి, చిన్నమ్మ శశికళకు ఎంజీఆర్ బంధువులు షాక్ ఇచ్చారు. ఈనెల 17వ తేదీన అన్నాడీఎంకే 50వ వసంతంలోకి అడుగు పెట్టనుంది. దీంతో, గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలను రామాపురం తోటలోని పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత సీఎం ఎంజీఆర్ నివాసం ఆవరణలో నిర్వహించాలని శశికళ శిబిరం నిర్ణయించింది. ఇందుకు తగ్గ ఏర్పాట్లపై దృష్టి పెట్టారు. అయితే, హఠాత్తుగా ఎంజీఆర్ బంధువులు చిన్నమ్మకు షాక్ ఇచ్చారు. రామాపురం తోటలో ఎలాంటి వేడుకలు నిర్వహించ వద్దని, తాము అనుమతి ఇవ్వబోమ ని మంగళవారం తేల్చి చెప్పారు. దీంతో మరో వేదికను ఎంపిక చేసుకోవాల్సిన పరిస్థితి చిన్నమ్మ మద్దతు దారులకు ఏర్పడింది. -
బన్రూటితో బంతాట.. పదవి నుంచి తప్పించిన పళణి స్వామి!
సాక్షి, చెన్నై : తమిళ రాజకీయాల్లో సీనియర్ నాయకుడైన బన్రూటి రామచంద్రన్తో అన్నాడీఎంకే ముఖ్య నేతలు మంగళవారం బంతాట ఆడుకున్నారు. ఓ వర్గం నేతగా ఉన్న పళణిస్వామి బన్రూటిని పదవీ నుంచి తప్పిస్తే.. మరో వర్గం నేత పన్నీరు సెల్వం ఆయనకు కొత్త పదవిని కట్టబెట్టారు. ఈ పరిణామాలు అన్నాడీఎంకే కేడర్ను విస్మయానికి గురి చేశాయి. బన్రూటి రామచంద్రన్ తొలుత డీఎంకేలో, అనంతరం ఎంజీయార్ నేతృత్వంలోని అన్నాడీఎంకేలో సుదీర్ఘ రాజకీయ ప్రయాణం సాగించారు. ఎంజీయార్కు అత్యంత విధేయుడిగా ఉన్న ఆయన జయలలిత రాకతో ఆ పార్టీకి దూరమయ్యారు. 2005లో సినీ నటుడు విజయకాంత్ నేతృత్వంలో డీఎండీకే ఆవిర్భావంలో కీలక పాత్ర పోషించారు. విజయకాంత్కు వెన్నుదన్నుగా ఉంటూ వచ్చారు. విజయకాంత్ను ప్రధాన ప్రతిపక్ష నేత స్థాయికి తీసుకెళ్లడంలో బన్రూటి కీలక పాత్ర పోషించారనంలో అతిశయోక్తి లేదు. చివరకు ఆ పార్టీలో సాగిన కుట్ర పూరిత రాజకీయాలను చూసి బయటకు వచ్చేశారు. అదే సమయంలో బన్రూటి సేవలను పార్టీకి ఉపయోగించుకునేందుకు గతంలో సీఎం జయలలిత నిర్ణయించారు. ఆయన్ని అన్నాడీఎంకేలోకి తీసుకొచ్చి గౌరవప్రదమైన పదవి అప్పగించారు. ఊడిన నిర్వాహక కార్యదర్శి పదవి జయలలిత మరణం తదుపరి పరిణామాలతో అన్నాడీఎంకేలో ఉన్నా, రాజకీయంగా పూర్తిస్థాయిలో బన్రూటి ముందుకు సాగలేదు. ఇటీవల కాలంలో అన్నాడీఎంకేలో చోటు చేసుకుంటున్న పరిణామాలు ఆయన్ని తీవ్రంగా కలిచి వేశాయి. ఆ పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శి పళణి స్వామి చర్యలను ఓ సమావేశంలో బన్రూటి వ్యతిరేకించారు. అదే సమయంలో అన్నాడీఎంకే సమన్వయ కమిటీ కన్వీనర్ పన్నీరు సెల్వంకు మద్దతుగా స్పందించారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఆయనతో ఈ ఇద్దరు నేతలు బంతాట ఆడే పరిస్థితి నెలకొంది. పన్నీరుకు మద్దతుగా వ్యవహరిస్తున్న బన్రూటి రామచంద్రన్ను పార్టీ నిర్వాహక కార్యదర్శి పదవి నుంచి మంగళవారం తప్పించారు. అలాగే పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి తొలగిస్తూ పళణి స్వామి ప్రకటన చేశారు. వెంటనే స్పందించిన పన్నీరు సెల్వం తన శిబిరం తరపున అన్నాడీఎంకేకు రాజకీయ సలహదారుడిగా బన్రూటిని నియమిస్తూ ప్రకటన విడుదల చేశారు. ఈ పరిణామాలు అన్నాడీఎంకే కేడర్ను అయోమయానికి గురి చేశాయి. అయితే, ఓ సీనియర్ నేతతో ఇలాగేనా వ్యవహరించడం అనే విమర్శలు వ్యక్తమయ్యాయి. ఇదిలా ఉండగా పళణిస్వామి నేతృత్వంలో జరిగిన సర్వసభ్య సమావేశానికి అనుకూలంగా హైకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ పన్నీర్సెల్వం సుప్రీంకోర్టు తలుపు తట్టిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్ ఈ నెల 30వ తేదీన విచారణకు రానుంది. -
తమిళ పాలిటిక్స్లో ట్విస్ట్.. పళణిస్వామికి బిగ్ షాక్!
సాక్షి,చెన్నై: అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి పళణిస్వామికి బుధవారం మద్రాసు హైకోర్టులో చుక్కెదురైంది. రహదారుల టెండర్లలో చోటు చేసుకున్న అక్రమాలకు సంబంధించి ఏసీబీ చేపట్టిన విచారణపై స్టే విధించేందుకు న్యాయ మూర్తులు నిరాకరించారు. గత అన్నాడీఎంకే ప్రభుత్వంలో సీఎంగా పనిచేసిన పళనిస్వామి పర్యవేక్షణలో రహదారుల శాఖ వ్యవహారాలు సాగిన విషయం తెలిసిందే. గత ప్రభుత్వంలో రహదారుల శాఖలో పెద్దఎత్తున అక్రమాలు జరిగినట్టు అరప్పోర్ ఇయక్కం ఆరోపించింది. రూ. 4,800 కోట్లు రహదారుల టెండర్లలో అక్రమాలు జరిగినట్లు ఆధారాలతో సహా ఏసీబీకి ఫిర్యాదు చేశాయి. అదే సమయంలో ఈ టెండర్ల వ్యవహారం పళనిస్వామి మెడకు చుట్టుకునే విధంగా కోర్టుల్లో పిటిషన్లు కూడా దాఖలయ్యాయి. ఈ ఆరోపణలు, ఫిర్యాదులపై ఏసీబీ స్పందించింది. అలాగే, మరోవైపు ఐటీ వర్గాలు సైతం దూకుడు పెంచాయి. పళణి స్వామి సన్నిహితులైన కాంట్రాక్టర్లను టార్గెట్ చేసి సోదాలు నిర్వహించాయి. అదే సమయంలో ఈ అక్రమాలపై దృష్టి పెట్టిన డీఎంకే ప్రభుత్వం తిరుచ్చి డివిజన్ రహదారుల శాఖ పర్యవేక్షణాధికారి, చీఫ్ ఇంజినీర్గా ఉన్న పళణిని సస్పెండ్ చేసింది. కోర్టులో విచారణ ఈ అక్రమాల వ్యవహారం విచారణ సుప్రీంకోర్టు వరకు వెళ్లొచ్చింది. మద్రాసు హైకోర్టు ఈ వ్యవహారంపై త్వరితగతిన విచారణ ముగించే విధంగా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ పరిస్థితుల్లో ఏసీబీ చర్యలకు సిద్ధం అవుతుండటంతో, ఈ విచారణకు స్టే విధించాలని కోరుతూ పళణి స్వామి హైకోర్టును ఆశ్రయించారు. బుధవారం ఈ పిటిషన్ విచారణకు వచ్చింది. ఈ అక్రమాలపై ఏసీబీ ప్రాథమిక విచారణ ముగించినట్లు కోర్టుకు ఆ విభాగం తరపు న్యాయవాదులు వివరించారు. విజిలెన్స్ కమిషన్కు నివేదిక పంపించినట్లు, అనుమతి రాగానే, తదుపరి చర్యలు చేపట్టనున్నట్లు కోర్టు దృష్టికి తెచ్చారు. వాదనల అనంతరం ఏసీబీ తదుపరి చర్యలకు స్టే విధించలేమని హైకోర్టు స్పష్టం చేసింది. తదుపరి విచారనను ఈనెల 26వ తేదీకి న్యాయమూర్తులు వాయిదా వేశారు. -
తమిళనాట శశికళ ప్లాన్ ఫలిస్తుందా.. పన్నీరు సెల్వానికి చెక్..?
సాక్షి, చెన్నై : అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధానకార్యదర్శి పళణి స్వామి సొంత జిల్లాలో చిన్నమ్మ శశికళ సోమవారం పర్యటించనున్నారు. ఈ పర్యటన విజయవంతానికి ఆమె మద్దతుదారులు పెద్దఎత్తున ఏర్పాట్లు చేశారు. అదే సమయంలో జిల్లాలో తన పట్టు చేజారకుండా పళణి స్వామి ముందు జాగ్రత్తల్లో పడ్డారు. అన్నాడీఎంకేలో సాగుతున్న గ్రూపు రాజకీయాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అదే సమయంలో అన్నాడీఎంకేను ఎప్పటికైనా తన గుప్పెట్లోకి తీసుకుంటానని దివంగత సీఎం జయలలిత నెచ్చెలి శశికళ ఇప్పటికే ప్రకటించారు. తన బలాన్ని చాటే విధంగా మద్దతు దారులతో భేటీలు, సంప్రదింపుల్లో ఆమె బిజీగా ఉన్నారు. దశల వారీగా జిల్లాల పర్యటన చేస్తున్నారు. ఈక్రమంలో అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఇటీవల ఎంపికైన పళణి స్వామి సొంత జిల్లాపై చిన్నమ్మ దృష్టి పెట్టారు. బలం చాటే ప్రయత్నం.. పళణి స్వామి సొంత జిల్లా సేలంలో తనకు సైతం బలం ఉందని చాటాలని చిన్నమ్మ భావిస్తోంది. ఇందులో భాగంగా తన మద్దతు దారుల ద్వారా బల నిరూపణకు సిద్ధమయ్యారు. పళణిస్వామి సొంత జిల్లాలో ఉన్న అసంతృప్తి సెగను తనకు అనుకూలంగా మలచుకునే విధంగా చిన్నమ్మ పర్యటనకు ఏర్పాట్లు జరిగాయి. సోమవారం ఆ జిల్లా పరిధిలోని ఆత్తూరు, వాలప్పాడి, సేలం టౌన్ జంక్షన్ , దాదుగా పట్టి, శీలనాయకం పట్టి, సూరమంగళంలలో సభలకు నిర్ణయించారు. పెద్దసంఖ్యలో జనాన్ని సమీకరించడమే కాకుండా, పళణిపై గుర్రుగా ఉన్న నేతలను ఆహ్వానించేందుకు తగ్గ ఏర్పాట్లు చేశారు. దీంతో అందరి దృష్టి సేలంపై పడింది. సోమవారం సేలంలో, ఆ మరుసటి రోజు పక్కనే ఉన్న ఈరోడ్ జిల్లాలో చిన్నమ్మ పర్యటన జరగనుంది. సేలంలో తిష్టవేసిన పళణి తన సొంత జిల్లాలో చిన్నమ్మ పర్యటన నేపథ్యంలో పట్టు జారకుండా ముందు జాగ్రత్తల్లో పళణి నిమగ్నమయ్యారు. చిన్నమ్మ పర్యటన వైపు ఏఒక్క నేత వెళ్లకుండా కట్టడికి సిద్ధమయ్యారు. తిరుపతి పర్యటన ముగించుకున్న ఆయన నేరుగా సేలంకు వెళ్లడం గమనార్హం. రెండు రోజులు సేలంలోనే ఆయన ఉండనున్నారు. చిన్నమ్మ పర్యటన జరిగే సమయంలో తన మద్దతుదారులతో ప్రత్యేక సమావేశాలకు పళణి ఏర్పాట్లు చేసుకున్నారు. ఫలితంగా సేలం వేదికగా అన్నాడీఎంకే రాజకీయం రసవత్తరంగా మారింది. -
అన్నాడీఎంకే ఆఫీస్లోకి వెళ్లేందుకు పన్నీరు ప్రయత్నాలు.. మళ్లీ టెన్షన్
సాక్షి, చెన్నై : అన్నాడీఎంకే కార్యాలయంలోకి అడుగు పెట్టేందుకు పన్నీరు సెల్వం ప్రయత్నాలు చేశారు. ఇందుకు పోలీసులు అనుమతి నిరాకరించారు. అయితే ఆయన మద్దతుదారులు చొచ్చుకెళ్లవచ్చన్న సమాచాంతో భద్రతను పెంచారు. ఈ పరిణామాల నేపథ్యంలో చిన్నమ్మ శశికళతో పన్నీరు మద్దతుదారుడు వైద్యలింగం శుక్రవారం భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది. అన్నాడీఎంకేలో ఇటీవల చోటుచేసుకుంటున్న రాజకీయాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన నేతృత్వంలో జరిగిన సర్వసభ్య సమావేశానికి కోర్టు ఆమోద ముద్ర వేయడంతో పళనిస్వామి పార్టీ వ్యవహారాల్లో దూకుడు పెంచారు. పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శి హోదాలో తొలిసారిగా గురువారం అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయంలో అడుగు పెట్టారు. పార్టీ నేతలతో సమావేశాలు, బలోపేతం, సర్వ సభ్య సమావేశంతో పూర్తి స్థాయి ప్రధాన కార్యదర్శి పదవి చేజిక్కించుకునేందుకు వ్యూహాలకు పదును పెట్టారు. పళనిస్వామికి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తాత్కాలిక బా«ధ్యతలతో తిరుమల శ్రీవారి దర్శనానికి పళనిస్వామి బయలుదేరి వెళ్లారు. అదే సమయంలో తానేమి తక్కువ తిన్నానా..? అన్నట్టు పన్నీరు సెల్వం సైతం పావులు కదుపుతున్నారు. చిన్నమ్మతో భేటీ. అన్నాడీఎంకే వివాదాల నేపథ్యంలో చిన్నమ్మ శశికళ సైతం రాజకీయంగా దూకుడు పెంచారు. శుక్రవారం తంజావూరులో ఆమె పర్యటించారు. ఆమెను పన్నీరు సెల్వం మద్దతుదారుడు, ఎమ్మెల్యే వైద్యలింగం కలిశారు. ఆమెతో భేటీ కావడం రాజకీయంగా చర్చకు దారి తీసింది. ఇప్పటికే చిన్నమ్మను కలిసేందుకు పన్నీరు సైతం ఆసక్తి చూపుతున్నారు. మరోవైపు ఐకమత్యంగా ఉందామని చిన్నమ్మ పిలుపునిస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఈ భేటికి ప్రాధాన్యత నెలకొంది. నేను సైతం.. అన్నాడీఎంకే సమన్వయ కమిటీ కన్వీనర్ హోదాలో పార్టీ కార్యాలయంలో అడుగు పెట్టేందుకు పన్నీరు సెల్వం సిద్ధమవుతున్నారు. గతంలో చోటు చేసుకున్న వివాదాల నేపథ్యంలో ఈసారి ముందుగానే పోలీసు భద్రత కోరే పనిలో పడ్డారు. తమకు భద్రత కల్పించాలని పన్నీరుసెల్వం మద్దతు నేత జేసీడీ ప్రభాకరన్ చెన్నై పోలీసులకు శుక్రవారం విజ్ఞప్తి చేశారు. అయితే, ఆయన విజ్ఞప్తిని పోలీసులు తోసిపుచ్చారు. అన్నాడీఎంకే కార్యాలయం వ్యవహారం కోర్టులో ఉన్న దృష్ట్యా, అక్కడే తేల్చుకోవాలని సూచించారు. పోలీసుల అనుమతి నిరాకరణతో పార్టీ కార్యాలయంలోకి దూసుకెళ్లేందుకు పన్నీరు మద్దతుదారులు ప్రయత్నాల్లో ఉన్నట్టు సమాచారం. దీంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. కార్యాలయం వద్ద భద్రతను పెంచారు. ఆ పరిసరాలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం పన్నీరు సెల్వం శ్రీవిల్లిపుత్తూరు అండాల్ అమ్మవారిని, వనపేచ్చి అమ్మన్ ఆలయాల్లో పూజలు నిర్వహించడం గమనార్హం. -
మాతో టచ్లో 10 మంది ఎమ్మెల్యేలు.. త్వరలోనే పార్టీలోకి
తిరువళ్లూరు (చెన్నై): అన్నాడీఎంకేతో 10 మంది డీఎంకే ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రతిపక్షనాయకుడు ఎడపాడి పళణిస్వామి చేసిన ప్రకటన సంచలనం సృష్టించింది. తిరువళ్లూరు జిల్లా గుమ్మిడిపూండి మాజీ ఎమ్మెల్యే కేఎస్ విజయకుమార్ కుమార్తె వివాహానికి ఎడపాడి పళణిస్వామి బుధవారం ఉదయం హాజరయ్యారు. ఎడపాడి పళణిస్వామికి పార్టీ నేతలు కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. వధూవరులను ఆశ్వీరించిన మాజీ ముఖ్యమంత్రి, ఈగువారిపాళ్యం వెళ్లి యూనియన్ చైర్మన్ శివకుమార్ కుటుంబ సభ్యులను ఆశీర్వదించారు. అనంతరం మీడియా సమావేశంలో ఈపీఎస్ మాట్లాడుతూ అన్నాడీఎంకేకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు డీఎంకేతో టచ్లో ఉన్నారనే వార్తలు అవాస్తమన్నారు. డీఎంకే ఏడాదిన్నర పాలనలో అన్ని వర్గాలకు చెందిన ప్రజలు విసిగిపోయారని, వారిపై ఉన్న అసంతృప్తి త్వరలో బయటపడుతుందని వ్యాఖ్యానించారు. డీఎంకేకు చెందిన 10 మంది ఎమ్మెల్యేలు తమతో టచ్లో ఉన్నారని త్వరలో వారిని పార్టీలోకి ఆహ్వానిస్తామన్నారు. ఇటీవల చెన్నైలో జరిగిన ప్రభుత్వ కార్యక్రమంలో మేయర్, డిప్యూటి మేయర్లను వెనుక సీట్లు కేటాయించడం వివాదస్పదంగా మారిన విషయంపై స్పందిస్తూ, డీఎంకే కార్పొరేట్ కంపెనీ లాంటింది. ఇక్కడ సీఈఓలుగా ఉన్న ఉదయనిధి స్టాలిన్, కనిమొళికి ఉన్న ప్రాధాన్యత ప్రజాప్రతినిధులకు వుండదన్నారు. ఎమ్మెల్యేగా ఉన్న ఉదయనిధిను షాడో సీఎంగా ప్రమోట్ చేస్తున్నారని విమర్శించారు. శశికళ– దినకరన్లకు చోటులేదు అన్నాడీఎంకేలోకి శశికళ, టీటీవీ దినరకన్ ఓపీఎస్ ఆహ్వానించడం హర్షిందగ్గ విషయం కాదన్నారు. అన్నాడీఎంకేలో కార్యకర్తలే పాలకులని, గతంలో పార్టీకి ద్రోహం చేసిన వారిని మళ్లీ పార్టీలోకి ఎలా ఆహ్వానిస్తామన్నారు. అన్నాడీఎంకే జనరల్ కమిటీ సమావేశంపై హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఓపీఎస్ సుప్రీంకోర్టుకు వెళ్తున్న విషయంపై ఎడపాడి సీరియస్ అయ్యారు. సుప్రీంకోర్టుకు వెళ్లినా తీర్పు తమకు అనుకూలంగా వస్తుందన్న ధీమాను వ్యక్తం చేశారు. వ్యవహారం కోర్టు పరిధిలో ఉన్నందున అంతకు మించి తాము మాట్లాడనన్నారు. వేగంగా స్పందించలేదు అన్నాడీఎంకే కార్యాలయంలోని కీలక డాక్యుమెంట్ల చోరీ కేసులో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పళణి స్వామి ఆరోపించారు. డీఎంకే హయాంలో సాధారణ ప్రజలకే భద్రత లేనప్పుడు తమ కార్యాలయానికి భద్రత కల్పిస్తారనే నమ్మకం ఎక్కడ ఉంటుందని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమిళనాడు సరిహద్దుల్లో నిర్మిస్తున్న ప్రాజెక్టులపై పునరాలోచన చేయాలని కోరారు. -
పళణి కోటలోకి శశికళ!
సాక్షి, చెన్నై : మాజీ సీఎం, అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి ఎడపాడి పళని స్వామి సొంత జిల్లాలో పర్యటించేందుకు దివంగత సీఎం జయలలిత నెచ్చెలి, చిన్నమ్మ శశికళ సిద్ధమయ్యారు. చెన్నై నుంచి బుధవారం ఆమె తంజావూరు మీదుగా పర్యటనకు రూట్ మ్యాప్ సిద్ధం చేసుకున్నారు. అన్నాడీఎంకేను కైవసం చేసుకునేందుకు విశ్వ ప్రయత్నాలను చిన్నమ్మ శశికళ చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా తన మద్దతుదారులను ఏకం చేస్తూ పర్యటనలపై దృష్టి పెట్టారు. ఈసారి ఆమె అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి పళణి స్వామి జిల్లాను టార్గెట్ చేశారు. అన్నాడీఎంకే సమన్వయ కమిటీ కన్వీనర్ పన్నీరు సెల్వం, పళణి స్వామి మధ్య వివాదం సాగుతోన్న నేపథ్యంలో చిన్నమ్మ శశికళ సేలం, నామక్కల్ జిల్లాలపై దృష్టి పెట్టడం రాజకీయంగా ప్రాధాన్యతకు దారి తీసింది. పళణి స్వామి ఆయన సన్నిహితుడు, మాజీ మంత్రి తంగమణి మద్దతుదారుల్ని తన వైపునకు తిప్పుకోవడమే లక్ష్యంగా ఈ పర్యటనలో చిన్నమ్మ వ్యూహరచన చేసినట్లు సమాచారం. అక్రమాస్తుల కేసులో తాను జైలుకు వెళ్తూ పళణి స్వామిని సీఎం కుర్చీలో కూర్చోబెట్టిన విషయం తెలిసిందే. అయితే, ఆమెను పళణి స్వామి సాగనంపి ఆ పార్టీని తన గుప్పెట్లోకి తెచ్చుకున్నారు. ఈ పరిస్థితుల్లో పళణి సొంతజిల్లాలో పర్యటించే చిన్నమ్మ శశికళ ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారనే విషయం ఆసక్తి కలిగిస్తోంది. రెండు రోజుల పర్యటన ఖరారు సేలం, నామక్కల్లో చిన్నమ్మ శశికళ పర్యటన రెండు రోజులు సాగనుంది. ఇందుకు తగ్గ రూట్ మ్యాప్ను మంగళవారం విడుదల చేశారు. బుధవారం ఉదయం టీ నగర్ నివాసం నుంచి తంజావూరు వైపుగా శశికళ పర్యటన ప్రారంభమవుతుంది. గురువారం తిరుత్తొరై పూండిలో కొత్తగా నిర్మించిన షిరిడీ సాయిబాబా ఆలయ కుంభాభిషేకం వేడుకల్లో ఆమె పాల్గొంటారు. తంజావూరు, తిరువారూర్, సేలం, నామక్కల్, పుదుకోట్టై, ఈరోడ్ జిల్లాల నేతలతో 9.10 తేదీల్లో సమావేశాలు నిర్వహిస్తారు. 11వ తేదీ ఉదయం తంజావూరు నుంచి తిరువయ్యారు. తిరుమానూరు, కీల పలలూరు, అరియలూరు, పెరంబలూరు జిల్లాల వైపుగా ఆమె పర్యటన ఉంటుంది. అదే రోజు మధ్యాహ్నం సేలంలో పలు ప్రాంతాల్లో శశికళ పర్యటించనున్నారు. పార్టీ కేడర్, నాయకులతో వివిధ అంశాలపై చర్చిస్తారు. ఆ రాత్రి సేలంలో బస చేసి 12వ తేదీ నామక్కల్ జిల్లాలో, అరియలూరు కొన్ని ప్రాంతాల్లో పర్యటించనున్నారు. శశికళ పర్యటన నేపథ్యంలో తన మద్దతు దారులు, సర్వ సభ్య సభ్యులు, ముఖ్యులు చేజారకుండా పళణిస్వామి ముందు జాగ్రత్త చర్యలు చేపడుతున్నట్లు తెలిసింది. -
పన్నీరుకు షాక్.. పళనిస్వామికే అన్నాడీఎంకే పగ్గాలు
అన్నాడీఎంకే బాధ్యతలు పళనిస్వామి గుప్పెట్లోకి చేరాయి. తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా పళని ఎంపికకు పరోక్షంగా శుక్రవారం మద్రాసు హైకోర్టు ద్విసభ్య బెంచ్ పచ్చ జెండా ఊపింది. జూలై 11న జరిగిన అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశాన్ని ఆమోదించింది. సింగిల్ బెంచ్ విధించిన స్టేను రద్దు చేసింది. దీంతో పళని మద్దతుదారులు సంబరాలు చేసుకున్నారు. కాగా ద్విసభ్య బెంచ్ తీర్పును వ్యతిరేకిస్తూ సుప్రీకోర్టులో అప్పీలుకు వెళ్లనున్నామని పన్నీరు సెల్వం ప్రకటించారు. సాక్షి, చెన్నై: అన్నాడీఎంకేలో పన్నీరు సెల్వం, పళనిస్వామి మధ్య రాజకీయ చదరంగం కొనసాగుతోంది. జూలై 11వ తేదీ జరిగిన అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశం ద్వారా పళనిస్వామి తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఎంపికయ్యారు. దీనిని వ్యతిరేకిస్తూ పన్నీరు సెల్వం దాఖలు చేసిన పిటిషన్ను గత నెల న్యాయమూర్తి జయచంద్రన్ బెంచ్ విచారించింది. సర్వసభ్య సమావేశానికి సింగిల్ బెంచ్ స్టే విధించింది. జూన్ 23వ తేదీకి ముందు అన్నాడీఎంకేలో ఉన్న పరిస్థితులు కొనసాగే విధంగా ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పళని స్వామి శిబిరానికి చెక్ పెట్టే విధంగా పన్నీరుసెల్వం దూకుడు పెంచారు. దివంగత సీఎం జయలలిత నెచ్చెలి శశికళ, ఆమె ప్రతినిధి దినకరన్ను కలుపుకుని ముందుకు సాగేందుకు తగ్గ వ్యూహాలకు పదును పెట్టారు. అడియాసే.. పన్నీరు ఆశలన్నీ ప్రస్తుతం ఆవిరయ్యాయి. సింగిల్ బెంచ్ విధించిన స్టేకు వ్యతిరేకంగా పళనిస్వామి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. న్యాయమూర్తులు దురైస్వామి, సుందర మోహన్ బెంచ్ ఈ పిటిషన్పై శుక్రవారం తీర్పు వెలువరించింది. పళనిస్వామి తరఫు న్యాయవాది ఇన్బదురై బలమైన వాదనలను కోర్టు ముందు ఉంచారు. అన్నాడీఎంకే నిబంధనలకు అనుగుణంగానే జూలైన 11న సర్వసభ్య సమావేశం జరిగిందని వివరించారు. జూన్ 23వ తేదీ జరిగిన సమావేశంలో జూలై 11న జరిగే సమావేశం గురించి ప్రిసీడియం చైర్మన్ ప్రకటన చేశారని గుర్తు చేశారు. ఈ సమయంలో పన్నీరుసెల్వం అదే వేదికపై ఉన్నారని, అలాంటప్పుడు ఈ సమావేశం గురించి సమాచారం లేదని చెప్పడం శోచనీయమని పేర్కొన్నారు. వీటిని ద్విసభ్య బెంచ్ పరిగణనలోకి తీసుకుంది. 128 పేజీలతో కూడిన తీర్పును న్యాయమూర్తులు వెలువరించారు. చదవండి: పొలిటికల్ గేమ్లో ప్లాన్ ఛేంజ్.. టీఆర్ఎస్కు షాకిచ్చిన బీజేపీ! తీర్పుతో పళని శిబిరంలో సంబరాలు సింగిల్ బెంచ్ విధించిన స్టేను ద్విసభ్య బెంచ్ రద్దు చేసింది. జూలై 11న జరిగిన సర్వ సభ్య సమావేశానికి ఆమోదం తెలిపింది. దీంతో పళని శిబిరంలో సంబరాలు మిన్నంటాయి. చెన్నైలో ఎంజీఆర్ యువజన విభాగం సంయుక్త కార్యదర్శి డాక్టర్ సునీల్ నేతృత్వంలో స్వీట్లు పంచుకుని బాణాసంచాతో హోరెత్తించారు. పళని, దివంగత నేతలు ఎంజీఆర్, జయలలిత ఫ్లెక్సీలకు పాలాభిషేకం చేశారు. పళని మద్దతుదారులు జయకుమార్, ఆర్బీ ఉదయకుమార్, వైగై సెల్వం, ప్రిసీడియం చైర్మన్ తమిళ్ మగన్ హుస్సేన్ తదితరులు మీడియా ముందుకు వచ్చారు. ఇది చారిత్రక తీర్పుగా పేర్కొన్నారు. పన్నీరు సెల్వంను అన్నాడీఎంకే నుంచి ఇప్పటికే తొలగించామని, ఆయనకు పార్టీలో చోటు లేదని స్పష్టం చేశారు. మూడు నెలల్లో మరోమారు పార్టీ సర్వసభ్య సమావేశాన్ని ఏర్పాటు చేసి పళనిస్వామిని పూర్తి స్థాయిలో ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకుంటామని ప్రకటించారు. కోర్టు తీర్పు ఏకనాయకత్వానికి ఆమోదముద్ర వేసిందని హర్షం వ్యక్తం చేశారు. తాత్కాలికం ద్విసభ్య బెంచ్ తీర్పుతో పళనిస్వామి తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఎంపికకు గ్రీన్ సిగ్నల్ లభించింది. ఇది పన్నీరు సెల్వం శిబిరానికి షాక్ గా మారింది. దీంతో సుప్రీంకోర్టులో అప్పీలు పిటిషన్ దాఖలు చేయడానికి పన్నీరు సెల్వం నిర్ణయించారు. ఇదిలా ఉండగా, ద్విసభ్య బెంచ్ తీర్పు తాత్కాలికంగా మారేనా అన్న చర్చ నెలకొంది. ఇందుకు కారణం న్యాయమూర్తి జయచంద్రన్ నేతృత్వంలోని సింగిల్ బెంచ్లో అన్నాడీఎంకే సమన్వయ కమిటీ వ్యవహారం ప్రధాన కేసుగా విచారణలో ఉండటమే. అన్నాడీఎంకే సమన్వయ కమిటీ రద్దు చేశారా.? కాలం చెల్లిందా..? అన్న వ్యవహారాలపై ఈ బెంచ్లో వాదనలు జరగాల్సి ఉంది. కేవలం సింగిల్ బెంచ్ విధించిన స్టేను మాత్రమే ద్విసభ్య బెంచ్ రద్దు చేసింది. అయితే, సింగిల్ బెంచ్లో మున్ముందు ప్రధాన కేసు విచారణ ఎలాంటి మలుపులకు దారి తీస్తాయో, తుది వాదనలు ఎలా ఉంటాయో అన్నది వేచి చూడాల్సిందే. దీనిపై పన్నీరు శిబిరం నేత వైద్యలింగం స్పందిస్తూ ఈ తీర్పు తాత్కాలికమేనని.. సుప్రీంకోర్టులో తమ న్యాయం జరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. తిరువళ్లూరులో.. పట్టణంలో పళనిస్వామి మద్దతుదారులు బాణసంచా కాల్చి స్వీట్లు పంచిపెట్టారు. అనంతరం ఎంజీఆర్, అన్నాదురై విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. మాజీ మంత్రి రమణ, పార్టీ నేతలు వెంకటేషన్, బాబు, ఎయిళరసన్, సుధాకర్, మాధవన్ పాల్గొన్నారు. తిరుత్తణి: హైకోర్టు తీర్పుతో అన్నాడీఎంకే శ్రేణులు తిరుత్తణిలో సంబరాలు చేసుకున్నారు. పట్టణ కార్యదర్శి సౌందర్రాజన్ ఆధ్వర్యంలో స్థానిక బస్టాండు వద్ద బాణసంచా కాల్చి స్వీట్లు పంచిపెట్టారు. పళ్లిపట్టు మండల కార్యదర్శి టీడీ.శ్రీనివాసన్, నాయకులు కుప్పుస్వామి, త్యాగరాజన్, జయశేఖర్బాబు పాల్గొన్నారు. -
మద్రాస్ హైకోర్టులో ఈపీఎస్కు ఊరట
చెన్నై: తమిళనాడు మాజీ సీఎం ఈకే పళనిస్వామికి మద్రాస్ హైకోర్టులో ఊరట లభించింది. అన్నాడీఎంకే నాయకత్వ వివాదంపై న్యాయస్థానం కీలక తీర్పునిచ్చింది. పార్టీకి పళనిస్వామే సుప్రీం నాయకుడని స్పష్టం చేసింది. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా ఆయన ఎన్నిక చెల్లుతుందని డివిజన్ బెంచ్ పేర్కొంది. గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును పక్కనపెట్టింది. జులై 11న జరిగిన పార్టీ జనరల్ కౌన్సిల్ సమావేశంలో అన్నాడీఎంకే తాత్కాలిక కార్యదర్శిగా పళనిస్వామి ఎన్నికయ్యారు. అయితే దీన్ని సవాల్ చేస్తూ ఓ పన్నీర్సెల్వం కోర్టును ఆశ్రయించారు. అప్పటి సింగిల్ బెంచ్ ధర్మాసనం పళనిస్వామి ఎన్నిక చెల్లదని తీర్పునిచ్చింది. అయితే ఈ వ్యవహారంపై పళనిస్వామి మరోసారి మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన డివిజన్ బెంచ్.. ఆయనకు అనుకూలంగా తీర్పు వెలువరించింది. దీంతో ఈపీఎస్ మద్దతుదారులు సంబరాలు చేసుకున్నారు. మరోవైపు కోర్టు తీర్పు అనంతరం అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయం వద్ద పోలీసులు పటిష్ఠ భద్రత ఎర్పాటు చేశారు. గతంలో ఈపీఎస్, ఓపీఎస్ వర్గాలు ఆపీస్లో విధ్వంసం సృష్టించిన విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఈమేరకు చర్యలు తీసుకున్నారు. చదవండి: కేసీఆర్కు ఘోర అవమానం.. ఇందుకేనా బిహార్ వెళ్లింది?: బీజేపీ -
పన్నీరు ఆకర్షణ మంత్రం!.. చిన్నమ్మతో కలిసి వ్యూహం అమలు?
సాక్షి, చెన్నై: పళనిస్వామి వెన్నంటి ఉన్న వారిని తన వైపునకు తిప్పుకునేందుకు పన్నీరు సెల్వం ఆకర్షణ మంత్రాన్ని ప్రయోగించే పనిలో పడ్డారు. చిన్నమ్మ శశికళతో కలిసి ఈ వ్యూహాన్ని ఆయన అమలు చేస్తున్నట్లు సంకేతాలు వెలువడ్డాయి. ఇందుకు ఫలితంగా పళని శిబిరం నుంచి ఓ ఎమ్మెల్యే , మరికొందరు నేతలు జంప్ అయ్యారు. వీరంతా ఆదివారం పన్నీరుకు జై కొట్టారు. అడీఎంకేలో పళని స్వామి, పన్నీరు సెల్వం మధ్య సాగుతున్న వార్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కోర్టు రూపంలో పార్టీ సమన్వయ కమిటీ తన గుప్పెట్లోకి రావడంతో పన్నీరు దూకుడుగా ముందుకు సాగుతున్నారు. పళనిస్వామికి వ్యతిరేకంగా ఉన్న వారు, అసంతృప్తి వాదులకు గాలం వేసే పనిలో పడ్డారు. ఈ పరిస్థితుల్లో ఏకంగా దివంగత సీఎం జయలలిత నెచ్చెలి, చిన్నమ్మ శశికళతో కలిసి పన్నీరు కొత్తఎత్తులు రచిస్తున్నట్లు తెలుస్తోంది. మరికొందరు క్యూలో.. చిన్నమ్మ శశికళతో కలిసి రచిస్తున్న వ్యూహానికి ఫలితం ఆదివారం లభించడం గమనార్హం. మదురై జిల్లా ఉసిలం పట్టి ఎమ్మెల్యే అయ్యప్పన్తోపాటుగా ఆ నియోజకవర్గానికి చెందిన ముఖ్య నేతలు పన్నీరుకు ఆదివారం జై కొట్టారు. పళని శిబిరంలో ఉంటూ పన్నీరుపై విరుచుకు పడ్డ ఈ అయ్యప్పన్ ప్రస్తుతం శిబిరం మార్చేశారు. కోర్టు ఆదేశాలు, అందులోని అంశాలకు కట్టుబడి తాను పన్నీరు సెల్వం శిబిరంలోకి వచ్చానని అయ్యప్పన్ ప్రకటించారు. చెన్నై గ్రీన్ వేస్ రోడ్డులోని పన్నీరు నివాసంలో జరిగిన భేటీ అనంతరం అయ్యప్పన్ మీడియాతో మాట్లాడారు. తానే కాకుండా తనతో పాటుగా మరి కొందరు ఎమ్మెల్యేలు క్యూలో ఉన్నారని, అందరూ పన్నీరు సెల్వం వైపుగా వచ్చేడం ఖాయమని ప్రకటించారు. చదవండి: ‘మునుగోడు ఉపఎన్నికల్లో బీజేపీ గెలిస్తే ప్రభుత్వం పడిపోతుంది’ అదే సమయంలో పన్నీరు సెల్వం పేర్కొంటూ, మరి కొద్ది రోజుల్లో చిన్నమ్మ శశికళ, ఆమె ప్రతినిధి టీటీవీ దినకరన్ను కలవనున్నానని, వారిని పార్టీలోకి ఆహ్వానించబోతున్నట్లు మీడియా ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం గమనార్హం. ఈ పరిణామాల నేపథ్యంలో పళని శిబిరానికి చెందిన నేతలు జయకుమార్, ఆర్బీ ఉదయకుమార్ స్పందిస్తూ, నోట్లను ఎరగా వేసి నాయకులు, స్వర సభ్య సమావేశం సభ్యులను తన వైపుగా తిప్పుకునే ప్రయత్నంలో పన్నీరు సెల్వం ఉన్నారని ఆరోపించారు. ఒక్క ఎమ్మెల్యే వెళ్లినంత మాత్రాన తమకు వచ్చిన నష్టం ఏమీ లేదని స్పష్టం చేశారు. -
తమిళనాట ట్విస్ట్.. పన్నీర్సెల్వానికి బిగ్ షాక్
సాక్షి ప్రతినిధి, చెన్నై : అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయంలోకి చొరబడి నష్టం కలిగించిన వ్యవహారంపై పన్నీర్సెల్వం, ఆయన అనుచరులకు సమన్లు జారీచేయాలని సీబీసీఐడీ పోలీసులు నిర్ణయించారు. వైద్యలింగం, మనోజ్ పాండియన్ తదితరులకు సైతం సమన్లు పంపనున్నారు. సీబీసీఐడీ డీఎస్పీ నేతృత్వంలోని ఒక బృందం శుక్రవారం పార్టీ కార్యాలయానికి వెళ్లి పరిశీలించింది. చెన్నై వానగరంలో గతనెల 11వ తేదీన జరిగిన అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశంలో ఎడపాడి పళనిస్వామిని తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నారు. ఇందుకు నిరసనగా పన్నీర్సెల్వం సహా ఆయన అనుచర వర్గం తీవ్ర ఆగ్రహంతో చెన్నై రాయపేటలోని పార్టీ ప్రధాన కార్యాలయానికి వెళ్లారు. కార్యాలయ ప్రధాన ద్వారాన్ని పగులగొట్టిలోనికి జొరబడి ఫరి్నచర్, ఇతర సామగ్రిని ధ్వంసం చేశారని, ముఖ్యమైన డాక్యుమెంట్లను ఎత్తుకెళ్లారని ఎడపాడి వర్గానికి చెందిన రాజ్యసభ సభ్యుడు సీవీ షణ్ముగం చెన్నై రాయపేట పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇందుకు ప్రతిగా పన్నీర్ వర్గం కూడా పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రెండు వర్గాలకు చెందిన చెరో 200 లెక్కన మొత్తం 400 మంది కార్యకర్తలపై పోలీసులు ఏడు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ కేసుల విచారణను గ్రేటర్ చెన్నై పోలీసుల నుంచి సీబీసీఐడీ పోలీసులకు అప్పగిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం మద్రాసు హైకోర్టుకు తెలిపింది. కార్యాలయంపై దాడి వ్యవహారంపై ఓపీఎస్, ఆయన మద్దతుదారు ముఖ్యనేతలకు వేర్వేరుగా సమన్లు జారీచేసి విచారణ చేపట్టాలని సీబీసీఐడీ నిర్ణయించింది. పన్నీరుసెల్వంకు దర్శకుడు భాగ్యరాజ మద్దతు ఎంజీఆర్ స్థాపించిన అన్నాడీఎంకేను అంద రూ కలిసి కాపాడుకోవాలని ప్రముఖ సినీ దర్శకులు భాగ్యరాజా అన్నారు. పారీ్టలో, న్యాయస్థానాల్లో చో టుచేసుకుంటున్న పరిణామాలపై చర్చించేందుకు పన్నీర్సెల్వం తన అనుచరులతో శుక్రవారం చెన్నై లో సమావేశమయ్యారు. ఇందులో భాగ్యరాజ పా ల్గొని పన్నీర్కు మద్దతు ప్రకటించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, ఒక చిన్న కార్యకర్తలా పార్టీ క్షేమాన్ని కోరుతున్నానని, పారీ్టలోని అన్ని వర్గాలు ఏకం అవుతాయని, ఇందుకు సమయం పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. -
ఏందయ్యా మీ గొడవ.. కోర్టుకు మరో పనిలేదా..?
అన్నాడీఎంకేలో అగ్రనేతల వర్గపోరు న్యాయస్థానానికి కూడా తలనొప్పిగా మారింది. కోర్టులో దాఖలవుతున్న పిటీషన్ల పరంపరపై సాక్షాత్తూ న్యాయమూర్తే అసహనం వ్యక్తం చేశారు. ‘ప్రధాన న్యాయమూర్తికి మరో పనిలేదని భావిస్తున్నారా’ అంటూ న్యాయమూర్తి కృష్ణన్ రామస్వామి అన్నాడీఎంకే నేతలు, వారి న్యాయవాదులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సాక్షి ప్రతినిధి, చెన్నై : అన్నాడీఎంకే అగ్రనేతలు ఎడపాడి పళనిస్వామి, పన్నీర్సెల్వం మధ్య అంతర్గత పోరు చిలికిచిలికి గాలివానగా మారిన విషయం తెలిసిందే. సమన్వయ కమిటీ కనీ్వనర్గా పన్నీర్సెల్వం, ఉప కనీ్వనర్ ఎడపాడి పళనిస్వామి ఉన్న ద్వంద విధానానికి స్వస్తి చెప్పి ఏక నాయకత్వంతో ముందుకు సాగాలనే అంశం పార్టీలో అగ్గిరాజేసింది. ఓపీఎస్ ఆదేశాలను అనుసరించి జూన్ 23వ తేదీన జరిగిన సర్వసభ్య సమావేశాన్ని ఈపీఎస్ వర్గం ధిక్కరించింది. పైగా జూలై 11వ తేదీన మరో సర్వసభ్య సమావేశం నిర్వహించింది. పనిలోపనిగా ఎడపాడిని తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకుని, ఓపీఎస్, ఆయన ఇద్దరు కుమారులు, అనుచరులపై బహిష్కరించింది. అయితే, ఓపీఎస్ వేసిన పిటిషన్తో ఎడపాడి నిర్వహించిన సర్వసభ్య సమావేశం చెల్లకుండా పోగా, పన్నీర్ పదవులు మళ్లీ పదిలమయ్యాయి. అన్నాడీఎంకే నిర్వహించిన సర్వసభ్య సమావేశం చెల్లదని ప్రత్యేక న్యాయమూర్తి జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ ఎడపాడి పళనిస్వామి మరో పిటిషన్ వేశారు. పార్టీలోని ఇరువర్గాలు ఏకమై మరో సర్వసభ్య సమావేశం జరుపుకోవాలని కోర్టు చేసిన సూచనకు ఎడపాడి తరపు న్యాయవాది అభ్యంతరం తెలిపారు. పన్నీర్సెల్వంతో ఎడపాడి కలిసి పనిచేసేందుకు అవకాశమే లేదని మద్రాసు హైకోర్టులో గురువారం జరిగిన వాదోపవాదాల్లో తేల్చిచెప్పారు. ఇలా ఇరువురూ నేతలూ పోటాపోటీగా మద్రాసు హైకోర్టు, సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్లలో కొన్ని ఇంకా విచారణ దశలో ఉన్నాయి. తాజాగా మరో రెండు.. తిరుచెందూరుకు చెందిన న్యాయవాది, అన్నాడీఎంకే సభ్యుడైన పి. ప్రేమ్కుమార్ ఆదిత్యన్, అదే పార్టీ సభ్యుడు సురేన్ పళనిస్వామి మద్రాసు హైకోర్టులో బుధవారం వేర్వేరుగా రెండు సివిల్ పిటిషన్లు వేశారు. 2017 సెపె్టంబర్ 12వ తేదీన సర్వసభ్య సమావేశంలో పలు తీర్మానాలు చేశారు. 2021 డిసెంబర్ 1వ తేదీన పార్టీ విధానాల్లో చేసిన మార్పులు, డిసెంబర్ 6వ తేదీన జరిగిన సమన్వయ కమిటీ ఎన్నికలు, సంస్థాగత ఎన్నికలు, 2022 జూన్ 23వ తేదీన సర్వసభ్యç సమావేశలో చేసిన తీర్మానాలు చెల్లవని ప్రకటించాల్సిందిగా కోరుతూ ఈ పిటిషన్ వేశారు. వీరిద్దరూ దాఖలు చేసిన కేసు మద్రాసు హైకోర్టులో విచారణలో ఉంది. తాము దాఖలు చేసిన సివిల్ పిటిషన్లు, జూన్, జూలై నిర్వహించిన సర్వసభ్య సమావేశ సమావేశాన్ని వ్యతిరేకిస్తూ సమన్వయ కమిటీ కన్వీనర్, ఉప కన్వీనర్ దాఖలు చేసిన పిటిషన్లు, స్థానిక సంస్థల ఎన్నికలకు వ్యతిరేకంగా కొందరు దాఖలు చేసిన పిటిషన్లు విచారణకు ప్రత్యేక బెంచ్ ఏర్పాటు చేయాలని అందులో కోరారు. ఇప్పటికే అన్నాడీఎంకే కేసుల విచారణకు ఈనెల 17వ తేదీన ప్రత్యేక న్యాయమూర్తిని ఏర్పాటు చేసి ఉన్నట్లు ఆ పిటిషన్లో పేర్కొన్నారు. రామ్కుమార్ ఆదిత్యన్ తదితరులు వేసిన పిటిషన్లు న్యాయమూర్తి కృష్ణన్ రామస్వామి ముందుకు విచారణకు వచ్చింది. ఇద్దరి నాయకుల తరపున హాజరైన న్యాయవాదులు ప్రత్యేక బెంచ్కోసం రిజి్రస్టార్కు వినతిపత్రం సమర్పించిన విషయం వెలుగులోకి రావడంతో న్యాయమూర్తి తీవ్రంగా ఆక్షేపించారు. కేసు విచారణ దశలో ఉండగా ప్రధాన న్యాయమూర్తికి వినతిపత్రాలు సమరి్పంచడమే మీపనిగా ఉంది, సీజేకి మరో పనిలేదని భావిస్తున్నారా..? అంటూ న్యాయమూర్తి ప్రశ్నించి కేసు విచారణను సెపె్టంబర్ 9వ తేదీకి వాయిదా వేశారు. గతనెల 11వ తేదీ జరిగిన సర్వసభ్య సమావేశం చెల్లదని ప్రకటించాలని కోరుతూ దాఖలైన పిటిషన్, సుప్రీంకోర్టు జారీచేసిన ఉత్తర్వులపై మద్రాసు హైకోర్టులో దాఖలైన పిటిషన్ ఇదే న్యాయమూర్తి ముందుకు విచారణకు వచ్చింది. అయితే పార్టీ సమన్వయ కమిటీ కన్వీనర్ పన్నీర్సెల్వం న్యాయవాది అభ్యర్థన మేరకు కేసు విచారణను మరో న్యాయమూర్తికి బదిలీ చేశారు. ఈమేరకు న్యాయమూర్తి జయచంద్రన్ను నియమిస్తూ ఈనెల 17న ఆదేశాలు కూడా జారీ చేశారు. ఈ దశలో అన్నాడీఎంకే కేసులన్నీ విచారించేందుకు ప్రత్యేక బెంచ్ను ఏర్పాటు చేయాలని మరో రెండు పిటిషన్లు దాఖలు కావడంపై న్యాయమూర్తి కృష్ణన్ రామస్వామి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. -
అన్నాడీఎంకే పాలిటిక్స్లో హై టెన్షన్.. రంగంలోకి దిగిన పోలీసులు!
సాక్షి ప్రతినిధి, చెన్నై: అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యాలయంలోకి కార్యకర్తలెవ్వరూ ప్రవేశించరాదని ఎడపాడి పళనిస్వామి మద్దతుదారులు ఆదివారం ఆకస్మిక ఉత్తర్వులు జారీ చేశారు. కార్యాలయ ప్రవేశంపై కోర్టు విధించిన గడువు శనివారం ముగియడంతో ఈ మేరకు తమ పట్టు నిలుపుకునేందుకు అప్రమత్తం అయ్యారు. గతనెల 11వ తేదీన అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశం జరగడం, తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఎడపాడి ఎంపిక కావడంతో రెచ్చిపోయిన పన్నీర్సెల్వం వర్గీయులు పార్టీ ప్రధాన కార్యాలయం ప్రధాన ద్వారం తలుపు బద్దలు కొట్టి మరీ ప్రవేశించారని ఎడపాడి వర్గం ఆరోపిస్తోంది. పైగా లోపలున్న ఫర్నీచర్, ఫైళ్లు, డాక్యుమెంట్లు, కంప్యూటర్లు ధ్వంసం చేశారని చెబుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం జోక్యం చేసుకుని కార్యాలయానికి సీలు వేయగా, సీలు తొలగించి పార్టీ కార్యాలయం తాళాలను ఎడపాడికి అప్పగించాలని కోర్టు ఇటీవల తీర్పు చెప్పింది. అయితే, పార్టీ శ్రేణులెవ్వరూ ఆగస్టు 20వ తేదీ వరకు కార్యాలయంలోకి ప్రవేశించరాదని కోర్టు అదేరోజు ఆదేశించింది. ఇదిలా ఉండగా, ఎడపాడి నిర్వహించిన సర్వసభ్య సమావేశం చెల్లదని, అంతకు ముందున్న పరిస్థితులు కొనసాగాలని ఇటీవల కోర్టు తీర్పు చెప్పడంతో పార్టీలో పన్నీర్సెల్వానిదే పైచేయిగా మారింది. పార్టీ సమన్వయ కమిటీ కన్వీనర్ హోదా మళ్లీ తన చేతికి వచ్చినా, కార్యాలయ తాళాలు మాత్రం ఇంకా ఎడపాడి చేతుల్లోనే ఉన్నాయి. కోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాల ప్రకారం కార్యకర్తల కార్యాలయ ప్రవేశ నిషేధం ఈనెల 20వ తేదీతో ముగిసింది. అయితే, కోర్టు తాజా తీర్పుతో పన్నీర్సెల్వం వర్గం మళ్లీ పార్టీ కార్యాలయంలోకి బలవంతంగా ప్రవేశిస్తే గతనెల 11వ తేదీన జరిగిన దుస్సంఘటనకు సంబంధించిన ఆనవాళ్లు రూపుమాపే అవకాశం ఉంటుందని ఎడపాడి వర్గం అనుమానిస్తోంది. దీంతో కార్యాలయంలోకి పార్టీ శ్రేణులు ఎవ్వరూ వెళ్లరాదని ఎడపాడి వర్గం ఉత్తర్వులు జారీచేసింది. అయితే ఈ ఆదేశాలను పన్నీర్ వర్గం ఖాతరు చేస్తుందా..? అనే కొత్త అనుమానాలు తలెత్తాయి. కోర్టు విధించిన నిషేధం గడువు ముగిసిపోయిన దశలో అదనపు పోలీసు బందోబస్తు మధ్య కార్యాలయం బోసిపోయి దర్శనమిస్తుండడం గమనార్హం. ఇది కూడా చదవండి: కాంగ్రెస్లో ఊహించని షాక్.. నడిరోడ్డుమీదే తన్నుకున్న నేతలు -
కీలక మలుపు తిరిగిన రాజీనామా వ్యవహారం.. పళనికి కొత్త చిక్కులు
సాక్షి, చెన్నై: ప్రతిపక్ష నాయకుడు పళనిస్వామికి కొత్త చిక్కులు వచ్చిపడ్డాయి. అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి పదవికి ఎంపికయ్యేందుకు ముందుగా ఆ పార్టీ సమన్వయ కమిటీ కో– కన్వీనర్ పదవికి ఆయన చేసిన రాజీనామా కొత్త సమస్యగా మారింది. ఈ రాజీనామాపై సీఈసీ విచారణకు నిర్ణయించినట్లు సమాచారం. దీంతో ఈ రాజీనామాను ఆమోదించాలని కోరుతూ పన్నీరు సెల్వం సీఈసీకి లేఖ రాసినట్లు శనివారం వెలుగు చూసింది. అన్నాడీఎంకేలో పన్నీరు సెల్వం, పళని స్వామి శిబిరాల మధ్య వివాదం ఆసక్తికరంగా మారుతోంది. సర్వసభ్య సమావేశం చెల్లదని రెండు రోజుల క్రితం హైకోర్టు ప్రకటించడంతో పళనిస్వామికి పెద్దషాక్ తగిలింది. దీంతో పన్నీరు సెల్వం వ్యూహాలకు పదును పెట్టారు. ఓ వైపు కలిసి పనిచేద్దామని పిలుపునిస్తూనే.. మరోవైపు పళని స్వామికి ఎలాగైనా చెక్ పెట్టాలనే మార్గాలను అన్వేషిస్తున్నారు. ఇందులో భాగంగా సీఈసీకి గత నెల పళనిస్వామి రాసిన లేఖ ప్రస్తుతం పన్నీరుకు అస్త్రంగా మారింది. ఆమోదించండి.. అన్నాడీఎంకే సర్వ సభ్య సమావేశంలో పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా గత నెల పళనిస్వామి ఎంపికైన విషయం తెలిసిందే. ఈ సమయంలో తన చేతిలో ఉన్న అన్నాడీఎంకే సమన్వయ కమిటీ కో– కన్వీనర్ పదవిని ఆయన రాజీనామా చేశారు. ఈ వివరాలను కేంద్ర ఎన్నికల కమిషన్కు(సీఈసీ) లేఖ ద్వారా పంపించారు. ఇన్నాళ్లూ పెండింగ్లో ఉన్న ఈ వ్యవహారాన్ని ప్రస్తుతం ఎస్ఈసీ విచారించేందుకు నిర్ణయించినట్లు సమాచారం. ప్రస్తుతం కోర్టు తీర్పుతో తాత్కాలిక ప్రధాన కార్యదర్శి పదవి దూరం కావడంతో డీలా పడిన పళనికి, ఈ రాజీనామా లేఖ కొత్త చిక్కులు సృష్టించే అవకాశాలు కనిపిస్తున్నాయి. చదవండి: పన్నీరు సెల్వానికి షాకిచ్చిన పళనిస్వామి.. తమిళ పాలిటిక్స్లో ట్విస్ట్ కో– కన్వీనర్గా వైద్యలింగం పళనిస్వామి రాజీనామా నేపథ్యంలో ఆ పదవిని తన సన్నిహితుడు, ఎమ్మెల్యే వైద్యలింగంకు అన్నాడీఎంకే సమన్వయ కమిటీ కన్వీనర్ హోదాలో పన్నీరుసెల్వం కేటాయించారు. కోర్టు తీర్పుతో ప్రస్తుతం పార్టీకి పెద్ద దిక్కుగా సమన్వయ కమిటీ మారడంతో పళనికి ఒక దాని తర్వాత మరొకటి చొప్పున సమస్యలు ఎదురు కాబోతున్నట్లు కనిపిస్తోంది. ఇందుకు కారణం, పళని స్వామి పంపించిన రాజీనామా లేఖను ఆమోదించాలని సీఈసీకి పన్నీరు సెల్వం లేఖ ద్వారా కోరడమే. ఒకవేళ సీఈసీ పళని రాజీనామాను ఆమోదించిన పక్షంలో, ఆయనకు పార్టీలో ఎలాంటి పదవి లేకుండా పోయినట్టే. ఇక పార్టీ కో– కన్వీనర్గా వైద్యలింగం కొనసాగే అవకాశాలు ఎక్కువే. ఈ పరిణామా లు పళని శిబిరంలో కలవరం రేపుతున్నాయి. మంతనాల్లో పన్నీరు.. హైకోర్టు తీర్పుతో పార్టీ వ్యవహారాలు తన గుప్పెట్లోకి రావడంతో పన్నీరు దూకుడు పెంచారు. జిల్లా కార్యదర్శులతో సమావేశాలు విస్తృతం చేశారు. శనివారం తన నివాసంలో ముఖ్య నేతలతో భేటీ అయ్యారు. తదుపరి కార్యచరణపై దృష్టి పెట్టారు. తాజా పరిణామాల నేపథ్యంలో పళని స్వామి ఒంటరిగా ఏమీ చేయలేని పరిస్థితి ఉందని, ఈ దృష్ట్యా, మరింత దూకుడుగా ముందుకు సాగి, కేడర్ను తమ వైపునకు తిప్పుకునే వ్యూహాలకు పన్నీరు శిబిరం పదును పెట్టినట్లు తెలుస్తోంది. -
పన్నీరు సెల్వానికి షాకిచ్చిన పళనిస్వామి.. తమిళ పాలిటిక్స్లో ట్విస్ట్
అంతర్గత కుమ్ములాటలతో కప్పల తక్కెడగా మారిన అన్నాడీఎంకేలో పరిణామాలు రోజురోజుకూ ఆసక్తికరంగా మారుతున్నాయి. బుధవారం కోర్టు తీర్పుతో మళ్లీ పార్టీ కనీ్వనర్, కోశాధికారిగా గుర్తింపు దక్కడంతో పన్నీరు శిబిరం ఆనంద తావడం చేస్తోంది. ఈ నేపథ్యంలో గురువారం పన్నీరు.. తన ప్రత్యర్థి పళని స్వామికి కీలక సూచన చేశారు. ఏక, జంట నాయకత్వానికి స్వస్తి పలికి ఉమ్మడిగా ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు. అందరూ ఏకం కావాల్సిన సమయం అసన్నమైందంటూ వ్యాఖ్యానించారు. అయితే ఊసరవెళ్లి తరహాలో రంగులు మార్చే పన్నీరు సెల్వంతో కలిసి ప్రయాణించే అవకాశమే లేదని పళని స్వామి తేలి్చచెప్పారు. సాక్షి, చెన్నై : ‘గొడవలు వద్దు..ఐక్యతే ముద్దు, జంట , ఏక నాయకత్వాలు వద్దు ఉమ్మడిగా పార్టీని బలోపేతం చేద్దాం..’’ అని పళని స్వామికి పన్నీరు సెల్వం పిలుపు నిచ్చారు. అలాగే, చిన్నమ్మ శశికళ, ఆమె ప్రతినిధి టీటీవీ దినకరన్కూ ఆహ్వానం పలికారు. అయితే, పన్నీరు పిలుపును పళని తిరస్కరించారు. కలిసి పనిచేసే అవకాశం లేదని స్పష్టం చేశారు. కీలక మలుపు.. అన్నాడీఎంకే అగ్ర నేతలు పళనిస్వామి, పన్నీరు సెల్వం మధ్య సాగుతున్న వివాదాల ఎపిసోడ్ బుధవారం కీలక మలుపు తిరిగింది. జూలై 11వ తేదీన పళని నిర్వహించిన సర్వ సభ్య సమావేశానికి వ్యతిరేకంగా పన్నీరు సెల్వం దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. సర్వ సభ్య సమావేశం చెల్లదని తేల్చింది. జూన్ 23వ తేదీ నాటి పరిస్థితులనే యథాతథంగా కొనసాగించాలని ఆదేశించింది. దీంతో తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా పళని ఎంపిక చెల్లకుండా పోయింది. అలాగే, అన్నాడీఎంకేలో రెండు గ్రూపులుగా ఏర్పడ్డ పళని, పన్నీరు తమ వాళ్లకు పదవులు కట్ట బెడుతూ జారీ చేసిన ఉత్తర్వులు అన్నీ చెల్లని కాగితాలయ్యాయి. అన్నాడీఎంకే సమన్వయ కమిటీ కన్వీనర్, కోశాధికారి పదవులు కోర్టు తీర్పుతో మళ్లీ పన్నీరు చేతికి చిక్కాయి. పళని కేవలంలో పార్టీ సమన్వయ కమిటీ కో– కన్వీనర్గా మిగలాల్సిన పరిస్థితి. కోర్టు తీర్పు పన్నీరు శిబిరంలో ఆనందాన్ని నింపితే, పళని శిబిరాన్ని నిరాశకు గురి చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఇరు శిబిరాలు వేర్వేరుగా గురువారం సమావేశాల్లో మునిగాయి. తదుపరి కార్యాచరణపై దృష్టి పెట్టాయి. ఇందులో భాగంగా మీడియాతో మాట్లాడుతూ, పన్నీరు సెల్వం ఇచ్చిన పిలుపు అన్నాడీఎంకే రాజకీయాలను ఆసక్తికరం చేశాయి. పళణితో సామరస్యానికి పన్నీరు ముందుకు రావడమే కాకుండా, చిన్నమ్మ శశికళ, ఆమె ప్రతినిధి దినకర్ను కూడా పారీ్టలోకి ఆహ్వానించడం చర్చనీయాంశంగా మారింది. చేతులు కలుపుదాం.. పన్నీరు సెల్వం తన ప్రసంగంలో ప్రియ మిత్రమా చేతులు కలుపుదాం.. కలిసి పనిచేద్దాం అని పిలుపు నిచ్చారు. ఇన్నాళ్లూ మనస్సులో ఉన్న చేదు అనుభవాలు, బాధలు, భేదాలు, వివాదాలను పక్కన పెట్టేద్దామని సూచించారు. అమ్మ జయలలిత మరణం తదుపరి పరిణామాలతో సీఎం పగ్గాలు చేపట్టిన పళని స్వామికి నాలుగున్నరేళ్ల సంపూర్ణ సహకారం అందించామని గుర్తు చేశారు. అయితే, ఇప్పుడు ఏక నాయకత్వం అంటే, అంగీకరించే ప్రసక్తే లేదని, అయితే, ఉమ్మడి నాయకత్వంతో అందరం కలిసి కట్టుగా ఐక్యతను చాటుదామని పిలుపు నిచ్చారు. అన్నాడీఎంకేలో ఒకే ఎజెండా మాత్రమే ఉందని, అది ఒక్క ఐక్యత మాత్రమేనని పేర్కొన్నారు. సమష్టిగా పార్టీ బలోపేతమే లక్ష్యంగా ప్రజాస్వామ్యబద్ధంగా అందరం కలిసి పనిచేద్దామని పిలుపు నిచ్చారు. అందరూ అంటే, చిన్నమ్మ శశికళ, దినకరన్ను కూడా ఆహా్వనిస్తున్నారా..? అని ప్రశ్నించగా, అవును అని సమాధానం ఇచ్చారు. అందరూ మళ్లీ పారీ్టలోకి రావాలని, కలిసి కట్టుగా ముందుకు సాగాలని స్పష్టం చేశారు. అమ్మ జీవించి ఉన్న కాలంలో పార్టీ కోసం రేయింబవళ్లు శ్రమించి, ఇప్పుడు దూరంగా ఉన్న వారు సైతం రావాలని, అందరూ ఉమ్మడి ప్రయాణం ప్రారంభించాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. అప్పీల్కు పళని.. అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశం వ్యవహారంలో ప్రత్యేక బెంచ్ బుధవారం ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ పళని స్వామి తరపున మద్రాసు హైకోర్టులో అప్పీల్ పిటిషన్ దాఖలు చేశారు. సీనియర్ న్యాయవాది విజయనారాయణన్ ఈ పిటిషన్ వేశారు. దీనిని న్యాయమూర్తులు ఎం. దురైస్వామి, సుందర్మోహన్ బెంచ్ విచారణకు స్వీకరించింది. అయితే, సోమవారం నుంచి విచారణ చేపడుతామని ప్రకటించింది. ఇదిలా ఉండగా, అన్నాడీఎంకే తాళాన్ని పళనిస్వామికి అప్పగించిన వ్యవహారంలో పన్నీరు సెల్వం దాఖలు చేసిన అప్పీల్ పిటిషన్ సుప్రీంకోర్టులో గురువారం విచారణకు వచ్చింది. తాళం కోసం పన్నీరు తరపు న్యాయవాదులు తీవ్రంగానే వాదనలు వినిపించారు. పళని స్వామికి తాళం అప్పగిస్తూ హైకోర్టు ఇప్పటికే ఇచ్చి న ఉత్తర్వులకు స్టే విధించాలని కోరారు. అయితే, సుప్రీంకోర్టు స్టేకు నిరాకరించింది. వివరణ ఇవ్వా లని పళని స్వామికి నోటీసులు జారీ చేసింది. అంగీకరించే ప్రసక్తే లేదు.. పళని స్వామి మీడియాతో మాట్లాడుతూ, పన్నీరు ఆహ్వానాన్ని తిరస్కరించారు. ఆయనతో కలిసి పనిచేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ధర్మయుద్ధం అంటూ గతంలో గళం వినిపించిన పన్నీరు, ఇప్పుడు ఆ యుద్ధాన్ని పక్కన పెట్టేశారా? అని ప్రశ్నించారు. వాళ్లను కూడా పారీ్టలోకి ఆహా్వనిస్తుండడం చూస్తే, ఆయన ధర్మయుద్ధం ఎవరి కోసం చేసినట్లో అర్థం అవుతోందని మండిపడ్డారు. ఆయనకు పదవీ కాంక్ష ఎక్కువని, శ్రమించకుండా ఉన్నత పదవుల్లో కూర్చోవడం ఆయనకు అలవాటేనని విమర్శించారు. పార్టీ కన్నా, కుటుంబమే ఆయనకు ముఖ్యమని, అందుకే ఆయన తనయుడికి కేంద్ర మంత్రి పదవి కోసం గతంలో పట్టుబట్టారని గుర్తు చేశారు. గూండాలతో, రౌడీలతో, పోలీసు భద్రతతో వెళ్లి పార్టీ కార్యాలయం పరువును బజారుకీడ్చారని, కేడర్ను కొట్టించిన పన్నీరుతో ఎట్టి పరిస్థితుల్లోనూ కలిసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఏక నాయకత్వం తన వ్యక్తిగతం కాదని, కార్యకర్తలందరి అభీష్టం అని స్పష్టం చేశారు. ఏదైనా సమస్యలు ఉంటే, పార్టీ సర్వ సభ్య సమావేశంలో చర్చించుకోవాలే గానీ, అనాగరికంగా వ్యవహరించడం సమంజసమా..? అని ప్రశ్నించారు. ఇది కూడా చదవండి: బిహార్ పరిణామాలు.. కేంద్రంలో అధికార మార్పునకు సంకేతం -
బిగ్ రిలీఫ్: మద్రాస్ హైకోర్టులో పన్నీర్ సెల్వంకు ఊరట
చెన్నై: అన్నాడీఎంకే నాయకత్వం వ్యవహారంలో పన్నీర్ సెల్వంకు భారీ ఊరట లభించింది. అన్నాడీఎంకే కేసులో స్టేటస్ కో విధించింది మద్రాస్ హైకోర్టు. జూన్ 23న జనరల్ బాడీలో తీసుకున్న నిర్ణయాలపై స్టే విధించింది. పార్టీ జనరల్ సెక్రెటరీగా ఈ పళనిస్వామి నియామకం చెల్లదని స్పష్టం చేసింది. దీంతో పళనిస్వామికి ఎదురుదెబ్బ తగిలినట్లయింది. కొత్తగా జనరల్ బాడీ సమావేశం నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు. తాజా ఆదేశాలతో అన్నాడీఎంకేలో సంయుక్త నాయకత్వాన్ని పునరుద్ధరించినట్లయింది. పన్నీరు సెల్వం కోఆర్డినేటర్గా, పళనిస్వామి డిప్యూటీ కోఆర్డినేటర్గా కొనసాగాల్సి ఉంటుంది. అన్నాడీఎంకే కేసులో ఇరు వర్గాల వాదనలు విన్న మద్రాస్ హైకోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఈ సందర్భంగా జూన్ 23న నిర్వహించిన జనరల్ బాడీ సమావేశం అక్రమమని వాదించారు పన్నీరు సెల్వం తరఫు న్యాయవాది. పార్టీ నిబంధనలను అతిక్రమించి పళనిస్వామి సమావేశం ఏర్పాటు చేశారని ఆరోపించారు. అలాంటి సమావేశం సంయుక్తంగా ఇరువురి నేతల సమక్షంగా చేపట్టాలని వెల్లడించారు. ‘పార్టీ మధ్యంతర జనరల్ సెక్రెటరీగా ఈపీఎస్ నియామకం సరైంది కాదు. ఇరువురు నేతలు కలిసి పనిచేయాలి.’ అని పేర్కొన్నారు ఓపీఎస్ తరఫు న్యాయవాది తమిల్మారన్. గతంలో ఓపీఎస్ను పార్టీ టాప్ పోస్ట్కు రెండుసార్లు ఎంపిక చేశారు అన్నాడీఎంకే చీఫ్, మాజీ ముఖ్యమంత్రి జయలలిత. ఆమె మరణించేకన్నా ముందు మూడు సార్లు ముఖ్యమంత్రిగానూ చేశారు. కానీ, జయలలిత నెచ్చెలి శశికల పార్టీ పగ్గాలు తీసుకున్న తర్వాత ఈపీఎస్ను ముఖ్యమంత్రిగా నియమించారు. మరోవైపు.. శశికల ముఖ్యమంత్రి పీఠంపై కూర్చునే ప్రయత్నాలు చేయగా ఓపీఎస్ తిరుగుబాటు చేశారు. ఆ తర్వాత ఆమె జైలుకు వెళ్లారు. ఇరువురు నేతలు కలిసి పార్టీని నడిపించారు. ఓపీఎస్తో చేతులు కలిపిన ఈపీఎస్ పార్టీ నేత శశికలను బహిష్కరించారు. ఓపీఎస్ను ఉపముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టారు ఈపీఎస్. ఓపీఎస్ కోఆర్డినేటర్గా, ఈపీఎస్ డిప్యూటీ జాయింట్ కోఆర్డినేటర్గా కొనసాగుతూ వచ్చారు. అయితే, ఇటీవల జరిగిన మూడు ఎన్నికల్లో అన్నాడీఎంకే ఓటమిపాలవటంతో నేతల మధ్య విబేధాలు బయటపడ్డాయి. పార్టీని హస్తగతం చేసుకునేందుకు ద్వంద నాయకత్వంతో నిర్ణయాలు తీసుకోలేకపోతున్నామని పేర్కొన్నారు ఈపీఎస్. పార్టీకి ఒక్కరే నాయకత్వం వహించాలని సూచించారు. ఆ తర్వాత జనరల్ బాడీ మీటింగ్ ఏర్పాటు చేసి జనరల్ సెక్రెటరీగా ఎన్నికయ్యారు. అయితే, తాజాగా మద్రాస్ హైకోర్టు ఆదేశాలతో ఓపీఎస్కు ఊరట లభించినట్లయింది. ఇదీ చదవండి: Tamil Nadu: సుప్రీంకోర్టుకు పళనిస్వామి.. తీర్పుపై ఫుల్ ఉత్కంఠ -
