
వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులోని ఎస్బీఐ వద్ద బారులు తీరిన ప్రజలు
అటు పొలాలు, స్థలాలు ధరలు పడిపోకుండా, నల్ల డబ్బు చెల్లుబాటు అయ్యేలా ఉభయ తారకమైన ఫార్మూలను తెరమీదకు తెచ్చారు. పాత నోట్లకే పొలాలు అమ్ముతామంటూ డబ్బున్న ఆసాములకు ఫోన్ లు చేసి దారిలో పెడుతున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం తగ్గిపోయిన తరుణంలో కొనుక్కుంటే లాభదాయకంగా ఉంటుందని నచ్చజెపుతున్నారు. రూ. 500, రూ. 1000 నోట్లు తీసుకుని వాళ్లు ఏదోలా వాటిని మార్చుకుంటారని ధీమాగా చెబుతున్నారు. విజయవాడ సమీపంలోని పెనమలూరు ప్రాంతానికి చెందిన మధ్యవర్తి ఒకాయనకు ఫోన్ చేసి ఎకరంన్నర పొలం రెడీగా ఉంది.. భవిష్యత్లో లేఅవుట్ వేసుకోవడానికి బాగుంటుంది.. పాత నోట్లు ఉంటే సిద్ధం చేసుకోమని చెప్పడం గమనార్హం.
అలాగే పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఖరీదైన ప్రాంతంగా పేరొందిన జువ్వలపాలెం రోడ్డు శివారున ఒక స్థలాన్ని కూడా ఇలాగే పాత కరెన్సీకే విక్రయిస్తామని మధ్యవర్తులు బేరసారాలు జరుపుతున్నారు. అదే ప్రాంతంలోని ఒక గ్రామంలో మొన్నటి వరకు సెంటు భూమి రూ. 6.50 లక్షలకు బేరం జరిగిందని, నోట్ల రద్దు వల్ల రూ.5 లక్షలకే ఇస్తానని ఆ స్థలం యజమాని చెప్పడం విశేషం. అది కూడా పాత నోట్లు ఇస్తే తీసుకుంటామని, మార్చుకోవడానికి తనకు ఆదాయ పన్ను వెసులుబాటు ఉందని చెప్పడం గమనార్హం.
కృష్ణా జిల్లా గన్నవరం ప్రాంతంలో ఇలాంటి వివాదానికి దిగిన క్రయవిక్రయదారులు పాత అగ్రిమెంట్ను రద్దు చేసుకున్నారు. దీంతో గతంలో ఇచ్చిన అడ్వాన్సును కొనుగోలుదారుడు వదులుకోవాల్సిందేనని మధ్యవర్తులు తీర్పు చెప్పడం గమనార్హం. మరికొన్ని చోట్ల పాత నోట్లు చెల్లుబాటుకాక, అంత పెద్ద మొత్తాలు కొత్త నోట్లు ఇవ్వలేక కొందరు గతంలో అగ్రిమెంట్లు చేసుకున్న భూముల రిజిస్ట్రేషన్లు కొంతకాలం వాయిదా వేసుకుంటున్నారు.