Cheating
-
చంద్రబాబు నాయుడు మోసకారి కాదా? ప్రజలను మోసం చేసినందుకు 420 కేసు పెట్టకూడదా?... వైఎస్సార్సీసీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం
-
వీడియో తీసి.. రూ.8.5 లక్షలు వసూలు
జగిత్యాల క్రైం: విలేకరినని పరిచయం చేసుకున్నాడు.. డబ్బులిస్తుంటే వీడియో తీశాడు.. తర్వాత బెదిరించి, పరిశ్రమల శాఖ జగిత్యాల జనరల్ మేనేజర్ యాదగిరి నుంచి పలు దఫాలుగా రూ.8.50 లక్షలు వసూలు చేశాడు. నిందితుడితోపాటు అతనికి సహకరించిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. శుక్రవారం రాత్రి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ రఘుచందర్ వివరాలు వెల్లడించారు. హైదరాబాద్లోని వనస్థలిపురానికి చెందిన ఎర్ర యాదగిరి పరిశ్రమల శాఖ జగిత్యాల జిల్లా జనరల్ మేనేజర్గా పని చేస్తున్నారు. గత నెల 20న విధుల్లో ఉండగా డీపీఆర్వో కార్యాలయ అటెండర్, జగిత్యాల అర్బన్ మండలం ధరూర్కు చెందిన బాలె జగన్ వచ్చాడు. రాయికల్ మండలం ఒడ్డెలింగాపూర్ తండాకు చెందిన భూక్య సంతోష్నాయక్ను ఓ చానల్ విలేకరని ఆయనకు పరిచయం చేశాడు.మరుసటి రోజు లోన్ కావాలని..21న సంతోష్నాయక్ జనరల్ మేనేజర్ యాదగిరి ఆఫీస్కు ఓ మహిళను తీసుకెళ్లాడు. తన బంధువని చెప్పి, సబ్సిడీపై కారు లోన్ కావాలని అడిగాడు. ముందుగా వేసుకున్న పథకం ప్రకారం.. రూ.5 వేలను కవర్లో పెట్టి, ఆయన టేబుల్పై పెట్టాడు. తర్వాత రహస్యంగా వీడియో తీశాడు. అదేరోజు రాత్రి ప్రెస్ గ్రూప్లో పెడతామంటూ ఆ వీడియోను అధికారికి వాట్సాప్ చేసి, బెదిరించాడు. కాసేపటికి సంతోష్కుమార్కు సంబంధించిన ఒడ్డెలింగాపూర్కు చెందిన పాలకుర్తి రాకేశ్, లోక్యానాయక్ తండాకు చెందిన మాలోతు తిరుపతి, భూక్య గంగాధర్లు కారులో వచ్చి, యాదగిరిని జగిత్యాల అర్బన్ మండలం తిప్పన్నపేట శివారుకు తీసుకెళ్లారు. రూ.3 లక్షలు డిమాండ్ చేస్తూ కొట్టారు. దీంతో ఆయన రూ.35 వేలు ఇచ్చారు. అవి సరిపోవని చెప్పడంతో మళ్లీ రూ.35 వేలతోపాటు ఫోన్పే ద్వారా మరో రూ.30 వేలు ముట్ట జెప్పారు. సంతోష్కుమార్ 22న ఫోన్ చేసి, డబ్బులు సరిపోలేదని బెదిరించడంతో కలెక్టర్ కార్యాలయంలోని ఇరిగేషన్ ఆఫీసు వద్ద రూ.2 లక్షలు ఇచ్చారు. 23న మా చానల్ చైర్మన్ ఒప్పుకోవడం లేదనడంతో 25న కలెక్టర్ కార్యాలయ సమీపంలోని వాటర్ట్యాంక్ వద్ద రూ.5.50 లక్షలు అప్పగించారు. ఇలా.. నిందితులు మొత్తం రూ.8.50 లక్షలు వసూలు చేశారు.బెదిరింపులు ఆగకపోవడంతో ఫిర్యాదు..అయినా, బెదిరింపులకు పాల్పడటంతో అనుమానం వచ్చిన జీఎం యాదగిరి 30న జగిత్యాల పట్టణ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. భూక్య సంతోష్కుమార్, పాలకుర్తి రాకేశ్లను పోలీసులు అదుపులోకి తీసుకొని, వారి వద్ద నుంచి రూ.1.75 లక్షల విలువైన బంగారం, రూ.16 వేలు, రెండు సెల్ఫోన్లు, కారును స్వాధీనం చేసుకున్నారు. వసూలు చేసిన డబ్బులో నుంచి కొంత మొత్తం తీసి, సంతోష్కుమార్ తన అప్పులు కట్టుకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ కేసుతో ప్రమేయం ఉన్న తిరుపతి, గంగాధర్, జగన్ పరారీలో ఉన్నారని, త్వరలోనే అరెస్టు చేస్తామని డీఎస్పీ పేర్కొన్నారు. కార్యక్రమంలో పట్టణ సీఐ వేణుగోపాల్, ఎస్సై కిరణ్ పాల్గొన్నారు. -
AP: పోలీసు ఉద్యోగ పరీక్షలో దొడ్డిదారి యత్నం!
కర్నూలు: ఎలాగైన పోలీసు ఉద్యోగం సాధించాలన్న పట్టుదలతో కొంతకాలంగా సాధన చేసిన ఓ అభ్యర్థి ఛాతీ, ఎత్తు కొలతల్లో ఫెయిల్ కావడంతో దొడ్డిదారిలో యత్నించి అడ్డంగా దొరికిపోయాడు. అధికారులను మోసగించే క్రమంలో అక్కడ సాంకేతికత ద్వారా గుర్తించి పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొని 4వ పట్టణ పోలీసు స్టేషన్లో చీటింగ్ కేసు నమోదు చేసి కటకటాల్లోకి పంపారు. పోలీసు నియామక ప్రక్రియలో భాగంగా ఉమ్మడి కర్నూలు జిల్లాకు సంబంధించి కానిస్టేబుల్ ఉద్యోగాల ప్రాథమిక రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు కర్నూలు ఏపీఎస్పీ బెటాలియన్లో డిసెంబరు 30 నుంచి దేహదారుఢ్య పరీక్షలు కొనసాగుతున్నాయి. అందులో భాగంగా మంగళవారం కోసిగి మండలం దొడ్డి బెళగల్ గ్రామానికి చెందిన పి.నరసింహుడు కుమారుడు పబిత తిరుమల బయోమెట్రిక్కు హాజరయ్యాడు. అయితే, అతను ఎత్తు, ఛాతి కొలతల్లో ఫెయిల్ కావడంతో వె నక్కి పంపారు. అయితే క్వాలిఫై అయినట్లుగా హాల్ టికెట్ను కలర్ జిరాక్స్ తీసుకొని.. క్వాలిఫై అయినట్లు టిక్ మార్క్ వేసుకొని 1600 మీటర్ల పరుగులో పాల్గొనేందుకు వరుస క్రమంలో నిలబడి మోసగించేందుకు ప్రయత్నించగా...స్టాటింగ్ పాయింట్ బందోబస్తు డ్యూటీలో రిజర్వు ఇన్స్పెక్టర్ నాగభూషణం గుర్తించి అభ్యర్థి మోసాన్ని వెలుగులోకి తెచ్చారు. పాడ్ క్యారియర్ లేకుండా 1600 మీటర్ల పాయింట్ వద్ద ఆర్ఎప్ఐడీ రిజిస్ట్రేషన్ కంప్యూటర్ ఆపరేటర్ జయరాం దగ్గరకు వెళ్లి పరిశీలించగా...సిస్టమ్లో అభ్యర్ధి పేరు చూపడం లేదని, హాల్ టికెట్లో మాత్రం క్వాలిఫై అయినట్లుగా నకిలీ తయారు చేసి టిక్ మార్క్ వేసుకున్నట్లు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఇదే విషయాన్ని ఎస్పీ బింధుమాదవ్ దృష్టికి తీసుకెళ్లగా.. 4వ పట్టణ పోలీసులకు అప్పగించాలని ఆదేశించారు. ఈ మేరకు అభ్యర్థి పబిత తిరుమలపై చీటింగ్ కేసు నమోదు చేసి రిమాండ్కు పంపినట్లు ఎస్ఐ గోపీనాథ్ తెలిపారు.కాగా 11 రోజు మంగళవారం పోలీసు కానిస్టేబుల్ దేహదారుఢ్య పరీక్షలకు మొత్తం 600 మందిని ఆహ్వానించగా... 412 మంది వచ్చారు. వీరిలో ప్రధాన పరీక్షకు మంగళవారం 267 మంది ఎంపికయ్యారు. -
పోతారు మొత్తం పోతారు.. ఇది నా తుగ్లకీయం
-
బాబూ.. ఇదేనా నీ సంతకం విలువ?: శ్యామల
గుంటూరు, సాక్షి: ఎన్నికల హామీల పేరిట మహిళలను తేలికగా మోసం చేయొచ్చని ముఖ్యమంత్రి చంద్రబాబు అనుకుంటున్నారని.. కానీ, రాష్ట్రంలోని ప్రతి మహిళా ఇప్పుడు ఆయన్ని గద్దె దించాలని అనుకుంటున్నారని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి ఆరె శ్యామల (Are Syamala) అన్నారు. కూటమి ప్రభుత్వ హామీల ఎగవేతపై శనివారం ఉదయం ఆమె మీడియాతో మాట్లాడారు.‘‘దీపం పథకం ఏమైందో చంద్రబాబు(Chandrababu) చెప్పాలి. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం ఏమైందో చంద్రబాబు చెప్పాలి. కూటమి ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు. నమ్మించి.. మాటిచ్చి.. ప్రజలను చంద్రబాబు మోసం చేశారు. ఏరు దాటాక తెప్ప తగలేయడం బాబుకు అలవాటే. చేతగానప్పుడు, చేయలేనప్పుడు శుష్కవాగ్ధానాలు చేయకూడదు. చంద్రబాబు మహిళలకు ఎన్నో పథకాలను అమలు చేస్తామని చెప్పి అలాగే మోసం చేశారు. సూపర్ సిక్స్ పేరుతో బాండు పేపర్లు ఇచ్చి నిలువునా మోసం చేశారు. చంద్రబాబూ.. ఇదే నా మీ సంతకం విలువ?. మహిళలను మోసం చేసినందుకు చంద్రబాబుపై 420 కేసు పెట్టవచ్చు.. .. 2014లో కూడా డ్వాక్రా రుణమాఫీ పేరుతో మోసం చేశారు. నమ్ముతున్నారని మహిళలను సులువుగా మోసం చేస్తున్నారు. తల్లికివందనం(thalliki vandanam) పేరుతో జగన్ ఇస్తున్న అమ్మ ఒడి పథకాన్ని ఆపేశారు. లక్షలాది మంది తల్లులు, విద్యార్ధులు ఎదురు చూస్తున్నారు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికీ రూ.15 వేలు చొప్పున ఇస్తామన్నారు. రాసి పెట్టుకోమని కూడా చెప్పారు. ఇప్పుడు మంత్రిగా ఉన్న రామానాయుడు చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. పొర్లు దండాలు పెట్టుకుంటూ ఎన్నికల ముందు తిరిగారు. కానీ ఇప్పుడు సమాధానం చెప్పకుండా తిరుగుతున్నారు.. హామీలు మాత్రం జనంలో ఇచ్చారు. ఇవ్వలేకపోతున్నామని నాలుగు గోడల మధ్య ఎందుకు చెప్తున్నారు?. తల్లికి వందనం ఇవ్వట్లేదని టీడీపీ నేతలు జనంలోకి వచ్చి చెప్పాలి. దీపం పథకం కింద ఇవ్వాల్సిన రూ.4,115 కోట్లు ఎగ్గొట్టారు. కనీసం ఉచిత బస్సు పథకాన్ని కూడా ఎందుకు అమలు చేయటం లేదు?.. 2025 జనవరి ఫస్టున జాబ్ కేలండర్ ఇస్తామని లోకేష్(Nara Lokesh) ప్రకటించారు. ఎన్ని ఉద్యోగాలు ఇస్తారో కాదుకదా.. కనీసం జాబ్ కేలండర్ కూడా ఎప్పుడు ప్రకటిస్తారో తెలియటం లేదు. పండుగ హామీలు లేవు, పెళ్లిళ్ల కానుకలూ లేవు. కూటమి నేతలు ప్రజలకు క్షమాపణలు చెప్పాలి.సంపద సృష్టి అంటే ప్రజలకేమో అనుకున్నాం.. చంద్రబాబు సొంతంగా సృష్టించుకోవటం అని ఇప్పుడే తెలిసింది. రూ.74 వేల కోట్లకు పైగా ఖర్చు అవుతుందని లెక్క తెలిసినా చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇప్పుడు డబ్బుల్లేవని ఎలా చెప్తారు?. ‘‘ఇప్పుడు గనుక జగన్ మోహన్రెడ్డి ఉండి ఉంటే..’’ అని రాష్ట్రంలో ప్రతీ ఒక్కరూ అనుకుంటున్నారు. ఈ హామీల అమలుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది’’ అని స్పష్టం చేశారామె.( ఈ క్రమంలో హామీల పేరుతో ఎన్నికల ప్రచారంలో కూటమి నేతలు చేసిన హడావిడిని.. ప్రకటనలను వీడియో రూపంలో శ్యామల మీడియాకు ప్రదర్శించారు. -
మీ అమ్మాయి మాకు బాగా నచ్చింది..
గచ్చిబౌలి: పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఘరానా మోసానికి పాల్పడిన వ్యక్తి ఉదంతం ఆలస్యంగా వెలుగుచూసింది. రాయదుర్గం ఇన్స్పెక్టర్ వెంకన్న తెలిపిన ప్రకారం..ఖాజాగూడలోని సాయి వైభవ్ లేఅవుట్లో నివాసం ఉండే ఓ వ్యక్తి డాక్టర్గా పనిచేస్తున్న తన కూతురుకు పెళ్లి సంబంధాలు చూస్తున్నాడు. ఈ క్రమంలోనే తెలుగు మ్యాట్రిమోనిలో అమ్మాయి వివరాలు ఉంచాడు. ఈ వివరాలు తెలుసుకున్న రాయపాటి కృష్ణ చౌదరి అనే వ్యక్తి ఫోన్ చేసి మీ అమ్మాయి నచ్చిందిని చెప్పాడు. తన అక్క మాధురి, నాన్న రంగ ప్రసాద్, అమ్మ రాణిదేవి ఆ్రస్టేలియా ఉంటున్నారని నమ్మించాడు. ఫోన్లో వారితో మాట్లాడించి అమ్మాయి నచ్చిందిని చెప్పించాడు. ఆగస్టు 14న ఇంటికి వచ్చి త్వరలోనే ఎంగేజ్మెంట్ పెట్టుకుందామని చెప్పాడు. అమ్మాయికి కేజీ బంగారు నగలు తీసుకుంటున్నామని, కొంత డబ్బు తక్కువ పడిందని చెప్పాడు. దీంతో తమ అమ్మాయికే నగలు పెడుతున్నారని నమ్మి బాధితులు నవంబర్ 28,29,30 తేదీల్లో రూ.19 లక్షల నగదు, ఆన్లైన్లో రూ.2.2 లక్షలు ఇచ్చారు. అనంతరం ఆ వ్యక్తి కాంటాక్ట్లోకి రాకపోవడంతో అనుమానం వచ్చి రెండు నెంబర్లకు ఫోన్ చేయగా రెస్పాండ్ కాలేదు. దీంతో ఈ నెల 12న యువతి తండ్రి రాయదుర్గం పీఎస్లో ఫిర్యాదు చేశారు. దీంతో బీఎన్ఎస్ 318(40, 316(2) సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా మోసానికి పాల్పడిన వ్యక్తి బాచుపల్లిలో నివాసం ఉంటున్నట్లు పోలీసులు ప్రాథమిక విచారణలో గుర్తించారు. ఇప్పటికే పెళ్లి అయ్యిందని, ఇద్దరు పిల్లలు ఉన్నట్లు సమాచారం. ఎస్ఆర్నగర్ పీఎస్లోనూ అతనిపై కేసు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. తెలుగు మ్యాట్రిమోనిలో సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులతో దిగిన ఫోటోలు పెట్టి..పెళ్లి పేరిట ఇతను మోసాలకు పాల్పడుతున్నాడని గుర్తించారు. వివాహేతర సంబంధమే ప్రాణం తీసిందా? -
అమ్మ ఒడి పేరుతో సైబర్ మోసం
ఆలూరు రూరల్ : సైబర్ నేరగాళ్లు కొత్త పంథాను ఎంచుకున్నారు. అమ్మ ఒడి పేరుతో అమాయకులను బురిడీ కొట్టించి ముగ్గురు వ్యక్తుల నుంచి ఫోన్లో మాట్లాడుతూనే రూ.26,500 వారి ఖాతాల నుంచి కాజేశారు. బాధితులు తెలిపిన వివరాలు.. కర్నూలు జిల్లా ఆలూరు మండలం అరికెర గ్రామానికి చెందిన నాగరాజు, మల్లికార్జున బతుకుదెరువు కోసం తెలంగాణ రాష్ట్రానికి వలస వెళ్లారు. వారికి ఆదివారం మధ్యాహ్నం 9266495107 నంబర్ నుంచి ఫోన్ వచ్చింది.తాము అమరావతిలోని విద్యాశాఖ కమిషనరేట్ నుంచి మాట్లాడుతున్నామని చెప్పారు. ‘మీకు అమ్మ ఒడి వచ్చిందా’ అంటూ ఫోన్ చేసిన వ్యక్తి అడిగి.. వారి వ్యక్తిగత వివరాలు సేకరించారు. అతడి మాటలు నమ్మిన నాగరాజు, మల్లికార్జునలు తమకు రాలేదని చెప్పారు. దీంతో ఆగంతకుడు మీ వలంటీర్ ఆనంద్ను కాన్ఫరెన్స్లో తీసుకుంటున్నానంటూ వలంటీర్కు కాల్ చేశాడు. అనంతరం ఆనంద్తో తాను అమరావతి నుంచి మాట్లాడుతున్నామని.. మల్లికార్జున, నాగరాజులకు అమ్మ ఒడి ఎందుకు రాలేదని ప్రశ్నించారు.త్వరలోనే మీ ఐడీలను అప్డేట్ చేస్తామంటూ వారి పూర్తి వివరాలనూ ఫోన్ చేసిన వ్యక్తి తెలుసుకున్నాడు. అనంతరం ‘నీకు పనిచేయడం రాదా’ అంటూ వలంటీర్ను దబాయిస్తూ మాట్లాడాడు. ఆగంతకుడు ఫోన్ కట్ చేయగానే.. నాగరాజు ఖాతా నుంచి రూ.12,500, మల్లికార్జున అకౌంట్ నుంచి రూ.9 వేలు, వలంటీర్ ఆనంద్ ఖాతా నుంచి నుంచి రూ.5 వేలు మాయం అయ్యాయి. బాధితులు లబోదిబోమంటూ జరిగిన విషయాన్ని గ్రామస్తులకు ఫోన్ చేసి చెప్పారు. -
పెళ్లి కొడుక్కి ‘సినిమా చూపించిన మావా!’
మరికొద్ది గంటల్లో అక్కడ వివాహ మహోత్సవం జరగాల్సి ఉంది. పెళ్లి బాజాలతో అక్కడంతా కోలాహలం నెలకొంటుందని అనుకునేరు. బదులుగా.. పెండ్లి కొడుకు వీపు విమానం మోత మోగింది. అయితే.. అమ్మాయి తల్లిదండ్రులు, బంధువులు.. ఆ దాడిని ఆపారు. తన్నులు తిన్న ఆ యువకుడికి కడుపు నిండా కమ్మటి భోజనం పెట్టారు. ఆ తర్వాత ఏం జరిగిందో ఈ కథనం చదివి తెలుసుకోండి..సోహన్లాల్ యాదవ్కు మరో మూడు రోజుల్లో వివాహం జరగాల్సి ఉంది. అయితే సడన్గా అతను కనిపించకుండా పోయాడు. దీంతో అతని కుటుంబం పోలీసులను ఆశ్రయించింది. మిస్సింగ్ నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు పోలీసులు. ఈలోపు.. ఇదేం తెలియని పెళ్లి కూతురు తరఫువాళ్లు తమ ఏర్పాట్లు చేసుకుంటూ పోతున్నారు. పెండ్లి టైం దగ్గర పడడంతో బాజాభజంత్రీలతో స్వాగతం పలికేందుకు సిద్ధమయ్యారు. కానీ, అక్కడి నుంచి సీన్ పీఎస్కు మారింది.పెళ్లి కొడుకు తరఫు వాళ్లు రాకపోవడంతో.. పెళ్లి కూతురు వాళ్లంతా దగ్గర్లోని పోలీస్ స్టేషన్కు వెళ్లారు. పోలీసుల జోక్యంతో.. అబ్బాయి తరఫు వాళ్లంతా వచ్చారు. చివరకు ఆ అమ్మాయితో వివాహానికి అబ్బాయి ఒప్పుకున్నాడు. అయితే.. అదేరోజు మరో ముహూర్తానికి వివాహం జరగాల్సి ఉంది. కానీ, ఇంతలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. మూడు రోజులపాటు కనిపించకుండా పోయిన ఆ యువకుడు.. మరో ఊరిలో ఇంకో అమ్మాయితో కలిసి ఉన్నాడని అమ్మాయి తరఫు వాళ్లకు తెలిసింది. దీంతో ఆగ్రహంతో గ్రామస్తులంతా అతన్ని చితకబాదారు. ఈలోపు అమ్మాయి తల్లిదండ్రులు, బంధువులు ఆ దాడిని ఆపారు. ఆ యువకుడికి భోజనం పెట్టి మరీ పెళ్లి క్యాన్సిల్ చేసుకందామని చెప్పారు. అయితే.. ఇక్కడే ఆ యువకుడికి ఊహించని షాక్ తగిలింది.పెళ్లి కోసం తాము ఎంతో ఖర్చు చేశామని, ఆ డబ్బంతా ఇచ్చి కదలమని కండిషన్ పెట్టారు. దీంతో ఖంగుతినడం అతని వంతు అయ్యింది. ‘‘మేం ఇక్కడికి ఆలస్యంగా వచ్చాం. ఆ మాత్రం దానికే పెండ్లి రద్దు చేసుకున్నారు. పైగా పరిహారం ఇవ్వమని అడుగుతున్నారు. అది ఇచ్చేదాకా నన్ను కదలనివ్వమంటున్నారు. అంతా చెప్తున్నట్లు నేనేం అదృశ్యం కాలేదు. పని మీద ఊరెళ్లా. నా ఫోన్ పని చేయకుండా పోయింది. బాగు చేసుకునేసరికి పోలీసులు రమ్మని పిలిచారు. పెళ్లికి నేను రెడీ, కానీ వాళ్లు సిద్ధంగా లేరు’’ అని పారిపోయే ప్రయత్నం చేసిన పెళ్లి కొడుకు మొబైల్ వీడియో సందేశం ఒకటి వైరల్ అయ్యింది. ఇక అమ్మాయి తండ్రి మాట్లాడుతూ.. 10 నెలల కిందట నా కూతురికి వివాహం నిశ్చయించా. పెండ్లి కొడుకుగా చేశాక.. అతను నాకు కారు కావాలనే డిమాండ్ చేశాడు. ఇవ్వడానికి మేం సిద్ధంగానే ఉన్నాం. ఆపై కారు వద్దు.. క్యాష్ కావాలన్నాడు. దానికీ మేం ఒప్పుకున్నాం. ఆ తర్వాతే అన్ని ఏర్పాట్లు చేశాం. పెండ్లి రోజు బంధువులంతా వచ్చినా.. పెండ్లి కొడుకు రాలేదు. చివరకు.. మా దగ్గరి బంధువును అక్కడికి పంపిస్తే అతను ఊర్లోనే లేడని సమాచారం ఇచ్చాడు. అందుకే పోలీస్ స్టేషన్కు వెళ్లాం. తీరా అక్కడికి వెళ్లే సరికి పీఎస్లో ఆ యువకుడు కూడా ఉన్నాడు. వరకట్నం కేసు పెడతామని వాళ్లు హెచ్చరించారు. అందుకే పెళ్లికి ఒప్పుకున్నాడు. కానీ, మాకీ పెళ్లి ఇష్టం లేదు. అతను చేసిన మోసం ఇప్పుడే బయటపడింది. ఒకవేళ పెండ్లి తర్వాత బయటపడి ఉంటే నా కూతురి జీవితం నాశనం అయ్యేది. అందుకే పరిహారం చెల్లించమని కూర్చున్నాం. ఉత్తర ప్రదేశ్ అమేథీ పోలీసులు ఈ సమస్యను సామరస్యంగా పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. अमेठी : दूल्हे राजा के इंतजार में दुल्हन के हाथों की मेहंदी हो गई फीकीकाफी इंतजार के बाद पुलिस के हस्तक्षेप पर सुबह पहुंची बारातसुबह बारात पहुंचने पर दुल्हन के घरवालों ने दूल्हे को बनाया बंधकशादी में हुए खर्च को लेकर अड़े दुल्हन के घर वाले@amethipolice @Uppolice #Amethi pic.twitter.com/VxYSFPcSUQ— Tasleem choudhary (JOURNALIST) (@tasleem7573) December 3, 2024 -
బంగారం బిజినెస్ పేరుతో మోసం.. బాధితుల్లో టాప్ హీరోయిన్లు..?
సాక్షి,హైదరాబాద్:బంగారం వ్యాపారం ముసుగులో రూ.100 కోట్లకు సెలబ్రిటీలు, వ్యాపారవేత్తలను బురిడీ కొట్టించాడు.వ్యాపారంలో వాటా ఇస్తానని చెప్పి నమ్మించి నట్టేట ముంచాడు.బాలీవుడ్ బ్యూటీ పరిణితి చోప్రా బ్రాండ్ అంబాసిడర్ అంటూ అబద్ధాలు చెప్పాడు. చివరకు ఆ ఫేక్ బంగారం వ్యాపారిని పోలీసులు అరెస్టు చేసి కటాకటాల్లోకి నెట్టారు.బంగారం వ్యాపారం ముసుగులో తృతీయ జ్యువెల్లరీ అధినేత కాంతిదత్ చేసింది పెద్ద మోసం అని తెలుసుకున్న సెలబ్రిటీలు ఒక్కొక్కరిగా సీసీఎస్ పోలీసులను ఆశ్రయిస్తున్నారు. శ్రీజరెడ్డి అనే మహిళావ్యాపారవేత్త ఫిర్యాదుతో విషయం తొలుత వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులు కాంతిదత్ను అరెస్టు చేశారు.కాంతిదత్ బాధితుల్లో హీరోయిన్ సమంత,కీర్తిసురేష్, డిజైనర్ శిల్పారెడ్డి తదితర ప్రముఖులున్నట్లు సమాచారం.కాంతిదత్ మీద సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. 100 మందికిపైగా బాధితులున్నట్లు చెబుతున్నారు. -
భర్త బండారాన్ని.. బయటపెట్టిన భార్య
-
చంద్రబాబు పచ్చి మోసంపై ప్రజాగ్రహం
అమరావతి, సాక్షి: ఏపీలో సంక్షేమ వారధులుగా ముద్రపడిపోయిన వలంటీర్లకు సీఎం నారా చంద్రబాబు నాయుడు పెద్ద షాకే ఇచ్చారు. గతంలో వాళ్లపై తీవ్ర విమర్శలు గుప్పించి.. ఎన్నికలటైంలో వాళ్లను కొనసాగిస్తానని, జీతం సైతం పెంచుతామని స్వయంగా ఆయన ప్రకటించారు. తీరా అధికారంలోకి వచ్చాక ఆ వ్యవస్థకే మంగళం పాడేశారు.ఏపీలో వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో వలంటీర్ వ్యవస్థ మొదలైంది. సంక్షేమ పథకాల విషయంలో లబ్ధిదారులు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో ఈ వ్యవస్థను మొదలుపెట్టారాయన. వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్నంతకాలం.. వీళ్ల ద్వారానే పౌర సేవలు నిరాటంకంగా సాగాయి. ఎండా, వాన, చలి లెక్కచేయకుండా.. చివరకు కరోనా టైంలోనూ ప్రాణాలకు తెగించి మరీ సేవల్ని అందించారు వాళ్లు. దేశవ్యాప్తంగా వలంటీర్ వ్యవస్థ గురించి చర్చ నడిచింది. అయితే.. ఎన్నికలకు నెలముందు.. టీడీపీ రాజకీయం నడిపించి వలంటీర్లను సంక్షేమ పథకాల పంపిణీకి దూరంగా ఉంచింది. దీంతో లబ్ధిదారులకు కష్టాలు మొదలయ్యాయి. ఈలోపు ఎన్నికలయ్యాయి. అధికారంలోకి వచ్చి ఇన్నిరోజులైనా వాళ్లకు ఎలాంటి విధులు అప్పగించలేదు. మరోవైపు.. తమ విధులకు సంబంధించి 2.66 లక్షల మంది వాలంటీర్ల ఆందోళనకు గురయ్యారు. కలెక్టరేట్ల చుట్టూ తిరిగి వినతి పత్రాలు సమర్పించారు. ఇంకోపక్క.. నామ మాత్రంగా సచివాలయ సిబ్బందితో పెన్షన్ల పంపిణీ కొనసాగించారు. దీంతో వలంటీర్ వ్యవస్థ కొనసాగుతుందా? అనే సందేహాలు మొదలయ్యాయి. అయితే.. ఇక్కడ వైఎస్సార్సీపీ అనుమానాలే నిజమయ్యాయి. జగన్ ఆలోచనను తుడిచేయాలని కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది ఆ పార్టీ మొదటి నుంచి ఆరోపిస్తోంది. అందుకు తగ్గట్లే.. అసెంబ్లీ సాక్షిగా ఏపీ మంత్రి చేసిన ప్రకటనతో.. చంద్రబాబు ప్రభుత్వం వలంటీర్ల ఊపిరి తీసింది. వలంటీర్లు విధుల్లో లేరని, వాళ్లను కొనసాగించేది లేదని, అలాంటప్పుడు జీతాల పెంపు ఎక్కడిదంటూ? చెప్పడంతో చంద్రబాబు పచ్చి మోసంపై.. ప్రజల్లోనూ ఆగ్రహం వ్యక్తం అవుతోంది.బుధవారం మండలిలో మండలి ప్రశ్నోత్తరాల సందర్భంగా వలంటీర్ వ్యవస్థపై ప్రశ్న YSRCP ఎమ్మెల్సీల ప్రశ్న.. గ్రామ, వార్డు వలంటీర్లకు గౌరవ వేతనం ఎప్పుడు పెంచుతారు?మంత్రి వీరాంజనేయస్వామి సమాధానం.. ప్రస్తుతం రాష్ట్రంలో వలంటీర్లు పనిచేయడంలేదని చెప్పారు. వారికి ఈ ఏడాది మే వేతనం రూ.277.21 కోట్లు ఇచ్చినట్లు తెలిపారు. గత ప్రభుత్వం వలంటీర్లను నియమించిందని, ఆ తర్వాత వారిని కొనసాగిస్తూ జీవో ఇవ్వలేదని, అందుకే తాము వారిని కొనసాగించలేమని అన్నారు. వలంటీర్ వ్యవస్థే లేనప్పుడు జీతాల పెంపు అంశం ఎలా వస్తుంది. -
సాఫ్ట్వేర్ ఉద్యోగాల పేరుతో రూ.26 లక్షలకు కుచ్చుటోపీ
బంజారాహిల్స్: ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించి రూ.26 లక్షలు వసూలు చేసి ముఖం చాటేసిన భార్యాభర్తలపై జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్లో చీటింగ్ కేసు నమోదైంది. వివరాల్లోకి వెళితే..జూబ్లీహిల్స్ రోడ్డునెంబర్–10లోని వెంకటగిరి స్రవంతినగర్లో నివసించే ఆరెవరపు వాసు టీసీఎస్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. గత ఏడాది జనవరిలో అక్కడే పనిచేస్తున్న చల్లా శ్రీరామ్ కిరణ్ అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ వాసుకు పరిచయం అయ్యాడు. తనకు పెద్ద పెద్ద కంపెనీల్లో పరిచయాలు ఉన్నాయని, ఐబీఎం కంపెనీలో ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించాడు. దీంతో వాసు తన స్నేహితులను సంప్రదించి ఒక్కొక్కరి నుంచి రూ.2– 2.5 లక్షల వరకు 17 మంది దగ్గర రూ.26 లక్షలు వసూలు చేసి చల్లా శ్రీరామ్కిరణ్కు ఇచ్చాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈ 17 మందికి ఆఫర్ లెటర్లు ఇవ్వగా వీరంతా ఆయా కంపెనీల్లో జాయిన్ కావడానికి వెళ్లినప్పుడు అవి బోగస్ ఆఫర్ లెటర్లు అని తేలింది. లబోదిబోమంటూ బాధితులు చల్లా శ్రీరామ్కిరణ్, ఆయన భార్య సంధ్యారాణిని సంప్రదించారు. అయితే మరో కంపెనీలో జాబ్లు ఇప్పిస్తానని, తనను నమ్మాలని చెప్పాడు. నెలలు గడుస్తున్నా వీరికి జాబ్లు ఇవ్వకపోగా డబ్బులు తిరిగి ఇవ్వమంటే ముఖం చాటేశాడని బాధితుడు వాసు పోలీసులకు ఇచి్చన ఫిర్యాదులో పేర్కొన్నారు. బ్యాక్డోర్ జాబ్స్ పేరుతో ఉద్దేశపూర్వకంగా తమ వద్ద నుంచి రూ.26 లక్షలు వసూలు చేసి మోసగించిన శ్రీరామ్కిరణ్, ఆయన భార్య సంధ్యారాణిలపై చర్యలు తీసుకోవాల్సిందిగా బాధితులు పేర్కొన్నారు. ఈ మేరకు పోలీసులు ఇద్దరి పైనా ఐపీసీ సెక్షన్ 406, 420 కింద చీటింగ్ కేసు నమోదు చేసి జూబ్లీహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
రూ.229 కోట్ల మోసం..ఇద్దరి అరెస్టు
సాక్షి,హైదరాబాద్: అధిక వడ్డీ ఆశ చూపి రూ.229 కోట్లు కొల్లగొట్టిన మాదాపూర్ డీకేజెడ్ టెక్నాలజీ సంస్థ ఇద్దరు డైరెక్టర్లను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టయిన డైరెక్టర్లు సయ్యద్ అష్ఫక్ రాహిల్ ఈ కేసులో ఏ2గా ఉండగా అయిషా నాజ్ ఏ9గా ఉన్నారు.17 వేల 5 వందల మంది నుంచి పెట్టుబడికి రెండింతలువ లాభం ఇస్తామని ఆశ చూపి రూ.229 కోట్ల మేర డిపాజిట్లు సేకరించిన డీకేజెడ్ కంపెనీ ఇటీవల బోర్డు తిప్పి డిపాజిట్దారులను మోసగించింది. -
నా భర్త నన్ను మోసం చేయలేదు.. షకీబ్ భార్య క్లారిటీ (ఫోటోలు)
-
లేడీ.. కిలాడీ
-
Big Question: ఏపీ చెవిలో సూపర్ పువ్వు
-
పెళ్లి పేరుతో ఘరానా మోసం
గాందీనగర్(విజయవాడ సెంట్రల్): పెళ్లి పేరుతో ఒంటరి, విడాకులు తీసుకున్న మహిళలను మోసం చేస్తున్న కేటుగాడిని విజయవాడ గవర్నర్పేట పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో నిందితుడి మోసాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసుల కథనం ప్రకారం.. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాకు చెందిన తుమ్మా మోహన్రెడ్డి వ్యసనాలకు బానిసై భార్య, పిల్లలను వదిలేశాడు. ఉన్న డబ్బులన్నీ షేర్ మార్కెట్లో పోగొట్టుకున్నాడు. అనంతరం సులభంగా డబ్బులు సంపాదించేందుకు ‘పెళ్లి కొడుకు’ అవతారం ఎత్తాడు. తెలుగు మ్యాట్రిమోని, షాదీ డాట్ కామ్ తదితర వెబ్సైట్లలో రకర కాల పేర్లతో రిజిస్టర్ చేసుకున్నాడు. ఒంటరి మహిళలను పరిచయం చేసుకునేవాడు. మాయమాటలతో నమ్మించి.. డబ్బు, బంగారం తీసుకొని పారిపోయేవాడు. ఈ క్రమంలో తెలుగు మ్యాట్రిమోని ద్వారా విజయవాడకు చెందిన ఓ మహిళను పరిచయం చేసుకున్నాడు. తన పేరు ‘కార్తీక్రెడ్డి.. సాఫ్ట్వేర్ ఉద్యోగిని.. విల్లాలు ఉన్నాయి’ అంటూ మాయమాటలు చెప్పాడు. పెళ్లి చేసుకుందామని ఒప్పించాడు. ఫొటోషూట్ కోసం నగలతో రావాలని సూచించాడు. ఆ ఫొటోలను తన తల్లిదండ్రులకు చూపించి పెళ్లికి ఒప్పిస్తానని ఆమెను నమ్మించాడు. దీంతో ఆమె ఈ ఏడాది ఏప్రిల్ 14న విజయవాడలోని ఓ హోటల్కు వెళ్లింది. ఫొటోషూట్ కోసం సిద్ధమై రావాలని ఆమెను వాష్రూమ్కు పంపించాడు. ఆమె తెచ్చిన 16 తులాల బంగారం, సెల్ఫోన్తో హోటల్ నుంచి ఉడాయించాడు. దీనిపై బాధితురాలు గవర్నర్పేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి విచారించగా.. అతని మోసాలన్నీ బయటపడ్డాయి. మోహన్రెడ్డి మోసాలివే.. » 2021 సెపె్టంబర్లో తెలంగాణలోని రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఓ మహిళ కారును తీసుకెళ్లిపోయి అమ్మేశాడు. » 2023 నవంబర్లో గుంటూరుకు చెందిన మహిళను పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. రూ.7 లక్షలు తీసుకుని పారిపోయాడు. » 2023 నవంబర్లో తెలంగాణలో ఓ మహిళను పెళ్లి చేసుకుంటానని నమ్మించి 25 తులాల బంగారం అపహరించాడు. » 2023 జనవరిలో తెలంగాణలోని మియాపూర్ పోలీస్స్టేషన్ పరిధిలో భర్తతో విడిపోయి ఒంటరిగా ఉన్న డాక్టర్ను పరిచయం చేసుకుని.. ఆమె క్రెడిట్ కార్డు ద్వారా రూ.లక్షలు వాడుకుని పారిపోయాడు. -
నా బాయ్ఫ్రెండ్ మోసం చేశాడు!
తమిళం, తెలుగు భాషల్లో పలు చిత్రాల్లో నటించి గుర్తింపు పొందిన నటి నివేద పేతురాజ్. తమిళంలో తిరునాళ్ కూత్తు చిత్రంతో కథానాయకగా పరిచయమైన ఈమె ఆ తర్వాత టిక్ టిక్ టిక్, సంఘతమిళన్ వంటి పలు చిత్రాల్లో నటించారు. అలా విజయ్ సేతుపతి, విజయ్ ఆంటోని వంటి హీరోల సరసన నటించినా ఇప్పటికీ స్టార్ ఇమేజ్ కోసం పోరాడుతూనే ఉన్నారు. అలాగే తెలుగులోనూ పలు చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం అవకాశాలు తగ్గడంతో వెబ్ సిరీస్లలో నటిస్తున్నారు. ఈమె నటించిన పరువు అనే వెబ్ సిరీస్ ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే తమిళంలో కొత్త చిత్రాలకు కమిట్ అయినట్టు చెబుతున్న నివేద పేతురాజ్ ఇటీవల కారులో వెళుతూ ఒక ట్రాఫిక్ పోలీస్తో గొడవ పడుతున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. అయితే అది తాను నటిస్తున్న వెబ్ సిరీస్ ప్రమోషన్లో ఒక భాగం అని ఆ తర్వాత తెలిసింది. కాగా ఈమె ఇటీవల ఒక భేటీలో ఇలా పేర్కొన్నారు. తన నెగెటివ్ ఆలోచనలన్నీ వాస్తవ రూపం దాల్చుతున్నాయని చెప్పారు. ఒకరోజు తన బాయ్ఫ్రెండ్ తన మోసం చేశాడని ఊహించుకున్నానన్నారు. ఆ తర్వాత అదే విధంగా జరిగిందన్నారు .తన బాయ్ఫ్రెండ్ మరెవరినో తీసుకుని వెళ్లిపోయాడని చెప్పారు. లేకపోతే ప్రస్తుతం తాను వాడుతున్న కారు నుంచి భవిష్యత్తులో కొనుక్కు పోయే కారు వరకు తన నెగటివ్ ఆలోచనలలేనని నటి నివేద పేతురాజు పేర్కొన్నారు. కాగా ఈ 32 ఏళ్ల పరువాలగుమ్మలో మంచి నటినే కాకుండా బైక్ రేసర్ క్రీడాకారిణి కూడా ఉన్నారన్నది గమనార్హం. -
అక్రమాలకు పాల్పడిన టీచర్ల జంట.. రూ. 9 కోట్లు రికవరీకి చర్యలు
చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయులే అక్రమాలకు పాల్పడితే.. అది కూడా తమకు ఉద్యోగాన్నిచ్చిన ప్రభుత్వాన్నే మోసగించాలని చూస్తే.. దాని పర్యవసానం ఎలా ఉంటుందో రాజస్థాన్లో వెల్లడయ్యింది. తమ స్థానంలో డమ్మీ టీచర్లను నియమించి, ఉద్యోగ విధులను చేస్తున్నట్లు నాటకమాడిన ఉపాధ్యాయ దంపతులపై ఇప్పుడు కోలుకోలేని దెబ్బ పడింది.రాజస్థాన్లోని బరన్ జిల్లాలో తమ స్థానంలో డమ్మీ టీచర్లను ఏర్పాటు చేసి, వారి చేత పాఠశాలలో విద్యాబోధన చేయిస్తున్న ఉపాధ్యాయ దంపతుల అక్రమాలపై విద్యాశాఖ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వీరి నుంచి రూ.9 కోట్ల 31 లక్షల 50 వేల 373 రికవరీ చేయాలని విద్యాశాఖ తన ఫిర్యాదులో పోలీసులను కోరింది.మీడియాకు అందిన సమాచారం ప్రకారం విష్ణు గార్గ్ 1996 నుండి, అతని భార్య మంజు గార్గ్ 1999 నుంచి బరన్ జిల్లా పాఠశాలలో ఉపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తున్నారు. అయితే వీరు తమ బదులు డమ్మీ టీచర్లను నియమించి, వారిచేత విద్యార్థులకు బోధన సాగేలా చూస్తున్నారు. 2017లోనే వీరి వ్యవహారం బయటపడింది. అయితే రాజస్థాన్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ఉపాధ్యాయులపై విద్యాశాఖ ఉచ్చు బిగించింది.పోలీసులు, విద్యా శాఖ సంయుక్తంగా దాడులు నిర్వహించి, ఈ ఇద్దరు ఉపాధ్యాయుల స్థానంలో నియమితులైన ముగ్గురు డమ్మీ ఉపాధ్యాయులను పట్టుకున్నారు. విషయం తెలుసుకున్న ఆ ఉపాధ్యాయ దంపతులు అరెస్టుకు భయపడి పరారయ్యారు. అక్రమాలకు పాల్పడిన ఈ ఇద్దరు ఉపాధ్యాయులపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి మదన్ దిలావర్ తెలిపారు. -
యూఎస్ మహిళను బురిడి.. 300 విలువ చేసే నగలను రూ. 6 కోట్లకు అమ్మి
విదేశీ మహిళను ఓ నగల వ్యాపారి నిట్ట నిలువునా మోసం చేశాడు, నాణ్యమైన బంగారు నగలపేరుతో ఒకటి కాదు రెండు కాదు ఆరు కోట్ల రూపాయల దోపిడికి పాల్పడ్డాడు. ఈ ఘోరం రాజస్థాన్లో వెలుగుచూసింది. వివరాలు..అమెరికాకు చెందిన చెరిష్ అనే మహిళ జైపూర్లోని జోహ్రీ బజార్లోని బంగారు దుకాణం యజమాని నుంచి బంగారు పాలిష్తో కూడిన బెండి అభరణాలను కొనుగోలు చేసింది. అయితే వాటికి అక్షరాల రూ. 6 కోట్లు వెచ్చించింది. డాది ఏప్రిల్లో యూఎస్లో జరిగిన ఎగ్జిబిషన్లో ఆ ఆభరణాలను ప్రదర్శించింది. ఈ క్రమంలో అవి నకిలీవని తేలింది. వాటి విలువ కేవలం రూ. 300 మాత్రమేనని తెలిసి షాక్కు గురైంది. వెంటనే సదరు మహిళ జైపూర్కి వచ్చి షాప్ యజమాని గౌరవ్ సోనీని నిలదీసింది.అయితే దుకాణం యాజమాని ఆమె ఆరోపణలను కొట్టిపాడేశాడు. దీంతో చెరిష్ జైపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అలాగే యూఎస్ ఎంబసీ అధికారుల నుంచి కూడా సహాయం కోరింది. స్పందించిన అధికారులు ఈ విషయాన్ని పరిశీలించవలసిందిగా జైపూర్ పోలీసులను కోరారు.కాగా 2022లో ఇన్స్టాగ్రామ్ ద్వారా గౌరవ్ సోనీతో పరిచయం ఏర్పడిందని.. గత రెండేళ్లుగా ఆభరణాల కోసం ₹ 6 కోట్లు చెల్లించినట్లు ఆ మహిళ పోలీసులకు తెలిపింది. ప్రస్తుతం గౌరవ్, అతని తండ్రి రాజేంద్ర సోనీ పరారీలో ఉండగా.. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇద్దరి ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
Mosh Pub: అమ్మాయిలను ఎరగా వేసి దందా చేస్తున్న మోష్ పబ్..
సాక్షి,హైదరాబాద్: డేటింగ్ యాప్స్ కేంద్రంగా పబ్స్ యజమానులు, కొందరు యువతులు చేస్తున్న భారీ స్కామ్ వెలుగులోకి వచ్చింది. ఈ యాప్స్ ఆధారంగా వ్యాపారులు, బడా బాబులకు ఎర వేయడం, వాళ్లను పబ్స్కు రప్పించడం ఇందులో మొదటి ఎత్తు. సదరు యువతులకు మద్యం పేరుతో సాఫ్ట్ డ్రింక్స్ సరఫరా చేసే పబ్స్ నిర్వాహకులు భారీ బిల్లుల్ని మాత్రం వెంట వచి్చన వారికి ఇస్తాయి. ఇలా వచ్చిన సొమ్ములో కొంత వాటా ఆ యువతులకు ఇస్తున్నాయి. కొన్నాళ్లుగా గుట్టుగా సాగుతున్న ఈ దందాలో అనేక మంది బాధితులుగా మారినా ఎవరూ బయటపడలేదు. సోమవారం హైటెక్ సిటీ సమీపంలోని మోష్ పబ్లో మోసపోయిన వ్యాపారి సోషల్ మీడియా ద్వారా తన గోడు వెళ్లబోసుకోవడంతో వెలుగులోకి వచి్చంది. ఓ యువతి వలలో పడి రూ.40,505 బిల్లు చెల్లించిన ఆ బాధితుడి వ్యధ ఇది.. టిండర్ యాప్ ద్వారా పరిచయం.. నగరానికి చెందిన వ్యాపారికి డేటింగ్ యాప్ టింబర్ ద్వారా రితికగా పేరు చెప్పుకున్న యువతి పరిచయమైంది. కాసేపు చాటింగ్ చేసిన ఈమె కలుద్దామంటూ ఆఫర్ ఇచ్చింది. వ్యాపారి సైతం ఆసక్తి చూపించడంతో హైటెక్ సిటీ మెట్రో స్టేషన్నుమీటింగ్ పాయింట్గా చెప్పింది. సోమవారం సాయంత్రం అక్కడకు వచ్చిన వ్యాపారిని కలిసిన రితిక కొద్దిసేపటికి సమీపంలోని ఓ భవనం నాలుగో అంతస్తులో ఉన్న పబ్కు వెళ్దామని చెప్పింది. అక్కడకు చేరుకున్న తర్వాత కొద్దిసేపు తీయగా మాట్లాడిన రితిక మద్యం తాగుదామంటూ అడిగింది. వ్యాపారి అంగీకరిచడంతో వెయిటర్ను కలిసి ఆ పబ్లో ఉన్న వాటిలో ఖరీదైన మద్యం ఆర్డర్ ఇచ్చింది. డేటింగ్ యాప్ ద్వారా వల వేయాలని, పడిన వారిని పబ్కు తీసుకురావాలని పబ్ యజమానులు–యువతి మధ్య ఒప్పందం ఉంది. ఈ నేపథ్యంలోనే ‘పబ్స్ అండ్ గారల్స్’ కలిసి వినూత్న స్కామ్కు తెరలేపారు. మద్యం పేరుతో కూల్డ్రింక్స్ సరఫరా.. వ్యాపారితో కలిసి సదరు యువతి రాకను గమనించే పబ్ నిర్వాహకులు వెయిటర్ను అప్రమత్తం చేస్తారు. దీంతో అతడు ఏ మద్యం ఆర్డర్ తీసుకున్నా.. గ్లాసుల్లో సరఫరా చేసేది మాత్రం కూల్డ్రింకే. రితిక సైతం ఆ రోజు ఒక్కో పెగ్గు రూ.1,799 ఖరీదు చేసే పది పెగ్గుల మద్యం ఆర్డర్ చేసింది. ఈ పేరుతో పబ్ నిర్వాహకులు సరఫరా చేసిన కూల్డ్రింక్ తాగుతూపోయింది. దీంతో రూ.20 ఖరీదు చేసే కూల్డ్రింక్కు యువతి సహకారంతో మద్యం రంగుపూసిన నిర్వాహకులు రూ.1,799 చొప్పున వసూలు చేశారు. ఈ ‘మద్యం’తో పాటు ఇతర డ్రింక్స్, తినుబండారాలు కలిపి రూ.40,505 (పన్నులతో కలిపి) బిల్లు చేసింది. చివరకు వెయిటర్ బిల్లు తీసుకువచి్చన తర్వాత అది వ్యాపారి చేతిలో పెట్టిన యువతి వాష్రూమ్కు వెళ్లి వస్తానంటూ ఉడాయించింది. దాదాపు పది పెగ్గులు తాగిన ఆ యువతిలో ఎలాంటి తేడా లేకపోవడం, తూలకుండా నేరుగా నడిచి వెళ్లడంతో పాటు ఆమె ఎంతకీ తిరిగి రాకపోవడంతో వ్యాపారికి అనుమానం వచ్చింది. ఆ పబ్కు సంబంధించిన గూగుల్ రివ్యూస్ పరిశీలించి షాక్ అయ్యాడు. అక్కడ వేదనలు నిత్యకృత్యం సదరు పబ్లో ఇలాంటి మోసాలు నిత్యకృత్యమంటూ అనేక మంది వెలిబుచ్చిన వేదనలు ఆ రివ్యూస్లో ఆ వ్యాపారికి కనిపించాయి. ఓ వ్యక్తి రూ.16 వేలు, మరో వ్యక్తి రూ.24 వేలు, ఇంకొకరు రూ.20 వేలు చొప్పున చెల్లించారని తెలిసింది. వీరిలో ఒకరైతే బాత్రూమ్కు వెళ్లిన ఆ యువతి కోసం దాదాపు ఏడెనిమిది గంటలు పబ్లోనే వేచి ఉన్నారట. దీనికోసం ఆయన చేసిన ఖర్చు మందు బిల్లుకు అదనం. రితిక, కృతిక పేర్లతో కొందరు యువతులు ఇదే పబ్ నిర్వాహకులతో కలిసి ఈ దందా చేస్తున్నారని, అలా వచి్చన మొత్తంలో యువతులు కొంత కమీషన్ తీసుకుంటున్నారని వ్యాపారి గుర్తించారు. ఈ విషయంపై పబ్ నిర్వాహకులను ప్రశ్నించగా.. వారి నుంచి బెదిరింపులు ఎదురయ్యాయి. అంతలోనే రంగ ప్రవేశం చేసిన బౌన్సర్లు బలవంతంగా బిల్లు కట్టించి పంపారు. దీంతో ఆ వ్యాపారి తన గోడును సోషల్ మీడియా ద్వారా వెళ్లబోసుకోవడంతో విషయం వెలుగులోకి వచ్చింది. మోష్ పబ్పై కేసు నమోదు హైటెక్ సిటీలోని మోష్ పబ్ యాజమాన్యంపై శుక్రవారం సుమోటో కేసు నమోదు చేసినట్లు మాదాపూర్ ఎస్సై ఎన్వీ రమణ తెలిపారు. కొన్ని ఆన్లైన్ డేటింగ్ యాప్స్ ద్వారా అమ్మాయిలతో ఎరవేసి, అలా వచ్చిన కస్టమర్లకు విలువైన మద్యం తాగించి, వారి నుంచి ఎక్కువ మొత్తంలో బిల్లులు వసూలు చేస్తున్నట్లు ఆరోపించారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన అంశాల ఆధారంగా నమోదైన ఈ కేసు దర్యాప్తులో ఉందని, వెలుగులోకి వచి్చన అంశాల ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ వ్యవహారంలో ఆయా యువతులకు, పబ్కు మధ్య సంబంధం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.బాధితుల భయమే వీరికి వరం ఇలా యువతుల వల్లో పడిన బాధితుల్లో అనేక మంది వివాహితులు, ఉన్నత కుటుంబాలకు చెందిన వాళ్లు ఉంటున్నారు. దీంతో తాము మోసపోయామని తెలిసినా.. యువతి కోసం వెళ్లామని బయటపడితే పరువుపోతుందని భయపడుతున్నారు. దీంతో కొందరు మాత్రం పబ్కు సంబంధించిన గూగుల్ రివ్యూస్లో విషయం పొందుపరుస్తున్నా.. అనేక మంది మిన్నకుండిపోతున్నారు. ఇదే అటు పబ్ నిర్వాహకులు, యువతులకు వరంగా మారుతోంది. ఈ తరహా దందాలో ఆ ఒక్క పబ్లోనే కాదని, నగరంలోని అనేక పబ్బుల్లో జరుగుతోందనే అనుమానాలు ఉన్నాయి. వాటిలోకి ఈ ‘జంటలు’ ప్రవేశిస్తున్న సమయంలో కేవలం యువకుల వివరాలు మాత్రమే అడిగి, నమోదు చేసుకుంటున్నారు. ఈ హనీట్రాప్ దందాపై తమకు ఎలాంటి సమాచారం, ఫిర్యాదులు లేవని పోలీసులు చెబుతున్నారు. ఇలా చేయడం కచి్చతంగా నేరమే అని, దీనికి యువతులతో పాటు పబ్స్ నిర్వాహకులు బాధ్యులని స్పష్టం చేస్తున్నారు. బాధితులుగా మారిన ఎవరైనా ముందుకు వచ్చి ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేస్తున్నారు. -
భారీగా బయటపడ్డ అక్రమ ఆస్తుల చిట్టా
-
అపార్ట్మెంట్ కట్టలేదు..స్థలం అమ్మేశారు!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్లో మరో ప్రీ లాంచ్ దందా వెలుగులోకి వచ్చింది. కొంపల్లిలో భారీ అపార్ట్మెంట్ ప్రాజెక్టును నిర్మిస్తున్నామని ప్రచారం చేసి, కస్టమర్ల నుంచి పెద్ద మొత్తంలో డిపాజిట్లు సేకరించి చేతులెత్తేసిన భారతి బిల్డర్స్ కు చెందిన ముగ్గురు యజమానులను సైబరాబాద్ ఆర్థిక నేరాల విభాగం (ఈఓ డబ్ల్యూ) పోలీసులు అరెస్టు చేసి, కోర్టు ఆదేశాల మేరకు జ్యుడీషియల్ రిమాండ్కు తరలించారు. వివరాలను డీసీసీ కె.ప్రసాద్ వెల్లడించారు. నగరానికి చెందిన దూపాటి నాగరాజు, మల్పూరి శివరామకృష్ణలు 2021 లో మాదాపూర్లో భారతి బిల్డర్స్ పేరుతో నిర్మాణ సంస్థను ప్రారంభించారు. ఈ క్రమంలో మేడ్చల్ మల్కా జిగిరి జిల్లా కొంపల్లిలో 6.23 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. భారతి లేక్ వ్యూ పేరుతో అపార్ట్మెంట్లను నిర్మిస్తామని ప్రకటించారు. కస్టమర్లను ఆకర్షించేందుకు ప్రీ లాంచ్ ఆఫర్కు తెరలేపారు. చదరపు అడుగు రూ.3,200కే విక్రయిస్తు న్నామని ప్రచారం చేశారు. ఈ మేరకు కొంపల్లి చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రత్యేకంగా సమావేశాలు సైతం నిర్వహించారు.రూ.60 కోట్లు వసూలు..: తమ ప్రణాళికను అమలు చేసేందుకు తొడ్డాకుల నర్సింహారావు అలియాస్ పొన్నారిని కంపెనీ సీఈఓగా నియమించారు. భారీ కమీషన్ ఇస్తామని ఆశ చూపించారు. ఈ నేపథ్యంలో దాదాపు 350 మంది కస్టమ ర్ల నుంచి రూ.60 కోట్లు వసూలు చేశారు. కానీ నిర్మాణాన్ని ప్రారంభించలేదు. మరోవైపు రూ.100 కోట్ల విలువైన 6.23 ఎకరాల స్థలాన్ని సంస్థ యజమానులు రెట్టింపు ధరకు ఇతర వ్యక్తులకు విక్రయించేశారు. అటు అపార్ట్మెంట్ నిర్మాణం ప్రారంభం కాక, వాటా స్థలమైనా దక్కే అవకాశం లేక కస్టమర్లు రోడ్డున పడ్డారు. బాధితుల్లో ఒకరైన బీవీఎస్ ప్రసాద్ సైబరాబాద్ ఈఓడబ్ల్యూ ఠాణాలో ఫిర్యాదు చేశారు. తెలంగాణ ప్రొటెక్షన్ ఆఫ్ డిపాజిటర్స్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్–1999 కింద కేసు నమోదు చేసిన పోలీసులు ముగ్గురు నిందితులు నాగరాజు, శివరామకృష్ణ, నర్సింహారావులను అరెస్టు చేశారు. -
సేనానికి ప్యాకేజీ.. నమ్ముకున్నవారికి నిరాశ..!
వారంతా పదేళ్ళుగా జనసేన జెండా మోస్తున్నారు. ఇప్పుడు వాళ్ళకు ఆ జెండా కర్రలే మిగిలాయి. పార్టీని నమ్మినవారిని పవన్కల్యాణ్ నిలువునా ముంచేశారు. అందుకే వారంతా ఆ జెండా కర్రలతోనే తిరగబడుతున్నారు. పవన్ చేసిన మోసానికి తాము బలయ్యామని మండిపడుతున్నారు. ప్యాకేజీ స్టార్గా మారిపోయి పార్టీని చంద్రబాబుకు అద్దెకిచ్చిన పవన్ అందరినీ నట్టేట ముంచేశారని రోదిస్తున్నారు. రానున్న రోజుల్లో జనసేన పూర్తిగా అదృశ్యమవుతుందని శాపనార్థాలు పెడుతున్నారు. అసలు జనసేనలో ఏం జరుగుతోందో చూద్దాం. ఎవరైనా రాజకీయ పార్టీ స్థాపిస్తే ఎన్నికల్లో పోటీ చేస్తారు. అంతకంటే ముందు పార్టీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేస్తారు. నాయకుల్ని తయారు చేసుకుంటారు. కాని జనసేనను పదేళ్ళ క్రితం స్థాపించిన పవన్కల్యాణ్ తన పార్టీని టీడీపీకి అద్దెకిచ్చేశారు. అప్పటి నుంచి చంద్రబాబు కోసమే కష్టపడుతున్నారు. అందుకు తగిన ప్రతిఫలం ప్యాకేజీ రూపంలో అందుకుంటున్నారు. ఇవన్నీ జనసేనలో పదేళ్ళుగా పనిచేస్తున్నవారే చెబుతున్న మాటలు. తనకు కులం లేదంటూ కులాల మధ్య చిచ్చు పెట్టిన పవన్ తన సొంత కులానికి, బీసీలకు పూర్తిగా అన్యాయం చేశారని పవన్ను నమ్మి మునిగిపోయిన నాయకులు చెబుతున్నారు. అందుకే జనసేన జెండా మోసినందుకు సిగ్గుపడుతూ ఒక్కొక్కరుగా పార్టీని వీడి బయటకు వెళ్ళిపోతున్నారు. విజయవాడ వెస్ట్ నియోజకవర్గానికి చెందిన పోతిన మహేష్ పవన్ కళ్యాణ్ తీరును ఎండగడుతూ జనసేన పార్టీకి రాజీనామా చేశారు. పశ్చిమ సీటును తనకు ఇస్తున్నట్లు ప్రకటించి చివరికి చంద్రబాబు ఆదేశం మేరకు ఆయన బినామీ సుజనాచౌదరికి బీజేపీ తరపున టిక్కెట్ దక్కేలా చేశారని పోతిన చెప్పారు. పవన్ చేసిన మోసానికి ఆగ్రహించిన పోతిన తన కార్యాలయంలో ఆయన ఫ్లెక్సీలను, ఫోటోలను తొలగించారు. బడుగు బలహీన వర్గాల వారిని పవన్ కళ్యాణ్ మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు బినామీ కోసం బీసీ నేతనైన తనను బలి పశువును చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీలే త్యాగాలు చేయాలా అగ్రకుల నేతలతో త్యాగాలు చేయించలేరా అంటూ పవన్ను నిలదీశారు పోతిన మహేశ్.. కైకలూరు టిక్కెట్ ఆశించిన బివి రావు కూడా పోతిన మహేష్ దారిలోనే పయనించి..జనసేన పార్టీకి రాజీనామా చేశారు. గతంలో ఆయన కైకలూరు నుంచి జనసేన తరపున పోటీ చేశారు. ఈసారి పొత్తులో భాగంగా చంద్రబాబు తొత్తుగా వ్యవహరించే బీజేపీ నేత కామినేని శ్రీనివాస్కు కైకలూరు అసెంబ్లీ సీటు కేటాయించారు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన బి వి. రావు జనసేన పార్టీకి గుడ్ బై చెప్పేసారు. పితాని బాలకృష్ణ ఉభయగోదావరి జిల్లాలో బలమైన శెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందిన నేత. ముమ్మిడివరం జనసేన ఇన్ఛార్జ్గా పనిచేసేవారు.. బాలకృష్ణ ముమ్మిడివరం నుంచి పోటీ చేస్తారని అనేక సందర్భాల్లో పవన్ కళ్యాణ్ ప్రకటించారు. బీసీలు అంటే తనకు అభిమానమని తెలిపారు. చివరికి పవన్ కళ్యాణ్ మాటలు నీటి మీద రాతలు గానే తేలిపోయాయి. ముమ్మిడివరం సీటును పొత్తులో భాగంగా టిడిపికి కేటాయించారు. బీసీలకు జరుగుతున్న మోసాన్ని తట్టుకోలేక పితాని బాలకృష్ణ సీఎం వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరారు. కాకినాడ మాజీ మేయర్ పొలసపల్లి సరోజ కాకినాడ రూరల్ సీటుపై గంపెడాశలు పెట్టుకున్నారు. పార్టీ కోసం అనేక కార్యక్రమాలు నిర్వహించారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన మహిళ కావడంతో తనకే సీటు వస్తుందని ఆశించారు. కానీ అక్కడ సరోజని కాదని మరొకరికి పవన్ సీటు ఇచ్చారు. దీంతో ఆమె ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ తీరుపై భగ్గుమన్నారు. పార్టీలో మహిళలకు ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ ప్రశ్నించారు. అనకాపల్లి లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది.. అనకాపల్లిలో మొదటి నుంచి పార్టీ కార్యక్రమాలను నియోజకవర్గ ఇంఛార్జ్గా పరుచూరి భాస్కరరావు బాధ్యతలు నిర్వహించేవారు. పవన్ కళ్యాణ్ అనకాపల్లి జిల్లాకు వచ్చిన ప్రతి సందర్భంలోనూ భాస్కరరావే ఖర్చు భరించేవారు. భాస్కరరావుని కాదని ఇటీవల పార్టీలో చేరిన కొణతాల రామకృష్ణకు అనకాపల్లి ఎమ్మెల్యే సీటు పవన్ కళ్యాణ్ జనసేన తరపున కేటాయించారు. దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన భాస్కరరావు జనసేన పార్టీకి రాజీనామా చేశారు. పిఠాపురంలో మాకినీడు శేషుకుమారికి సీటు ఇస్తామని చెప్పి ఆమెతో పార్టీ కోసం భారీగా ఖర్చు పెట్టించారు. పిఠాపురంలో పోటీ చేయాలని భావించిన పవన్ ఆమెను పక్కనపెట్టారు. పార్టీకి పనిచేసిన మహిళా నేతగా పిఠాపురంలో ఆమెకు సీటు ఇవ్వకపోయినా వేరే నియోజకవర్గంలో సీటు ఇస్తారని ఆమె ఆశించారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఆమెకు ఎక్కడా సీటు లేదంటూ చెప్పేశారు. దీంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురై జనసేనకు రాజీనామా సమర్పించి ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇంకా మిగిలిన మరికొందరు నేతలు కూడా జనసేనను వీడేందుకు సిద్ధమవుతున్నారని ప్రచారం జరుగుతోంది. -
ఒక రోజు అద్దెతో ఐదేళ్లు తిష్ట.. న్యూయార్క్ హోటల్లో వింతవైనం!
సాధారణంగా ఎవరైనా ఏదైనా హోటల్లో బస చేయానుకుంటే ఒక రోజో, రెండు రోజులో ఉంటారు. అయితే అమెరికాకు చెందిన ఒక వ్యక్తి ఏకంగా హోటల్లో ఐదు సంవత్సరాలు గడిపాడు.. అది కూడా అద్దె లేకుండా.. నమ్మశక్యం కాని ఈ నిజం వెనుకనున్న కథనాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. వార్తా సంస్థ అసోసియేటెడ్ ప్రెస్ తెలిపిన వివరాల ప్రకారం మిక్కీ బారెటో(48) న్యూయార్క్లోని మాన్హాటన్లో ఉన్న ఒక హోటల్కు తానే యజమానినని చెప్పుకుంటూ ఐదేళ్లుగా అద్దె చెల్లించకుండా అందులోనే ఉంటున్నాడు. ఈ వ్యవహారంలో తప్పుడు ఆస్తుల రికార్డులు సృష్టించినందుకు తాజాగా పోలీసులు అతనిని అరెస్టు చేశారు. 1930లో నిర్మితమైన ఈ వెయ్యి గదుల ఆర్ట్ డెకో న్యూయార్కర్ హోటల్లో ఐదేళ్ల క్రితం మిక్కీ బారెట్తో పాటు అతని ప్రియురాలు 200 డాలర్లకు (రూ. 16,500) ఒక గదిని బుక్ చేసుకున్నారు. మిక్కీ లాస్ ఏంజిల్స్ నుండి న్యూయార్క్కు వచ్చినప్పుడు తన ప్రియురాలిలో కలిసి ఈ గదిలో దిగాడు. తరువాత హోటల్ గదుల బుకింగ్ చట్టానికి సంబంధించిన అక్రమాల గురించి మిక్కీ తన ప్రియురాలికి చెప్పాడు. ఎవరైనా 1969 కి ముందు నిర్మించిన భవనంలో ఒకే గదిలో నివసిస్తున్నట్లయితే, వారు ఆరు నెలల లీజు కింద గదిని తీసుకోవచ్చు. హోటల్లో ఒక రాత్రి బస చేసేందుకు డబ్బులు చెల్లించిన తరువాత గదిని లీజుకు అడిగాడు. అయితే దీనికి హోటల్ యాజమాన్యం నిరాకరించింది. మిక్కీ ఈ విషయమై కోర్టును ఆశ్రయించాడు. ప్రాథమిక విచారణలో న్యాయమూర్తి ఇందుకు అనుమతించకపోవడంతో, మిక్కీ సుప్రీంకోర్టుకు ఆశ్రయించాడు. ఈ కేసులో విజయం సాధించిన మిక్కీకి బస చేసేందుకు హోటల్ గదిని ఇవ్వాలని, తాళం చెవిని కూడా అందించాలని కోర్టు ఆదేశించింది. దీంతో 2019 నుంచి 2023, జూలై వరకు అద్దె చెల్లించకుండా అదే హోటల్లో నివసిస్తున్నాడు. అయితే 2019లో ఒక నకిలీ అగ్రిమెంట్ లెటర్ను సృష్టించి, తానే హోటల్ యజమానినని ప్రకటించుకున్నాడు. తరువాత హోటల్ గదుల అద్దెను వసూలు చేయడం మొదలుపెట్టాడు. అనంతరం హోటల్ పేరిట బ్యాంక్ ఖాతా తెరిచి, నగదు తనకు బదిలీ అయ్యేందుకు ప్రయత్నించాడు. తాజాగా అతనిపై చీటింగ్ కేసు నమోదయ్యింది. అయితే తాను హోటల్ నుంచి ఒక్క రూపాయి కూడా సంపాదించలేదని మిక్కీ ఒక ప్రకటనలో తెలిపాడు. -
పేకాటలో హైటెక్ చీటింగ్!
సాక్షి, హైదరాబాద్/బంజారాహిల్స్: బంజారాహిల్స్లోని రాడిసన్ హోటల్ కేంద్రంగా సాగిన పేకాటలో హైటెక్ చీటింగ్ దందాలు వెస్ట్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. మహబూబ్నగర్కు చెందిన శ్రీను నేతృత్వంలోని తొమ్మిది మందితో కూడిన ముఠాను పట్టుకున్నారు. వీరితో పాటు పేకాట ఆడుతున్న నలుగురినీ అదుపులోకి తీసుకుని బంజారాహిల్స్ అధికారులకు అప్పగించారు. నిందితులకు నోటీసులు జారీ చేశామని బంజారాహిల్స్ ఇన్స్పెక్టర్ పి.సతీష్ బుధవారం ‘సాక్షి’కి తెలిపారు. మహబూబ్నగర్లోని సుభా‹Ùనగర్కు చెందిన సింగిడి శ్రీనివాస్ అలియాస్ శ్రీను తన స్నేహితులతో కలిసి తరచూ గోవాలోని క్యాసినోవాలకు వెళ్లి వస్తుండేవారు. అక్కడ పేకాటలో భారీగా నష్టపోయిన ఇతగాడు అదే ఆటలో మోసాలకు పథక రచన చేశాడు. నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన సూర్య, మెరి్వన్, చంద్రశేఖర్, గుర్మీత్ సింగ్, సంతోష్ కుమార్, సయ్యద్ నయీం, వేణు, వినోద్లతో ముఠా ఏర్పాటు చేశాడు. ఎదుటి వారి పేక ముక్కలు కనిపించేలా.. ఆన్లైన్లో ఆర్డర్ ఇచి్చన శ్రీను రూ.25 వేలు వెచి్చంచి ఎక్స్రే విజన్ కాంటాక్ట్ లెన్స్ను ఖరీదు చేశాడు. పేకాట సమయంలో ఎవరైనా దీన్ని ధరిస్తే ఎదుటి వ్యక్తి చేతిలోని ముక్కలు ఏంటో తెలుసుకోవచ్చు. దీన్ని ఎలా వినియోగించాలనేది మెరి్వన్ యూ ట్యూబ్ ద్వారా తెలుసుకుని ధరిచడం మొదలెట్టాడు. గోవాలో పేకాట నేపథ్యంలో పరిచయమైన సరితకు తాము రాడిసన్ హోటల్ కేంద్రంగా భారీ పేకాట శిబిరం నిర్వహిస్తున్నట్లు సమాచారం ఇచ్చాడు. దీంతో ఈమెతో పాటు బంధువులు, స్నేహితులు అయిన సాయి కృష్ణ, వినోద్కుమార్, కుమారీ అక్కడకు వచ్చి పేకాట ఆడేందుకు ఆసక్తి చూపారు. దీంతో ముందే రూ.1.5 లక్షల తన ఖాతాలో డిపాజిట్ చేయించుకున్న శ్రీను.. తన ముఠాకు చెందిన వాళ్లనూ పేకాట ఆడే వారి మాదిరిగానే రంగంలోకి దింపాడు. తన ఖాతాలో పడిన మొత్తం నుంచి రూ.24 వేలు వెచి్చంచిన శ్రీను.. రాడిసన్ హోటల్లో స్వీట్ రూమ్ బుక్ చేశాడు. మంగళవారం మధ్యాహ్నం 3.30 గంటలకు అక్కడుకు చేరుకున్న అంతా పేకాట ఆడటం మొదలెట్టారు. వినోద్ తదితరులకు శ్రీను రూ.4,500 విలువైన కాయిన్లు కూడా ఇచ్చాడు. ఎక్స్రే విజన్ కాంటాక్ట్ లెన్స్ ధరించిన మెరి్వన్ వినోద్కుమార్, సరిత చేతుల్లోని పేక ముక్కలు తెలుసుకుని.. తన ముఠా సభ్యుల సాయంతో వాళ్లు ఓడిపోయేలా చేస్తున్నాడు. ఇది పశ్చిమ మండల టాస్్కఫోర్స్ పోలీసులకు సమాచారం అందడంతో దాడి చేసిన అధికారులు 13 మందినీ అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి రూ.2400 నగదు, 4500 కాయిన్లు, లెన్స్ను స్వాధీనం చేసుకుని బంజారాహిల్స్ పోలీసులకు అప్పగించారు. శ్రీను తన గ్యాంగ్లోని వారికి ఒక్కో విడతకు రూ.2 వేలు చొప్పున చెల్లిస్తున్నాడని, లెన్స్ ధరించి సాంకేతిక సహకారం అందించే మెరి్వన్కు మాత్రం రూ.5 వేలు చొప్పున ఇస్తున్నాడని పోలీసులు గుర్తించారు. శ్రీను ఖాతాలో ఉన్న రూ.84 వేలు సైతం ఫ్రీజ్ చేశారు. ఈ గ్యాంగ్ గతంలోనూ కొందరిని ఇలా మోసం చేసినట్లు అనుమానిస్తున్న పోలీసులు ఆ కోణంలో ఆరా తీస్తున్నారు. పేకాట శిబిరం నిర్వహిస్తున్న శ్రీను, అతడి గ్యాంగ్తో పాటు పేక ఆడటానికి వచి్చన నలుగురికీ నోటీసులు జారీ చేశారు. -
మహిళ కనిపిస్తే.. వేధింపులేనా? మీరేం మనుష్యులు
మహిళలకు సంబంధించి ఓ ముఖ్యమైన విషయాన్ని సోషల్మీడియాలో ప్రస్తావించారు డాక్టర్ శ్రీకాంత్ మిరియాల. ఆయన ట్విట్టర్ వేదికగా రాసిన పోస్టు యథాతధంగా.. నేను వైద్యం చేసిన ఎంతోమంది ఆడవాళ్లు (వయసు నిమిత్తం లేకుండా), నా స్నేహితురాళ్ల అనుభవాలు ఇవి. ఈ దురదృష్ట అనుభవాలు అన్ని దేశాల్లో ఉన్నప్పటికీ మనదేశంలో బాగా ఎక్కువ. ఏమిటివి? వీధుల్లో, బస్సుల్లో,రైళ్లలో, ఇళ్లలో,ఆడుకునే స్థలాల్లో, పనిచేసే ప్రదేశాల్లో, గుళ్లలో సమయం సందర్భం ఏదైనాగానీ ఆడవాళ్ళ వెంటబడటం, తేరిపార చూడటం, సైగలు చెయ్యటం, ఫోటోలు తీయటం మాత్రమే కాకుండా కావాలని రాసుకుని వెళ్ళటం, ఇంకా మితిమీరి తాకటం, ముట్టటం, పట్టుకోవడం, కొట్టటం, హఠాత్తుగా మీద పడడం లాంటివి చేసి చాలా ఇబ్బంది పెడతారు. ఇలా ఎందుకు చేస్తారు అన్నదానికి మానసిక శాస్త్ర పరంగా చాలా కారణాలున్నప్పటికీ ఇది చెడ్డ ప్రవర్తన. ఒకసారి చేసి పట్టుబడనప్పుడు వీళ్లలో ధైర్యం పెరిగి మళ్లీ మళ్లీ చేస్తూ, వారి చర్యల తీవ్రత కూడా పెరుగుతుంది. ముందు భయంతో చేసి, చేశాక ఆనందాన్ని పొందే వీళ్లు తర్వాత తర్వాత దాడికి గురైన ఆడవాళ్ల ముఖంలో ఉండే భయాన్ని, షాక్ ని చూసి ఒక పైశాచిక ఆనందాన్ని పొందుతుంటారు. వీళ్లని నియంత్రించే ఒకే ఒక్క మార్గం ఎదిరించటం, పట్టుకుని ప్రశ్నించడం. అలా జరిగిన చాలా సందర్భాల్లో అందరూ కలిసి దేహశుద్ధి చేస్తారు. ఒకసారి పట్టుబడ్డాక చాలామంది మానేస్తారు కానీ కొంతమంది కొనసాగిస్తారు. వీళ్లని కఠినంగా శిక్షించటం ద్వారా ఈ నేరాల తీవ్రత కొంతవరకు తగ్గించవచ్చు. ఈమధ్య వచ్చే కొన్ని సినిమాలు కూడా ఇటువంటి ప్రవర్తనని ఎగదోస్తున్నాయి. ఇటువంటి సంఘటనలు ఆడవాళ్ళని చాలా ఇబ్బంది పెడతాయి. వాళ్లని చాలా బాధకి గురిచేస్తాయి. కోపం, దిగులు, బయటికెళ్లాలంటే భయం, వణుకు, నిస్సహాయత మొదలైన అనుభూతులకి గురవ్వటమే కాకుండా ఆత్మన్యూనత, తమనితాము నిందించుకోవడం, తమ వస్త్రాలంకరణని ప్రశ్నించుకోవడం, తోడు లేనిదే బయటికి వెళ్లకపోవడం చేస్తుంటారు. పైగా ఈబధని ఎవరితో చెప్పుకోలేక సతమతమౌతుంటారు. చెప్పినా కూడా కొన్నిసార్లు వీళ్లే నిందలకు గురవుతుంటారు. కొన్ని గుర్తుపెట్టుకోండి. 1. ఈ అనుభవాలు మీ ఒక్కరికే కాదు, దాదాపు అందరి ఆడవాళ్లలో ఉంటాయి. ఒకసారి మీ అమ్మాయి/సోదరి/భార్య/స్నేహితురాళ్లతో చర్చించండి. వారికి సాంత్వన చేకూర్చి ధైర్యాన్ని ఇచ్చినవాళ్లవుతారు. 2. తప్పు ఎప్పుడూ దాడి చేసినవాళ్లదే. మీరు ఒంటరిగా బయటికి వెళ్ళటం, మీ వస్త్రాలంకరణ, మీ మాటలు ఇవేవీ కూడా వారు మీతో అలా ప్రవర్తించడానికి పచ్చజెండా కాదు. 3. మిమ్మల్ని మీరు నిందించుకోవద్దు. రోడ్డుపై వెళ్ళేటప్పుడు జాగరూకతతో ఉండండి, ఎదుటివాళ్లపై అనుమానం ఉంచి వాళ్లు మిమ్మల్ని దరి చేరేటప్పుడు బ్యాగ్ ఒక చేతి నుంచి ఇంకో చేతికి మార్చటం, చేతులు విదల్చటం వంటి హఠాత్చర్యల వలన దాడిచేసేవాళ్లు దూరం జరుగుతారు. 4. దాడి జరిగినప్పుడు వెంటనే పట్టుకుని ప్రశ్నించండి. వాళ్లు హెడ్లైట్ల కింద దొరికిన కుందేలులా స్థాణువైపోతారు. 5. ఇటువంటి అనుభవాలు మిమ్మల్ని తీవ్ర మానసిక ఇబ్బందికి గురిచేసినా లేక మీ లైంగిక జీవితాన్ని అస్తవ్యస్తం చేసినా మానసిక నిపుణుల్ని కలవండి. డాక్టర్ శ్రీకాంత్ మిరియాల -
గ్యాస్ కనెక్షన్ చెకప్ పేరుతో నయా మోసం
దన్వాడ: ఇండియన్ గ్యాస్ కనెక్షన్ చెకప్ పేరుతో కొందరు కేడీలు నయా మోసానికి తెరలేపారు. గ్యాస్ కనెక్షన్ చెకప్ చేసేందుకుగాను రూ.236 చొప్పున వసూలు చేసి వినియోగదారులను బురిడీ కొట్టించారు. ఈ ఘటన నారాయణపేట జిల్లా ధన్వాడ మండలం కిష్టాపూర్లో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళ్తే.. ఇండియన్ గ్యాస్ కనెక్షన్ చెకప్ పేరుతో బుధవారం ఆరుగురు వ్యక్తులు వినియోగదారుల ఇళ్లకు వెళ్లారు. ప్రతి సంవత్సరం గ్యాస్ కనెక్షన్ చెకప్ చేసుకోవాల్సి ఉంటుందని.. ఇందుకుగాను రూ.236 చొప్పున చెల్లించాలని పేర్కొన్నారు. గ్యాస్ కనెక్షన్ చెకప్ చేయించుకోకపోతే సరఫరాలో ఇబ్బందులు తలెత్తుతాయని చెప్పారు. వీరి మాటలు నమ్మిన కొందరు వినియోగదారులు.. గ్యాస్ కనెక్షన్ చెకప్ కోసం రూ.236 చొప్పున చెల్లించారు. గ్రామంలో మొత్తం 300 కనెక్షన్లు ఉండగా.. 200 మంది నుంచి దాదాపు రూ.50వేల వరకు వసూలు చేసినట్లు తెలిసింది. కొందరికి అనుమానం వచ్చి గురువారం గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులను సంప్రదించగా.. తాము ఎలాంటి చెకప్లు చేయడంలేదని తెలిపారు. తమ కార్యాలయంలోనే సిలిండర్ను పూర్తి స్థాయిలో చెక్చేసి, వినియోగదారులకు అందజేస్తామని తెలియజేశారు. కాగా గ్యాస్ కనెక్షన్ చెకప్ పేరుతో డబ్బులు వసూలు చేసిన దుండగులు.. అందుకు సంబంధించిన రసీదులు ఇవ్వడం గమనార్హం. ఏదేమైనప్పటికీ రోజురోజుకు కొత్త కొత్త మోసాలు వెలుగు చూస్తుండటంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ప్రస్తుత సమాజంలో ఎవరిని నమ్మా లో తెలియని పరిస్థితి నెలకొందని వాపోతున్నారు. -
హోంగార్డు ఉద్యోగాల పేరిట ఐపీఎస్ అధికారి ఘరాన మోసం
మంగళగిరి: హోంగార్డు ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగులకు ఓ ఐపీఎస్ అధికారి శఠగోపం పెట్టిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసుల కథనం ప్రకారం.. ప్రస్తుతం వేరే శాఖలో విధులు నిర్వహిస్తున్న ఒక ఐపీఎస్ అధికారి గతంలో రాష్ట్రంలో వివిధ హోదాలలో పనిచేశారు. ఏలూరులో పనిచేసిన సమయంలో ఏలూరుకు చెందిన ఒక మహిళతో సహజీవనం చేశారు. అనంతరం ఐజీపీ హోంగార్డు రాష్ట్ర అధికారిగా పనిచేసిన సమయంలో ఆ మహిళ కుటుంబ సభ్యులు ఐజీపీ సహకారంతో హోంగార్డు ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ 200 మందికిపైగా నిరుద్యోగులు ఒక్కొక్కరి నుంచి రూ.6 నుంచి రూ.7 లక్షలు వసూలు చేశారు. అధికారి ఐజీపీగా ఉన్న సమయంలో కొందరికి హోంగార్డు ఉద్యోగాలు ఇచ్చారు. అధికశాతం మందికి పోస్టింగులు ఇవ్వలేకపోయారు. దీంతో నిరుద్యోగులు ఒత్తిడి చేయడంతో 2022లో ఐజీపీ హోంగార్డ్స్ పేరుతో తాను పోస్టులో లేకపోయినా తనే ఐజీపీ హోంగార్డు అయినట్లు సంతకాలు చేసి నకిలీ అపాయింట్మెంట్లు ఇచ్చారు. వాటితో అభ్యర్థులు పోలీస్ ఉన్నతాధికారులను కలవగా అనుమానం వచ్చి రహస్యంగా విచారణ చేశారు. అవి నకిలీ అపాయింట్మెంట్లు అని తేలడంతో నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేదు. అదే సమయంలో బాధిత నిరుద్యోగి తలాజి విజయ్కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విచారణ ప్రారంభించిన పోలీసులు విచారణలో వెలుగులోకి వచ్చిన వాస్తవాలతో విస్తుపోయినట్లు తెలిసింది. నిరుద్యోగుల నుంచి వసూలు చేసిన కొంతనగదు దళారుల ఖాతాల నుంచి ఐజీపీతోపాటు ఆయన ప్రియురాలి ఖాతాలకు వెళ్లినట్లు గుర్తించారు. వీరు హైదరాబాద్లో విల్లాలు కొన్నట్టు సమాచారం. దీంతో అధికారి ప్రియురాలి పెద్ద అల్లుడితోపాటు మధ్యప్రదేశ్కు చెందిన దళారులు ఏడుగురిని రెండు రోజుల క్రితం పోలీసులు అరెస్ట్ చేశారు. మరింత లోతుగా విచారణ చేస్తున్నారు. అరెస్టులతో అప్రమత్తమైన అధికారి మంగళవారం హైకోర్టులో ముందస్తు బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు చేసినట్లు పోలీస్ ఉన్నతాధికారులు తెలిపారు. -
ఇద్దరితో ప్రేమాయణం.. ప్రియుడి కోసం యువతుల కొట్లాట
వెంగళరావునగర్(హైదరాబాద్): ఇద్దరు యువతులను మోసం చేసి మూడో యువతితో పెళ్లితంతుకు సిద్ధమైన యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఆ వ్యక్తి తనకు మాత్రమే సొంతమంటూ మహిళలు కేసు పెట్టిన విచిత్రమైన సంఘటన మధురానగర్ పోలీస్ స్టేషన్లో చోటు చేసుకుంది. పోలీసుల సమాచారం మేరకు... ఏపీలోని రాయచోటి ప్రాంతానికి చెందిన బాబా ఫక్రుద్దీన్ అనే యువకుడు మాదాపూర్లోని ఓ ఆస్పత్రిలో పనిచేస్తుంటాడు. అదే ఆస్పత్రిలో పని చేసే యువతి రెండేళ్ల క్రితం అతనికి పరిచయం అయింది. ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించి వెంగళరావునగర్ డివిజన్లోని ఒక బస్తీలో నివాసం ఉంటున్న యువతి రూముకు అనేకమార్లు వచ్చి తన కోర్కెను తీర్చుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత ఆమెకు చెప్పకుండా కార్ఘానాలోని మరో ఆస్పత్రిలో చేరాడు. అక్కడ పనిచేసే ఇంకో యువతితో సేమ్ సీన్ రిపీట్ చేశాడు. కట్ చేస్తే... (ఈ నెల 6న) ఎవరికీ చెప్పకుండా స్వగ్రామం వెళ్లాడు. అక్కడ తన ఇంటి పక్కనే ఉంటున్న యువతిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యాడు. ఈ నెల 24న నిశ్చితార్థం చేసుకోవాలనుకుని అనుకున్నాడు. పక్కాగా ప్లానింగ్ చేసి ఉంగరాలు, దండలు మార్చుకోవాలనుకునే సమయంలో సినీ ఫక్కీలో మధురానగర్ ఎస్ఐ ఇక్బాల్ షడన్గా రంగ ప్రవేశం చేశారు. ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ ఆదేశాల మేరకు నిశ్చితార్థాన్ని చివరి నిమిషంలో అడ్టుకున్నాడు. అందరూ ఆశ్చర్యంగా చూస్తుండగా వారికి అతని ఫ్లాష్బ్యాక్ మొత్తం చెప్పి నిందితుడిని హైదరాబాద్కు తీసుకొచ్చారు. సమస్య పరిష్కారం అయిందనుకున్నారంతా... అయితే ఇక్కడే అసలు కథ మొదలైంది. ఫక్రుద్దీన్ను మధురానగర్కు తీసుకువచ్చారని తెలుసుకున్న బాధిత యువతులు బుధవారం రాత్రి పోలీస్ స్టేషన్కు వచ్చారు. అర్ధరాత్రి వరకు వీడు నా వాడు అంటే కాదు నా వాడంటూ ఇరువురు యువతులు వాదులాడుకున్నారు. దీంతో పోలీసులు అయోమయంలో పడ్డారు. ముందుగా నేను మోసపోయాను, కాబట్టి నాకే సొంతమంటూ ఒకరు, కాదు నేనూ సర్వస్వం అర్పించాను పెళ్లి చేసుకుంటానన్నాడు నాకు న్యాయం చేయాలంటూ పోలీసులను వేడుకున్నారు. సమస్య ఎలా పరిష్కరించాలో అర్థంకాక మధురానగర్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్తోపాటు ఎస్ఐ ఇక్బాల్ తలలు పట్టుకున్నారు. ఎట్టకేలకు బాబా ఫక్రుద్దీన్ను పోలీసులు రిమాండ్ తరలించి ఊపిరిపీల్చుకున్నారు. చదవండి: తెలియకుండా విదేశాలకు భార్య! భర్త ఆత్మహత్య -
కాంగ్రెస్వి దొంగ డిక్లరేషన్లు
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ఎన్నికలు సమీపిస్తుండటంతో కాంగ్రెస్ ప్రకటించినవన్నీ దొంగ డిక్లరేషన్లేనని ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి టి.హరీశ్రావు విమర్శించారు. వాటిని నమ్మితే ప్రజలు నిలువునా మోసపోతారన్నారు. సంగారెడ్డి జిల్లా కొల్లూరు టౌన్షిప్లో జీహెచ్ఎంసీ నిర్మించిన డబుల్ బెడ్రూం గృహాలను గురువారం 4,800 మంది లబ్ధిదారులకు మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో హరీశ్రావు మాట్లాడు తూ కేసీఆర్ కిట్టు.. న్యూట్రీషియన్ కిట్టు.. ఎన్సీడీ కిట్టు.. ఇలా బీఆర్ఎస్ సర్కారు లబ్ధిదారులకు కిట్లు పంపిణీ చేస్తుంటే.. ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ నేతలు తిట్లకే పరిమితం అవుతున్నారని దుయ్యబట్టారు. హైదరాబాద్లో జరిగిన అభివృద్ధిని చూసి సినీ నటుడు రజనీకాంత్ మెచ్చుకున్నప్పటికీ., ఇక్కడ ఉన్న ప్రతిపక్ష పార్టీలకు చెందిన గజనీగాళ్లకు మా త్రం అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు. ఐటీ ఎగుమతుల్లో హైదరాబాద్ బెంగళూరును మించి పోయిందనీ, ఇప్పుడు ఈ రంగంలో దేశంలోనే హైదరాబాద్ నం.1 స్థానంలో నిలుస్తోందన్నారు. ఇచ్చే రూ.60 వేలల్లోనూ లంచాలు తీసుకునేవారు.. కాంగ్రెస్ హయాంలో ఇంటి నిర్మాణానికి ఇచ్చే రూ.60 వేలల్లోనూ ఆ పార్టీ నేతలు లంచాలు అడిగే వారని హరీశ్రావు ఆరోపించారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఎలాంటి లంచాలు లేకుండా ఇంటిని కేటాయిస్తున్నారన్నారు. రానున్న ఎన్నికల్లో ఒక్కొక్కరు అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని విజ్ఞప్తి చేశారు. కృష్ణా నదీ జలాల్లో 90 టీఎంసీల నీటి వాటా మనకే దక్కిందని, పాలమూరు ఎత్తిపోతల పథకానికి కూడా అనుమతి తెచ్చుకుంటామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గూడెం మహిపాల్రెడ్డి, అరికెపూడి గాంధీ, దానం నాగేందర్, ప్రకాశ్గౌడ్, మాగంటి గోపీ నాథ్, సంగారెడ్డి కలెక్టర్ డాక్టర్ శరత్ పాల్గొన్నారు. -
సమంతను మోసం చేసిన మేనేజర్.. ఎంతో నమ్మితే, చివరకు ఇలా..
చిత్రపరిశ్రమలో హీరోహీరోయిన్ల మేజేజర్ల హవా మాములుగా ఉండదు. నిర్మాతకు హీరో,హీరోయిన్లకు మధ్య వారధిలా వాళ్లు పని చేస్తుంటారు. నిర్మాతకు డేట్స్ కావాలంటే.. సదరు హీరో, హీరోయిన్ల మేనేజర్లను సంప్రదించాల్సిందే. రెమ్యునరేషన్ మొదలు.. డేట్స్ వరకు ప్రతీది మేనేజర్ల చేతిలోనే ఉంటుంది. ఏ హీరో, హీరోయిన్ అయినా.. మేనేజర్లు చెప్పేదే విని ఓకే చెబుతారు. వారిలో హీరోయిన్ సమంత కూడా ఒకరు. తన మేనేజర్ని ఇంటి మనిషిలా భావించి, అన్నీ అతని చెప్పినట్లుగానే చేసేది. అంత నమ్మకంగా ఉన్న వ్యక్తి.. సామ్ని ఆర్థిక మోసం చేశాడనే వార్త కొద్ది రోజులుగా నెట్టింట చక్కర్లు కొడుతుంది. సమంతకు తెలియకుండా రూ. కోటిని కాజేసేందుకు ప్రయత్నించాడట. ఈ విషయం సమంత దృష్టికి రావడంతో అతన్ని విధుల నుంచి తొలగించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు ఆంగ్ల పత్రికల్లో వార్తలు వచ్చాయి. కుటుంబ సభ్యుడిగా భావించిన వ్యక్తి మోసం చేయడాన్ని సామ్ జీర్ణించుకోలేకపోయిందట. తొలుగ నమ్మకపోయినా.. ముఖ్యమైన వ్యక్తి చెప్పడంతో ఆమె అతన్ని దూరం పెట్టినట్లు సమాచారం. త్వరలోనే మరో కొత్తవ్యక్తిని తన మేనేజర్గా నియమించుకునే పనిలో ఉన్నారట. అసలు విషయం ఇదేనా? మయో సైటిస్ బారిన పడడంతో సామ్ ఒప్పుకున్న ఓ చిత్రం షూటింగ్ ఆలస్యం అయింది. దీంతో నిర్మాతలకు తన వల్ల నష్టం జరిగిందని, తన రెమ్యునరేషన్ తగ్గించాలని సామ్ భావించారట. ఈ విషయాన్ని తన మేనేజర్తో చెప్పి, రూ. కోటి వరకు తగ్గించి తీసుకోమని చెప్పిందట. అయితే మేనేజర్ మాత్రం నిర్మాతల దగ్గర ఆ కోటి కూడా తీసుకోవాలనుకున్నాడట. సదరు నిర్మాతల దగ్గరకు వెళ్లి బ్యాలెన్స్ గా ఉన్న రూ. కోటిని క్యాష్ రూపంలో ఇవ్వమని అడిగారట. అంత డబ్బు క్యాష్గా ఇవ్వడం సాధ్యం కాదని చెప్పడంతో.. తన స్నేహితుడి అకౌంట్కి పంపమని చెప్పాడట. వారికి అనుమానం కలగడంతో ఈ విషయాన్ని సామ్ దగ్గర వరకు తీసుకెళ్లారు. ఇలా మేనేజర్ అసలు రూపం బయటపడింది. ఇక సినిమా విషయాలకొస్తే.. సమంత- విజయ్ దేవరకొండ జంటగా నటించిన ‘ఖుషి’ చిత్రం సెప్టెంబర్ 1న విడుదల కాబోతుంది. దీంతో పాటు రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో సీటడెల్ అనే వెబ్ సిరీస్ చేసింది. ఇందులో వరుణ్ ధావణ్ కీలక పాత్ర పోషించాడు. త్వరలోనే ఈ వెబ్ సిరీస్ ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ లో స్క్రీమింగ్ కానుంది. -
ఆందోళనలో మార్గదర్శి చందాదారులు
తొమ్మిది నెలలుగా చిట్ పాడుకున్న వారికి సైతం చెల్లింపులు చెల్లించని వైఖరిని మార్గదర్శి అవలంభిస్తోంది. దీంతో చందాదారుల్లో ఆందోళన నెలకొంది. అదే సమయంలో అధికారిక తనిఖీల్లో మార్గదర్శి అక్రమాలు, అవకతవకలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మూడోరోజూ మార్గదర్శి కార్యాలయాల్లో ఏపీ సీఐడీ సోదాలు కొనసాగుతున్నాయి. సీఐడీ అధికారులతో పాటు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలో.. మార్గదర్శి అక్రమాలకు సంబంధించిన కీలక ఆధారాలను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే.. తాజా సోదాలలో డిపాజిటర్ల సంతకాలు ఫోర్జరీ చేసినట్లు గుర్తించారు. బ్యాంక్ ఖాతాలు, చిట్టీ గ్రూపుల చందాల వివరాలు.. నిధుల మళ్లింపునకు సంబంధించిన పత్రాలతో పాటు ఫోర్జరీ సంతకాలు చేసిన రికార్డులు, హార్డ్ డిస్క్లను అధికారులు జప్తు చేశారు. ఇవాళ్టి తనిఖీలలో మరిన్ని అక్రమాలు బయటపడొచ్చనే భావిస్తున్నారు. ఆ వర్గానికి మాత్రమే చెల్లింపులా? ఇప్పటికే తొమ్మిది నెలలుగా చిట్ పాడుకున్న వాళ్లకు మార్గదర్శి యాజమాన్యం చెల్లింపులు చెల్లించలేదు. అదే సమయంలో కాల పరిమితి ముగిసినా ప్రైజ్మనీ అందించని పరిస్థితి ఉంది. దీంతో మార్గదర్శి చందాదారుల్లో ఆందోళన నెలకొంది. చందాదారులకు రూ.2 వేల కోట్లకు పైగా బకాయిలు చెల్లించాల్సి ఉంది మార్గదర్శి. దీంతో చందాదారులు కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అయితే.. ఒత్తిడి తెస్తున్న ఓ సామాజికవర్గం వారికి మాత్రం చెల్లింపులు జరుగుతున్నాయని తెలుస్తోంది. రామోజీకి దెబ్బ! చందాదారుల సొమ్మును రామోజీరావు కుటుంబం తమ సొంత పెట్టుబడులుగా మళ్లించడంతో మార్గదర్శి చిట్ ఫండ్స్ ఆర్థికంగా దివాలా అంచులకు చేరుకుంది. మార్గదర్శి చిట్ఫండ్స్పై సీఐడీ కేసు నమోదు చేయడంతో రాష్ట్రంలో 2022 నవంబర్ నుంచి కొత్త చిట్టీ గ్రూపులు నిలిచిపోయాయి. చందాదారుల సొమ్మును మార్గదర్శి చిట్ఫండ్స్ చట్టానికి విరుద్ధంగా అక్రమంగా మళ్లిస్తోందన్నది స్పష్టమవడంతో కొత్తగా చిట్టీలు వేసేందుకు చందాదారులు ముందుకు రావడం లేదు. దాంతో మనీ సర్క్యులేషన్ (గొలుసుకట్టు మోసాలు) తరహాలో వ్యాపారం నిర్వహిస్తున్న రామోజీరావుకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. అదే సమయంలో.. మార్గదర్శి చిట్ఫండ్స్ ఆర్థిక పరిస్థితి కుదేలైందన్న విషయం వ్యాపార, పారిశ్రామికవర్గాలకు స్పష్టమైంది. ఇతర వ్యాపార సంస్థల నుంచి గుట్టుచప్పుడు కాకుండా నిధులు సేకరిద్దామన్న రామోజీ వ్యూహం బెడిసి కొట్టింది. నిధుల మళ్లింపు పాపం కేంద్ర చిట్ ఫండ్స్ చట్టం–1982 ప్రకారం చందాదారుల సొమ్మును.. ఇతర వ్యాపారాల్లో పెట్టుబడిగా పెట్టకూడదు. చందాదారులు చెల్లించే చిట్టీ సొమ్మును సంబంధిత బ్రాంచి పరిధిలోని జాతీయ బ్యాంకులో డిపాజిట్ చేయాలి. చిట్ ఫండ్స్ సంస్థ ఏ కారణంతోనైనా ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోతే చందాదారులు నష్టపోకుండా ఆ నిబంధనలు విధించారు. ఎందుకంటే అక్రమంగా పెట్టిన పెట్టుబడులు వెంటనే వెనక్కి తేవడం సాధ్యం కాదు కాబట్టి. కానీ ఈ రెండు నిబంధనలను రామోజీరావు ఏనాడూ పట్టించుకోలేదు. మార్గదర్శి చిట్ ఫండ్స్ చందాదారులు చెల్లించిన సొమ్మును మ్యూచువల్ ఫండ్స్లో తమ కుటుంబ సభ్యుల పేరిట పెట్టుబడిగా పెట్టారు. దాంతోపాటు తమ కుటుంబ సంస్థలైన ఉషాకిరణ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, ఉషోదయ ఎంటర్ ప్రైజస్లో పెట్టుబడులుగా మళ్లించడంతో మార్గదర్శి చిట్ఫండ్స్ చందాదారులు నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. ఇదొక్కటే దారి రామోజీ పాపం ఫలితంతో.. 50 వేల మంది చందాదారుల సొమ్ము ప్రశ్నార్థకంగా మారింది. అయితే ‘అగ్రిగోల్డ్’ తరహాలో మార్గదర్శి చందాదారుల హక్కుల పరిరక్షణపైనా సర్కారు దృష్టి సారించింది. ఇందులో భాగంగా మార్గదర్శి చిట్ ఫండ్స్ అక్రమంగా పెట్టిన పెట్టుబడులను అటాచ్ చేసేందుకు సీఐడీకి అనుమతిచ్చింది. మ్యూచువల్ ఫండ్స్లో పెట్టిన రూ.1,035 కోట్లతోపాటు రామోజీరావు కుటుంబ సంస్థలైన ఉషా కిరణ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్లో 88.50 శాతం వాటా, ఉషోదయ ఎంటర్ ప్రైజస్లో 44.50 శాతం వాటాను అటాచ్ చేసేందుకు అనుమతి కోరుతూ సీఐడీ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసింది. -
కిలాడీ లేడీ.. ఆమె ట్రాప్లో పడితే అంతే సంగతులు!
ఫేక్ ఐడెంటిటీల సాయంతో ఆన్లైన్లో పలువురు మహిళలను మోసం చేస్తున్న ఉదంతాలు తరచూ వెలుగు చూస్తున్నాయి. మహిళలే స్వయంగా ఇటువంటి మోసాలకు దిగడం విశేషం. వారు ఫేక్ ఐడెంటిటీల సాయంతో కొంతమంది మహిళలకు ఫోన్ చేసి.. మీకు ఖరీదైన బహుమతులు వచ్చాయని, వాటిని తీసుకునేందుకు కస్టమ్స్ డ్యూటీ చెల్లించాలని చెబుతూ, వారి నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఆ మధ్య దేశ రాజధాని ఢిల్లీలో ఇదేకోవకు చెందిన ఒక ఉదంతంలో పోలీసులు 36 ఏళ్ల నైజీరియన్ను అరెస్టు చేశారు. అరెస్టయిన మహిళ పలువురు మహిళలకు ఫోన్ చేసి, మీకు వచ్చిన ఖరీదైన బహుమతులు అందుకోవాలంటే వెంటనే కస్టమ్స్ డ్యూటీ చెల్లించాలని చెబుతూ మోసానికి పాల్పడ్డారు. ఈ కేసులో అరెస్టయిన మహిళను పోలీసులు నైజీరియాకు చెందిన ఒఫోరిగా గుర్తించారు. ఆమె వలలో పడి 20 మంది బాధితులు మోసపోయినట్ల పోలీసుల దర్యాప్తులో తేలింది. ఎనిమిది బ్యాంకు ఖాతాల ద్వారా ఈ మోసం జరిగినట్లు పోలీసులు గుర్తించారు. తనను తాను తాను డాక్టర్గా పరిచయం చేసుకున్న ఒక మహిళ ఆన్లైన్లో తనతో స్నేహం చేసిందని పేర్కొంటూ, ఆ తరువాత జరిగిన సంఘటనల గురించి ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపధ్యంలోనే ఈ తరహా కేసు వెలుగులోకి వచ్చిందని పోలీసులు తెలిపారు. ఆ మహిళ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో డాక్టర్గా పరిచయం చేసుకున్న ఆ మహిళతో కొద్దికాలంలోనే మంచి స్నేహం ఏర్పడిందని, అప్పటి నుంచి ఆమె బహుమతులు పంపేదని తెలిపారు. అయితే కొన్ని రోజుల తర్వాత తనకు కస్టమ్స్ అధికారిగా పరిచయం చేసుకున్న ఒక మహిళ నుండి కాల్ వచ్చిందని తెలిపారు. తన పేరు మీద విమానాశ్రయానికి కొన్ని బహుమతులు వచ్చాయని, వాటిని విడుదల చేయాలంటే కస్టమ్స్ డ్యూటీ చెల్లించాలని ఫోన్ చేసిన వ్యక్తి తనకు తెలిపారని పేర్కొన్నారు. దీంతో తాను రూ. 25 వేలు చెల్లించినట్లు ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే తాను చెల్లించినదానికన్నా ఎక్కువ మొత్తంలో డబ్బు కావాలని డిమాండ్ చేయడంతో తనకు అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నట్లు ఆమె తెలిపారు. ఆ మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులకు దర్యాప్తులో అనేక విషయాలు వెలుగు చూశారు. మోసానికి పాల్పడిన ఆ మహిళ సోషల్ మీడియా ఖాతాల కోసం ఉపయోగించిన ఐడిలు నైజీరియాకు చెందినవని తేలింది. బాధితురాలి కాల్ రికార్డింగ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టగా నైజీరియన్ మహిళ ఓఫోరి ఈ మోసానికి కీలక సూత్రధారి అని తేలింది. ఆమెపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇది కూడా చదవండి: తల్లీకొడుకుల ప్రాణం తీసిన మొబైల్ చార్జర్ -
చిటీల పేరుతో టీడీపీ నేత అప్పలనాయుడు భారీ మోసం
-
కంపెనీ డబ్బులు రూ.21 లక్షలు కొట్టేసి ఏం చేశాడో తెలుసా?
లండన్: యూకేలో వేల్స్ కు చెందిన ఒక నిర్మాణ కంపెనీలో పనిచేస్తోన్న థామస్ స్టైల్స్(25) అశ్లీల చిత్రాలకు బానిసై వాటిని కొనుగోలు చేసేందుకు తాను పనిచేస్తోన్న చోట అక్రమాలకు పాల్పడ్డాడు. కంపెనీ బిల్లల మొత్తాన్ని ఇష్టానికి మార్చుకుంటూ సుమారు రూ. 21 లక్షలు దోచుకున్నాడు. థామస్ స్టైల్స్(25) అట్లాంటిక్ క్లాడింగ్ అనే ఒక నిర్మాణ సంస్థలో పనిచేస్తున్నాడు. ఈ మధ్యనే తన ప్రతిభకు మెచ్చుకుంటూ మేనేజరుగా కూడా ప్రమోషన్ ఇచ్చింది కంపెనీ. ఆనతి కాలంలోనే వ్యాపార లావాదేవీల తాలూకు ఆర్ధిక చెల్లింపులు చేసే స్థాయికి ఎదిగాడు. మనిషి ఎదిగినప్పుడే బుద్ధి గడ్డి తింటుందన్నట్టు మంచి ఉద్యోగం ఉన్నప్పుడు ఆ గౌరవాన్ని కాపాడుకోకుండా తనకున్న వ్యసనానికి కంపెనీ డబ్బును పాడుచేశాడు. అశ్లీల వెబ్ సైట్ల మాయలో పడి తాను పనిచేస్తోన్న కంపెనీలో భారీ స్థాయిలో అవకతవకలకు పాల్పడ్డాడు. ఇష్టానుసారంగా బిల్లులు పెంచుకుంటూ పోయి తన పిచ్చిలో తాను మునిగి తేలేవాడు. అంతలో పెరుగుతున్న బిల్లులను చూసి కంపెనీ వారికి అనుమానం రావడంతో తీగ లాగారు. డొంకంతా కదిలింది. మే 4 నుంచి జులై 31, 2021 వ్యవధిలో మొత్తం బిల్లుల అక్రమాలను లెక్క వేయగా సుమారు రూ. 21 లక్షలుగా తేలింది. అంత మొత్తాన్ని ఏం చేశాడని ఆరా తీయగా విషయం తెలుసుకుని నివ్వెరపోయిన కంపెనీ యాజమాన్యం పోలీసులను ఆశ్రయించింది. కంపెనీ నమ్మకాన్ని వమ్ము చేసినందుకు న్యాయస్థానం థామస్ ను దోషిగా తేల్చి మొదట 2 సంవత్సరాలు జైలు శిక్ష విధించాలని భావించింది. కానీ జడ్జి దయ తలచి శిక్షను 10 నెలలకు కుదించారు. నెలకు 500 పౌండ్ల చొప్పున కంపెనీకి తిరిగి చెల్లించాలని తీర్పునిచ్చారు. ఇది కూడా చదవండి: బెలారస్ లో వాగ్నర్ సైన్యం.. అంతా ప్లాన్ ప్రకారమే..? -
'చీటింగ్ అనే పదం వాళ్ల బ్లడ్లోనే ఉంది!'
క్రికెట్ను కొన్నేళ్ల పాటు ఆస్ట్రేలియా శాసించిందన్న మాట అందరికి తెలిసిందే. 1990 దశకం నుంచి దాదాపు రెండు దశాబ్దాల పాటు ఆస్ట్రేలియా క్రికెట్ను ఏకచత్రాధిపత్యంతో ఏలింది. ఈ రెండు దశాబ్దాల్లో కంగారూలు మూడు వన్డే వరల్డ్కప్లతో పాటు వన్డే, టెస్టుల్లో చాలాకాలం పాటు నెంబర్వన్గా కొనసాగారు. భయమంటే ఏంటో ఎరుగని జట్టుగా ఉన్న ఆస్ట్రేలియాకు టీమిండియా కూడా దాసోమయ్యింది. 2003 వన్డే వరల్డ్కప్ ఫైనల్ అందుకు చక్కటి ఉదాహరణ. స్టీవా, రికీ పాంటింగ్, మార్క్ వా, ఆడమ్ గిల్క్రిస్ట్, మైకెల్ బెవాన్, గ్లెన్ మెక్గ్రాత్, షేన్ వార్న్, మైకెల్ క్లార్క్, జాసన్ గిలెస్పీ.. ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే ఉంది. జట్టుగా ఎంత బలంగా ఉంటుందో.. ఆధిపత్యం ప్రదర్శించడంలోనూ అంతే పట్టుదలగా ఉండేది. ఒక దశలో కంగారూలతో మ్యాచ్ అంటే ప్రత్యర్థి జట్లు కంగారు పడే పరిస్థితి ఉండేది. అయితే ఇన్ని ఘనతలున్నా కంగారూలకు చీటింగ్ అనేది పర్యాయపదంగా ఉండిపోయింది. ఆస్ట్రేలియా ఎన్నో గొప్ప మ్యాచ్లు గెలిచినా కొన్నిసార్లు ఆ జట్టు చీటింగ్ చేసి గెలిచిన మ్యాచ్లే ఎక్కువగా గుర్తుండిపోయాయి. ముఖ్యంగా క్యాచ్ ఔట్ల విషయంలో ఆసీస్ ఆటగాళ్లు చేసిన చీటింగ్లు ఏ జట్టు చేయలేదని చెప్పొచ్చు. బాల్ టాంపరింగ్ నుంచి సాండ్ పేపర్ ఉదంతం వరకు అన్ని ఆస్ట్రేలియా ఖాతా నుంచి వచ్చినవే. అందుకే చీటింగ్ అనే పదం కంగారూల బ్లడ్లోనే ఉందంటారు క్రికెట్ అభిమానులు. తాజాగా డబ్ల్యూటీసీ ఫైనల్లో భాగంగా టీమిండియాతో జరుగుతున్న మ్యాచ్లో ఆస్ట్రేలియా మరోసారి చీటింగ్ను బయటపెట్టింది. 444 పరుగుల టార్గెట్తో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన టీమిండియాకు గిల్, రోహిత్లు శుభారంభం అందించారు. 41 పరుగులు జోడించిన అనంతరం స్కాట్ బోలాండ్ బౌలింగ్లో షాట్ ఆడే యత్నంలో శుబ్మన్ గిల్ స్లిప్లో ఉన్న గిల్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. క్యాచ్ తీసుకునే క్రమంలో డైవ్ చేసిన గ్రీన్ బంతిని అందుకున్నప్పటికి.. ఫోర్స్కు బంతిని నేలకు తాకించినట్లు కనిపించింది. దీంతో గిల్ రివ్యూకు వెళ్లాడు. అల్ట్రాఎడ్జ్లో కెమెరా యాంగిల్ పరిశీలించగా గ్రీన్ బంతిని అందుకున్నప్పటికి నేలకు తాకించినట్లు కనిపించింది. అయితే గ్రీన్ చేతి వేలు బంతి కింద ఉన్నట్లు థర్డ్అంపైర్ మైక్లో చెప్పి బిగ్ స్ర్కీన్పై గిల్ ఔట్ అని ప్రకటించాడు. ఈ నిర్ణయం రోహిత్, గిల్తో పాటు సగటు అభిమానిని ఆశ్చర్యపరిచింది. గతంలోనూ పాంటింగ్, స్టీవ్ స్మిత్, మైకెల్ క్కార్ల్ కెప్టెన్లుగా ఉన్నప్పుడు ఇలాంటి చీటింగ్లు చాలానే జరిగాయి. అంపైర్లు కూడా ఆసీస్కు అనుకూలంగా వ్యవహరిస్తూ ఫలితాలు ఇచ్చేవారు. ఇప్పుడు ఇంత టెక్నాలజీ వచ్చి కూడా నాటౌట్ అని క్లియర్గా కనిపిస్తున్నా థర్డ్ అంపైర్ తప్పుడు నిర్ణయం ఇచ్చాడు. అయితే సాఫ్ట్ సిగ్నల్ నిబంధన ఉండి కూడా ఎందుకు ఉపయోగించడం లేదని అభిమానుల సందేహం వ్యక్తం చేస్తున్నారు. View this post on Instagram A post shared by ICC (@icc) Always winning with cheating #notout pic.twitter.com/H2m939vqCD — Milind Joshi (@MilindJ03022606) June 10, 2023 Cheating is in Australian cricket team DNA. pic.twitter.com/fqXsPxulBQ — SAVAGE (@Freakvillliers) June 10, 2023 చదవండి: #NotOut: థర్డ్ అంపైర్ చీటింగ్.. గిల్ ఔట్ కాదు -
మరణించిన వ్యక్తికి 12 ఏళ్లుగా వృధాప్య పెన్షన్..ఆరా తీస్తే..
పల్నాడు జిల్లాలో ఓ విచిత్ర ఘటన చోటు చేసుకుంది. మరణించిన వ్యక్తికి 12 ఏళ్లుగా వృధ్యాప్య ఫించన్ ఇస్తున్నారంటూ విమర్శుల వెల్లువెత్తాయి. చాలా ఏళ్ల క్రితం తండ్రి చనిపోతే..అతడి పెన్షన్కి ఆశపడి ప్రభుత్వాని మోసం చేస్తున్న కొడుకు ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పల్నాడు జిల్లా క్రోసూరు మండలం దొడ్లేరు గ్రామంలో ఈ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన చనిపోయని వ్యక్తి బతికున్నట్లు నమ్మించి 12 ఏళ్లుగా ఫించన్ తీసుకుంటున్నాడు మృతుడు పారా కిరీటి కుమారుడు సారయ్య. 2001లో చనిపోయిన తన తండ్రి స్థానంలో మరొక వ్యక్తిని చూపిస్తూ ప్రభుత్వాన్ని మోసం చేస్తూ పెన్షన్ అందుకుంటున్నట్లు మృతుడి బంధువులు జాయింట కలెక్టర్కి ఫిర్యాదు చేశారు. అతను 2011లో తన మామ చనిపోతే..అతడిని తండ్రిగా చూపించి నకిలీ డాక్యుమెంట్స్ సృష్టించి ఫించన్కు దరఖాస్తు చేస్తే అధికారులు ఫించన్ మంజూరు చేసేశారు. దీంతో అతడు ధర్జాగా గత 144 నెలలుగా మోసం చేస్తూ సుమారుగా 4 లక్షల రూపాయలు ప్రభుత్వ సొమ్మును పారా సౌరయ్య కాజేసినట్లు అధికారులు గుర్తించారు. దీనిపై విచారణ చేపట్టాలని డీడీవో మహాలక్ష్మిని జేసీ శ్యాంప్రసాద్ ఆదేశించారు. ఇన్నేళ్లుగా పింఛన్ తీసుకుంటున్నా అధికారులకు మాత్రం దొరకలేదు. (చదవండి: సత్తా చాటిన గుంటూరు జిల్లా ఎడ్లు) -
‘నా భార్య, తండ్రి కలసి నన్ను వంచించారు’
ఒక వ్యక్తి తనకు ఎదురైన అత్యంత చేదు అనుభవాన్ని ఈ ప్రపంచంతో పంచుకున్నాడు. తాను అమితంగా ప్రేమించిన తన భార్య తనను ఘోరంగా మోసగించిందంటూ తన బాధను వెళ్లగక్కాడు. తన భార్య తన తండ్రితో తిరుగుతున్నదని తెలుసుకుని అతను నిశ్చేష్టుడైపోయాడు. ఇప్పుడు తన భార్య తన తండ్రి కారణంగా గర్భం ధరించిందని తెలుసుకుని ఏం చేయాలో తెలియని పరిస్థితిలో చిక్కుకున్నాడు. ఆ వ్యక్తి పేరు డెక్లాన్ ఫులర్. తన 22 ఏళ్ల భార్య స్టెఫనీ తనను మోసగించిందని తెలియగానే అతనికి కాళ్ల కింద భూమి ఒక్కసారిగా కదిలిపోయినట్లయ్యింది. ఆమె తన 44 ఏళ్ల తండ్రి డైరెన్తో సంబంధం పెట్టుకుందని తెలిసి అతను తల్లడిల్లిపోయాడు. ది సన్ రిపోర్టును అనుసరించి ఈ కుటుంబం బ్రిటన్లో ఉంటోంది. 22 ఏళ్ల డెక్లాన్, స్టెఫనీలకు రెండేళ్ల కుమార్తె విలో కూడా ఉంది. బాధితుడు తనకు ఎదురైన చేదు అనుభవాన్ని వివరిస్తూ తాను మధ్యాహ్నం సమయంలో తన భార్య, తండ్రి కలసి బెడ్రూమ్లో సరసాలు ఆడటాన్ని చూశానని తెలిపారు. అయితే స్టెఫనీ దీని గురించి మాట్లాడుతూ తాను, తన మామగారితో పాటు ఆ సమయంలో టీవీ చూస్తున్నానని తెలిపింది. అయితే తన తండ్రి కూడా తనను ఇంతలా మోసం చేస్తాడని అనుకోలేదన్నారు. తన తండ్రి గతంలో తన తల్లి నుంచి విడాకులు తీసుకున్నాడని, అయినా తిరిగి తమ ఇంటికి వచ్చివుంటున్నాడన్నారు. పైగా తన భార్య, తన తండ్రి కలసి ఉండటాన్ని చూశాన్నారు. త్వరలో తన భార్య కవల పిల్లలకు జన్మనివ్వబోతున్నదని అన్నారు. దీనిని అస్సలు జీర్ణించుకోలేకపోతున్నానన్నారు. తమ కుటుంబం అస్తవ్యస్తంగా మారిందన్నారు. కాగా త్వరలో పుట్టబోయే కవలలకు డెక్లాన్ సవతి సోదరుడు కానున్నాడు. అలాగే అతని కుమార్తె విలో ఆ చిన్నారులకు ఆంటీ కాబోతోంది. ఇటువంటి పరిస్థితులను నమ్మలేకపోతున్నానని డెక్లాన్ వాపోతున్నాడు. -
రోల్స్ రాయిస్ ఇండియాకు కేంద్రం షాక్: అవినీతి ఆరోపణలతో సీబీఐ కేసు
సాక్షి, ముంబై: బ్రిటిష్ ఏరోస్పేస్ కంపెనీ రోల్స్ రాయిస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్కు భారీ షాక్ తగిలింది. 24 హాక్ జెట్ 115 అడ్వాన్స్ కొనుగోలులో భారత ప్రభుత్వాన్నిమోసంచేశా రని ఆరోపిస్తూ కంపెనీ డైరెక్టర్సహా, మరికొంతమందిపై సీబీఐ కేసు నమోదు చేసింది. (3వేల ఉద్యోగాలు కట్: లగ్జరీ కార్మేకర్ స్పందన ఇది!) ట్రైనర్ ఎయిర్క్రాఫ్ట్ కొనుగోలులో అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలపై రోల్స్ రాయిస్, దాని ఎగ్జిక్యూటివ్లపై కేసు నమోదు చేసింది. రోల్స్ రాయిస్ ఇండియా డైరెక్టర్ టిమ్ జోన్స్, ఆయుధాల డీలర్లు సుధీర్ చౌదరి , భాను చౌదరితోపాటు, ప్రభుత్వ ప్రైవేట్ వ్యక్తులపై సీబీఐ కేసు నమోదు చేసింది.రోల్స్ రాయిస్ పిఎల్సి, యుకె , ఎం/ఎస్ రోల్స్ రాయిస్ టర్బోమెకా లిమిటెడ్తో సహా దాని అసోసియేట్ గ్రూప్ కంపెనీల నుండి హాక్ ఎయిర్క్రాఫ్ట్ కొనుగోలు విషయంలో భారత ప్రభుత్వాన్ని మోసం చేసినందుకు ఈ కేసు సంబంధించినదని సీబీఐ ప్రకటించింది. (కేవీపీ పెట్టుబడి డబుల్ ధమాకా: పదేళ్లదాకా ఆగాల్సిన పనిలేదు!) CBI registers a case against British Aerospace company Rolls Royce India Pvt Ltd, Tim Jones, Director Rolls Royce India Pvt Ltd and private individuals Sudhir Chuadhrie and Bhanu Chaudharie and other unknown public servants and private persons with the objective to cheat the… pic.twitter.com/tREN8OUkyk — ANI (@ANI) May 29, 2023 -
వాట్సాప్లో చీటింగ్!
సాక్షి, అమరావతి: సైబర్ నేరగాళ్లు సరికొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు. ఆన్లైన్లో ఆర్థిక మోసాలను అరికట్టేందుకు టెలికాం సంస్థలు తీసుకుంటున్న భద్రతా చర్యలకు పైఎత్తులు వేస్తున్నారు. సాధారణ స్పామ్ కాల్స్ కట్టడికి ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్) ఫిల్టర్లను ప్రవేశపెట్టినప్పటికీ అంతకు మించి దోపిడీ మార్గాలను అన్వేషిస్తున్నారు. అంతర్జాతీయ నంబర్ల వాట్సాప్ కాల్స్తో నేరాలకు పాల్పడుతున్నారు. దేశంలో సుమారు 480 మిలియన్ల వాట్సాప్ వినియోగదారులుండటం, ప్రపంచంలోనే అతిపెద్ద వాట్సాప్ కేంద్రం కావడంతో సైబర్ నేరగాళ్ల దృష్టి మనపై పడింది. అంతర్జాతీయ నంబర్లతో.. వాట్సాప్ వినియోగదారులకు ఎక్కువగా ఇథియోపియా (+25), మలేషియా(+60), ఇండోనేషియా (+62), కెన్యా (+254), మాలి (+223), గినియా (+224) వియత్నాం (+84)తో పాటు మరికొన్ని దేశాల నుంచి అంతర్జాతీయ నంబర్లతో పదేపదే వాట్సాప్ కాల్స్ రావడం ఆందోళన కలిగిస్తోంది. ఇందులో ఎక్కువ భాగం ఆగ్నేయాసియా దేశాల ఐఎస్డీ కోడ్లతోనే కాల్స్ వస్తున్నాయి. కనిపెట్టడం కష్టం.. అంతర్జాతీయ నంబర్లతో వస్తున్న వాట్సాప్ కాల్స్ ఉనికిని కనిపెట్టడం చాలా కష్టం. ఒక ఐఎస్డీ కోడ్తో వచ్చే వాట్సాప్ కాల్ను మోసగాళ్లు అదే దేశం నుంచే చేస్తున్నట్లు నిర్ధారించలేం. విదేశాల్లో ఉండే వారి ద్వారా అక్కడి నంబర్ తీసుకుని వేరే దేశంలో ఉంటూ వాట్సాప్ యాక్టివేట్ చేసుకుని మోసపూరిత కాల్స్ చేయవచ్చు. బయట మార్కెట్లో చాలా ఏజెన్సీలు నేరగాళ్లకు అంతర్జాతీయ నంబర్లను విక్రయిస్తున్నాయి. ‘మనీ ఫర్ లైక్స్’ స్కామ్ వాట్సాప్ మెసేజ్ల ద్వారా జాబ్ ఆఫర్లను పంపడం కొత్త రకం స్కామ్. ఇంటి నుంచి పార్ట్టైమ్ ఉద్యోగ అవకాశం కల్పిస్తామంటూ వాట్సాప్లో మెసేజ్ పంపుతారు. యాప్ను ఇన్స్టాల్ చేసుకోవాలని, టెలిగ్రామ్ చానెల్లో చేరాలని నమ్మబలుకుతారు. యూట్యూబ్ వీడియోల లైక్ బటన్ నొక్కడం, పోస్టులపై కామెంట్లు, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కంటెంట్ను ప్రచారం చేయడం లాంటి పనులు చేయాలని చెబుతారు. బాధితుడిని నమ్మించడానికి తొలుత చిన్న చిన్న టాస్క్లు అప్పగించి చెల్లింపులు జరుపుతారు. ఆ తర్వాత నెమ్మదిగా అధిక మొత్తంలో చెల్లిస్తామంటూ టాస్క్లను కేటాయిస్తారు. అయితే ఈసారి ముందస్తుగా భారీగా డిపాజిట్ చేయాలని కోరతారు. ఇక్కడే బాధితులు మోసపోతున్నారు. డిపాజిట్లు వసూలు చేసుకున్నాక నేరగాళ్లు పత్తా లేకుండా పోతున్నారు. ఇక్కడ ఏదో ఒక సమయంలో నగదు రిటర్న్లతో నకిలీ సమస్యను సృష్టిస్తారు. యూజర్లు తమ టాస్క్లకు వచ్చిన డబ్బు తిరిగి పొందేందుకు కొంత మొత్తం చెల్లించాలని వసూలు కూడా చేస్తారు. ఈ క్రమంలోనే బాధితులను స్టాక్స్, క్రిప్టోకరెన్సీలలో పెట్టుబడులు పేరుతో నమ్మించి మోసాలకు పాల్పడుతున్నారు. బ్యాంకర్ల పేరుతో.. నేరగాళ్లు ‘ఏఐ’ చాటున స్పూఫింగ్ ద్వారా బ్యాంకులు/ప్రభుత్వ ఏజెన్సీల నుంచి మెసేజ్ కాల్ వస్తున్నట్టు చిత్రీకరిస్తున్నారు. బ్యాంకు ప్రతినిధిగా నటిస్తూ క్రెడిట్, డెబిట్ కార్డుల వివరాలు సేకరించి ఫోన్ మాట్లాడుతుండగా ఆన్లైన్లో కొనుగోళ్లు జరిపి మోసాలకు పాల్పడుతున్నారు. అనాథలు, ప్రకృతి విపత్తుల ఫోటోలు, వీడియోలు పెట్టి చందాలు వసూలు చేస్తున్నారు. భావోద్వేగాలకు గురి చేస్తూ స్వచ్ఛంద సంస్థల పేరుతో కాజేస్తున్నారు. లైక్ చేస్తే అంతే.. యూట్యూబ్ టాస్క్లు, వాట్సాప్కు వచ్చే లింక్లను ఒక్కసారి లైక్ చేస్తే సదరు యూజర్ డేటా మొత్తం సైబర్ నేరగాళ్లకు చేరిపోతుంది. ఆ మరుక్షణం నుంచి గూగుల్ మెయిల్, ఫేస్బుక్, ఇతర సామాజిక మాధ్యమాల్లోని ప్రొఫైళ్లను సులభంగా తెలుసుకోగలుతారు. ఇందులో భాగంగానే నిత్యం ఈ–మెయిళ్లకు అనేక ప్రమోషనల్ మెయిళ్లు, లోన్ వచ్చినట్టు లింక్లు కనిపిస్తుంటాయి. వాటిని క్లిక్ చేస్తే యూజర్ మీడియా యాక్సెస్ మొత్తం నేరగాళ్ల చేతుల్లోకి పోతుంది. ఫేస్బుక్లో యూజర్ ప్రొఫైల్ను బట్టి రకరకాల మోసపూరిత ఆఫర్లతో ప్రలోభపెడతారు. ఆ లింక్లపై క్లిక్ చేసి నగదు చెల్లిస్తే వస్తువులు ఎప్పటికీ డెలివరీ కావు. కొన్ని సందర్భాల్లో అశ్లీలతను జొప్పించి ట్రాప్ చేయడం పరిపాటిగా మారింది. వీడియో కాల్స్తో బ్లాక్ మెయిల్ మోసగాళ్లు బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు దండుకునేందుకు వాట్సాప్ వీడియో కాల్స్ను ఉపయోగిస్తున్నారు. అజ్ఞాత వ్యక్తులు రకరకాల నంబర్ల నుంచి వీడియో కాల్ చేస్తారు. కాల్ లిఫ్ట్ చేయగానే అవతల మహిళ అశ్లీలంగా కనిపిస్తుంది. కాల్ డిస్కనెక్ట్ చేసేలోగా నేరగాళ్లు స్క్రీన్ రికార్డింగ్, స్క్రీన్ షాట్ తీస్తారు. ఆ తర్వాత బాధితుడికి పంపి బ్లాక్మెయిల్కు దిగుతున్నారు. మరికొన్ని ఘటనల్లో వీడియో కాల్స్ వస్తున్నప్పటికీ యూజర్ స్క్రీన్పై ఎటువంటి ఆడియో లేకుండా ఖాళీ వీడియో కనిపిస్తుంది. చూస్తుండగానే కాల్ అకస్మాత్తుగా కట్ అవుతుంది. కొన్ని నిమిషాల తర్వాత మార్ఫింగ్ చేసిన అశ్లీల వీడియోను పంపి డబ్బులు ఇవ్వకుంటే యూజర్ కాంటాక్ట్లకు పంపిస్తామంటూ బెదిరించి డబ్బులు గుంజుతారు. ఆ కాల్స్ను బ్లాక్ చేయండి సైబర్ మోసగాళ్లు అనేక విధాలుగా మోసం చేయాలని ప్రయత్నిస్తారు. వాట్సాప్లో అవాంఛిత, అంతర్జాతీయ కోడ్లతో ఫోన్లు వస్తే తిరస్కరించాలి. పదేపదే వస్తుంటే బ్లాక్ చేసి వాట్సాప్లోనే రిపోర్టు చేయాలి. ఎటువంటి లింక్లపై క్లిక్ చేయకూడదు. క్లిక్ చేస్తే యూజర్ డేటా మొత్తం క్షణాల్లో సైబర్ నేరగాళ్లకు చేరుపోతుంది. తర్వాత బ్లాక్మెయిల్కు పాల్పడతారు. డిస్కౌంట్లు, చెకింగ్ల పేరుతో ఎవరూ ఫోన్ చేసినా వివరాలు చెప్పొద్దు. సైబర్ మోసాలకు గురైన బాధితులు నేషనల్ పోలీస్ హెల్ప్లైన్ నంబర్ 112, సైబర్ క్రైమ్ హెల్ప్లైన్ నంబర్ 1930కు ఫిర్యాదు చేయాలి. – అమిత్ బర్దార్, ఎస్పీ, సైబర్ క్రైమ్ -
హలో.. పార్శిల్ ముట్టిందా? కాదు.. బ్యాంకు ఖాతా ఖాళీ అయింది
కాజీపేట: నిత్యం ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక సమస్యను ఎదుర్కొంటాం. వాటికి సంబంధించిన సమాచార అన్వేషణ కోసం ఇంటర్నెట్పై ఎక్కువగా ఆధారపడుతున్నాం. ఇంటర్నెట్లోని వివిధ వెబ్సైట్ట్లను పరిశీలించే వారి సంఖ్య పెరుగుతోంది. మనిషి అవసరాన్ని గుర్తించిన కేటుగాళ్లు తమ సంపాదనకు మలుచుకుంటున్నారు. ఫలితంగా సొ మ్ము పరుల పాలవుతోంది. సేవా లోపాల పరిష్కారానికి వివిధ సంస్థల ఫోన్ నంబర్లు ఇంటర్నెట్లో బోగస్వి పెడుతున్నారు. వాటికి పలువురు వినియోగదారులు ఫోన్చేసి మోసగాళ్ల ఉచ్చులో పడి బ్యాంకు ఖాతాల్లోని సొమ్మును పోగొట్టుకుంటున్నారు. కొరియర్ నంబర్ కోసం వెతికితే... కాజీపేటకు చెందిన అబ్దుల్ ఖాదర్ హైదరాబాద్లో ఉండే తన స్నేహితుడికి ఇటీవల ఓ పార్సిల్ను కొరియర్ చేశాడు. వారం గడుస్తున్నా కొరియర్ రాకపోయేసరికి ఇంటర్నెట్లో సంబంధిత సంస్థ కస్టమర్ కేర్ నంబర్ కోసం వెతికి దానికి ఫోన్ చేశాడు. ఆ నంబర్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. తర్వాత కొద్దిసేపటికి కొరియర్ సంస్థ నుంచి అంటూ ఓ వ్యక్తి ఫోన్ చేసి పరిచయం చేసుకున్నాడు. మీ పార్సిల్ బ్రాంచి కార్యాలయంలో ఆగిందని, ప్రాసెస్ చేయడానికి రూ.2 ఫోన్ ద్వారా చెల్లించాలని కోరారు. మీకు రాము అనే కొరియర్ బాయ్ తీసుకొస్తాడని చెప్పి ఓ నంబర్ ఇచ్చాడు. ఆ నంబర్కు రూ.2 చెల్లిస్తే ఈ నెల 26 వరకు పార్సిల్ చేరుస్తామంటూ ఓ లింక్ పంపించాడు. నిజమే అని నమ్మిన అబ్దుల్ ఖాదర్ ఆ లింక్ను క్లిక్చేసి డబ్బు చెల్లించాడు. రెండు రోజులు దాటుతున్నా కొరియర్ సర్వీస్ అడ్రస్ లేకపోవడంతో పాటు సెల్ఫోన్కు వచ్చిన ఎస్ఎంఎస్లు చూసి అవాక్కయ్యాడు. తొమ్మిది విడుతలుగా రూ.1.36 లక్షలు ఆయన బ్యాంక్ ఖాతా నుంచి డ్రా అయ్యాయి. వెంటనే ఖాతాను బ్లాక్ చేయించి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఇలాంటి ఆన్లైన్ కేసులు ఒక కాజీపేట పీఎస్లోనే పాతికకు పైగా నమోదయ్యాయి. ఇంటర్నెట్లోని వివిధ వెబ్సైట్లలో పలువురు మోసగాళ్లు ..వివిధ కంపెనీల, బ్యాంకుల కస్టమర్ కేర్ నంబర్ అని చెప్పి తమ సొంత ఫోన్ నంబర్లను ఉంచుతున్నారు. వెబ్సైట్లలో వెతికి ఈ నంబర్లను ఉంచుతున్నారు. వెబ్సైట్లలో వెతికి ఈ నంబర్లకు ఫోన్ చేసి మోసపోకూడదు. ఆ సంస్థకు చెందిన అధీకృత వెబ్సైట్ నుంచి మాత్రమే తీసుకోవాలి. ప్రైవేట్ వెబ్సైట్లలో వివరాలు నమోదు చేయకూడదు. అవి మోసగాళ్లకు సులువుగా వెళ్తాయి. సంబంధిత కంపెనీ వెబ్సైట్లోకి వెళ్లడం ఉత్తమం. -
చట్ట ప్రకారం చట్టానికి తూట్లు.. రామోజీ నమ్ముకున్న సిద్ధాంతం ఇదే..
రామోజీరావు మార్గదర్శిలో ఏ విధంగా అక్రమాలకు పాల్పడ్డారో ఆయన తోడల్లుడు డాల్ఫిన్ అప్పారావు వెల్లడించారు. చట్టాన్ని కూడా చట్టప్రకారమే అతిక్రమిస్తూ మార్గదర్శిని ఒక ప్రత్యేక సామ్రాజ్యంగా రామోజీ చూశారని వివరించారు. ఇందుకు సంబంధించిన కీలక విషయాలు ఆయన మాటల్లోనే.. 2,600 మంది కస్టమర్ల సొమ్ముని వెంటనే కట్టాలని ఆర్బీఐ మార్గదర్శకాలు జారీ చేసింది. అప్పటికప్పుడు సొమ్ములు తిరిగి వెనక్కు తీసుకురాలేని తరుణంలో వివిధ అంతర్జాతీయ కంపెనీలతో రామోజీరావు చర్చలు జరిపారు. అయితే అంత పెద్దమొత్తం ఇచ్చేందుకు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో రామోజీ.. చంద్రబాబుని సంప్రదించారు. ఆయన రిలయన్స్ని, నిమేష్ అంబానీ అనే బ్రోకర్ని పట్టుకున్నారు. రామోజీ సంస్థల షేర్లు ఒక్కోటి రూ.500గా ఉంటే రూ.5 వేలుగా చూపించి నిధులు తెచ్చారు. తద్వారా 2,600 మంది కస్టమర్లలో కొంతమందికి చెల్లించారు. అయితే ఎంతమందికి ఇచ్చామనే వివరాల్ని ఇప్పటికీ రామోజీ బయటపెట్టలేదు. పైగా ఎవరూ ఫిర్యాదు చేయలేదని వాదిస్తుంటారు. అంత పెద్ద వ్యక్తిపైన ఫిర్యాదు చేస్తే.. తమ భవిష్యత్తు ఏమవుతుందనే భయంతోనే డిపాజిటర్లు వెనకడుగు వేశారు. అది కూడా ఆ రోజుల్లో వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం అప్రమత్తమవ్వడంతోనే కొంతమందికి చెల్లించారు. మూడో వ్యక్తికి తెలియకుండా రామోజీ, శైలజ జాగ్రత్తపడ్డారు.. మార్గదర్శిలో మేనేజర్లు అకౌంట్స్ చేయడం, రిజిస్టర్స్ నిర్వహించడం మొదలైనవన్నీ చేయాల్సి ఉంటుంది. కానీ.. వారందర్నీ రామోజీ డమ్మీలుగా చేసేశారు. ఏ బ్రాంచ్లో డబ్బులు వచ్చినా ప్రధాన కార్యాలయానికి పంపించాలనే హుకుం జారీ చేశారు. వివిధ జిల్లాల్లో వసూలైన చిట్స్ డబ్బులు మొత్తం ప్రధాన కార్యాలయంలోనే ఉంటాయి. ఏ జిల్లాలో ఎన్ని డిఫాల్టులుఉన్నాయి.. ఎంత మొత్తం వస్తుంది.. అనేది ఎవరికీ తెలీదు. రామోజీ మార్గదర్శిని ఒక ప్రత్యేక సామ్రాజ్యంగా చూశారు. ఇందులో ఏం జరుగుతుందనేది మూడో వ్యక్తికి కూడా తెలియకుండా రామోజీ, శైలజ జాగ్రత్తపడ్డారు. రామోజీ నమ్ముకున్న సిద్ధాంతం ఒక్కటే.. బ్రేక్ ది లా.. లాఫుల్లీ. అంటే.. చట్టాన్ని కూడా చట్టప్రకారమే అతిక్రమిస్తుంటారు. చదవండి: కీలక ‘లేఖ’పై కిమ్మనరెందుకు? -
ఉద్యోగం పేరుతో రూ.కోటీ ఇరవై లక్షలు.. 40 మందికి టోకరా
పెదకాకాని: ఉద్యోగాలు ఇప్పిస్తానని నిరుద్యోగులను మోసగించిన ఘటన తాజాగా వెలుగు చూసింది. ఉద్యోగాల పేరుతో రూ.కోటీ ఇరవై లక్షలు మోసపోయారు. బాధితుల కథనం.. గుంటూరు జిల్లా పెదకాకాని పరిధిలోని కంతేరు అడ్డరోడ్డులో ఉన్న ఐజేఎం అపార్ట్మెంట్స్లో విజయవాడ ట్రెజరీ డిపార్ట్మెంట్లో జాయింట్ డైరెక్టర్గా పనిచేస్తున్న దావులూరి మాల్యాద్రి నివాసం ఉంటున్నాడు. గతంలో రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ డీఎస్సీ నిర్వహించి ఉద్యోగాలు ఇచ్చింది. కాంట్రాక్ట్ పద్ధతిలో వికలాంగ పిల్లలకు విద్యాబోధన చేస్తున్న మాత జయప్రకాష్రెడ్డికి దావులూరి మాల్యాద్రి పరిచయం అయ్యాడు. డీఎస్సీలో మిగిలిపోయిన పోస్టులకు సంబంధించి ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించాడు. తనకు మధ్యవర్తిగా లాజర్ అనే వ్యక్తిని పరిచయం చేశాడు.. జయప్రకాష్రెడ్డి కాకినాడ జిల్లా, కాజులూరు మండలం, దుగ్గుదూరు గ్రామం కావడంతో ఆయన పరిచయం ఉన్న మరో ఏడుగురితో కలసి మొత్తం ఎనిమిది మంది లాజర్ను కలిశారు. ఒక్కొక్క పోస్టుకు రూ.3 లక్షల అవుతుందని ముందుగా అడ్వాన్స్ లక్ష చొప్పున చెల్లించాలని లాజర్ చెప్పడంతో 8 లక్షలు చెల్లించారు. ఎక్కువ మందిని చూసుకోవడం ద్వారా ఖర్చులు తగ్గుతాయని చెప్పడంతో శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి జిల్లాల్లో ప్రైవేటు టీచర్లుగా పనిచేస్తున్న మరో 32 మందిని పరిచయం చేశారు. 40 మంది నుంచి ఫోన్ పే, గూగుల్ పే, బ్యాంక్ అకౌంట్ ద్వారా చెల్లించారు. వారి వద్ద నుంచి దావులూరి మాల్యాద్రి, లాజరు అతడి భార్య అరుణ వసూలు చేశారు. ఏ ఒక్కరికీ ఉద్యోగం రాకపోగా అదిగో ఇదిగో వస్తుంది అంటూ కాలయాపన చేస్తున్నారు. గట్టిగా నిలదీయడంతో అందరికీ ఉద్యోగాలు వచ్చే వరకూ షూరిటీగా నోట్లు, 100 స్టాంప్ పేపరుపైనా దావులూరి మాల్యాద్రి సంతకం చేసి ఇవ్వడం జరిగింది. అనంతరం కొంతకాలానికి డబ్బులు ఇవ్వాలని ఒత్తిడి చేయడంతో మీకు ఉద్యోగాలు ఇప్పించం, చేతనైంది చేసుకోండి అంటూ దుర్భాషలాడాడు. అలానే ఉద్యోగానికి నగదు చెల్లించిన వారిలో ఒకరైన ఎం.రాజేష్ బావ బి. వెంకటేశ్వరరావు(కానిస్టేబుల్) నిన్ను నమ్మి డబ్బులు చెల్లించాం, నీ చెక్ ఇవ్వాలని మాత జయప్రకాష్రెడ్డి ఇంటిపైకి వచ్చి భార్య పిల్లల్ని బెదిరిస్తున్నాడు. ఉద్యోగాలు ఇప్పిస్తామని చెబితే ఆశపడి 40 మంది అభ్యర్థులు ఒక్కొక్కరూ రూ.3 లక్షల చొప్పున చెల్లించి మోసపోయామని, మాకు మా కుటుంబసభ్యులకు ప్రాణరక్షణ కల్పించాలని, మోసపోయిన నగదు ఇప్పించాలని బాధితులు పెదకాకాని పోలీసుస్టేషన్లో శుక్రవారం ఫిర్యాదు చేశారు. -
సహకారం.. స్వాహాపర్వం
సాక్షి ప్రతినిధి,ఏలూరు: సహకార చట్టంలోని బ్యాంకుల నిబంధనలను పాటించలేదు.. రుణపరిమితిని అడ్డగోలుగా ఇష్టానుసారంగా పెంచేశారు.. సరైన షూరిటీలు లేకుండా కోట్లాది రూపాయల రుణాలు మంజూరు చేశారు. అర్హులైన రైతులకు ఇవ్వాల్సిన రుణాలను పక్కదారి పట్టించి మద్యం వ్యాపారులతో సహా పలువురికి కట్టబెట్టారు. ఇదంతా జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) పరిధిలోని బ్రాంచీల్లో జరిగిన అవినీతి పర్వం. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని డీసీసీబీ పరిధిలోని ఆరు శాఖల్లో జరిగిన భారీ అవకతవకలపై ప్రభుత్వం కన్నెర్ర చేసింది. సమగ్ర విచారణ నివేదిక ఆధారంగా గతంలో పనిచేసిన ఉన్నతాధికారులందరిపై శాఖాపరమైన, క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. గతంలో పనిచేసిన చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్తో పాటు మేనేజర్ కేడర్లోని 17 మందిపై చర్యలు తీసుకోనున్నారు. రుణాల మంజూరు విషయంలో.. జిల్లాలోని DCCB పరిధిలోని పలు బ్రాంచీల్లో ఏళ్ల తరబడి రుణాల మంజూరు విషయంలో భారీగా అవకతవకలు జరిగాయి. వివాదాల్లో ఉన్న భూము లను బ్యాంకుల్లో షూరిటీగా చూపించి కోట్ల రూపాయల రుణాలు పొంది తిరిగి రూపాయి కూడా చెల్లించని ఘటనలు వెలుగులోకి వచ్చాయి. జిల్లాలోని యలమంచిలి, కొవ్వూరు, తాడేపల్లిగూడెం, ఏలూరుతో పాటు మరికొన్ని బ్రాంచీల్లో జరిగిన అవకతవకలపై విచారణకు ప్రభుత్వం గుంటూరు కో–ఆపరేటివ్ రిజిస్ట్రార్ను ప్రత్యేకాధికారిగా నియమించింది. సుదీర్ఘంగా సాగిన విచారణ అనంతరం ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. దీనిపై కో–ఆపరేటివ్ శాఖ క మిషనర్ ఎ.బాబు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సిఫార్సు చేశారు. అక్రమాల్లో కొన్ని.. ● యలమంచిలి బ్రాంచీలో వివాదాలతో ఉన్న ఆ స్తులను షూరిటీలుగా చూపించి రూ.33.22 కోట్ల రుణం మంజూరు చేశారు. దీనిలో రూ.13.86 కోట్లు ఇప్పటికీ రికవరీ కాలేదు. అలాగే 2015–16, 2017–18 నాబార్డు వార్షిక తనిఖీల్లో నిర్దేశించిన నిబంధనలను అతిక్రమించి రుణాలు మంజూరు చేసినట్లుగా నిర్ధారించారు. ఎలాంటి షూరిటీలు లేకుండా రుణాలు మంజూరు చేసి బ్యాంకుకు ఆర్థిక నష్టం చేకూర్చారు. ● తాడేపల్లిగూడెం బ్రాంచీలో 104 మంది సభ్యుల పేరుతో రూ.2.80 కోట్లను ఓ రియల్టర్కు రుణంగా ఇచ్చారు. తాడేపల్లిగూడెంలోని డీసీసీబీ బ్రాంచీలో మొత్తం బకాయిల విలువ రూ.11.69 కోట్లు కాగా 559 రుణాలు విలువ రూ.4.30 కోట్లు. వీటి గడువు దాటినా కొన్నింటి వసూళ్లకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ● 2012–13 నుంచి 2018–19 వరకు డీసీసీబీ పలు శాఖల ద్వారా రూ.867.19 కోట్ల విలువైన 2,445 బ్యాంకు గ్యారంటీలు జారీ చేసింది. దీనిలో రూ.295.35 కోట్ల విలువైన 23 బ్యాంకు గ్యారంటీలను మద్యం వ్యాపారులు, రైస్మిల్లులు, ఇతరులకు ఇచ్చినట్టు గుర్తించారు. ● వ్యవసాయ భూమి విలువ భారీగా పెంచి షూరిటీగా చూపి రుణాలు కూడా మంజూరు చేశారు. క్రిమినల్ కేసులు అక్రమాలు జరిగిన క్రమంలో ఆయా కాలంలో పనిచేసిన బ్యాంకు అధికారులపై క్రిమినల్ కేసులకు సిఫార్సు చేశారు. మేనేజర్లు మన్నె మోహనరావు, ఐవీ నాగేశ్వరరావు, డి.ఆంజనేయులు, టీవీ సుబ్బారావు, కేఏ అజయ్కుమార్, జి.పిచ్చయ్యచౌదరి, కె.సురేంద్రప్రసాద్, ఎం.శ్రీనివాసరావు, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఎస్.రాధాకృష్ణ, జేఎస్వీ సత్యనారాయణరావు, సీహెచ్ రత్నకుమారి, కె.కిరణ్మయి, వి.శ్రీదేవి, డి.రమణ, జనరల్ మేనేజర్లు ఎ.మాధవీమూర్తి, వైవీ రాఘవేంద్రరెడ్డి, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వీవీఎం ఫణి తదితరులపై క్రిమినల్ చర్యలతో పాటు శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కమిషనర్ సిఫార్సు చేశారు. -
అదృష్టం వరించే రాళ్లంటూ వంచన
కర్ణాటక: సాలిగ్రామ అనే రాయిని అదృష్టం రాళ్లు అంటూ నమ్మించి వంచనకు పాల్పడుతున్న మనోజ్, ఆదిత్యసాగర్ అనే వ్యక్తులను అరెస్ట్చేసినట్లు సీసీబీ జాయింట్ పోలీస్కమిషనర్ డాక్టర్ ఎస్డీ.శరణప్ప తెలిపారు. నిందితులు రాజాజీనగర డాక్టర్ రాజ్కుమార్రోడ్డులోని ప్రైవేటు హోటల్లో బస చేశారు. వినియోగదారులను అక్కడకు పిలిపించి గుజరాత్లోని గోమతి నది నుంచి సాలిగ్రామ రాళ్లు తెప్పించామని, ఇవి విష్ణురూపమని, వీటిని ఇంట్లో ఉంచుకుంటే అదృష్టమని, వీటిని రూ.2కోట్లకు విక్రయిస్తామని చెప్పారు. పక్కా సమాచారంతో శుక్రవారం సీసీబీపోలీసులు దాడిచేసి నిందితులను అరెస్ట్ చేశారు. సాలిగ్రామ రాళ్లను స్వాదీనం చేసుకున్నారు. -
నమ్మిన వ్యక్తే దారుణంగా మోసం చేశాడు: ‘మిర్చి’ నటి ఆవేదన
ప్రముఖ సినీ, టీవీ నటి మాధవి ఓ వ్యక్తిని నమ్మి దారుణంగా మోసపోయానంటూ షాకింగ్ విషయం బయటపెట్టింది. నటి మాధవి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రభాస్ ‘మిర్చి’ సినిమాతో ఆమె గుర్తింపు పొందింది. మిర్చిలో మాట వినని కొడుకు కోసం ఆత్మహత్యాయత్నం చేసిన తల్లిగా కనిపించింది. దీంతో ప్రభాస్ ఆమెకు విలన్ కుటుంబం తరపున డబ్బు సాయం చేస్తాడు. అలా ఈ సినిమాలో ఎమోషన్స్ పండించి నటిగా మంచి గుర్తింపు పొందిన ఆమె పలు టీవీ సీరియల్స్లో విలనిజం పోషిస్తోంది. బుల్లితెరపై కుట్రలు చేస్తూ, మోసం చేసే పాత్రల్లో మాధవి ఆకట్టుకుంటోంది. చదవండి: ఏడాది తిరక్కుండానే యాంకర్ శ్యామల మరో కొత్త ఇంటి నిర్మాణం, ‘అంత డబ్బు ఎక్కడిది?’ అలాంటి ఆమె నిజ జీవితంలో ఓ వ్యక్తి నమ్మ భారీ మొత్తంలో డబ్బు పొగొట్టుకుందట. ఇటీవల లైవ్లో ఫ్యాన్స్తో ముచ్చటించిన ఆమె స్వయంగా ఈ విషయం వెల్లడించింది. తనకు తెలిసిన వ్యక్తే నమ్మించి మోసం చేశాడంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ‘నాకు బాగా తెలిసిన వ్యక్తి స్టాక్ మార్కెట్లో డబ్బులు పెట్టమన్నాడు. అతడిని నమ్మి రూ. 5 లక్షల వరకు పెట్టుబడి పెట్టాను. ఆ తర్వాత మాయ మాటలు చెబుతూ ఆ డబ్బు మొత్తం కాజేశాడు. స్టాక్ మార్కెట్పై నాకు పెద్దగా అవగాహన లేకపోడం వల్లే సులువుగా నన్ను మోసం చేయగలిగాడు. చదవండి: ఓటీటీకి వచ్చేస్తోన్న కల్యాణ్ రామ్ అమిగోస్.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే..! డబ్బు పోయిందనే బాధ కంటే.. తెలిసినే వ్యక్తే, నేను బాగా నమ్మిన వ్యక్తి మోసం చేయడాన్ని జీర్ణించుకోలేకపోతున్నా’ అంటూ చెప్పుకొచ్చింది. అనంతరం ఎవరిని గుడ్డిగా నమ్మొద్దని, లేదంటే తనలా మోసపోతారంటూ నెటిజన్లకు సూచించింది. ముఖ్యంగా స్టాక్ మార్కెట్ గురించి తెలియకుండ అసలు డబ్బులు ఇన్వెస్ట్ చేయొద్దని ఆమె తెలిపింది. కాగా స్టార్ మాలో ప్రసారమయ్యే ‘గుప్పెడంత మనసు’ సీరియల్లో మాధవి దేవయాని పాత్ర పోషించింది. ఇందులో హీరోకు పెద్దమ్మగా నటించింది. కపట ప్రేమ చూపిస్తూ.. సొంతవాళ్లపైనే కుట్రలు చేసే పెద్దమ్మగా మాధవి తన నటనతో మెప్పించింది. అయితే ప్రస్తుతం ఆమె ఈ సీరియల్ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. -
యూట్యూబ్లో లైక్ చేయాలంటూ వల.. ఒక్క రోజులో రూ. కోటి స్వాహా!
హిమాయత్నగర్: ఒక్క రోజులో సైబర్ కేటుగాళ్లు రూ.కోటి కొట్టేశారు. డబ్బు పోగొట్టుకున్న బాధితులు శనివారం సైబర్క్రైం పోలీసు స్టేషన్కు క్యూ కట్టారు. సైబర్క్రైం ఏసీపీ కేవీఎం ప్రసాద్ కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్–12లో నివాసం ఉండే వైద్యురాలికి కొద్దిరోజుల క్రితం టెలిగ్రాంలో ఓ యువతి పరిచయమైంది. తాము పంపించే యూట్యూబ్ లింకులను ఓపెన్ చేసి దానిలోని వీడియోను లైక్, కామెంట్తో పాటు షేర్ చేస్తే ఒక్కో లైక్కు రూ.500, కామెంట్కు రూ.1,000, షేర్ చేస్తే రూ.2 వేలు ఇస్తామన్నారు. తొలిరోజుల్లో లాభాలు ఇచ్చారు. వీరి మధ్య సాన్నిహిత్యం బలపడింది. దీంతో ఇన్వెస్ట్మెంట్ వైపు ఆమెను ఆహా్వనించింది. దీనికి ఒప్పుకున్న వైద్యురాలికి ఇన్వెస్ట్మెంట్లో కూడా తొలుత లాభాలు ఇచ్చారు. ఆ తర్వాత పెట్టిన పెట్టుబడికి టాస్క్లు ఉన్నాయంటూ చెబుతూ పలు దఫాలుగా రూ.64 లక్షలు దోచుకున్నారు. మరో వ్యక్తి ఆమెజాన్ గిఫ్ట్ కూపన్స్ కొనుగోలు చేసి ఆన్లైన్లో ఇతరులకు విక్రయిస్తుంటాడు. కేవైసీ తీసుకున్న వారికే గిఫ్ట్ కూపన్స్ను బల్్కలో కొంతకాలంగా ఆన్లైన్ ద్వారా విక్రయిస్తున్నాడు. బల్క్లో తీసుకున్న కొందరు డబ్బు వేస్తున్నట్లు నటించి డబ్బు వేయలేదు. రెండు నెలల వ్యవధిలో కేవైసీ ఇచి్చన ఇద్దరు వ్యక్తులు రూ.34 లక్షలు కాజేశారు. మరో ఐదుగురి నుంచి సైబర్ నేరగాళ్లు ఓటీపీలు, ఇన్వెస్ట్మెంట్లు అంటూ దాదాపు రూ.10 లక్షలు స్వాహా చేశారు. ఇలా శనివారం ఒక్కరోజే కోటికి పైగా డబ్బు పోగొట్టుకున్న వారు సైబర్క్రైం పోలీసుల్ని ఆశ్రయించారు. చదవండి: స్నేహితుడిని కత్తితో పొడిచి.. తల, గుండె వేరు చేసి.. -
ఆ ఉచ్చులో పడితే అంతే.. చైనాలో సూత్రధారులు.. ఉత్తరాదిలో పాత్రధారులు
మాజీ సైనికోద్యోగి నుంచి 21 లక్షలు.. పదవీ విరమణ చేసిన ప్రైవేట్ ఉద్యోగి నుంచి రూ.53 లక్షలు.. ఓ వ్యాపారి నుంచి రూ.48 లక్షలు.. కేవలం గత మూడు రోజుల్లో పార్ట్టైమ్ జాబ్స్ పేరిట సైబర్ నేరగాళ్లు కొల్లగొట్టిన సొమ్ము ఇది. కేవలం లైకులు కొడితే చాలంటూ.. ఇంటి నుంచే పనిచేస్తూ సంపాదించుకోవచ్చంటూ.. గాలం వేసి డబ్బులు కాజేస్తున్న ఈ తరహా నేరాలు బాగా పెరిగాయని సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఆన్లైన్లో పార్ట్టైమ్ జాబ్లు అంటూ వచ్చే మెసేజీలు, ప్రకటనల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. చిన్న సందేశంతో మొదలై.. పార్ట్టైమ్ ఉద్యోగాలు ఉన్నాయని.. స్మార్ట్ ఫోన్, ఇంటర్నెట్ ఉంటే చాలు ఇంటి నుంచే సంపాదించవచ్చంటూ సైబర్ నేరగాళ్లు వాట్సాప్ సందేశాలు, ఎస్సెమ్మెస్లు పంపుతున్నారు. వ్యవస్థీకృతంగా పనిచేసే ఈ ముఠాలు వర్చువల్ నంబర్లతోపాటు నకిలీ గుర్తింపుకార్డులతో తీసుకున్న ఫోన్ నంబర్లతో ఈ వ్యవహారాన్ని నడిపిస్తాయి. ఆ సందేశాల్లో ఉన్న లింకులను క్లిక్ చేస్తే వాట్సాప్, టెలిగ్రామ్ వంటి సోషల్ మీడియా సైట్స్లోని గ్రూపులు తెరుచుకుంటాయి. అక్కడ ఈ పార్ట్టైమ్ జాబ్ల వివరాలు ఉంటాయి. కేవలం లైకులు కొడితే చాలు డబ్బులు వస్తాయని.. తనకు నెల రోజుల్లోనే రూ.లక్షల్లో సొమ్ము వచ్చిందని.. ఇందులో చేరితే బాగుంటుందని.. ఇలా ఆ గ్రూపుల్లో చర్చలు జరుగుతుంటాయి. ఇలా కామెంట్స్ చేసే వారంతా ఆ సైబర్ క్రైమ్ ముఠా వారే ఉంటారు. అవి చూసిన అమాయకులు ఆశతో ముందడుగు వేస్తారు. యాప్స్, వాలెట్స్లో డబ్బులు జమ చేయించి.. సైబర్ నేరగాళ్లు తాము టార్గెట్ చేసిన వ్యక్తితో వాట్సాప్, టెలిగ్రామ్ ద్వారా సంప్రదింపులు జరుపుతూ.. ప్రత్యేక యాప్స్, వెబ్సైట్లకు చెందిన లింకులను పంపుతారు. వాటిలో వివరాలు నమోదు చేసి రిజిస్టర్ చేసుకోవాలని కోరుతారు. అందులో ఉండే వివిధ స్కీముల్లో ఒకదాన్ని ఎంపిక చేసుకుని.. దానికి అనుగుణంగా నెట్ బ్యాంకింగ్ లేదా యూపీఐ విధానంలో డబ్బులు పెట్టుబడి పెట్టాలని సూచిస్తారు. స్కీమ్ ఎంపిక చేసుకుని, డబ్బులను అందులో జమ చేశాక.. వరుసగా వీడియోలు వస్తుంటాయి. వాటిని లైక్ చేస్తూ పోవాలని, ప్రతి లైక్కు రూ.2 నుంచి రూ.5 వరకు వస్తాయని చెబుతారు. ఇలా లైకులు చేసే కొద్దీ అందుకు సంబంధించిన సొమ్ము బాధితుడి వర్చువల్ ఖాతాలోకి జమ అవుతూ ఉంటాయి. చిన్న మొత్తాలు ఇచ్చి.. పెద్ద మొత్తానికి గాలమేసి.. బాధితులు జమ చేసిన మొత్తం, లైకుల ద్వారా సంపాదించిన సొమ్ము వారి వర్చువల్ ఖాతాలోనే ఉన్నట్టు కనిపిస్తూ ఉంటుంది. కొన్ని రోజుల్లోనే సొమ్ము బాగా పెరిగిపోతూ ఉంటుంది. ఇందులో కొంతమొత్తం సొమ్మును ఒకట్రెండు సార్లు బ్యాంకు ఖాతాలోకి మార్చుకుని, డ్రా చేసుకోవడానికీ అవకాశమిస్తారు. ఇలా పూర్తిగా నమ్మించి.. పెద్ద మొత్తంలో పెట్టుబడి పెడితే ఎక్కువ వీడియోలను లైక్ చేసే అవకాశం వస్తుందని.. ఎక్కువ లాభం వస్తుందని గాలం వేస్తారు. దీంతో కొందరు బాధితులు లక్షల్లో సొమ్మును యాప్స్/వాలెట్లలోకి జమ చేస్తారు. వీడియోలు లైక్ చేసిన కొద్దీ వచ్చే సొమ్ము వారి వర్చువల్ ఖాతాలో కనిపిస్తుంటుంది. ఇక్కడే మరింత మోసం మొదలవుతుంది. వర్చువల్ ఖాతాల్లో భారీగా సొమ్ము కనిపించినా.. బ్యాంకు ఖాతాకు ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశం ఇవ్వరు. అలా డ్రా చేసుకోవాలంటే, రూల్ ప్రకారం మరింత మొత్తం పెట్టుబడి పెట్టాలంటూ.. బాధితులతో వీలైనంత మేర జమ చేయిస్తారు. ఆ సొమ్మంతా సైబర్ నేరగాళ్ల చేతిలోకి వెళ్లిపోయినట్టే. తర్వాత ఆ యాప్/ వెబ్సైట్ మాయమైపోతాయి. తమ ఫోన్కు వచ్చిన లింకులు, వెబ్ అడ్రస్ల ద్వారా తెరవడానికి ప్రయత్నించినా.. సదరు యాప్స్/వెబ్సైట్లు అందుబాటులో లేవని చూపిస్తుంది. ఇలాంటి సైబర్ గ్యాంగులు దేశవ్యాప్తంగా అమాయకులకు గాలం వేసి వందల కోట్ల రూపాయలు కాజేస్తున్నాయి. ప్రధానంగా తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, గుజరాత్, తమిళనాడు, రాజస్తాన్, కేరళ, పశ్చిమ బెంగాల్లలో ఎక్కువగా పంజా విసరుతున్నాయి. లైకులు, ఇన్వెస్ట్మెంట్స్, సేల్స్ పేరుతో జరిగే ఈ స్కామ్స్కు చైనీయులే సూత్రధారులని.. ఉత్తరాది రాష్ట్రాల వారి సాయంతో ఈ నేరాలకు పాల్పడుతున్నారని సైబర్ క్రైమ్ పోలీసులు చెప్తున్నారు. కేవలం లైకులు, షేర్లు చేయడం వల్ల డబ్బు రాదని.. తెలియని అంశాల్లో పెట్టుబడులు వద్దని సూచిస్తున్నారు. చదవండి:ఒకటి, రెండు కాదు.. 40 బైకులు సీజ్: కారణం ఏంటంటే? -
అసలు వీడు మనిషేనా?.. విదేశాల్లో భార్యను ఒంటరిగా వదిలేసి..
సాక్షి, హైదరాబాద్: ‘ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు’ అంటారు. కానీ, ఓ ప్రవాస ప్రబుద్ధుడు భార్య చదువు ఆర్థిక భారంగా భావించాడు. ఉన్నత చదువులు చదివి..మంచి ఉద్యోగం సంపాదించి భర్తకు చేదోడుగా నిలుద్దామనుకున్న ఆమె కలలను కల్లలు చేశాడు. విదేశాల్లో ఒంటరిగా వదిలేసి..తాపీగా చేతులు దులుపేసుకున్నాడు. అల్లుడికి నచ్చచెబుదామని పలుమార్లు ప్రయత్నించినా ఫలితం లేకపోవటంతో.. దిక్కుతోచని స్థితిలో బాధితురాలి తల్లిదండ్రులు గచ్చి»ౌలిలోని మహిళా పోలీసులను ఆశ్రయించారు. పూర్తి వివరాలు ఇలా.. మాదాపూర్ జోన్కు చెందిన కావ్య (పేరు మార్చాం) స్థానికంగా డిగ్రీ పూర్తి చేసింది. దాదాపు ఐదేళ్ల క్రితం తల్లిదండ్రులు మ్యాట్రిమోని సైట్ల ద్వారా పెళ్లి సంబంధం వెతికి అమెరికాలో స్థిరపడిన కిషోర్ (పేరు మార్చాం)కు ఇచ్చి పెళ్లి చేశారు. కిషోర్ యూఎస్లోని వర్జీనియాలో ఉద్యోగి కావటంతో.. పెళ్లి తర్వాత ఈ యువ జంట అక్కడికి వెళ్లింది. కొన్నాళ్లు అన్యోన్యంగానే ఉన్నారు. మధ్యలో ఆపేసిన చదువును పూర్తి చేద్దామని భావించిన కావ్య అక్కడే ఓ యూనివర్సిటీలో ఎంఎస్లో చేరింది. దీంతో భర్త అసలు రంగు బయటపడింది. భార్య చదువు ఆర్థిక భారంగా మారిందని కిషోర్ తనని దూరం పెట్టడం మొదలుపెట్టాడు. దీనిపై ఇద్దరి మధ్య తగాదాలు మొదలయ్యాయి. ఈ విషయాన్ని ఇండియాలో ఉన్న తల్లిదండ్రులకు వివరించింది కావ్య. దీంతో పలుమార్లు ఫోన్లో అల్లుడితో మాట్లాడేందుకు ప్రయత్నించగా పట్టించుకోలేదు. అల్లుడి తల్లిదండ్రులను కలిసి వారి కొడుక్కి సర్దిచెప్పమని చెబుదామని ప్రయత్నిస్తే వారి నుంచి కూడా స్పందన లేదు. దీంతో చేసేదిలేక గచ్చిబౌలిలోని మహిళా పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు కిషోర్ తల్లిదండ్రులను విచారించగా.. వాళ్లిద్దరి మధ్య అవగాహన సరిగా లేదని చెప్పి చేతులు దులిపేసుకున్నారు. దీంతో విదేశంలో కూతురు ఒంటరైపోయిందని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఎన్నారై సంబంధం ఇలా పెటాకులు కావటంతో అమ్మాయి చదువు, వసతి ఇతరత్రా ఖర్చులన్నీ తల్లిదండ్రులే భరిస్తున్నారు. ఎన్నారై బంధానికి ఏడు సూత్రాలు: ► ఎన్నారైల ఎంపిక, పెళ్లి చేసే విషయంలో తొందరపడకూడదు. ► వరుడు/వధువు అతని కుటుంబ సభ్యుల నేపథ్యాన్ని ధ్రువీకరించుకోవాలి. ► మ్యారేజ్ బ్రోకర్లు, బ్యూరోలపై ఆధారపడి సంబంధాన్ని అంగీకరించకూడదు. ► ప్రవాసుల వివాహాన్ని తప్పనిసరిగా నమోదు చేయాలి. ► విదేశాలలో చట్టపరమైన హక్కులు, అర్హతలు, అత్యవసర సేవల గురించి తెలుసుకోవాలి. ► వధువు వీసా, పాస్పోర్ట్, ఇతరత్రా ముఖ్యమైన కాపీలను వధువు కుటుంబం లేదా దగ్గరి స్నేహితుల వద్ద ఉంచాలి. ► ఎన్నారై వరుడి పాస్పోర్ట్, విదేశీయుల నమోదు కార్డు, సామాజిక భద్రత నంబరు, గత మూడు సంవత్సరాలకు సంబంధించిన పన్ను రిటర్న్లు, బ్యాంకు పత్రాలు వంటి కీలకమైన పత్రాలను తనిఖీ చేయాలి. -
HYD: సంధ్య కన్వెన్షన్ ఎండీ శ్రీధర్ అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: సంధ్య కన్వెన్షన్ ఎండీ శ్రీధర్ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనను ఉప్పరపల్లి కోర్టులో పోలీసులు హాజరుపర్చారు. ట్రాన్సిట్ వారెంట్ అనుమతి కోరుతూ ఢిల్లీ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. కాగా, ఎస్కార్ట్ కంపెనీ మాజీ వైస్ ప్రెసిడెంట్ అనిల్ నందా ఫిర్యాదుతో సంధ్యా శ్రీధర్పై కేసు నమోదైంది. ఢిల్లీ, లూథియానాలో ఉన్న భూములను ఫోర్జరీ సంతకాలతో శ్రీధర్ అమ్మినట్లు సమాచారం. సుమారు రూ. 200 కోట్ల రూపాయల విలువైన భూములను ఫోర్జరీ డాక్యుమెట్లతో మోసాలకు పాల్పడ్డారని ఫిర్యాదు చేశారు. రూ.180 కోట్లు చెల్లించినట్లు తన దగ్గర డాక్యుమెంట్లు ఉన్నాయని, అమితాబచ్చన్ బంధువులను మోసం చేయలేదన్న శ్రీధర్.. న్యాయ పోరాటం చేస్తానన్నారు. చదవండి: అమ్మకానికి హెచ్ఎండీఏ భూములు.. ప్లాట్ల ఆన్లైన్ వేలం ఎప్పుడంటే? -
రూ.6వేలు అప్పు ఇచ్చి.. రూ.54వేలు కట్టించుకున్నారు.. అయినా..!
సాక్షి, ఖమ్మం: ఆన్లైన్ యాప్ లోన్ ఆగడాలకు ఖమ్మంలో ఓ యువకుడు బలయ్యాడు. యాప్ వారి వేధింపులకు భరించలేక పురుగుమందుతాగి ఆత్మహత్యకు యత్నించాడు. స్థానికులు గమనించి ఆస్పత్రిలో చేర్చగా చికిత్స పొందుతూ ఆదివారం మరణించాడు. ఖమ్మం జిల్లాలో రఘునాథపాలెం మండలంలో జరిగిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. బాపూజీ తండాకు చెందిన భూక్యా భావ్సింగ్ కుమారుడు ఆకాశ్(24) నగరంలోని ఓ బంగారం షాపులో పనిచేస్తున్నాడు. ఆన్లైన్ యాప్ ద్వారా రూ.6 వేలు అప్పుగా తీసుకున్నాడు. ఆ అప్పును సకాలంలో చెల్లించడంతోపాటుగా అదనంగా రూ.54 వేలు చెల్లించినా....ఇంకా అప్పు ఉన్నావని, అప్పు చెల్లించకుంటే ‘నీ ఫొటో, మీ కుటుంబ సభ్యుల ఫొటోలు సోషల్ మీడియాలో పెడతాం’అంటూ వేధింపులకు పాల్పడ్డారు. వారి వేధింపులు భరించలేక ఈ నెల 9న తాను పనిచేసే షాపు వెనుకనే పురుగు మందు తాగాడు. షాపు యాజమాన్యం గమనించి వెంటనే ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందాడు. ఆకాశ్ కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు ఖమ్మం త్రీటౌన్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, సీఐ సర్వయ్య మాత్రం లోన్యాప్ వేధింపులనే ఫిర్యాదు తమకు అందలేదని, వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్య చేసుకున్నాడనే సమాచారం ఉందని, దీనిపై విచారణ చేస్తున్నామని చెప్పారు. మనిషికి ఉండేది ఒక్కటే జీవితం. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com చదవండి: నార్సింగి కేసులో వీడిన మిస్టరీ.. ఇద్దరు అరెస్ట్ -
భార్యకు తెలియకుండానే విడాకులిచ్చిన భర్త.. డబ్బు కొట్టేయాలని ప్లాన్
సాక్షి, సిటీబ్యూరో: డబ్బుల కోసం కట్టుకున్న భార్యను, చనిపోయిన కన్న తల్లినీ మోసం చేశాడు. భార్యకు తెలియకుండా విడాకులు ఇవ్వడమే కాకుండా ఆమె పేరున ప్రాపర్టీ కొనుగోలు చేసి, ప్రతి నెలా ఈఎంఐ కిరికిరిలో భార్యను ఇరికించేశాడు! చనిపోయిన తల్లి సంతకం ఫోర్జరీ చేసి డబ్బు కాజేశాడు. ఈ సొమ్ము భార్య, భర్తల జాయింట్ ఖాతాలో జమకావడంతో తన ప్రమేయం లేకుండానే అటు బాధితురాలు, ఇటు నిందితురాలిగా మారింది ఓ భార్య! విచిత్రమైన ఈ కేసు గచి్చ»ౌలి మహిళా ఠాణాలో నమోదైంది. వివరాల్లోకి వెళితే.. మాదాపూర్కు చెందిన అభిషేక్, అర్చన (పేర్లు మార్చాం)లు ఒకరినొకరు ప్రేమించుకున్నారు. పెద్దలను ఒప్పించి వైభవంగా పెళ్లి కూడా చేసుకున్నారు. ఆ తర్వాత ఉద్యోగరీత్యా ఆ యువ జంట ఆ్రస్టేలియా వెళ్లింది. నాలుగైదు ఏళ్లు అన్యోన్యంగానే ఉన్నారు. ఆ తర్వాత అతడి అసలు రంగు బయటపడింది. చీటికీమాటికీ భార్యతో గొడవ పడుతుండటంతో అదే సమయంలో తల్లిదండ్రుల ఆరోగ్య సమస్యల రీత్యా.. ఆమె ఇండియాకు తిరిగొచ్చేసింది.దీంతో అభిషేక్ తన భార్య వెళ్లిపోయిందని విడాకులను కావాలని ఆ్రస్టేలియాలో కోర్టును ఆశ్రయించడంతో అక్కడి న్యాయస్థానం విడాకులు మంజూరు చేసింది. విడాకుల విషయం దాచి.. ఆ తర్వాత ఇండియాకు వచ్చిన అతను భార్యకు విడాకుల విషయం చెప్పకుండా దాచేశాడు. అప్పటికే ఆమె గచి్చ»ౌలిలోని ఓ బహుళ జాతి కంపెనీలో ఐటీ ఉద్యోగి. లక్షల్లో వేతనం కావటంతో ఆమె బ్యాంకు ఖాతాలోని డబ్బును ఎలాగైనా కాజేయాలని పథకం వేశాడు. ఎంచక్కా.. ఇద్దరి పేరున ఉమ్మడి బ్యాంకు ఖాతా తెరిచాడు. భార్యను సహ యజమానురాలిగా పెట్టి బ్యాంకు రుణంతో ఓ ఖరీదైన ప్రాపర్టీని కొనుగోలు చేశాడు. బ్యాంకు నెలవారీ వాయిదా ఆమె అకౌంట్ నుంచి జమ అయ్యేలా ప్లాన్ చేశాడు. అయితే ప్రాపర్టీ మీద వచ్చే అద్దె డబ్బును సొంతానికి వాడుకుంటున్నాడు. చనిపోయిన తల్లి డబ్బు కాజేయాలని.. గతంలోనే అభిషేక్ తల్లి చనిపోయింది. అయితే ఆమె బ్యాంకు ఖాతాలోనే డబ్బు ఉందని తెలుసుకున్న అతను.. ఎలాగైనా దాన్నీ కొట్టేయాలని మరో స్కెచ్ వేశాడు. తల్లి బ్యాంకు చెక్ తీసుకొని అమ్మ సంతకం ఫోర్జరీ చేశాడు. ఈ చెక్ను ఉమ్మడి ఖాతా ఉన్న బ్యాంకులో డిపాజిట్ చేసి.. రూ.లక్షల్లో సొమ్ము తీసుకున్నాడు. ఈ విషయం అభిషేక్ సోదరికి తెలియడంతో ఆమె పోలీసు స్టేషన్లో ఫోర్జరీ కేసు పెట్టింది. దీంతో పోలీసులు అభిషేక్ను విచారించగా.. బండారం మొత్తం వెలుగులోకి వచ్చింది. ఆ అమ్మాయి తన భార్య కాదని అందుకే తనపై 498ఏ కేసు పెట్టేందుకు ఆమె అర్హురాలు కాదని అభిషేక్ పోలీసులతో వాగ్వాదం దిగడం కొసమెరుపు. అనధికారికంగా తల్లి ఖాతాలోని డబ్బు భార్య, భర్తలు ఉమ్మడి ఖాతాలోనే జమైంది కాబట్టి.. పోలీసులు భర్తతో సహా భార్యపై కూడా కేసు పెట్టారు. దీంతో ఆమె ఉద్యోగం పోగొట్టుకుని జైలుపాలైంది. చదవండి: వివాహిత కిడ్నాప్.. కారులో తిప్పుతూ లైంగిక దాడి -
Nikki Yadav: ప్రియుడు మోసగాడని తెలియక నిక్కీ..
క్రైమ్: శ్రద్ధా వాకర్ తరహాలో.. అదీ దేశరాజధానిలోనే వెలుగు చూసిన ‘ఫ్రిడ్జ్లో ప్రియురాలి శవం’ ఉదంతం డేటింగ్ కల్చర్పై మరోసారి చర్చకు దారి తీసింది. ఏళ్ల తరబడి కలిసి ఉన్న ఆమెకు.. ప్రియుడు చేసిన నమ్మక ద్రోహం తెలిశాక నిలదీసింది. అయితే తన దగ్గర సమాధానం లేకపోవడంతో.. వదిలించుకునేందుకు ఆమెను దారుణంగా హత్య చేశాడు. మంగళవారం ప్రియుడు సాహిల్ గెహ్లాట్కు చెందిన ఓ రెస్టారెంట్ ఫ్రిడ్జ్లో శవమై కనిపించింది నిక్కీ యాదవ్. ఛార్జింగ్ కేబుల్ను మెడకు బిగించి చంపి.. ఆపై ఆ శవాన్ని దగ్గర్లోనే ఉన్న తన కుటుంబానికి చెందిన ధాబాలోని ఫ్రిడ్జ్లో దాచిపెట్టాడు సాహిల్. తన కూతురికి సాహిల్ మోసగాడు అని గుర్తించలేకపోయిందని, గుడ్డిగా ప్రేమించి ప్రాణం పొగొట్టుకుందని నిక్కీ తండ్రి విలపిస్తున్నాడు. సాహిల్కు మరణశిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నాడాయన. ఇదిలా ఉంటే.. సెక్యూరిటీ ఫుటేజ్ ద్వారా ఈ ఘోరం వెలుగులోకి వచ్చింది. निक्की यादवचं हत्येच्या काही तास आधीचं CCTV आलं समोर#NikkiYadav Murder Case CCTV#SahilGehlot #SahilGahlot #Delhi pic.twitter.com/d7hJJtYfuV — Shivraj Yadav | शिवराज यादव 🇮🇳🖊️ (@shiva_shivraj) February 15, 2023 మరోవైపు నిక్కీ యాదవ్ చివరిసారిగా కనిపించిన వీడియో ఒకటి పోలీసుల ద్వారా మీడియాకు రిలీజ్ అయ్యింది. సౌత్ వెస్ట్ ఢిల్లీలోని తన ఇంట్లోకి ఆమె ప్రవేశిస్తున్న సమయంలో సీసీటీవీ ఫుటేజ్లో దృశ్యాలు రికార్డు అయ్యాయి. ఆ రోజు తేదీ ఫిబ్రవరి 9. ఆరోజే హత్య జరిగినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. సాహిల్కి చాలారోజుల కిందటే.. మరో యువతితో వివాహం ఫిక్స్ అయ్యింది. ఆ విషయం నిక్కీకి తెలియకుండా జాగ్రత్తపడ్డాడు అతను. అయితే.. వివాహానికి ముందురోజు ఆమెకు ప్రియుడి చేస్తున్న మోసం తెలిసింది. దీంతో.. అతన్ని నిలదీసింది. మరో యువతిని వివాహం చేసుకుంటున్నాడని తెలియగానే.. నిక్కీ అతనితో గొడవకు దిగింది. ఇంట్లోకి వెళ్లిన నిక్కీ.. కాసేపటికే మళ్లీ బయటకు వచ్చింది. ఆపై సుమారు మూడు గంటలపాటు ఇద్దరూ కారులోనే వాగ్వాదానికి దిగినట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే.. ఫోన్ ఛార్జింగ్కేబుల్ను ఆమె మెడకు బిగించి సాహిల్ హత్య చేశాడు. నిక్కీ స్వస్థలం హర్యానాలోని ఝాజ్జర్. అయితే ఆమె మాత్రం ఢిల్లీలో ఉంటోంది. మెడికల్ ఎంట్రెన్స్ ఎగ్జామ్లకు ప్రిపేర్ అవుతున్న క్రమంలోనే నిక్కీ-సాహిల్ మధ్య పరిచయం ఏర్పడింది. గత కొన్నేళ్లుగా ఇద్దరూ డేటింగ్లో ఉన్నారు. నిక్కీ కనిపించకుండా పోయిందని పొరుగింటి వాళ్లు ఫిర్యాదు చేయడంతో.. ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది. విచారణలో సాహిల్ నేరాన్ని అంగీకరించినట్లు పోలీస్ వర్గాలు చెప్తున్నాయి. -
Banjara Hills: దోమ తెరలు, బ్లాంకెట్ల సరాఫరా.. 60 కోట్ల కాంట్రాక్ట్ ఇప్పిస్తానని..
సాక్షి, బంజారాహిల్స్: అస్సాంలోని దోమ తెరలు, బ్లాంకెట్ల సరఫరాకు సంబంధించి 60 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ ఇప్పిస్తానని నమ్మబలికి 20 లక్షల రూపాయలు తీసుకొని మోసం చేసిన వ్యక్తిపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. రహ్మత్నగర్కు చెందిన కె.నర్సింహారెడ్డి వ్యాపారి. ఆయనకు విశ్రాంత ఐఏఎస్ అధికారి కె.నారాయణతో పరిచయం ఉంది. కొద్ది రోజుల కిత్రం నారాయణ ద్వారా మాదాపూర్ జైహింద్ రోడ్డులో నివాసం ఉండే గుండుబోయిన వినయ్, కాకాని మనోహర్రెడ్డితో పరిచయం ఏర్పడింది. వీరిద్దరు తమకు వివిధ ప్రభుత్వాలతో మంచి సంబంధాలు ఉన్నాయని చెప్పారు. పెద్ద పెద్ద కాంట్రాక్ట్లు చేస్తుంటామని నమ్మించారు. అనంతరం అస్సాం రాష్ట్రంలో 60 కోట్ల రూపాయల విలువ చేసే దోమ తెరలు, బ్లాంకెట్లు సరఫరా చేసే కాంట్రాక్ట్ అప్పగింత పని తమ చేతిలో ఉందని తెలిపారు. ఎవరైన పెట్టుబడి పెడితే మంచి లాభాలు వస్తాయని నర్సింహారెడ్డికి ఆశ కల్పించారు. ఆ తర్వాత కాంట్రాక్ట్ తామే తీసుకుంటున్నట్టు చెప్పడంతో కొంత పెట్టుబడి పెడితే వాటా ఇస్తామని చెప్పారు. నర్సింహారెడ్డి వారి మాటలను నమ్మి 20 లక్షల రూపాయలు ఇచ్చాడు. ఆ తరువాత వారిద్దరు మోసగాళ్లని తెలిసింది. తన డబ్బు తిరిగి ఇచ్చేయాలని నర్సింహారెడ్డి ఇద్దరిని పలుమార్లు అడిగాడు. కాని వారు స్పందించలేదు. దీంతో పోలీసులను ఆశ్రయించగా జూబ్లీహిల్స్ పోలీసులు వినయ్, కాకాని మనోహర్రెడ్డిలపై ఐపీసీ 406,420, రెడ్ విత్ 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
Hyderabad: ‘దెబ్బకు దెయ్యం వదిలిపోతుంది.. నన్ను పెళ్లి చేసుకో’
సాక్షి, హైదరాబాద్: నేను ఖయామత్ బంధిష్ను (దుష్టశక్తులు ధరికి రాకుండా కాపాడే గొప్ప శక్తిమంతుడిని) అంటూ మాయమాటలు చెప్పి యువతులను వశపరుచుకుంటున్న బాబా ముసుగులో ఉన్న నిత్య పెళ్లికొడుకుపై పోలీసులు కేసు నమోదు చేశారు. లంగర్హౌస్ పోలీసులు, బాధితులు తెలిపిన మేరకు.. లంగర్హౌస్ ఎండీలైన్స్లో నివాసముండే 18 సంవత్సరాల యువతి గత 3 సంవత్సరాలుగా అనారోగ్యంతో బాధపడుతోంది. పలు ప్రాంతాల్లో వైద్యం కోసం తిరిగినా ఫలితం లేకపోవడంతో కొందరి సలహా మేరకు నెల్లూరులోని ఓ దర్గాకు చేరారు. నెల్లూరు ఏసుపాలెం గ్రామంలోని రెహమతుల్లా దర్గా ప్రధాన నిర్వాహకుడు హాతీష్పాషా బాబాను(52) రెండేళ్ల క్రితం కలిసి సమస్యను తెలిపారు. మంత్రశక్తులతో నయం చేస్తానంటూ నిమ్మకాయలు, కాగితాలు ఇచ్చి పంపేవాడు. నిత్యం వైద్యం, మంత్రం కోసం నెల్లూరు వెళ్లిన బాధితులకు హతీష్ బాబా రెండు నెలలుగా ఈ అమ్మాయిని తనకు ఇచ్చి వివాహం చేయాలని కోరాడు. తాను ఖయామత్ బంధిస్తానని తనను పెళ్లి చేసుకుంటే సమస్యలు పోవడమే కాకుండా మళ్లీ ఎలాంటి సమస్యలు దరిదాపులోకి రావని తెలిపాడు. నమ్మిన తల్లిదండ్రులు వివాహానికి ఒప్పుకొని ఈ నెల 11న రాత్రి టోలీచౌకీలోని ఫంక్షన్హాల్లో బంధుమిత్రుల ఆధ్వర్యంలో వివాహానికి ఏర్పాట్లు చేశారు. పాషా బాబా వివాహసమయానికి ముందు అనారోగ్యం అంటూ ఆస్పత్రిలో చేరి బాధితురాలి కుటుంబీకుల ఫోన్లకు స్పందిచట్లేదు. దీంతో భాదితులు లంగర్హౌస్ పోలీసులను ఆశ్రయించారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారించగా నెల్లూరుకు చెందిన బాబా మంత్రాలు, భూతవైద్యం పేరుతో ఇప్పటికే ఏడుగురు యువతులను పెళ్లిచేసుకొని పలువురిని మోసం చేసి.. మరి కొందరి వద్ద డబ్బులు వసూలు చేసి మోసం చేసినట్లు తెలిసింది. ఇతనిపై పలు పోలీస్స్టేషన్లలో కేసులు ఉన్నట్లు తెలిపారు. చదవండి: పంజగుట్టలో అర్ధరాత్రి గ్యాంగ్ హల్చల్.. యువకుడిపై 15 మంది దాడి -
50 లీటర్ల పెట్రోల్ ట్యాంకుకు 57 లీటర్ల బిల్లు! బంకు సీల్..!
జబల్పూర్: మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో ఓ పెట్రోల్ పంపు సిబ్బంది ఏకంగా హైకోర్టు న్యాయమూర్తికే టోకరా ఇచ్చారు! ఆయన కారు ట్యాంక్ సామర్థ్యమే 50 లీటర్లయితే ఏకంగా 57 లీటర్ల పెట్రోల్ కొట్టినట్టు బిల్లు చేతికిచ్చారు. న్యాయమూర్తి ఫిర్యాదు మేరకు అధికారులు పెట్రోల్ బంకును సీల్ చేశారు. ఆ ప్రాంతంలోని ఇతర బంకుల నిర్వహణ తీరుపై విచారణకు ఆదేశించారు. ఈ నెల 9వ తేదీన ఈ ఘటన చోటుచేసుకుంది. చదవండి: ఆల్టైం రికార్డు సృష్టించిన చికెన్ ధర.. కేజీ రూ.720..! -
HYD: ప్రేమ పేరుతో సహజీవనం.. రూ. 8 లక్షలు తీసుకొని మరో యువతితో పెళ్లి
సాక్షి, హైదరాబాద్: ప్రేమ పేరుతో లైంగిక దాడికి పాల్పడి పెళ్లి చేసుకుంటానని సహజీవనం చేశాడు. అనంతరం ఉపాధి వెతుక్కుంటానని రూ. 8 లక్షలు తీసుకున్నాడు. తీరా పెళ్లి మాట ఎత్తేసరికి అప్పటికే మరో యువతిని పెళ్లి చేసుకొని మోసగించారు. ఘటనలో ఘరానా మోసగాడిని జూబ్లీహిల్స్ పోలీసులు శనివారం అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు. వివరాలివీ... హయత్నగర్ సమీపంలో ప్రైవేట్ హాస్టల్ నడుపుతున్న కాశీ స్నేహిత్ ప్రణయ్ రాజ్కు 2011లో యువతితో పరిచయం ఏర్పడింది. ప్రేమిస్తున్నానని పలుమార్లు ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి అయిదేళ్లుగా సహజీవనం చేశాడు. బోరబండలో జవహర్నగర్లో గదులు అద్దెకు తీసుకొని ఆమెతో సహజీవనం చేసిన సమయంలోనే తాను వ్యాపారం చేస్తానని ఆమె వద్ద నుంచి దశల వారిగా రూ. 8 లక్షల వరకు వసూలు చేశాడు. పెళ్లి మాట ఎత్తేసరికి ముఖం చాటేయడమే కాకుండా గతేడాది ఆగస్టు 20న మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు. తన మాటేమిటని ప్రశ్నిస్తే ఫోన్ బ్లాక్ చేశాడు. తాను మోసపోయానని తెలుసుకున్న బాధితురాలు ఎస్ఆర్నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి నాలుగు నెలలుగా తిరిగినా అది తమ పరిధి కాదంటూ పట్టించుకోకపోవడంతో షీ టీమ్స్ను ఆశ్రయించింది. అక్కడి పోలీసుల సూచన మేరకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా నిందితుడిపై ఐపీసీ సెక్షన్ 376, 420 కింద కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. చదవండి: విధి ఆడిన వింత నాటకం.. కొత్త జంట అకాల మరణం -
సరిగమప విన్నర్ యశస్వి కొండెపూడి మోసం.. స్పందించిన స్వచ్చంద సంస్థ
యశస్వి కొండెపుడి.. ఈ పేరు తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సరిగమప సింగింగ్ షోలో లైఫ్ ఆఫ్ రామ్ పాట పాడి ఓవర్ నైట్లో స్టార్ అయ్యాడు. ఆ సమయంలో ఎక్కడ చూసిన యశస్వి పాటనే మారుమోగింది. ఆ సీజన్ సరిగమప సింగింగ్ ఐకాన్ విన్నర్గా టైటిల్ కూడా గెలిచాడు. తాజాగా యశస్వి వివాదంలో చిక్కుకున్నాడు. తనది కాని సంస్థను తనదని చెప్పుకుని మోసానికి పాల్పడ్డాడు. తాను చేయని సామాజిక సేవ గురించి తప్పుడు ప్రచారం చేసుకున్నాడు. తాజాగా అతడి బాగోతాన్ని నవసేవ పౌండేషన్ నిర్వహకురాలు ఫరా కౌసర్ బట్టబయలు చేశారు. చదవండి: షణ్ముఖ్తో హగ్లు, ముద్దులు.. శ్రీహాన్ ముందు సిరి కన్నీళ్లు! కాగా ఇటీవల ఓ షోలో పాల్గొన్న యశస్వి తాను నవసేవ అనే పేరుతో ఎన్జీవో నడుపుతున్నానని, దీని ద్వారా 50 నుంచి 60 మంది పిల్లలను చదివిస్తున్నట్లు చెప్పాడు. అయితే.. ఇది నిజం కాదని ఆ సంస్థ నిర్వాహకురాలు ఫరా కౌసర్ తాజాగా ఆరోపణలు చేస్తున్నారు. బుధవారం ఆమె సోమాజిగూడ ప్రెస్ క్లబ్ మీడియాతో మాట్లాడుతూ.. తాను చేయని సేవా కార్యక్రమాలను చేసినట్లుగా ఓ టీవీ ఛానల్లో యశస్వి ప్రచారం చేశాడని చెప్పారు. నవసేవ అనే పేరుతో గత ఐదేళ్లుగా స్వచ్ఛంద సంస్థను స్థాపించి 56 మంది అనాథ పిల్లలను తానే చదివిస్తున్నానని చెప్పారు. కానీ ఓ ఛానల్లో పాటలు పాడిన యశస్వి ప్రేక్షకుల ఆదరాభిమానాలను పొందేందుకు సదరు కార్యక్రమం ఓట్లు రాబట్టేందుకు తాను చేయని సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు ప్రచారం చేసుకున్నారని ఆమె మండిపడ్డారు. చదవండి: ‘తొలిప్రేమ’ హీరోయిన్ కీర్తి రెడ్డి ఇప్పుడు ఎక్కడ ఉంది, ఏం చేస్తుందో తెలుసా? అది తెలిసి వెంటనే తానే స్వయంగా యశస్విని క్షమాపణ చెప్పాలని కోరిన అతడు పట్టించుకోలేదు. ప్రేక్షకుల నుంచి అభిమానం పొందేందుకు చేయని సేవా కార్యక్రమాలను తామే చేస్తున్నట్లు ఎలా ప్రచారం చేసుకుంటారని నిలదీశారు. ఈ విషయంపై తాను ప్రచారం చేసిన టీవీ ఛానల్, సదరు కార్యక్రమానికి వ్యాఖ్యాతక వ్యవహరించిన యాంకర్పై, యసస్విపై త్వరలోనే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని ఆమె హెచ్చరించారు. కాగా సరిగమప సింగింగ్ షో తెచ్చిన పెట్టిన పాపులారిటితో యశస్వి సెలబ్రెటి అయిపోయాడు. అదే క్రేజ్తో అతడు పలు ఈవెంట్స్లో తన గాత్రంతో అలరిస్తూ ఎన్నో షోలు చేస్తూ బిజీగా మారాడు. -
హైదరాబాద్ యువతితో నైజీరియన్ స్నేహం.. గిఫ్ట్ల పేరుతో రూ. 1.22 కోట్లు..
సాక్షి, హైదరాబాద్: గిఫ్ట్ పేరుతో మోసానికి పాల్పడ్డ నైజీరియన్ జంటను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 20 పాస్బుక్లు, 8 చెక్కు బుక్లు, 9 డెబిట్ కార్డులు, 12 మొబైల్ ఫోన్లు, 4 సిమ్కార్డులు, ల్యాప్టాప్, మూడు ఐడీకార్డులను స్వాధీనం చేసుకున్నట్లు అరెస్టు చేసినట్లు సీసీఎస్ జాయింట్ సీపీ గజరావు భూపాల్పేర్కొన్నారు. వివరాలు నైజీరియాకు చెందిన బకయోకో లస్సినా, షోమా పుర్కయస్తా ప్రేమికులు. బకయోకో లస్సినా డాక్టర్ లియనార్డో మ్యాట్టియో అనే పేరుతో ఫేస్బుక్ అకౌంట్ను తెరచి కొందరికి ఫ్రెండ్ రిక్వెస్టులు పంపాడు. నగరానికి చెందిన ఓ యువతి అతడి రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయగా కొంతకాలం ఇద్దరూ చాటింగ్ చేసుకున్నారు. తనను లండన్లో డాక్టర్గా పరిచయం చేసుకున్న ఇతగాడు యువతి కోసం సిటీకి వస్తున్నట్లు తెలిపాడు. ఆ తర్వాత కొన్నాళ్లకు ఢిల్లీ కస్టమ్స్లో మీ కోసం వస్తున్న డాక్టర్ లియనార్డో మ్యాట్టియోను అరెస్టు చేశామని, అతడి వద్ద వజ్రాలు, విలువైన బహుమతులు, డబ్బును స్వాధీనం చేసుకున్నామంటూ సదరు యువతికి కస్టమ్స్ ఆఫీసర్గా పరిచయం చేసుకున్న షోమా పుర్కయస్తా ఫోన్ చేసి చెప్పింది. ఆమెను భయపెట్టి పలు దఫాలుగా రూ.1.22 కోట్లు పలు బ్యాంకు అకౌంట్లకు ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు. అయినా పదే పదే డబ్బులు డిమాండ్ చేస్తుండటంతో బాధితురాలు సైబర్క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఢిల్లీ వెళ్లి నిందితులను అరెస్టు చేశారు. ఇదే తరహాలో వీరు పలువురిని మోసం చేసినట్లు గజరావు భూపాల్ తెలిపారు. -
ముచ్చటగా మూడు పెళ్లిళ్లు..విడాకులు ఇవ్వకుండా మరో పెళ్లికి సిద్ధం
సాక్షి, కంటోన్మెంట్: ముచ్చటగా మూడు పెళ్లిళ్లు చేసుకుని నాలుగో పెళ్లికి సిద్ధమైన నిత్య పెళ్లి కొడుకు బాగోతం బోయిన్పల్లిలో కలకలం సృష్టించింది. బోయిన్పల్లి పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. వంశీ కృష్ణ (39) అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ దిల్కుష్ నగర్లోని కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటున్నారు. ఇతను గతంలోనే రెండు పెళ్లిళ్లు చేసుకుని వివిధ కారణాల వల్ల విడాకులు తీసుకున్నాడు. తాజాగా మూడో పెళ్లి కోసం ఓ మ్యాట్రిమోనీని సంప్రదించాడు. నెల్లూరు జిల్లాకు చెందిన డాక్టర్ మీనారెడ్డికి ఏడాది క్రితమే వివాహం జరగ్గా ఇటీవలే భర్త చనిపోయాడు. ఈమె కూడా అదే మ్యాట్రిమోనీలో దరఖాస్తు చేసుకుంది. మ్యాట్రిమోనీ ద్వారా ఒకరి వివరాలు మరొకరికి అందడంతో, గత నెలలోనే వంశీకృష్ణ నెల్లూరుకు వెళ్లి మీనారెడ్డినికి కలిశాడు. నాలుగైదు రోజుల పాటు అక్కడే ఉండి నగరానికి తిరిగొచ్చాడు. ఈ నెల 4వ తేదీన నగరానికి వచ్చిన మీనారెడ్డిని కుటుంబ సభ్యుల సమక్షంలోనే ఆడంబరం లేకుండా వివాహం చేసుకున్నట్లు తెలుస్తోంది. వారం రోజుల అనంతరం నెల్లూరుకు వెళ్లికిన మీనా రెడ్డి ఈ నెల 24న మళ్లీ తిరిగొచ్చి వంశీకృష్ణ ఇంటికి చేరుకుంది. అయితే అప్పటికే వంశీకృష్ణ తనకు మీనారెడ్డితో వివాహ బంధాన్ని కొనసాగించడం ఇష్టం లేదంటూ చెప్పి, ఓ గదిలో బంధించాడు. మళ్లీ వివాహం కోసం మ్యాట్రిమోనీని సంప్రదించాడు. ఇటీవలే పెళ్లి చేసుకున్న వంశీకృష్ణ మళ్లీ పెళ్లికోసం దరఖాస్తు చేసుకోవడంతో మ్యాట్రీమోనీ నిర్వాహకులు మీనారెడ్డిని ఫోన్లో సంప్రదించారు. ఆమె చెప్పిన వివరాలతో పాటు వంశీకృష్ణపై ఫిర్యాదు చేయాల్సిందిగా సూచించారు. దీంతో ఆమె వంశీకృష్ణ చెరనుంచి తప్పించుకుని బోయిన్పల్లి పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వంశీకృష్ణను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వంశీకృష్ణ మూడు పెళ్లిళ్ల వ్యవహారంలో అతని కుటుంబ సభ్యులు పాత్రపై కూడా ఆరాతీస్తున్నారు. (చదవండి: పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. పట్టుబడ్డ డిప్యూటీ మేయర్) -
సాహితీ ఇన్ఫ్రా పిటిషన్పై విచారణ.. హైకోర్టు కీలక ఆదేశాలు..
హైదరాబాద్: సాహితీ ఇన్ఫ్రా పిటిషన్పై తెలంగాణ హైకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. బాధితుల ఫిర్యాదులపై విడివిడిగా కేసులు నమోదు చేయాలన్న హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పును సాహితీ ఇన్ఫ్రా సవాల్ చేసింది. అన్ని పిటిషన్లు ఓకే కేసుగా పరిగణించాలని కోరింది. ఇప్పటివరకు సీసీఎస్ పోలీస్ స్టేషన్లో 42 కేసులు నమోదు కాగా.. సింగిల్ బెంచ్ తమ వాదనలను పరిగణనలోకి తీసుకోలేదని సాహితీ ఇన్ఫ్రా తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. వాదనలు విన్న హైకోర్టు కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 10కి వాయిదా వేసింది. రియల్ ఎస్టేట్ పేరుతో 1700 మంది బాధితుల నుంచి రూ.530 కోట్లు వసూలు చేసినట్లు సాహితీ ఇన్ఫ్రాపై ఆరోపణలున్నాయి. 38 అంతస్తుల అపార్ట్మెంట్ నిర్మాణం పేరుతో భారీ మోసానికి తెరతీసినట్లు కేసు ఫైల్ అయ్యింది. ప్రాజెక్టు మొదలు పెట్టకముందే కస్టమర్ల నుంచి డబ్బులు వసూలు చేశారని, మరో ప్రాజెక్టులో రూ.900 కోట్లు సాహితీఇన్ఫ్రా వసూలు చేసిందనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే బాధితులు ఈ సంస్థపై కేసులు నమోదుచేశారు. చదవండి: జయత్రి ఇన్ఫ్రా పేరుతో ఘరానా మోసం.. రూ.100 కోట్లకు పైగా వసూళ్లు -
నర్సుతో డాక్టర్ ప్రేమాయణం.. పెళ్లి.. బిడ్డ పుట్టిన తర్వాత!
యశవంతపుర(కర్ణాటక): నర్సును ప్రేమించి పెళ్లి చేసుకున్న డాక్టర్ బిడ్డ పుట్టిన తర్వాత ముఖం చాటేశాడు. ఈ ఘటన విజయనగర జిల్లా హరపనహళ్లి తాలూకా హలవాగలు గ్రామంలో జరిగింది. గిరీశ్ బీఎంఎస్ చదివి క్లినిక్ నడుపుతున్నాడు. అదే గ్రామానికి చెందిన త్రివేణి గిరీశ్ వద్ద నర్సుగా పని చేస్తుంది. ఈక్రమంలో ఇద్దరు ప్రేమించుకున్నారు. కురవత్తి బసవణ్ణ దేవస్థానంలో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక బిడ్డ ఉంది. ఇటీవల డాక్టర్ తీరులో మార్పు వచ్చింది. గిరీశ్ మరో పెళ్లి చేసుకున్నట్లు అరోపణలు వస్తున్నాయి. ఈక్రమంలో త్రివేణి వద్దకు రావడం మానేశాడు. దీంతో త్రివేణి దావణగెరె ఎస్పీకి ఫిర్యాదు చేసింది. చదవండి: నర్సు అనుమానాస్పద మృతి.. ఆసుపత్రిలో ఏం జరిగింది? -
స్థలాలకు అద్దె వల.. రూ.3 లక్షలు పెడితే 6 లక్షలు.. 'రియల్' దగా..