తమిళనాడు.. దిక్కుతోచని స్థితితో పన్నీరుసెల్వం
సాక్షి, చెన్నై: అన్నాడీఎంకేలో పరిణామాలన్నీ ఎడపాడి పళనిస్వామికే అనుకూలంగా మారడంతో పన్నీర్సెల్వం దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. న్యాయస్థానాల్లో వరుసగా ఎదురుదెబ్బలు తగులుతుండడంతో ఆయన పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఎడపాడి నేతృత్వంలో జరిగిన పార్టీ సర్వసభ్య సమావేశం, తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఎంపిక చెల్లదు..అని ఆదేశించాలని కోరుతూ వేసిన అప్పీల్ పిటిషన్ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. పైగా మద్రాసు హైకోర్టులోనే ఈ వ్యవహారాన్ని తేల్చుకోవాలని ఆదేశించడం,అప్పటి వరకు అన్నాడీఎంకేలో యథాతధ స్థితి కొనసాగుతుందని స్పష్టం చేయడం ఓపీఎస్కు మింగుడుపడలేదు. అన్నాడీఎంకే వ్యవహారంపై 3 వారాల్లోగా తీర్పు చెప్పాలని కూడా మద్రాసు హైకోర్టును ఆదేశించింది. ఈ మేరకు ఆగస్టు 1వ తేదీన విచారణ ప్రారంభం కానుండగా, సుప్రీంకోర్టు ఆదేశాలను అధిగమించి చేపట్టాల్సిన తదుపరి చర్యలపై తన మద్దతుదారులు, చట్ట నిపుణులతో ఓపీఎస్ శనివారం సుదీర్ఘంగా సమాలోచనలు జరిపారు. ఇక అన్నాడీఎంకేలో కుమ్ములాటలు ఇలా ఉండగా, శశికళ, పన్నీర్సెల్వం ఏకమై రాజకీయంగా ముందుకు సాగాలని వంద దేవర్ సంఘాల ప్రతినిధులు వారిద్దరికీ శనివారం లేఖలు పంపడం చర్చనీయాంశంగా మారింది. చదవండి: రాష్ట్రపతి అంటే గౌరవం లేదా? కేంద్రమంత్రి క్షమాపణలు చెప్పాల్సిందే.. అఖిలపక్ష సమావేశానికి ఈపీఎస్.. ఓటరు కార్డుతో ఆధార్కార్డు అనుసంధానంపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఈనెల 1వతేదీన అఖిలపక్ష సమావేశం నిర్వహించనుంది. దీనికి డీఎంకే, కాంగ్రెస్, బీజేపీ, అన్నాడీఎంకే తదితర గుర్తింపు పొందిన పార్టీలను ఆహ్వానిస్తోంది. ఈ క్రమంలో అన్నాడీఎంకే తరపున ఎడపాడి పళనిస్వామికి ఈసీ నుంచి పిలుపు వచ్చింది. చెన్నై రాయపేటలోని అన్నాడీంకే ప్రధాన కార్యాలయానికి ఆహ్వానపత్రం అందింది. దీంతో అన్నాడీఎంకే కో కన్వీనర్ పదవి నుంచి ఎడపాడిని బహిష్కరించినట్లు, ఆయన స్థానంలో వైద్యలింగంను నియమించినట్లుగా ప్రధాన ఎన్నికల కమిషన్ కార్యాలయానికి పన్నీర్సెల్వం ఉత్తరం పంపారు. ఓపీఎస్ ఎత్తుగడలను తిప్పికొట్టేందుకు ఎడపాడి సైతం శనివారం తన అనుచరగణంతో సమావేశమై తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు. -
తమిళనాట కోల్డ్వార్: సుప్రీంకోర్టుకు పళనిస్వామి.. ఏం జరుగనుంది?
సాక్షి, చెన్నై : అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశం వ్యవహారంలో తమ వాదన వినాలని కోరుతూ ఎడపాడి కె.పళనిస్వామి తరఫున కేవియేట్ పిటిషన్ గురువారం సుప్రీంకోర్టులో దాఖలైంది. అన్నాడీఎంకేలో పన్నీరు సెల్వం, పళని స్వామి శిబిరాల మధ్య జరుగుతున్న వార్ గురించి తెలిసిందే. ఈ పరిస్థితుల్లో ఈనెల 11వ తేదీ చెన్నైలో పళనిస్వామి నేతృత్వంలో జరిగిన అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశాన్ని పన్నీరు సెల్వం తీవ్రంగా వ్యతిరేకించారు. అదే సమయంలో ఈ సమావేశం వేదికగా అన్నాడీఎంకే సమన్వయ కమిటీని రద్దు చేశారు. అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా పళనిస్వామి ఎంపికయ్యారు. అలాగే అన్నాడీఎంకే నుంచి పన్నీరు సెల్వం అండ్ బృందాన్ని సాగనంపే విధంగా తీర్మానాలు చేశారు. దీంతో ఈ సమావేశానికి, ఇందులో తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా పన్నీరుసెల్వం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అలాగే ఈ సమావేశం నిర్వహణకు అనుకూలంగా హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరారు. ఈ పిటిషన్ శుక్రవారం సుప్రీంకోర్టులో విచారణకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీంతో పళని స్వామి తరఫున కార్యనిర్వాహక కార్యదర్శి, మాజీమంత్రి ఎస్పీ వేలుమణి గురువారం సుప్రీంకోర్టులో కేవియేట్ పిటిషన్ దాఖలు చేశారు. పన్నీరు సెల్వం దాఖలు చేసిన పిటిషన్ వ్యవహారంలో తమ వాదన వినాలని కోరారు. అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశానికి ఉన్న ప్రాధాన్యత, అధికారాల గురించి ఆ పిటిషన్లో వివరించారు. ఇది కూడా చదవండి: ఐదేళ్లలో కేంద్రం ప్రకటనల ఖర్చు రూ.3,339 కోట్లు -
తమిళనాట ట్విస్టులు.. పళనిస్వామి, పన్నీరు సెల్వానికి షాకిచ్చిన మోదీ!
సాక్షి, చెన్నై: ప్రధాని నరేంద్ర మోదీకి ఆహ్వానం పలికే వారి జాబితాలో మాత్రమే అన్నాడీఎంకే నేతలు పన్నీరు, పళని స్వామికి అనుమతి దక్కింది. కానీ, రాజ్భవన్లో ప్రత్యేకంగా భేటీ అయ్యేందుకు అపాయింట్మెంట్ లభించలేదని సమాచారం. కాగా, అన్నాడీఎంకే అంతర్గత పోరు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే, ప్రధాని నరేంద్ర మోదీ చెన్నై పర్యటన సందర్భంగా వీరి మధ్య విబేధాలకు శుభం కార్డు పడే అవకాశం ఉంది.. అనే చర్చ ఇన్నాళ్లూ సాగుతూ వచ్చింది. ఈ ఇద్దరు నేతలు వేర్వేరుగా మోదీని కలిసేందుకు అపాయిమెంట్ కోరినట్లు కూడా తెలిసింది. అయితే, ఈ ఇద్దరికీ మోదీతో ప్రత్యేక భేటీకి అనుమతి దక్కలేదు. చెన్నై విమానాశ్రయంలో ప్రధాని నరేంద్ర మోదీకి ఆహ్వానం పలికే కార్యక్రమానికి మాత్రం ఈ ఇద్దరికి అధికారులు అనుమతిచ్చారు. ఢిల్లీ వెళ్లినా ప్రధానితో భేటీ కాలేకపోయిన నేపథ్యంలో చెన్నైలోనైనా అవకాశం వస్తుందని ఎదురు చూసిన పళని స్వామికి ఇది పెద్ద షాకే అని భావిస్తున్నారు. అదే సమయంలో మోదీ ఆశీస్సులు పొందేందుకు ప్రయత్నించిన పన్నీరుకూ ఇది భంగపాటే. ఒకరిపై ఒకరు.. అన్నాడీఎంకే కార్యాలయం ధ్వంసం విషయంపై పన్నీరు సెల్వంను ఇరకాటంలో పెట్టేందుకు పళని స్వామి శిబిరం దూకుడు పెంచింది. ఈ కార్యాలయంలో రికార్డులు, కీలక వస్తువులు మాయమైనట్లు ఇప్పటికే ఆ శిబిరం వర్గాలు ఆరోపించాయి. ఈ వ్యవహారంపై సీబీఐ విచారణ కోరుతూ పళని మద్దతు ఎంపీ సీవీ షణ్ముగం డీజీపీ శైలేంద్ర బాబును కలవడం గమనార్హం. అదే సమయంలో వీరి ఎత్తులకు పైఎత్తు వేయడానికి పన్నీరు సిద్ధమయ్యారు. తన కుమారుడు రవీంద్రనాథ్ను అన్నాడీఎంకే ఎంపీగా పరిగణించకూడదని పళనిస్వామి శిబిరం పార్లమెంట్ స్పీకర్కు లేఖ రాయడాన్ని పన్నీరు పరిగణనలోకి తీసుకున్నారు. అదే సమయంలో పళని స్వామి వెంట ఉన్న 63 మంది ఎమ్మెల్యేలను అన్నాడీఎంకే సభ్యులుగా పరిగణించకూడదని పేర్కొంటూ, వారిపై వేటుకు పన్నీరు సెల్వం వ్యూహ రచన చేస్తున్నారు. ఈమేరకు అసెంబ్లీ స్పీకర్ అప్పావును కలిసి ఇందుకు లేఖ సమరి్పంచేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. ఇక, అన్నాడీఎంకే కార్యాలయం తలుపులను కాలితో తన్ని పగలకొట్టిన వారి తొక్కి నలిపేద్దామని మద్దతు దారుల కు బుధవారం తాత్కాలిక ప్రధాన కార్యదర్శి పళని స్వామి పిలుపు నివ్వడంతో ఇద్దరు నేతల మధ్య వివాదం మరింత ముదిరే అవకాశం ఉంది. ఇది కూడా చదవండి: శివసేన నుంచి మరో సీఎం వస్తారు.. బీజేపీ మాట తప్పడం వల్లే ఎంవీఏ పుట్టింది -
హస్తినలో పళనిస్వామికి చేదు అనుభవం.. ఇలా జరిగిందేంటి?
సాక్షి, చెన్నై: ఢిల్లీ వెళ్లిన అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి ఎడపాడి పళనిస్వామికి ప్రధాని నరేంద్ర మోదీ అపాయింట్మెంట్ దక్కనట్లు తెలుస్తోంది. దీంతో ఆదివారం ఆయన చెన్నైకు తిరిగి వచ్చేశారు. ఈ పరిస్థితుల్లో పన్నీరు సెల్వం ఓ అడుగు ముందుకు వేసి, 14 జిల్లాలకు అన్నాడీఎంకే కార్యదర్శులను నియమిస్తూ ప్రకటన విడుదల చేయడం గమనార్హం. అన్నాడీఎంకేలో పళనిస్వామి, పన్నీరు సెల్వం మధ్య సాగుతున్న వివాదం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ ఇద్దరు నేతలు ఎత్తుకు పైఎత్తు వేస్తూ ముందుకు సాగుతున్నారు. ఒకర్ని మరొకరు అన్నాడీఎంకే నుంచి తొలగిస్తూ.. ఇప్పటికే పలు ప్రకటనలు విడుదల చేశారు.ఈ పరిస్థితుల్లో పళనిస్వామికి ఢిల్లీ నుంచి ఆహా్వనం రావడంతో ఇక, పన్నీరు సెల్వంకు కేంద్రం అండదండాలు కరువైనట్లే అన్న చర్చజోరందుకుంది. తిరుగు పయనం రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపదీ ముర్మును పళనిస్వామి బృందం శనివారం మర్యాదపూర్వకంగా కలిసింది. ఆమెకు శుభాకాంక్షలు తెలియజేసింది. అలాగే రామ్నాథ్ కోవింద్ వీడ్కోలు కార్యక్రమానికి కూడా పళని స్వామి హాజరయ్యారు. ఇక ఆదివారం ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిసేందుకు పళని స్వామి బృందం ప్రయత్నాలు చేసింది. అయితే, అపాయింట్మెంట్ లభించకపోవడంతో వారంతా తిరిగి చెన్నైకు వచ్చేశారు. అదే సమయంలో పళని స్వామి వ్యవహరించిన తీరుపై కేంద్రం గుర్రుగా ఉన్నట్టు, అందుకే ఆయనకు అపాయింట్మెంట్ ఇవ్వనట్లు పన్నీరు సెల్వం శిబిరం చెబుతుండడం గమనార్హం. ఇక ఈనెల 28వ తేదీ చెస్ ఒలంపియాడ్ నిమ్తితం చెన్నైకు రానున్న ప్రధాని నరేంద్ర మోదీ అన్నాడీఎంకేలో విభేదాలకు ముగింపు పలికే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇద్దరూ ఒకేసారిగా తనను కలవాలనే ఆదేశాలు ఢిల్లీ నుంచి పన్నీరు, పళనికి వేర్వేరుగా వచ్చినట్లు సమాచారం. కొత్త కార్యదర్శులను నియమించిన పన్నీరు తన మద్దతుదారులు 14 మందిని అన్నాడీఎంకే కార్యదర్శులుగా నియమిస్తూ పన్నీరు సెల్వం ఆదివారం ప్రకటన చేశారు. చెన్నై పరిధిలోని నాలుగు జిల్లాలకు, కోయంబత్తూరు, రామనాథపురం తదితర జిల్లాలకు కార్యదర్శులను నియమించారు. ఇందులో ఎంపీ ధర్మర్ను రామనాథపురం జిల్లా కార్యదర్శి, కోవై సెల్వరాజ్ను కోవై నగర కార్యదర్శిగా నియమించారు. ఇదిలా ఉండగా పన్నీరు సెల్వంపై పళని వర్గం నేత, ఎంపీ సీవీ షన్ముగం ఇచ్చిన ఫిర్యాదుపై చెన్నై పోలీసులు కేసు నమోదుకు సిద్ధమవుతోన్నట్లు తెలుస్తోంది. అన్నాడీఎంకే కార్యాలయంలో వస్తువులు మాయమైనట్లుగా సీవీ షన్ముగం ఇచ్చిన ఫిర్యాదుపై న్యాయ నిపుణులతో ఆదివారం చెన్నై పోలీసులు చర్చించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇది కూడా చదవండి: కూతురిపై ఆరోపణలు.. కాంగ్రెస్ నేతలకు స్మృతి ఇరానీ లీగల్ నోటీసులు -
అన్నాడీఎంకే పంచాయతీ: ఢిల్లీలో పళని.. గల్లీలో పన్నీర్
సాక్షి ప్రతినిధి, చెన్నై: అన్నాడీఎంకేపై పట్టు సాధించిన పళనిస్వామి ఢిల్లీలో ప్రధాని మోదీ సహా పలువురు నేతలను కలుసుకుంటూ బిజీబిజీగా గడుపుతున్నారు. ఇక పార్టీ అంతర్గత పోరులో వెనుకబడిన పన్నీరు సెల్వం చెన్నైలో ఉంటూ పిటీషన్ల పర్వం కొనసాగిస్తున్నారు. నేపథ్యం ఇదీ.. ఎడపాడి పళనిస్వామి, ఓ పన్నీర్సెల్వం మధ్య భగ్గుమన్న విబేధాలు అన్నాడీఎంకే చీలికదిశగా సాగు తు న్నాయి. తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఈపీఎస్ ఎన్నికైన∙వెంటనే పనిలోపనిగా ఓపీఎస్ పనిపట్టడం ప్రారంభించారు. పన్నీర్, ఆయన ఇద్దరు కుమారులు రవీంద్రనాథ్, జయప్రదీప్ ఇతర మద్దతుదారులపై శాశ్వత బహిష్కరణ వేటు వేశారు. అంతేగాక కోశాధికారి పదవి నుంచి పన్నీర్ను తప్పించి, అన్నాడీఎంకే బ్యాంకు ఖాతాలను తన ఆధీనంలోకి తెచ్చుకున్నారు. పన్నీర్ కుమారుడైన తేనీ లోక్సభ సభ్యుడు రవీంద్రనా«థ్కు అన్నాడీఎంకే పార్లమెంటరీ నేత హోదా నుంచి కూడా తప్పించాలని కోరుతూ లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు ఎడపాడి ఇటీవల లేఖ రాశారు. పార్టీ కార్యాల యం ధ్వంసం చేసి, ఖరీదైన వస్తువులను, కొన్ని పత్రా లను అపహరించినట్లుగా ఎడపాడి మద్దతుదారైన సీవీ షణ్ముగం ఆరోపించారు. ఇందుకు బాధ్యులైన ఓపీఎస్, వైద్యలింగం, మనోజ్పాండియన్ సహా 9 మందిపై చర్య తీసుకోవాలని కోరుతూ చెన్నై రాయపేట పోలీస్స్టేషన్లో శనివారం ఆయన ఫిర్యాదు చేశారు. బిజీబిజీగా ఓపీఎస్ రాష్ట్రంలో పరిస్థితులను పక్కనబెట్టి.. ఎడపాడి పళనిస్వామి దేశ రాజధానిలో పర్యటిస్తున్నారు. శుక్రవారం రాత్రి ఢిల్లీకి చేరుకున్న ఈపీఎస్ శనివారం ఢిల్లీ పెద్దలను కలవడం మొదలుపెట్టారు. ఇటీవల జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో గెలుపొందిన ద్రౌపది ముర్మును కలిసి అభినందనలు తెలిపారు. అలాగే, శుక్రవారం రాత్రి ఢిల్లీలో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ వీడ్కోలు విందులో పాల్గొన్నారు. ఇదే సమయంలో ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్షాను కలుసుకున్నారు. ఎడపాడి ఢిల్లీలో మరో రెండురోజులుండి పార్టీలో చోటుచేసుకున్న పరిణామాలు, పన్నీర్ వైఖరిని మోదీకి వివరించనున్నట్లు తెలిసింది. కాగా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ వీడ్కోలు, కొత్త రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పదవీ ప్రమాణ సభలకు ఎడపాడిని మాత్రమే కేంద్రం ఆహ్వానించినట్లు ప్రధాన ప్రతిపక్ష ఉపనేత ఆర్బీ ఉదయ్కుమార్ మీడియాకు తెలిపారు. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఎడపాడిని కేంద్రం అంగీకరించినట్లు భావించాల్సి ఉంటుందని ఆయన అన్నారు. స్పీకర్కు ఓపీఎస్ లేఖ తనను అన్నాడీఎంకే నుంచి తొలగించినట్లుగా ఎడపాడి రాసిన లేఖను పరిగణనలోకి తీసుకోవద్దని లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు ఓ పన్నీర్సెల్వం, తేనీ ఎంపీ రవీంద్రనాథ్ శనివారం ఓ లేఖ పంపారు. ఈపీఎస్ను తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఎంపిక చేసుకున్న అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశం చెల్లదనే వివాదం న్యాయస్థానంలో విచారణ దశలో ఉందని, ఇదే అంశంపై ఎన్నికల కమిషన్కు ఓపీఎస్ రాసిన ఉత్తరం పరిశీలనలో ఉందని అందులో పేర్కొన్నారు. ఈసీ రికార్డుల్లో పార్టీ కన్వీనర్గా పన్నీర్సెల్వమే ఉన్నారని గుర్తు చేశారు. ఆయన అనుమతి లేకుండా, పార్టీ విధి విధానాలకు వ్యతిరేకంగా ఈనెల 11వ తేదీన నిర్వహించిన సర్వసభ్య సమావేశానికి చట్టబద్ధత లేదని లేఖలో స్పష్టం చేశారు. బ్యాంకు ఖాతాలు సీజ్ చేయాలి కాగా అన్నాడీఎంకే బ్యాంకు ఖాతాలను సీజ్ చేయాలని ఆ పార్టీ కన్వీనర్ హోదాలో ఓ పన్నీర్సెల్వం రిజర్వు బ్యాంకు చెన్నై మండల డైరెక్టర్కు శనివారం లేఖ రాశారు. పార్టీ ప్రధాన కార్యదర్శి వ్యవహారంలో ఎన్నికల కమిషన్ ఓ నిర్ణయానికి వచ్చే వరకు అన్నాడీఎంకేకు చెందిన ఏడు బ్యాంకు ఖాతాలను తక్షణం స్తంభింపజేయాలని కోరారు. ఈసీ రికార్డుల్లో తానే కన్వీనర్, కోశాధికారినని, ఇందుకు సంబంధించిన రికార్డులను ఇప్పటికే ఈసీకి సమర్పించానని అందులో స్పష్టం చశారు. -
తవ్వేకొద్దీ అవినీతి.. కట్టలు కట్టలుగా డబ్బులు,కళ్లు తిరిగేలా బంగారం!
