మోసం చేసిందని సినీనటిపై ఫిర్యాదు | Financier Suresh Sharma files Complaint against Pooja gandhi | Sakshi
Sakshi News home page

మోసం చేసిందని సినీనటిపై ఫిర్యాదు

Published Mon, Jun 29 2015 9:16 AM | Last Updated on Sun, Sep 3 2017 4:35 AM

మోసం చేసిందని సినీనటిపై ఫిర్యాదు

మోసం చేసిందని సినీనటిపై ఫిర్యాదు

బెంగళూరు : కన్నడ నటి పూజాగాంధీ మరోసారి వార్తల్లోకి ఎక్కింది. పూజాగాంధీ కోటి రూపాయలు డబ్బు తీసుకుని పూజాగాంధీ వంచనకు పాల్పడినట్లు, నటుడు డాక్టర్ సురేశ్ శర్మ వాణిజ్యమండలికి ఫిర్యాదు చేశారు.  అభినేత్రి సినిమా కోసం పూజాగాంధీ కోటి రూపాయలు నగదు తీసుకున్నదని, ఆ నగదు తిరిగి ఇప్పించాలంటూ సురేశ్ శర్మ కర్ణాటక చలన చిత్ర వాణిజ్య మండలికి చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

అయితే ఆ మోసానికి సంబంధించిన ఎలాంటి ఆధారాలను ఆయన అందచేయలేదు. నగదు అందచేసినప్పుడు సురేష్ శర్మ...పూజాగాంధీ నుంచి ఏదూనా ఆధారాలు తీసుకుని ఉండాల్సిందని వాణిజ్య మండలి కార్యదర్శి వ్యాఖ్యానించారు. ఈ ఫిర్యాదుపై పూజాగాంధీతో చర్చిస్తామని తెలిపారు. కాగా ఈ ఫిర్యాదు వ్యవహారంపై పూజాగాంధీ స్పందించలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement