ఫైల్ ఫొటో
అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం డిసెంబర్ 1 న సమావేశం జరగనుంది. వెలగపూడిలోని నూతన సచివాలయంలో ఒకటో తేదీన మధ్యాహ్నం మంత్రివర్గం భేటీ కానుంది. సమావేశంలో చర్చకు వచ్చే అంశాలు ఇంకా తెలియరాలేదు. కాగా కొత్త సచివాలయంలో మంత్రి వర్గ సమావేశం జరగడం ఇదే తొలిసారి.