సాక్షి ప్రతినిధి, చెన్నై: ప్రతిపక్ష నాయకుడు ఎడపాడి పళనిస్వామికి సన్నిహితుడైన కాంట్రాక్టరు ఇళ్లు, కార్యాలయాల్లో ఆదాయపు పన్నుశాఖ అధికారుల తనిఖీలు గురువారం కూడా కొనసాగాయి. ఎడపాడికి.. మదురైకి చెందిన మురుగవేల్, ఆయన కుమారులు అత్యంత సన్నిహితులు. ఎడపాడి ద్వారా 2016 నుంచి వేల కోట్ల రూపాయల కాంట్రాక్టు పనులు పొంది భారీస్థాయిలో ఆర్జించారు. అయితే ఆదాయపు పన్ను ఎగవేసినట్లు సమాచారం అందడంతో ఐటీ అధికారులు బుధవారం ఆకస్మిక దాడులకు దిగారు. తవ్వేకొద్దీ అవినీతి బయటపడటంతో రెండోరోజైన గురువారం కూడా తనిఖీలు కొనసాగించారు. మదురై, దిండుగల్లు జిల్లాల్లో 15కు పైగా భవన నిర్మాణ కంపెనీల నుంచి రూ.27 కోట్ల నగదు, 3 కిలోల బంగారు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. చదవండి: పెళ్లై 40 రోజులు.. ఏమైందో ఏమో.. బయటకు వెళ్తున్నానని చెప్పి! -
హైకోర్టు సంచలన తీర్పు.. తమిళనాట పాలి‘ట్రిక్స్’లో ట్విస్ట్
సాక్షి ప్రతినిధి, చెన్నై: అన్నాడీఎంకేలో నంబర్–1 అనే స్థాయికి పళనిస్వామి చేరుకుంటున్నారు. ఆధిపత్యపోరులో ప్రత్యర్థులపై పైచేయి సాధిస్తూ వస్తున్న ఆయనకు తాజాగా మరో విజయం దక్కింది. పార్టీ ప్రధాన కార్యాలయం సీలును తొలగించాలని, కార్యాలయం తాళాన్ని ఎడపాడికి అప్పగించాలని మద్రాసు హైకోర్టు బుధవారం ఆదేశించింది. ఎడపాడి పళనిస్వామి, పన్నీర్సెల్వం మధ్య గత కొంతకాలంగా నువ్వా..నేనా అంటూ సాగుతున్న పోరు అనేక మలుపులు తిరుగుతోంది. ఈనెల 11వ తేదీన జరిగిన అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశంలో ఎడపాడి తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఎంపికై పన్నీర్ దూకుడుకు పగ్గాలు వేశారు. ఇక ఆ తరువాత పన్నీర్, ఆయన ఇద్దరు కుమారులు, అనుచవర్గంలోని కొందరిపై బహిష్కరణ వేటు కూడా పడింది. ఎడపాడిని కట్టడిచేసేందుకు అదేరోజున పన్నీర్, ఆయన అనుచరవర్గం చెన్నై రాయపేటలోని పార్టీ ప్రధాన కార్యాలయంపై దాడికి దిగింది. ఈ సమాచారం అందుకున్న ఎడపాడి మద్దతుదారులు పన్నీర్ వర్గంతో తలపడ్డారు. పలువురు గాయపడటం, పోలీసుల లాఠీచార్జీతో పార్టీ కార్యాలయ పరిసరాలు రణరంగాన్ని తలపించాయి. శాంతి భద్రతల సమస్యలు వస్తాయనే అనుమానంతో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని అన్నాడీఎంకే కార్యాలయానికి సీలు వేసింది. సీలు తొలగించాలని ఈపీఎస్, ఓపీఎస్ వేర్వేరుగా మద్రాసు హైకోర్టులో వేసిన పిటిషన్ బుధవారం విచారణకు వచ్చింది. ఎడపాడికి అప్పగింత–ఆనందోత్సాహాలు ఇరుపక్షాల వాదనలను విన్న న్యాయస్థానం..అన్నాడీఎంకే కార్యాలయానికి వేసిన సీలును తొలగించాలని బుధవారం తీర్పు చెప్పింది. అయితే పార్టీ కార్యకర్తలు నెలరోజులపాటూ కార్యాలయానికి రాకూడదని షరతు విధించింది. కోర్టు తీర్పుపై ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఎడపాడి వర్గీయులకు ఆనందం మిన్నంటింది. అన్నాడీఎంకే ఎంజీఆర్ యువజన విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి డాక్టర్ సునీల్ నాయకత్వంలో వందలాది కార్యకర్తలు, మహిళా కార్యకర్తలు చెన్నై అడయార్ గ్రీన్వేస్ రోడ్డులో విజయోత్సాహంతో చిందులు వేశారు. ఎంజీఆర్, జయలలిత, ఎడపాడి చిత్రపటాలను చేతబూని ర్యాలీ నిర్వహించారు. క్యాంప్ ఆఫీస్కు చేరుకుని ఎడపాడిని అభినందనలతో ముంచెత్తారు. ఇక కోర్టు తీర్పుతో పన్నీర్ మద్దతుదారులు డీలా పడిపోయారు. ఇది కూడా చదవండి: యూపీ సర్కార్కు బిగ్ షాక్.. ఏకంగా మంత్రి రాజీనామా -
తమిళనాడు పాలిటిక్స్లో ట్విస్ట్.. పన్నీర్సెల్వానికి బిగ్ షాక్
Panneerselvam.. పన్నీర్సెల్వం రాజకీయ జీవితంలో ఉద్వాసనల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే ఆయన అన్నాడీఎంకే కోశాధికారి పదవి, ప్రాథమిక సభ్యత్వంతో సహా పార్టీ నుంచి శాశ్వత బహిష్కరణకు గురయ్యారు. ఇక తాజాగా ప్రతిపక్ష ఉప నాయకుడిగా ఆర్బీ ఉదయకుమార్ ఎంపిక కావడంతో పన్నీర్ చేతి నుంచి ఈ పదవి కూడా చేజారిపోయే పరిస్థితులు నెలకొన్నాయి. సాక్షి ప్రతినిధి, చెన్నై: అన్నాడీఎంకేలో గందరగోళ పరిస్థితులు కొనసా..గుతూనే ఉన్నాయి. తాజాగా ఆ పార్టీ నుంచి రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష ఉప నాయకుడిగా ఆర్బీ ఉదయకుమార్ ఎంపికయ్యారు. ఈయన ఎడపాడి పళనిస్వామి వర్గానికి చెందిన నాయకుడు. ఇందుకు సంబంధించిన పత్రాన్ని స్పీకర్ అప్పావుకు ఎస్పీ వేలుమణి బుధవారం అందజేశారు. దీంతో ఇప్పటి వరకు ఈ స్థానంలో ఉన్న పన్నీర్సెల్వం పదవీచ్యుతులయ్యే అవకాశం ఉంది. కాగా ఈనెల 11వ తేదీ అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశంలో ఎడపాడి పళనిస్వామి తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఎంపికకాగా, పన్నీర్సెల్వంను శాశ్వతంగా బహిష్కరించారు. అదే సమయంలో కోశాధికారి పదవి, ప్రాథమిక సభ్యత్వం నుంచి కూడా ఓపీఎస్ను తప్పించారు. అతని మద్దతుదారులపై కూడా వేటు వేశారు. ఉన్న ఆ ఒక్క పదవీ..? ప్రస్తుతం పన్నీర్సెల్వం చేతులో ప్రస్తుతం ఉండేది ప్రతిపక్ష ఉప నాయకుడి పదవి మాత్రమే. పార్టీ బహిష్కరణ వేటు వేసినా.. ప్రజాప్రతినిధిగా పన్నీరు సెల్వం అసెంబ్లీలో కొనసాగే అవకాశం మాత్రం ఉంటుంది. దీంతో ఎడపాడి ఆలోచనలో పడ్డారు. ఆ పదవి నుంచి కూడా పన్నీర్ను ఎలాగైనా తప్పించేందుకు కొన్నిరోజులుగా ప్రయత్నాలు సాగిస్తున్నారు. పన్నీర్స్థానంలో ప్రత్యామ్నాయ నేత కోసం చెన్నై అడయారులోని ఓ ప్రయివేటు హోటల్లో ఎడపాడి మంగళవారం సమావేశమయ్యారు. అనంతరం ఉదయకుమార్ పేరును ఖరారు చేశారు. ఈ నిర్ణయానికి సంబంధించి ఎడపాడి పళనిస్వామి బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈనెల 17వ తేదీన అన్నాడీఎంకే శాసనసభ పక్ష సమావేశం నిర్వహించి, ప్రతిపక్ష ఉప నాయకుడిగా తిరుమంగలం నియోజకవర్గ ఎమ్మెల్యే ఆర్బీ ఉదయకుమార్ను ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు. తరువాత మాజీ మంత్రి ఎస్పీ వేలుమణి చెన్నై సచివాలయంలో స్పీకర్ అప్పావును కలిసి ఉదయకుమార్ నియామకపత్రాన్ని అందజేశారు. ఈసీ, కోర్టు తీర్పు పైనే.. అన్నాడీఎంకే నుంచి పన్నీర్సెల్వం, వైద్యలింగం, మనోజ్ పాండియన్ను తొలగించినందున వారిని అధికారికంగా అన్నాడీఎంకే ఎమ్మెల్యేలుగా పరిగణించే పరిస్థితి ఉండదు. అయితే ఈ అంశంపై ఓపీఎస్ కోర్టు, ఎన్నికల కమిషన్లో పిటిషన్లు వేసి ఉన్నందున ఆ రెండు చోట్ల నుంచి స్పష్టత వచ్చేవరకు ఎమ్మెల్యేల గుర్తింపుపై స్పీకర్ ఓ నిర్ణయం తీసుకునే అవకాశం లేదు. అలాగే ప్రతిపక్ష ఉప నాయకుడి పదవి ఈ విషయంలోనూ ఏకపక్ష నిర్ణయానికి తావులేకుండా చట్ట ప్రకారం నడుచుకుంటానని స్పీకర్ అప్పావు తెలిపా రు. ఎస్పీవేలుమణి ఓ ఉత్తరం అందజేశారని, అయితే అంతకు ముందే పన్నీర్సెల్వం సమరి్పంచిన వినతిపత్రం పరిశీలనతో ఉందని ఆయన పేర్కొన్నారు. ముందస్తు బెయిల్ కోసం.. అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయం వద్ద ఈనెల 11వ తేదీన చోటుచేసుకున్న ఘర్షణల నేపథ్యంలో ఈపీఎస్, ఓపీఎస్ వర్గాల కార్యకర్తలకు పోలీసులు సమన్లు పంపారు. వీటిలో పేర్కొన్న ప్రకారం చెన్నై రాయపేట పోలీస్స్టేషన్లో ఓపీఎస్కు చెందిన 30 మంది బుధవారం హాజరుకాలేదు. అరెస్ట్ చేసే అవకాశం ఉండడంతో వారు ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు. ఇక 12 మంది పళనిస్వామి మద్దతుదారులు కూడా గురువారం పోలీస్స్టేషన్లో హాజరు కావాల్సి ఉంది. అయితే ఎడపాడి వర్గం కూడా బుధవారం ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసినట్లు తెలియడంతో.. వారు సైతం విచారణకు హాజరయ్యే అవకాశం ఉండదని భావిస్తున్నారు. -
పొలిటికల్ వార్: పన్నీరు సెల్వానికి ఊహించని షాకిచ్చిన పళనిస్వామి
పన్నీర్ సెల్వంను పార్టీ నుంచి తప్పించేందుకు పళనిస్వామి యత్నిస్తున్నారా? అవుననే సమాధానం అన్నాడీఎంకేలో వినిపిస్తోంది. ఇప్పటికే పన్నీర్సెల్వం, ఆయన అనుచరులపై బహిష్కరణ వేటు వేసిన పళనిస్వామి, ప్రధాన ప్రతిపక్ష ఉపనేత హోదా నుంచి తొలగించే యత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో పన్నీర్ సెల్వం తన ఉనికి కాపాడుకునేందుకు తన మద్దతుదారులతో మూడోసారి అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది. సాక్షి ప్రతినిధి, చెన్నై : ఐదేళ్లకు ఒకసారి జరగాల్సిన అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశం ‘చెల్లికి మళ్లీ మళ్లీ పెళ్లి’లా తయారైంది. జూన్ 23వ తేదీ, జూలై 11వ తేదీ సర్వసభ్య సమావేశం జరగ్గా, తన వర్గీయులతో మూడోసారి సర్వసభ్య సమావేశానికి పన్నీర్ సెల్వం సన్నాహాలు మొదలుపెట్టారు. అన్నాడీఎంకేలో చోటుచేసుకున్న ఏక నాయకత్వం వివాదంపై ఎట్టకేలకూ ఎడపాడి పళనిస్వామి పైచేయి సాధించి తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఎంపికయ్యారు. పదవి చేపట్టడమే అదనుగా పన్నీర్ సెల్వం, ఆయన మద్దతుదారులను పార్టీ నుంచి బహిష్కరించారు. పొన్నయ్యన్ ఆడియోపై నమ్మకం ఇటీవల మాజీ మంత్రి పొన్నయన్ పేరున విడుదలైన ఆడియో కలకలం రేపింది. ఎడపాడి నెంబర్ గేమ్ ఆడుతున్నారని, ఆయనకు పార్టీ క్యాడర్లో పెద్ద బలం లేదంటూ వ్యాఖ్యానించడం ఆ పార్టీలో దుమారం రేపింది. దీనిపై అప్రమత్తమైన ఎడపాడి పార్టీలో కొత్త టీమ్ను నియమించి పొన్నయ్యన్ను ప్రాధాన్యత లేని పదవిలోకి నెట్టారు. పొన్నయ్యన్ మాటలను విశ్వసిస్తున్న పన్నీర్ సెల్వం తన మద్దతుదారులతో మరోసారి సర్వసభ్య సమావేశం నిర్వహించడంపై చర్చిస్తున్నారు. ఎడపాడి పళనిస్వామి నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో నెలకొన్న ఉద్రిక్తత ఇంకా సద్దుమణగకముందే పన్నీర్సెల్వం మరోసారి సన్నద్ధం కావడం చర్చనీయాంశమైంది. ఎడపాడి వైపు ఉన్నట్లుగా చెబుతున్న కార్యవర్గ సభ్యులకు గాలంవేయాలని భావిస్తున్నారు. ఇందుకు సంబంధించి తుది నిర్ణయాన్ని త్వరలో ఓపీఎస్ ప్రకటిస్తారని తెలుస్తోంది. పార్టీలోని ముఖ్యనేతలను పదవుల నుంచి ఎడపాడి తప్పించిన అంశాన్ని కూడా చర్చించాలని ఆలోచిస్తున్నారు. కేవలం నెలరోజుల వ్యవధిలో ఇప్పటికే రెండుసార్లు సర్వసభ్య సమావేశం జరుగగా, పన్నీర్ ప్రయత్నాలు ఫలిస్తే అది మూడో సర్వసభ్య సమావేశం అవుతుంది. కుట్రలో భాగంగానే తాళం అన్నాడీఎంకేలో నెలకొన్న పరిస్థితులను సీఎం స్టాలిన్ అవకాశంగా తీసుకుని తమ పార్టీకి శాశ్వతంగా తాళం వేసేందుకు యత్నిస్తున్నారని ఆ పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శి ఎడపాడి పళనిస్వామి ఆరోపించారు. అన్నాడీఎంకేను భూస్తాపితం చేసేందుకు ద్రోహులతో స్టాలిన్ చేతులు కలిపారని, అందుకే తమ పార్టీ కార్యాలయానికి సీలు వేశారని విమర్శించారు. పన్నీర్సెల్వం సైతం అన్నాడీఎంకేను అణచివేయాలని కాచుకుని ఉన్నారని, అయితే ఆయన ఆశయం నెరవేరదని ఎడపాడి వ్యాఖ్యానించారు. పోటాపోటీగా వినతిపత్రాలు ప్రధాన ప్రతిపక్ష ఉపనేత హోదాను సైతం పన్నీర్సెల్వం నుంచి లాక్కునే ప్రయత్నాలు మొదలయ్యాయి. ఈ పదవిపై ఓపీఎస్, ఈపీఎస్ వేర్వేరుగా అసెంబ్లీ స్పీకర్కు వినతిపత్రాలు సమరి్పంచారు. ప్రధాన ప్రతిపక్ష ఉపనేత ఎంపికకై ఎమ్మెల్యేలతో ఈనెల 17వ తేదీ ఎడపాడి సమావేశం అవుతున్నారు. విధి విధానాలను అనుసరించి స్పీకర్ అప్పావుకు ఈ సమాచారం ఇవ్వనున్నారు. -
పన్నీర్ సెల్వానికి మరో షాక్.. ఇద్దరు కుమారులపైనా వేటు
చెన్నై: తమిళనాడు ప్రతిపక్ష అన్నాడీఎంకే పార్టీ నేత, మాజీ ముఖ్యమంత్రి ఓ పన్నీర్ సెల్వానికి(ఓపీఎస్) మరో షాక్ తగిలింది. అన్నాడీఎంకే పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి ఓపీఎస్ను తొలగించిన కొద్ది రోజుల్లోనే ఆయన కుమారులు సహా మరో 16 మందిపై బహిష్కరణ వేటు వేశారు పార్టీ తాత్కాలిక జనరల్ సెక్రెటరీ పళనిస్వామి(ఈపీఎస్). క్రమశిక్షణ చర్యల్లో భాగంగా పన్నీరు సెల్వం వర్గంపై వేటు వేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. పన్నీరు సెల్వం కుమారులైన.. థేని లోక్సభ నియోజకవర్గ సభ్యుడు రవీంద్రనాథ్, జయప్రదీప్, మాజీ మంత్రి వెల్లమండి ఎన్ నటరాజన్లను బహిష్కరించినట్లు పార్టీ తెలిపింది. వారితో పాటు శాసనసభ మాజీ సభ్యులు, ఎంపీలు మొత్తం మరో 15 మంది ఉన్నారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు పళనిస్వామి. మొత్తం 18 మందిపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నామని, వారంతా పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. అందుకే వారి ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేయాల్సి వచ్చినట్లు చెప్పారు. కొద్ది రోజుల క్రితం నిర్వహించిన పార్టీ సర్వసభ్య సమావేశంలో.. ద్వంద్వ నాయకత్వాన్ని రద్దు చేశారు. పార్టీకి ఏకైక తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా పళనిస్వామి(ఈపీఎస్)ను ఎన్నుకున్నారు. దీంతో పార్టీ పగ్గాలు పళనిస్వామి చేతుల్లోకి చేరాయి. పన్నీర్ సెల్వాన్ని పార్టీ ముఖ్య పదవులు, సభ్యంత్వం నుంచి తొలగిస్తూ అన్నాడీఎంకే జనరల్ కౌన్సిల్ తీర్మానించింది. ఓపీఎస్పై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకుంది. ఇదీ చూడండి: AIADMK General Body Meet: పన్నీర్ సెల్వానికి భారీ షాక్.. పళనికి పార్టీ పగ్గాలు -
పళనిస్వామికి కొత్త తలనొప్పి.. కలకలం రేపిన రహస్య సంభాషణ
సాక్షి ప్రతినిధి, చెన్నై: మొన్నటి వరకు పన్నీర్సెల్వంతో పోరాడిన ఎడపాడి పళనిస్వామికి కొత్త తలనొప్పి వచ్చిపడింది. పార్టీ నుంచి పొన్నయ్యన్ను బహిష్కరించాలని మాజీ మంత్రులు కొందరు అప్పుడే నిరసన గళం విప్పారు. కన్యాకుమారి జిల్లాకు చెందిన పార్టీ ప్రముఖుడొకరు పొన్నయన్తో రహస్య సంభాషణ చేసినట్లుగా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న ఆడియో, ఆయనను బహిష్కరించాలనే డిమాండ్ ఎడపాడిని ఇరుకునపెట్టింది. చదవండి: మరో కొత్త వివాదం.. అన్నాడీఎంకే ఖజానాపై ‘వారిద్దరి’ కన్ను ఆడియోలోని వివరాలు.. మాజీ మంత్రి కేపీ మునుస్వామి డీఎంకే మంత్రి దురైమురుగన్ సిఫార్సుతో క్వారీల కాంట్రాక్టు పొంది నెలకు రూ.2 కోట్లు సంపాదిస్తున్నట్లు, అలాగే మాజీ మంత్రి తంగమణి సైతం తన అక్రమాస్తులను ఏసీబీ దాడుల నుంచి కాపాడుకునేందుకు సీఎం స్టాలిన్కు మద్దతుగా వ్యవహరిస్తున్నారని, మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యుడు సీవీ షణ్ముగం గురించి విమర్శలు చేసినట్లు, ఎంజీఆర్, జయలలితల గురించి అమర్యాదగా మాట్లాడినట్లు ఆ సంభాషణల్లో ఉన్నాయి. అంతేగాక తంగమణి, వేలుమణి దొంగలు, డబ్బు, కాంట్రాక్టులు ఇచ్చి 42 మంది ఎమ్మెల్యేలను గుప్పిట్లో పెట్టుకున్నారని, వాస్తవానికి ఎడపాడికి కేవలం 9 మంది ఎమ్మెల్యేలు మాత్రమే మద్దతు పలుకుతున్నారని కూడా మాట్లాడారు. ఈ కారణంగా పొన్నయ్యన్ను పార్టీ నుంచి బహిష్కరించాలని ఎడపాడిపై మాజీ మంత్రులు ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ఆడియో సంభాషణలను పొన్నయ్యన్ ఖండించారు. సాంకేతిక పరిజ్ఞానంతో తన గొంతుకను ప్రచారంలోకి తెచ్చారని ఆరోపించారు. మాజీ మంత్రులపై తాను తప్పుగా మాట్లాడలేదని పేర్కొన్నారు. అయితే, మొత్తం ఈ ఆడియోల వివాదం కోర్టుకెక్కగా గురువారం విచారణ జరగనుంది. పన్నీర్, శశికళపై నిఘా పార్టీ పగ్గాలు చేజారిపోవడంతో పన్నీర్సెల్వం, శశికళ ఏకంకావాలని ప్రయత్నాలు జరుగుతున్నట్లు అన్నాడీఎంకే నేతలు అనుమానిస్తున్నారు. వీరిద్దరూ రహస్యంగా కలుసుకుని మంతనాలు సాగిస్తున్నారనే సమాచారం అందడంతో నిఘాపెట్టి రెడ్ హ్యాండెడ్గా పట్టుకునేలా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎడపాడిపై జరుపుతున్న న్యాయపోరాటంలో నెగ్గకుంటే మరో మార్గంలో రాజకీయంగా దెబ్బకొట్టేందుకు పన్నీర్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే అదనుగా పన్నీర్ను తమవైపు తిప్పుకోవాలని కొందరు, జయ అన్న కుమార్తె, కుమారులైన దీప, దీపక్ పన్నీర్సెల్వంను ఇంటికి విందుకు ఆహా్వనించినట్లు కూడా ప్రచారం జరుగుతోంది. ఈ విందుకు శశికళను కూడా ఆహ్వానిస్తాం, కలిసి కొత్త పార్టీ స్థాపించి ఎడపాడి ఎత్తుగడలను చిత్తుచేయవచ్చని పన్నీర్కు గాలం వేస్తున్నట్లు సమాచారం. అయితే ప్రచారాన్ని ఓపీఎస్ వర్గీయులు నిర్ధారించడం లేదు. 17న ఎమ్మెల్యేలతో ఎడపాడి సమావేశం పారీ్టలో ఇంతటి గందరగోళ పరిస్థితులు కొనసాగుతుండగా ఈనెల 17వ తేదీన ఎమ్మెల్యేలతో ఎడపాడి పళనిస్వామి సమావేశం నిర్వహిస్తున్నారు. 18వ తేదీన రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్, పన్నీర్ బహిష్కరణతో ప్రధాన ప్రతిపక్ష ఉపనేత పదవి భర్తీపై ఆనాటి సమావేశంలో చర్చించనున్నారు. అత్యవసర విచారణకు నో అన్నాడీఎంకే కార్యాలయానికి వేసిన సీలును తొలగించాలని కోరుతూ వేసిన పిటిషన్ను అత్యవసర కేసుగా విచారించాలని ఎడపాడి పళనిస్వామి, ఓ పన్నీర్సెల్వం తరపున చేసిన అభ్యర్థనను మద్రాసు హైకోర్టు నిరాకరించింది. ఈ పిటిషన్లు బుధవారం విచారణకు రాగా, ఎడపాడి తరపున పిటిషన్ వేసింది ఎమ్మెల్యే కావడం వల్ల ప్రధాన న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లి సాధారణ కేసుగా జాబితాలో చేరుస్తామని తెలిపారు. ఇక పన్నీర్సెల్వం తరపున దాఖలైన పిటిషన్పై కూడా ఆదే విధానాన్ని అనుసరిస్తామని స్పష్టం చేశారు. -
Tamil Nadu: నాలుగు స్తంభాలాట
అనుకున్నంతా అయింది. ఎంజీఆర్ సారథ్యంలో, ఆ తరువాత జయలలిత నాయకత్వంలో తమిళనాట తిరుగులేని రీతిలో చక్రం తిప్పిన రాజకీయ పార్టీ ప్రతిష్ఠ అలాంటి బలమైన నేతలు లేక క్రమంగా మసక బారుతోంది. అంతర్గత కలహాలతో ‘అఖిల భారత అన్నా ద్రావిడ మున్నేట్ర కజగం’ (అన్నాడీఎంకే) అల్లాడుతోంది. మాజీ సీఎం, నిన్నటి దాకా అన్నాడీఎంకే సమన్వయకర్త, కోశాధికారి అయిన ఓ. పన్నీర్ సెల్వమ్ (ఓపీఎస్)ను బహిష్కరిస్తూ, పార్టీపై పెత్తనాన్ని ప్రత్యర్థి ఈడపాడి కె. పళనిస్వామి (ఈపీఎస్) సోమవారం చేజిక్కించుకోవడం ఆ పార్టీ ఇంటిపోరులో తాజా పరిణామం. తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఎంపికై పార్టీపై పట్టు బిగించిన పళనిస్వామి, తనకంటూ బలమైన వర్గం సృష్టించుకోలేకపోయిన పన్నీర్ సెల్వమ్, తగిన సమయం కోసం కాచుకుకూర్చున్న శశికళ, అన్నాడీఎంకే నేతల్ని గుప్పెట పెట్టుకొని తమిళనాట బలం పుంజుకోవాలని చూస్తున్న బీజేపీలతో తమిళనాట ఆసక్తికరమైన నాలుగు స్తంభాలాట మొదలైంది. జయలలిత పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చిన రెండుసార్లూ, ఆమె ఆసుపత్రిలో చావుబతు కుల మధ్య ఉన్నప్పుడు మరోసారీ – మొత్తం మూడుసార్లు ముఖ్యమంత్రిగా చేసిన పన్నీర్ ఇప్పుడు తన ఉనికిని కాపాడుకొనేందుకు పోరాడాల్సిన పరిస్థితి. ఆ మాటకొస్తే పార్టీకి ఒకే నాయకత్వం పేరిట పన్నీర్ను సాగనంపేందుకు ప్రత్యర్థి వర్గం కొంతకాలంగా ప్రయత్నిస్తూనే ఉంది. దాన్ని అడ్డుకొనేందుకు ఆయన కోర్టులను ఆశ్రయిస్తూ వచ్చారు. కానీ, పార్టీ జనరల్ కౌన్సిల్ తాజా భేటీకి ముందు జూన్ 23న జరిగిన సమావేశంలోనే ఒకే నాయకుడి సిద్ధాంతాన్నీ, పళనిస్వామి నేతృత్వాన్నీ 2 వేల పైచిలుకు అన్నాడీఎంకే జనరల్ కౌన్సిల్, కార్యవర్గ సభ్యుల్లో అధికశాతం ఆమోదించారు. ఒక రకంగా అప్పుడే పన్నీర్ కథ కంచికి చేరింది. కోర్టు కేసులతో జూలై 11 దాకా ఆయన లాక్కొచ్చారు. పార్టీ అంతర్గత అంశాలపై కోర్టులోనూ ఊరట దొరకలేదు. పన్నీర్ ప్రత్యర్థులదే పైచేయి అయింది. నిజానికి, 2016లో జయలలిత మరణం తర్వాత ఆమె సహచరి శశికళ పార్టీని తన చేతుల్లోకి తీసుకున్నారు. తీరా ఆమెకు నాలుగేళ్ళ జైలుశిక్ష పడడంతో 2017 ఫిబ్రవరిలో జాతకం తిరగబడింది. పగ్గాలు ఆమె నుంచి చేజారాయి. శశికళే ఉమ్మడి శత్రువుగా, ఆమెనూ, ఆమె కుటుంబాన్నీ దూరం పెట్టడానికి ఓపీఎస్, ఈపీఎస్లు చేతులు కలిపారు. భారత రాజకీయాల్లో ఎన్నడూ లేని రీతిలో ఒక పార్టీని ఇద్దరు నేతలు సంయుక్తంగా నడిపే అరుదైన ప్రయోగానికి తెర తీశారు. పార్టీనీ, అధికారాన్నీ పంచుకున్నారు. ఈపీఎస్ ముఖ్యమంత్రిగా, పార్టీ సహ–కన్వీనర్గా ఉంటే, ఓపీఎస్ ఉప ముఖ్య మంత్రిగా, పార్టీ కన్వీనర్గా ఉండాలనే ఏర్పాటు ఆ సెప్టెంబర్లో జరిగింది. నిరుడు అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమితో ప్రతిపక్షానికే పరిమితమైన వేళ ఈ అవసరార్థ మిత్రుల మధ్య అభిప్రాయ భేదాలు పూర్తిగా బయటకొచ్చాయి. అందులో తాజా అంకమే – సోమవారం నాటి జనరల్ కౌన్సిల్లో ఈపీఎస్కు పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శి సీటు, ఓపీఎస్పై బహిష్కరణ వేటు. దాదాపు 15 కి.మీల దూరంలో వానగరంలోని కల్యాణమండపంలో ఒకపక్క పార్టీ జనరల్ కౌన్సిల్ సమావేశం జరుగుతుండగానే, చెన్నై రాయపేటలోని అన్నాడీఎంకే ఆఫీసు అనేక నాటకీయ పరిణామాలకు వేదికైంది. ప్రత్యర్థులైన ఓపీఎస్ – ఈపీఎస్ వర్గాల మధ్య ఘర్షణ, తాళాలు బద్దలు కొట్టి మరీ పార్టీ కార్యాలయాన్ని పన్నీర్ వర్గీయులు కైవసం చేసుకోవడం, పోలీసుల రంగప్రవేశం, రెవెన్యూ అధికారులు వచ్చి కార్యాలయానికి సీలు వేయడం లాంటి పరిణామాలు ప్రజల్లో అన్నా డీఎంకే గౌరవాన్ని మరింత పలుచన చేశాయి. అసలైన పార్టీ ఎవరిది, పార్టీ ఆఫీసు ఎవరిది, బ్యాంకు ఖాతాలపై హక్కు ఎవరిది సహా అనేక అంశాలపై వైరివర్గాల పరస్పర ఫిర్యాదులు తాజాగా ఎన్నికల సంఘం నుంచి హైకోర్ట్ దాకా చేరాయి. రాగల కొన్ని వారాలు ఆ డ్రామా సాగనుంది. తమిళ ప్రజలు గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో స్టాలిన్ సారథ్యంలోని డీఎంకేకు పట్టం కట్టినా, ప్రతిపక్షంగా అన్నాడీఎంకేకు అప్పగించిన బాధ్యత ఈ మొత్తం వ్యవహారంతో పక్కకుపోవడమే విషాదం. సామాన్య ప్రజల సమస్యలపై అధికార డీఎంకేపై పోరాడాల్సిన అన్నాడీఎంకే గత ఏడాదిగా అది వదిలేసి, అంతర్గత విభేదాలకే పరిమితమైంది. ప్రతిపక్ష స్థానంలో ఉన్నది తానే అన్న సంగతి ఈ ద్రవిడ పార్టీ మర్చిపోవడమే అదనుగా, ఆ స్థానాన్ని దక్కించుకొనేందుకు బీజేపీ పావులు కదుపుతోంది. తల దూర్చడానికి తావివ్వని తమిళ ద్రవిడ రాజకీయాల్లో షెడ్యూల్డ్ కులానికి చెందిన సంగీత దర్శకుడు ఇళయరాజాను తాజాగా రాజ్యసభకు నామినేట్ చేసి, బలమైన సంకేతాలిస్తోంది. అన్నాడీఎంకే బలహీనపడడం డీఎంకేకు లాభమే కానీ, ఇప్పటి దాకా రెండు ద్రవిడ పార్టీల మధ్య పోరుగా ఉన్న తమిళనాట ఆ స్థానంలోకి కొత్తగా బీజేపీ లాంటివి వస్తే దీర్ఘకాలంలో నష్టమే. ఇక, కార్యవర్గంలో మెజారిటీ ఉన్నా, రేపు కార్యకర్తల్లోనూ, ప్రజల్లోనూ అంతే బలం పళని స్వామి నిరూపించుకుంటారా అన్నదీ వేచిచూడాలి. పళనిపై ప్రతీకారంతో తన సామాజిక వర్గానికే చెందిన శశికళతో పన్నీర్ చేతులు కలిపితే కథ కొత్త మలుపు తిరుగుతుంది. ఎవరు ఎవరిపై పైచేయి సాధిస్తారన్నది పక్కన పెడితే, సరిగ్గా 50 ఏళ్ళ క్రితం కోశాధికారిగా లెక్కలడిగినందుకు కరుణానిధి సారథ్యంలోని నాటి డీఎంకే నుంచి బహిష్కృతుడైన ఎంజీఆర్ స్థాపించిన అన్నాడీఎంకే భవిష్యత్తు ప్రస్తుతం ఆందోళనకరమే. ఆ పార్టీకి ఇప్పుడు కావాల్సింది వచ్చే ఎన్నికల్లో మళ్ళీ అధికారంలోకి తెచ్చే ప్రజాకర్షక నాయకుడే తప్ప వేరెవరూ కాదు. పార్టీ నిలబడితేనే వారి భవిష్యత్తు అనే ఆ సంగతి కీచులాడుకుంటున్న ఈ తమిళ తంబీలకు ఎవరు చెప్పాలి? -
మరో కొత్త వివాదం.. అన్నాడీఎంకే ఖజానాపై ‘వారిద్దరి’ కన్ను
ఇన్నాళ్లూ పార్టీపై పట్టుకోసం పోరాడిన ఈపీఎస్, ఓపీఎస్ మధ్య తాజాగా మరో కొత్త వివాదం మొదలైంది. అన్నాడీఎంకే బ్యాంక్ ఖాతాల నిర్వహణ బాధ్యత నాదంటే.. నాదంటూ వారిద్దరూ లేఖల యుద్ధానికి దిగారు. పరిస్థితి ముదిరితే ఖాతాలను స్తంభింపజేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. సాక్షి ప్రతినిధి, చెన్నై: అన్నాడీఎంకే బ్యాంకు ఖాతాలపై తనదే పెత్తనమని ఎడపాడి పళనిస్వామి, కాదు..కాదు కోశాధికారిగా తానే అధికారిక వ్యక్తినని పన్నీర్సెల్వం కొత్తగా మరో కుమ్ములాట మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో సమస్య సద్దుమణిగే వరకు ఇద్దరికి అవకాశం లేకుండా సీలువేస్తారని ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే ఖాతాల్లోని రూ.300 కోట్లు స్తంభించిపోయే ప్రమాదం ఉంది. చదవండి: అవసరమా! ఆ సింహాలు క్రూరంగా, కోపంగా కనిపించాలా? అంతకంతకూ ముదురుతున్న వివాదాలు అంతఃకలహాలతో అన్నాడీఎంకే అట్టుడికి పోతోంది. ప్రధాన కార్యదర్శిగా ఎడపాడి పళనిస్వామి ఎంపిక, పన్నీర్సెల్వం శాశ్వత బహిష్కరణ జరిగిపోయింది. కోశాధికారి పదవి నుంచి ఓపీఎస్ను తప్పించినట్లు బ్యాంకు అధికారులకు ఈపీఎస్ ఓ లేఖ పంపారు. అయితే తన అనుమతి లేకుండా ఎలాంటి లావాదేవీలు జరిపేందుకు వీలులేదని, హద్దుమీరితో తగిన చర్యలు తప్పవని పన్నీరు సెల్వం మరో లేఖలో హెచ్చరించారు. ఇక కోశాధికారిగా దిండుగల్లు శ్రీనివాసన్ను నియమించాం, ఆయన అనుమతి లేకుండా లావాదేవీలు జరుపరాదని కరూరు వైశ్య బ్యాంకు, ఇండియన్ బ్యాంకుకు, చీఫ్ ఎలక్షన్ కమిషన్కు ఈపీఎస్ మంగళవారం మరో లేఖ రాశా రు. ఈరెండు బ్యాంకుల్లో అన్నాడీఎంకేకు సుమారు రూ.300 కోట్లు ఉండటంతో ఈపీఎస్, ఓపీఎస్లు తహతహలాడుతున్నారు. ఎవరి ఆదేశాలు పాటించాలో తెలియక బ్యాంకు అధికారులు తలలుపట్టుకున్నారు. రూ.300 కోట్లు పక్కదారి పట్టకుండా పార్టీ బ్యాంకు ఖాతాలకు తాత్కాలికంగా సీలు వేయడమే మేలని అధికారులు ఆలోచిస్తున్నట్లు సమాచారం. సీఈసీకి పోటాపోటీ పిటిషన్లు ఈనెల 11న సర్వసభ్య సమావేశంలో చేసిన తీర్మానాలపై ఈపీఎస్, ఓపీఎస్ ప్రధాన ఎన్నికల కమిషన్ (సీఈసీ) కార్యాలయంలో పోటాపోటీగా పిటిషన్లు వేశారు. ఇటీవలి సర్వసభ్య సమావేశంలో చేసిన తీర్మానాలు, ఆమోదయోగ్యం కాని ఆ పిటి షన్లపై స్టే విధించాలని సీఈసీకి సమర్పించిన పిటిషన్లో ఓపీఎస్ పేర్కొన్నారు. బైలా ప్రకారమే పార్టీ వ్యవహారాల్లో సవరణలు చేశామని ఎడపాడి పేర్కొంటూ సీఈసీకి ఆధారాలు సమర్పించారు. మలి అడుగు ఎలా..? ఆశించినట్లుగానే ఎడపాడి పళనిస్వామికి ప్రధాన కార్యదర్శి పదవి దక్కింది. పన్నీర్సెల్వంను బహిష్కరించడం కూడా జరిగిపోయింది. అయితే పార్టీపై పూర్తిస్థాయి పట్టుసాధించడం కోసం చేపట్టాల్సిన చర్యలపై చట్ట నిపుణులతో ఈపీఎస్ మంగళవారం సమాలోచనలు జరిపారు. పన్నీర్సెల్వం బహిష్కరణకు గురైనందున ప్రభుత్వంలో ప్రధాన ప్రతిపక్ష ఉపనేత పదవి వెంటనే చేజారిపోతుందా..? అని కూడా చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఇతర అంశాలు ఇక అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయం వద్ద సోమ వారం అరాచకాలకు పాల్పడిన, కార్యాలయంలోకి జొరబడిన 400 మంది కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేశారు. 14 మందిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. కార్యాలయ ప్రాంగణంలోని ఎంజీ రామ చంద్రన్, జయలలిత విగ్రహాలకు రోజూ పూలమాలలు వేయడం ఎంతోకాలంగా ఆనవాయితీగా వస్తోంది. అయితే పార్టీ కార్యాలయానికి ప్రభుత్వం సీలు వేయడంతో వారి విగ్రహాల్లో ఎండిపోయిన రోజాపూల మాలలను చూసి పారీ్టశ్రేణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అన్నాడీఎంకేలోని రెండువర్గాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగడంతో ఎడపాడి పళనిస్వామి, పన్నీర్సెల్వం ఇళ్ల వద్ద పోలీసుల బందోబస్తు పెంచారు. పార్టీ కార్యాలయానికి ప్రభుత్వం సీలు వేయడంతో ఎడపాడి తన ఇంటిని తాత్కాలిక కార్యాలయంగా మార్చారు. ఆఫీసుకు వేసిన సీలును తొలగించేలా ఆదేశించాలని కోరుతూ ఎడపాడి మద్ద తుదారు తరపున న్యాయవాది విజయ్ నారాయణన్ మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. -
బాహుబలి క్లైమాక్స్ కూడా తక్కువే.. అన్నాడీఎంకే పగ్గాలు పళనికే..!
ఆరోపణలు.. ప్రత్యారోపణలు, సభలు.. సమావేశాలు, దాడులు.. దౌర్జన్యాలు, ఎత్తులు.. పై ఎత్తులతో గత పక్షం రోజులుగా సాగిన అన్నాడీఎంకే ఆధిపత్య పోరుకు తెరపడింది. పార్టీ పగ్గాలు ప్రస్తుతానికి పళనిస్వామికే దక్కాయి. అయితే సోమవారం క్లైమాక్స్ మాత్రం బాహుబలి, కేజీఎఫ్, విక్రమ్ సినిమాలకు తక్కువ కాదన్నట్లుగా సాగింది. సర్వసభ్య సమావేశంలో వానగరం వేదికగా ఎడపాడి పార్టీ పగ్గాలు అందుకున్నారనే సమాచారంతో.. పన్నీరు సెల్వం వర్గం ఆగ్రహంతో ఊగిపోయింది. ఓపీఎస్ తన మద్దతుదారులతో రాయపేటలోని పార్టీ కార్యాలయం తలుపులను బద్దలు కొట్టి.. దాన్నిస్వాధీనంలోకి తెచ్చుకున్నారు. సమాచారం అందుకున్న ఎడపాడి వర్గం అక్కడికి వచ్చి వీరంగం సృష్టించింది. దాడులు.. ప్రతిదాడులతో పార్టీ కార్యాలయ ప్రాంగణం దద్దరిల్లింది. పోలీసులు లాఠీచార్జీ చేసినా ఫలితం లేకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంది. అన్నాడీఎంకే కార్యాలయానికి సీలు వేసి పలువురు ఆందోళన కారులను అరెస్ట్ చేసింది. సాక్షి ప్రతినిధి, చెన్నై: గత కొంతకాలంగా అన్నాడీఎంకేలో సాగుతున్న ఆధిపత్యపోరులో ఎట్టకేలకూ ఎడపాడి పళనిస్వామి పైచేయి సాధించారు. పన్నీర్ కల్పించిన అడ్డంకులను అధిగమించి పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఎడపాడి ఎంపికయ్యారు. దీంతో ప్రత్యర్థి వర్గం ఎడపాడి మద్దతుదారులపై విరుచుకుపడగా జరిగిన అల్లర్లు, వాహనాల ధ్వంసం, పరస్పర ముష్టిఘాతాలు, కత్తివేట్లతో పార్టీ కార్యాలయ పరిసరాలు యుద్ధభూమిని తలపించాయి. అమ్మ మరణంతో ఖాళీగా మారిన ప్రధాన కార్యదర్శి పదవిని చేజిక్కించేందుకు తొలుత శశికళ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు ఆమె జైలుకెళ్లగా, సమన్వయ కమిటీ కన్వీనర్, కో కన్వీనర్లుగా పన్నీర్సెల్వం, ఎడపాడి పళనిస్వామి జయస్థానాన్ని భర్తీ చేశారు. అయితే ఇద్దరికీ పొసగకపోవడంతో చాపకిందినీరులా ఉన్న అంతఃకలహాలు అసెంబ్లీ ఎన్నికల తరువాత బట్టబయలయ్యాయి. పార్టీ సారథులుగా ఇద్దరు వద్దు, ఒక్కరే ముద్దు అంటూ ఏక నాయకత్వ నినాదం తెరపైకి వచ్చింది. ఈ వ్యవహారంలో సుమారు 80 నుంచి 90 శాతం మంది నాయకులు, కార్యకర్తలు ఎడపాడి వైపు నిలువడంతో పన్నీర్సెల్వం కోపం కట్టలు తెంచుకుంది. ఎడపాడికి అన్నీ మంచి శకునాలే.. ఇదిలా ఉండగా, ఈనెల 11వ తేదీన ప్రధాన కార్యదర్శిగా ఎంపికయ్యేందుకు ఎడపాడి అన్నీ సిద్ధం చేసుకున్నారు. సమావేశంపై స్టే కోసం పన్నీర్సెల్వం కోర్టు కెక్కడంతో ఎడపాడి శిబిరం తీవ్ర ఉత్కంఠకు లోనైంది. అయితే సోమవారం వెలువడిన తీర్పు ఎడపాడికి అనుకూలమైంది. పార్టీ అంతర్గత వ్యవహారాల్లో కోర్టు జోక్యం చేసుకోబోమని న్యాయమూర్తి తమ తీర్పులో పేర్కొన్నారు. దీంతో యధావిధిగా సర్వసభ్య సమావేశం జరిగింది. తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఎడపాడి, కోశాధికారిగా దిండుగల్లు శ్రీనివాసన్ ఎంపికయ్యారు. కన్వీనర్, కో కన్వీనర్ పదవులు రద్దు, పార్టీ నుంచి పన్నీర్ బహిష్కరణ, ప్రధాన కార్యదర్శి పదవికి నాలుగు నెలల్లోగా ఎన్నికలు తదితర 16 తీర్మానాలు ఎలాంటి అవాంతరాలు లేకుండా ఏకగ్రీవ ఆమోదం పొందాయి. అంతేగాక శాశ్వత ప్రధాన కార్యదర్శి జయలలిత అనే పదవిని రద్దు చేస్తూ పార్టీ బైలాను సవరించారు. కాగా అన్నాడీఎంకేను మళ్లీ అధికారంలోకి తెస్తామని సర్వసభ్య సమావేశంలో ఎడపాడి ధీమా వ్యక్తం చేశారు. రెచ్చిపోయిన ఇరువర్గాలు ఎడపాడి ఎత్తులకు చిత్తయిన పన్నీర్సెల్వం పార్టీ ప్రధాన కార్యాలయంలో పాగా వేశారు. ఎడపాడి మద్దతుదారులంతా వానగరంలో జరుగుతున్న సర్వసభ్య సమావేశంలో ఉండగా, పన్నీర్సెల్వం తన అనుచరులతో కలిసి రాయపేట పార్టీ కార్యాలయంలోకి తలుపులను బద్దలు కొట్టి మరీ వెళ్లారు. అక్కడున్న ఎడపాడి ఫొటోలను చించివేసి తగులబెట్టారు. ఈ సమాచారం అందుకున్న ఎడపాడి వర్గం పార్టీ కార్యాలయంలోకి జొరబడి వీరంగం సృష్టించింది. ఇందుకు ప్రతిగా పన్నీర్ అనుచరులు సైతం ముష్టిఘాతాలకు దిగడంతో ఆ ప్రాంతం రణరంగంగా మారింది. కత్తులు, కర్రలు ఇతర మారణాయుధాలతో పరస్పరం దాడులకు పాల్పడ్డారు. ఒకరినొకరు వెంటాడారు. ఫలితంగా కొందరికి గాయాలయ్యాయి. శాంతిభద్రతల సమస్య తలెత్తడంతో.. దాడుల కారణంగా అనేక వాహనాలు ధ్వంసమై తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడి.. శాంతిభద్రతల సమస్య తలెత్తింది. పోలీసులు భారీగా మొహరించి లాఠీచార్జీ చేసినా పార్టీ శ్రేణులను నిలువరించడం సాధ్యం కాలేదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని 144 సెక్షన్ విధించి పార్టీ కార్యాలయానికి సీలు వేసి పలువురిని అరెస్ట్ చేసింది. ఇందుకు నిరసన తెలుపుతూ పన్నీర్ తన మద్దతుదారులతో ధర్నాకు దిగారు. పార్టీ కార్యాలయంలో విధ్వంసానికి పాల్పడ్డారని, ముఖ్యమైన డాక్యుమెంట్లను తీసుకెళ్లారని ఆరోపిస్తూ ఎడపాడి వర్గీయులు పన్నీర్సెల్వం తదితరులపై పోలీసు కేసు పెట్టారు. పార్టీ నుంచి తనను ఎడపాడి బహిష్కరించడం కాదు, తానే ఎడపాడి, కేపీ మునుస్వామిని పార్టీ నుంచి బహిష్కరించినట్లు పన్నీర్సెల్వం మీడియాతో మాట్లాడుతూ ప్రకటించారు. చదవండి: సీఎంకు చల్లటి చాయ్: అధికారికి నోటీసులు.. కఠిన చర్యలు! -
పన్నీరుపై వేటు నేపథ్యంలో శశికళ మళ్లీ పార్టీలోకి వస్తారని ప్రచారం