‘‘మా ఫామ్ల్యాండ్లో రూ. 3 లక్షలుపెట్టి రెండు గుంటలు (242 గజాలు) కొంటే ప్రతి నెలా రూ. 15 వేల అద్దె చొప్పున 20 నెలల తర్వాత రూ. 3 లక్షల అసలు సహా మొత్తం రూ. 6 లక్షలు చెల్లిస్తాం. 4 గుంటల స్థలానికి రూ. 6 లక్షలు చెల్లిస్తే ప్రతి నెలా రూ.30 వేల చొప్పున 20 నెలల తర్వాత రూ. 12 లక్షలు ఇస్తాం. 8 గుంటలకు రూ. 12 లక్షలు కడితే నెలకు రూ. 24 వేల చొప్పున 20 నెలల్లో రూ.24 లక్షలు రిటర్న్ చేస్తాం’’ హైదరాబాద్కు 140 కి.మీ. దూరంలోని నారాయణ్ఖేడ్లో ఓ రియల్ ఎస్టేట్ సంస్థ ఫామ్ల్యాండ్ వెంచర్ పేరిట వినియోగదారులను ఆకర్షించేందుకు జోరుగా సాగిస్తున్న ప్రచారం ఇది. ప్రీలాంచ్ పేరిట గత కొన్నేళ్లుగా హైదరాబాద్ సహా ప్రధాన పట్టణాల్లో కొందరు బిల్డర్లు వేలాది మంది మధ్యతరగతి ప్రజల సొంతింటి కలలను కల్లలు చేసి సొమ్ము చేసుకుంటుంటే తాజాగా మరికొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఖాళీ స్థలాలను వెంచర్ల పేరు చెప్పి బై బ్యాక్, రెంటల్ ఇన్కం, ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ వంటి కొత్త పేర్లతో సామాన్యులను బురిడీ కొట్టిస్తున్నారు. ఏడాదిలో అద్దె సహా కట్టిన సొమ్మును వాపసు చేస్తామంటూ నమ్మించి ఫామ్ ప్లాట్లు, ఖాళీ స్థలాలను అక్రమ మార్గంలో విక్రయిస్తున్నారు. మార్కెట్ రేటు ప్రకారం గజానికి రూ. 5 వేలు కూడా పలకని ప్రాంతంలో గజం రూ. 10 వేలకుపైనే విక్రయించి ముందే డబ్బు వసూలు చేసుకుంటున్నారు. డీటీసీపీ, హెచ్ఎండీఏ నుంచి ఎలాంటి అనుమతులు, రెరాలో నమోదు చేసుకోకుండానే వెంచర్లలో ప్లాట్లను విక్రయిస్తున్నారు. నమ్మకస్తులే మధ్యవర్తులుగా.. గ్రామాలు, శివారు ప్రాంతాలలో టీచర్లు, ఎల్ఐసీ ఏజెంట్లు, రిటైర్డ్ ఉద్యోగులను రియల్ ఎస్టేట్ ఏజెంట్లుగా నియమించుకుంటున్నారు. గ్రాఫిక్స్ హంగులను అద్ది రంగురంగుల బ్రోచర్లను ముద్రించి ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్ట్రాగామ్ వంటి సామాజిక మాధ్యమాలలో విస్తృతంగా ప్రచారం చేస్తూ కొనుగోలుదారులను ఆకర్షిస్తున్నారు. ప్రతి నెలా స్టార్ హోటళ్లలో మధ్యవర్తులతో సమావేశం నిర్వహించి, ఎక్కువ విక్రయాలు చేసిన ఏజెంట్లకు విదేశీ టూర్లు, కార్లు, బంగారం వంటివి బహుమతులుగా అందజేస్తున్నారు. అసలుకు రెట్టింపు ఆశ చూపి... చట్ట నిబంధనల ప్రకారం ఫామ్ల్యాండ్ వెంచర్లను రియల్ ఎస్టేట్ సంస్థలు కనీసం అర ఎకరం, ఆపై మొత్తాల్లోనే విక్రయించాలి. అయితే అంత విస్తీర్ణంలోని భూముల ధరలు రూ. పదుల లక్షలు, ఆపైనే ఉంటాయి కాబట్టి సామాన్యులు అంత డబ్బు పెట్టి కొనే పరిస్థితి ఉండదనే ఉద్దేశంతో ఆయా సంస్థలు ఫామ్ల్యాండ్ వెంచర్లను గజాలు లేదా గుంటల లెక్కన విక్రయిస్తున్నాయి. నిరీ్ణత కాలం తర్వాత అసలుకు రెట్టింపు డబ్బు ఇస్తామని ఆశ చూపుతూ వినియోగదారులతో అగ్రిమెంట్లు చేసుకుంటున్నాయి. కొన్ని చోట్ల మాత్రం అధికారులకు లంచాలు ఇచ్చి ఆ స్థలాలను వ్యవసాయ భూములుగా రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. అయితే ఒకవేళ అగ్రిమెంట్ గడువు తర్వాత రియల్ ఎస్టేట్ మార్కెట్ పతనమై సంస్థ డబ్బు తిరిగి చెల్లించే పరిస్థితి లేకపోయినా లేదా కంపెనీ బోర్డు తిప్పేసినా కొనుగోలుదారులే మోసపోతున్నారు. తమకు కొసరు ఇవ్వకపోయినా పరవాలేదు అసలు సొమ్ము ఇస్తే చాలంటూ సంస్థల చుట్టూ తిరుగుతున్నారు. కానీ దీనిపై చాలా మంది బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సైతం వెనకాడుతున్నారు. అలా చేస్తే తమ పేర్లు బయటపడటంతోపాటు ఆయా సంస్థలు కోర్టులోనే తేల్చుకోమంటాయేమోనని భయపడుతున్నారు. ఈ పట్టణాల్లో కుప్పలుతెప్పలుగా... సదాశివపేట, నారాయణ్ఖేడ్, నందివనపర్తి, చేవెళ్ల, జనగాం, బచ్చన్నపేట, చౌటుప్పల్, యాదాద్రి వంటి హైదరాబాద్ నుంచి 100 కి.మీ. దూరంలో ఉన్న ప్రాంతాల్లో ఈ తరహా ప్రాజెక్టులు కుప్పలుతెప్పలుగా ఉన్నాయి. రహదారులు, విద్యుత్, మురుగునీటి వ్యవస్థ వంటి కనీస మౌలిక వసతులు కూడా సరిగా లేని ప్రాంతాలలో వందలాది ఎకరాలలో ప్రాజెక్ట్లు చేస్తున్నామని మాయమాటలు చెబుతున్నాయి. కరోనా కాలంలో పుట్టుకొచ్చిన ఏవీ ఇన్ఫ్రాకాన్, జయ గ్రూప్, ఫార్చ్యూన్ 99 తదితర సంస్థలు ఈ మోసాలకు పాల్పడుతున్నాయి. బై బ్యాక్ పేరుతో మోసపోయా... జనగాం జిల్లాలోని పెంబర్తిలో 11 ఎకరాలలో ఓ సంస్థ వేసిన వెంచర్లో బై బ్యాక్ స్కీమ్ కింద రూ. 20 లక్షలకు 183.33 గజాల స్థలం కొన్నా. 12 నెలల తర్వాత లాభం రూ. 10 లక్షలు, మొదట్లో నేను కట్టిన రూ. 20 లక్షలు కలిపి మొత్తం రూ. 30 లక్షలు తిరిగి చెల్లిస్తామని సంస్థ నాతో అగ్రిమెంట్ చేసుకుంది. కానీ ఏడాది దాటినా సొమ్ము చెల్లించడం లేదు. – ఓ బాధితుడి ఆవేదన. స్కీమ్లలో తీసుకొని మోసపోవద్దు... ప్రీలాంచ్, బై బ్యాక్, రెంటల్ గ్యారంటీ అంటూ రకరకాల పేర్లతో సామాన్యులను కొందరు వ్యాపారులు ఆకర్షిస్తున్నారు. టీఎస్–రెరా, నిర్మాణ అనుమతులు లేని ఏ ప్రాజెక్ట్లలోనూ ప్రజలు స్థలాలు కొనుగోలు చేయకూడదు. రెరా రిజి్రస్టేషన్ లేని మధ్యవర్తులను నమ్మి మోసపోకూడదు. –విద్యాధర్, సెక్రటరీ, టీఎస్–రెరా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి... రియల్టీ మార్కెట్ను స్కీమ్ల పేరుతో కొందరు బిల్డర్లు చెడగొడుతున్నారు. స్థలం కొనుక్కోవాలనుకొనే సామాన్యుల ఆశలను ఆసరా చేసుకొని మోసం చేస్తున్నారు. స్కీమ్ల పేరుతో విక్రయించే స్థలాలను రిజిస్ట్రేషన్ చేయకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. – సునీల్ చంద్రారెడ్డి, అధ్యక్షుడు, నరెడ్కో తెలంగాణ చదవండి: బీఆర్ఎస్.. బందిపోట్ల రాక్షసుల సమితి -
ఫీజులు గుంజేసి.. బకాయిలు మింగేసి! హైదరాబాద్లో ఎన్టీఆర్ ట్రస్టు నిర్వాకాలు
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: కరోనా విపత్తులోనూ విద్యార్థుల నుంచి ముక్కుపిండి మరీ ఫీజులు వసూలు చేసిన ఎన్టీఆర్ ట్రస్టు యాజమాన్యం అధ్యాపకులకు మాత్రం బకాయిలు చెల్లించకుండా ఎగ్గొట్టడంపై ప్రధాని కార్యాలయంతోపాటు తెలంగాణ ప్రభుత్వం, గవర్నర్, ఉస్మానియా విశ్వవిద్యాలయం ఉన్నతాధికారులకు బాధితులు ఫిర్యాదు చేశారు. మరోవైపు దీనిపై న్యాయ పోరాటానికి కూడా దిగారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని గండిపేట సమీపంలో హైస్కూలు, జూనియర్, డిగ్రీ కాలేజీలు నడుస్తున్నాయి. కాలేజీల్లో 900 మందికి పైగా, హైసూ్కల్లో 500 మంది వరకు విద్యార్థులున్నారు. విద్యార్థుల నుంచి ఏటా రూ.1.50 లక్షల నుంచి రూ.1.75 లక్షల వరకు ఫీజులు వసూలు చేస్తున్నారు. కరోనా నేపథ్యంలో జీతాల్లో 50 శాతం తాత్కాలికంగా కోత విధిస్తున్నామని, ఫీజులు వసూలయ్యాక మినహాయించిన మొత్తాన్ని తిరిగి చెల్లిస్తామని 2020 మే 20వ తేదీన జూమ్ మీటింగ్లో ఎనీ్టఆర్ ట్రస్టు సీఈవో రాజేంద్రకుమార్ సిబ్బందికి హామీ ఇచ్చారు. వంద మంది బోధనా సిబ్బంది, 20 మందికి పైగా బోధనేతర సిబ్బంది ఇక్కడ పని చేస్తుండగా రూ.పది వేలకు మించి జీతాలు చెల్లిస్తున్న వారికి 16 నెలలు కోత విధించారు. పలువురు అధ్యాపకులకు రూ.2 లక్షల నుంచి రూ.5.25 లక్షల వరకు జీతాల బకాయిలను ట్రస్టు చెల్లించాల్సి ఉంది. కరోనా కష్టకాలంలోనూ కళాశాల నుంచే ఆన్లైన్ ద్వారా తరగతులు నిర్వహించిన తమకు కనీసం హెల్త్కార్డులు ఇవ్వలేదని, గ్రాట్యుటీ ఊసే లేదని ఉద్యోగులు వాపోతున్నారు. వసూలు చేసుకుని.. సిబ్బందికి చెల్లించలేదు.. కరోనా సమయంలో ఫీజులు రాలేదని పేర్కొన్న యాజమాన్యం ఆ తర్వాత విద్యార్థుల నుంచి వసూలు చేసుకున్నా.. సిబ్బందికి మాత్రం బకాయిలు చెల్లించలేదు.. ట్రస్టు సీఈవో, డీన్, ప్రిన్సిపాల్, ట్రస్టీలకు మొరపెట్టుకున్నా స్పందన శూన్యం.. చివరకు చంద్రబాబు, భువనేశ్వరి, లోకేష్కు తెలియజేసినా కూడా పట్టించుకోలేదు.. అంటూ సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారో చెప్పాలని నిర్వాహకులను కోరినందుకు ఓ లెక్చరర్ను రెండు గంటల్లో ఇంటికి సాగనంపారు. మరో లెక్చరర్ నుంచి క్షమాపణ లేఖ తీసుకుని హెచ్చరించారు. 9 మందికి లీగల్ నోటీసులు బకాయిల గురించి యాజమాన్యం స్పందించకపోవడంతో తొమ్మిది మంది లెక్చరర్లు ట్రస్టు సీఈవోతో సహా నిర్వాహకులకు లీగల్ నోటీసులు పంపారు. ఏ నెల జీతంలో ఎంత కోత విధించారనే వివరాలను నోటీసుల్లో పొందుపరిచారు. చదవండి: ‘డెక్కన్’లో అగమ్యగోచరం! నాలుగో రోజూ లభించని ఆ ఇద్దరి అవశేషాలు -
పరారీలో ఫిజియోథెరపిస్ట్.. ఆ వ్యాపారం ఏమైందో తెలీదు కానీ!
సాక్షి, అనంతపురం: అప్పులు చేసి.. తిరిగి ఇవ్వకుండా ఫిజియోథెరపిస్ట్ పరారైన ఘటన అనంతపురంలో వెలుగు చూసింది. బాధితులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. శ్రీనివాసనగర్లో ఫిజియోథెరపిస్ట్ రఘువీరప్రసాద్ ఫిజియోథెరపీ సెంటర్ నిర్వహిస్తున్నాడు. తనవద్దకు ఫిజియో థెరపీ కోసం వచ్చే వారితో పాటు స్నేహితులు, సన్నిహితుల నుంచి అప్పులు తీసుకున్నాడు. మంచివాడని, ఆయన కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఉద్యోగులు కావడంతో తమ డబ్బు ఎక్కడికి పోతుందిలే అన్న ధైర్యంతో అందరూ ధర్మ వడ్డీకి ఇచ్చారు. అలా రూ.3 కోట్ల వరకు అప్పులు చేసిన రఘువీర ప్రసాద్ రియల్ ఎస్టేట్, షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాడు. ఆ వ్యాపారం ఏమైందో తెలీదు కానీ తనవద్ద డబ్బులు లేవని, అప్పు చెల్లించే పరిస్థితిలో లేనని ఐపీ నోటీసులు పంపాడు. ఫిజియో థెరపిస్ట్ ఇంటికి తాళం వేసి భార్య, పిల్లలు, తల్లితో కలిసి పరారయ్యాడు. ధర్మ వడ్డీ పేరుతో తమ వద్ద డబ్బు తీసుకుని ఇప్పుడు నోటీసులు పంపితే ఎలా అంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చట్టంలోని లొసుగులను ఆసరా చేసుకుని ఎగ్గొట్టే చర్యలకు పాల్పడుతున్న ఇతనిపై కఠిన చర్యలు తీసుకుని, తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. చదవండి: (అందం చూసి అనుమానం.. నవ వివాహితను చంపిన సైకో భర్త) -
బిగ్ క్వశ్చన్: అతనే ఒక కుట్ర..
-
పోలీసుల అదుపులో నిత్య పెళ్లికొడుకు.. ఏకంగా 21 మందికి పైగా..
సాక్షి, చెన్నై: ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 20 పెళ్లిళ్లు చేసుకున్న నిత్య పెళ్లి కొడుకును తిరువణ్ణామలైలో స్పెషల్ ఫోర్స్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. వివరాలు.. రామనాథపురం జిల్లా పరమక్కుడికి చెందిన కార్తీక్ రాజా(26) ప్రైవేట్ బ్యాంకు ఉద్యోగి. విరుదునగర్ జిల్లా సాత్తూరు సమీపంలోని వల్లంపట్టికి చెందిన జాన్సీరాణి(20)ని ఈ ఏడాది మార్చిలో వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత ఆమె వద్ద 5 సవర్ల చైన్ తీసుకుని విదేశానికి వెళ్తున్నానని చెప్పి బయటకు వెళ్లాడు. భర్త గురించి ఎలాంటి ఆచూకీ లేకపోవడంతో జాన్సిరాణీ ఏలాయిరమ్ పన్నై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కార్తీక్ రాజా తిరువణ్ణామలై జిల్లాలో ఉన్నట్లు తెలుకుని పోలీసులు అక్కడికి వెళ్లి శుక్రవారం అతన్ని అదుపులోకి తీసుకున్నారు. శనివారం ఏలాయిరమ్ పన్నై పోలీస్స్టేషన్కు తీసుకొచ్చి విచారించారు. ఇతను వివిధ గ్రామాలకు చెందిన 20 మందికి పైగా మహిళలను పెళ్లి చేసుకుని వారి నుంచి 80 సవర్లకు పైగా నగలు తీసుకున్నట్లు తెలిసింది. ఇతనిపై కోయంబత్తూరు, సాత్తూర్, ఏలాయిరమ్ పన్నై, విల్లుపురంతో పాటు పలు పట్టణాల్లో కేసులు పెండింగ్లో ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. ఈ కోణంలో పోలీసులు లోతుగా విచారణ చేస్తున్నారు. -
Eluru: లాడ్జికి తీసుకెళ్లి తాళి కట్టాడు.. గర్భం విషయం తెలియగానే..
నూజివీడు: మండలంలోని రావిచర్లకు చెందిన దేవరపల్లి సురేష్ పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడంటూ ఒక యువతి రూరల్ పోలీస్స్టేషన్ శుక్రవారం ఫిర్యాదు చేసింది. తనను లాడ్జికి తీసుకెళ్లి తాళి కట్టాడని.. తనకు గర్భం విషయం తెలిపి పెళ్లి చేసుకోమని అడగగా, పథకం ప్రకారం జ్యూస్లో మందు కలిపి తాగించాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. దీంతో యువతికి గర్భస్రావం అయింది. తనకు జరిగిన అన్యాయాన్ని సురేష్ పెద్దవాళ్ల దృష్టికి తీసుకెళ్లగా వాళ్లు ఆమెను అవమానించి, గ్రామమంతా చెప్పి అల్లరిపాలు చేస్తామని బెదిరించారంటూ బాధితురాలు రూరల్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తలారి రామకృష్ణ తెలిపారు. చదవండి: (పరువు తీశారని మాజీ సర్పంచ్ ఆత్మహత్య) -
ప్రేమిస్తున్నానంటూ వెంటపడి..పెళ్లి మాట ఎత్తగానే...
సాక్షి, హిందూపురం: ప్రేమించి, పెళ్లి చేసుకుంటానని నమ్మించి సర్వమూ దోచేసిన యువకుడు.. పెళ్లి మాట ఎత్తగానే ముఖం చాటేశాడంటూ ఓ యువతి నడిరోడ్డుపై ధర్నాకు దిగింది. బాధితురాలు తెలిపిన మేరకు.. హిందూపురం మండలానికి చెందిన ఓ యువతి అనంతపురం జిల్లా గుత్తిలోని ఓ కళాశాలలో ఎంబీఏ పూర్తి చేసింది. కళాశాలలో చదువుకుంటున్న సమయంలోనే కర్నూలు జిల్లా పెద్దకడుబూరు ప్రాంతానికి చెందిన గణేష్ పరిచయమయ్యాడు. ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. మూడేళ్ల పాటు తనతో పాటు తిప్పుకున్నాడు. ప్రస్తుతం దళితురాలిననే కారణం చూపి పెళ్లికి అంగీకరించడం లేదు. గణేష్ చేసిన మోసంపై ఇప్పటికే పోలీసు స్పందన కార్యక్రమంలో ఎస్పీని కలసి ఫిర్యాదు చేసింది. దీనిపై 20 రోజుల క్రితం హిందూపురం రూరల్ పోలీసులు పిలిపించుకుని విచారణ చేశారు. అయినా తనకు న్యాయం చేకూరలేదంటూ శనివారం అంబేడ్కర్ సర్కిల్ వద్ద కేవీపీఎస్ నాయకులతో కలసి భైఠాయించి నిరసన వ్యక్తంచేసింది. తనకు న్యాయం జరిగే వరకూ పోరాడుతానని పేర్కొంది. కార్యక్రమంలో బాధితురాలితో పాటు తల్లి, కేవీపీఎస్ నాయకులు అన్నమయ్య, రమణ, రాము, జ్యోతమ్మ, మధు తదితరులు పాల్గొన్నారు. హిందూపురం రూరల్ సీఐ కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. అబ్బాయిని పిలిపించి విచారిస్తే అతను ఒప్పుకోవడం లేదన్నారు. బాధితురాలు రాత పూర్వకంగా ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేస్తామని పేర్కొన్నారు. (చదవండి: అప్పు కట్టకుంటే.. జైలుశిక్ష ) -
భార్యకు విడాకులిస్తానని మహిళా అధికారితో చెట్టాపట్టాల్.. చివరకు..
వారిద్దరిదీ ఒకే డిపార్ట్మెంట్.. ఒకే కులం. ఆ యువతితో మాటలుకలిపాడు. అధికారి మనవాడే కదా అని ఆమె కూడా పరిచయం పెంచుకుంది. అదే అదునుగా చూసి ఆ అధికారి పెళ్లయిన విషయాన్ని దాచి మోసం చేశాడు. దీంతో తనకు జరిగన అన్యాయం మరొకరికి జరగకూడదని సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకెళ్తే.. ఉమ్మడి కర్నూల్ జిల్లాలో అబిద్ అలీ అనే వ్యక్తి డ్రగ్ ఇన్స్పెక్టర్గా పనిచేశాడు. అదే సమయంలో డిపార్ట్మెంట్లో ప్రకాశం జిల్లాలో పనిచేసే మహిళా అధికారికి దగ్గరయ్యాడు. పెళ్లయిన విషయం కూడా చెప్పకుండా ఆ సమయంలో ఇద్దరూ కలిసి సహజీవనం చేశారు. విషయం తెలిసి మహిళా అధికారి నిలదీయడంతో.. తన భార్యకు విడాకులిచ్చి పెళ్లి చేసుకుంటానని మాటాచ్చి తర్వాత ముఖం చాటేశాడు. అయితే ఆ డ్రగ్ ఇన్స్పెక్టర్ ఆమెను వివాహం చేసుకోకపోవడంతో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఉన్నతాధికారులు పిలిచి ఇద్దరికీ కౌన్సిలింగ్ ఇచ్చారు. అయినా తన ప్రవర్తనలో మార్పులేకపోవడంతో బాధిత మహిళ తనతో గడిపిన ఫోటోలను, వీడియోలను బయటపెట్టింది. వీటిపై స్పందించిన అబిద్ అలీ ఆ మహిళా అధికారి తనపై కావాలనే తప్పుడు ఆరోపణలు చేస్తోందని తెలిపారు. చదవండి: (భార్య వేధింపులు తట్టుకోలేక.. నవ వరుడు ఆత్మహత్య!) -
బయోమెట్రిక్ పద్ధతిన పింఛన్లు స్వాహా!..లబోదిబోమంటున్న బాధితులు
సాక్షి, వెల్గటూర్(ధర్మపురి): వృద్ధాప్యంలో ఆసరా ఉంటుందని రాష్ట్రప్రభుత్వం పేద, మధ్యతరగతి వర్గాలకు ఆసరా పింఛన్లు పంపిణీ చేస్తోంది. అయితే, కొందరు అక్రమార్కులు వీటిని కాజేస్తున్నారు. జిల్లాలోని పలుచోట్ల కొన్ని ఇలాంటివి వెలుగు చూస్తున్నాయి. ప్రధానంగా వెల్గటూర్ మండలంలో పింఛన్ల పంపిణీ ప్రక్రియలో చాలా మోసాలు జరుగుతున్నట్లు వృద్ధులు, నిరక్షరాస్యులు ఆవేదన చెందుతున్నారు. బయోమెట్రిక్ పరికరంలో పింఛన్దారుల వేలుముద్రలు తీసుకుని తమ బ్యాంకు ఖాతాల్లోకి సొమ్ము జమచేసుకుంటున్నారు. వేలుముద్రలు రావడం లేదని పింఛన్దారులను ఇళ్లకు పంపిస్తున్నారు. కొందరు అనుమానంతో బ్యాంకు ఖాతాలు తనిఖీ చేయిస్తే.. అసలు విషయాలు బయటకు వస్తున్నాయి. దీంతో అక్రమార్కులను నిలదీస్తే.. ఏవేవో మాయమాటలు చెబుతూ.. పింఛన్దారుల డబ్బులు తిరిగి చెల్లిస్తున్నారు. మండల కేంద్రంతోపాటు స్తంభంపల్లి అనుబంధ కొత్తపల్లిలో ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయని బాధితులు ఆవేదన చెందుతున్నారు. (చదవండి: స్టూడెంట్ లీడర్ టు మాస్ లీడర్.. కూతురి పెళ్లిరోజే రాష్ట్రస్థాయి పదవి) -
బరితెగించిన మేల్ నర్స్.. సన్నిహితంగా ఉంటూ బ్లాక్మెయిలింగ్
సాక్షి, హైదరాబాద్: మలక్పేట ప్రాంతానికి చెందిన మేల్ నర్స్ మహ్మద్ గులామ్ నగరానికి చెందిన ఓ వృద్ధురాలిని టార్గెట్గా చేసుకున్నాడు. ఆమె వ్యక్తిగత వివరాలు సంగ్రహించిన అతగాడు వాటిని బయటపెడతానంటూ బ్లాక్మెయిలింగ్కు దిగాడు. బాధితురాలు నగర షీ–టీమ్స్ను ఆశ్రయించడంతో కటకటాల్లోకి చేరాడని అదనపు సీపీ (నేరాలు) ఏఆర్ శ్రీనివాస్ శుక్రవారం పేర్కొన్నారు. సదరు 55 ఏళ్ల మహిళ గతంలో కోవిడ్ బారినపడగా టెలీ మెడిసిన్ ద్వారా వైద్య సహాయం పొందారు. అప్పట్లో మేల్ నర్సుగా ఈమెకు తరచు ఫోన్లు చేసి యోగక్షేమాలు తెలుసుకున్న గులామ్ ఆమెకు సన్నిహితంగా మారాడు. తరచు ఫోన్లు చేస్తూ ఆమెకు సంబంధించిన వ్యక్తిగత విషయాలు తెలుసుకున్నాడు. అతిగా స్పందిస్తున్నాడని, తన వ్యక్తిగత వివరాలు తెలుసుకుంటున్నాడని పసిగట్టిన ఆమె దూరంగా ఉంచడం మొదలెట్టారు. దీంతో తన వద్ద ఉన్న సమాచారాన్ని లీక్ చేస్తానని, ప్రశాంత జీవితాన్ని పాడుచేస్తానంటూ బ్లాక్ మెయిల్ చేయడం మొదలెట్టాడు. ఇతడిని వదిలించుకోవడానికి ఆమె కొంత మొత్తం చెల్లించినా పంథా మారలేదు. బాధితురాలు షీ–టీమ్స్ను ఆశ్రయించింది. విషయాన్ని పూర్తి గోప్యంగా ఉంచిన అధికారులు గులామ్ను పట్టుకుని, పూర్తి సాక్ష్యాధారాలతో కోర్టులో ప్రవేశపెట్టారు. న్యాయస్థానం అతడికి 8 రోజుల జైలు విధించడంతో చంచల్గూడకు తరలించారు. పెళ్లి చేసుకోవాలంటూ ఓ వ్యక్తి వేధిస్తున్నాడంటూ.. ►పెళ్లి చేసుకోవాలంటూ ఓ వ్యక్తి వేధిస్తున్నాడని మరో బాధితురాలు షీ–టీమ్స్ను ఆశ్రయించింది. భర్త నుంచి విడాకులు తీసుకున్న ఈ మహిళకు (26) స్పాలో పని చేసే ఎం.అర్జున్ అకౌంటెంట్ ఉద్యోగం ఇప్పించాడు. కొన్నాళ్ల తర్వాత తనను పెళ్లి చేసుకోవాలని అడగడం మొదలెట్టాడు. వివాహితుడైన అతడికి ఇద్దరు పిల్లలు కూడా ఉండటంతో తిరస్కరించింది. బాధితురాలు ఆ ఉద్యోగాన్ని వదిలేసినా అర్జున్ నుంచి వేధింపులు తప్పలేదు. బాధితురాలి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన షీ–టీమ్స్ అతడిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాయి. కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి ఐదు రోజుల జైలు శిక్ష విధించారు. యువకుడిపై పోక్సో కేసు నమోదు ►గాంధీనగర్ ప్రాంతానికి చెందిన బాలికను ఇన్స్ట్రాగామ్ ద్వారా వేధిస్తున్న యువకుడిపై పోక్సో కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. మొత్తమ్మీద గత నెల్లో షీ–టీమ్స్కు 103 ఫిర్యాదులు వచ్చాయి. వీరిలో 52 మంది నేరుగా, 34 మంది వాట్సాప్ ద్వారా, మిగిలిన వాళ్లు ఇతర విధానాల్లో ఆశ్రయించారు. వీటికి సంబంధించి ఆయా ఠాణాల్లో 12 కేసులు నమోదు కాగా.. 26 ఫిర్యాదులు పెట్టీ కేసులుగా మారాయి. ఆరోపణలు ఎదుర్కొన్న వారిలో 98 మందికి కౌన్సెలింగ్ ఇచ్చారు. వేధింపులు ఎదురైనప్పుడు మౌనంగా ఉండవద్దని, 9490616555కు వాట్సాప్ చేయడం ద్వారా లేదా నగర పోలీసు సోషల్మీడియా ఖాతాల ద్వారా ఫిర్యాదు చేయాలని ఏఆర్ శ్రీనివాస్ కోరారు. చదవండి: థాయిలాండ్ విద్యార్థినిపై ప్రొఫెసర్ అత్యాచారయత్నం.. హెచ్సీయూలో ఉద్రిక్తత -
సరదాగా అలా తిరిగొద్దాం అని చెప్పి..ప్రియురాలిని చంపి, నిప్పంటించాడు
ఢిల్లీలోని శ్రద్ధా వాకర్ హత్యోదంతం మరువక మునుపే అదే తరహాలో మరో ఘటన చోటు చేసుకుంది. తనను నమ్మి వచ్చిన ప్రియురాలిని బయటకు వెళ్దాం అని చెప్పి హత్య చేసి నిప్పంటించాడు. ఈ ఘటన ఒడిశాలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే...పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.... చత్తీస్గఢ్లోని కోర్బా ప్రాంతానికి చెందిన 21 ఏళ్ల తనూ కుర్రే ఓ ప్రైవేట్ బ్యాంకులో పనిచేస్తుండేది. ఆమె తన స్నేహితుడు సచిన్ అగర్వాల్తో కలిసి నవంబర్ 21న బలంగీర్కి వెళ్లింది. ఆ తర్వాత నుంచి ఆమె తన కుటుంబ సభ్యులతో టచ్లో లేదు. దీంతో అనుమానం వచ్చి కుటుంబసభ్యులు రాయ్పూర్ పోలీస్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఐతే పోలీసులు ఈ కేసు విషయమై విచారిస్తుండగా...బలంగీర్లో కాలిపోయి పడి ఉన్న మృతదేహాన్ని కనుగొన్నారు పోలీసులు. ఆ మృతదేహన్ని తనూదిగా ఆమె కుటుంబసభ్యులు గుర్తించారు. అనతరం పోలీసులు ఆమె ప్రియుడు సచిన్ అగర్వాల్ని అనుమానిస్తూ...ఆ కోణంలో దర్యాప్తు చేయడం ప్రారంభించారు. నిందితుడు సచిన్ అగర్వాల్ ప్రియురాలు తనూ చనిపోయిన ప్రాంతంలో ఎక్కువగా సంచరించినట్లు ఫోన్ లోకేషన్ తెలుపుతోంది. దీంతో పోలీసులు తమదైన తరహాలో సచిన్ని గట్టిగా విచారించగా...నేరం చేసినట్లు ఒప్పుకున్నాడు. తనూని బలంగీర్ చుట్టూ సరదాగా తిరిగొద్దాం అని చెప్పి బయటకు తీసుకు వెళ్లినట్లు చెప్పాడు. తనను మోసం చేస్తుందని భావించి హత్యచేసి చంపేసినట్లు తెలిపాడు. అనతరం పెట్రోల్ పోసి తగలు బెట్టినట్లు వెల్లడించాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడిని అరెస్టు చేసినట్లు తెలిపారు. (చదవండి: తీస్తే మరో దృశ్యం సినిమా అవుతుందేమో!.. గొంతుకోసి.. వేడినూనె, యాసిడ్తో ముఖం కాల్చేసి..) -
అమెరికా టూ ఇండియా!.. తక్కువ ధరకే విమాన టికెట్.. నమ్మితే అంతే!
సాక్షి, హైదరాబాద్: పండుగలు, సెలవుల నేపథ్యంలో స్వదేశానికి వచ్చే వారిని టార్గెట్ చేస్తూ విమాన టికెట్ల రూపంలో మోసాలకు పాల్పడుతున్నారు సైబర్ నేరగాళ్లు. అమెరికా నుంచి హైదరాబాద్కు వస్తున్న వారిని ఎంచుకుని వారి నుంచి రూ.లక్షలు కాజేస్తున్నారు. ఇటీవల యూఎస్లో ఉంటూ నగరానికి రావాల్సిన సుమారు 8 కుటుంబాలు సైబర్కేటుగాళ్ల చేతిలో మోసపోయి బంధువుల ద్వారా సైబర్క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ విమాన టికెట్ల రూపంలో జరుగుతున్న మోసాలు సైబర్క్రైం పోలీసుల దృష్టికి వచ్చాయి. గుర్తు తెలియని వ్యక్తులకు ముందే డబ్బు ఇస్తున్నారు. ఏజెంట్ ద్వారా టికెట్ను బుక్ చేయించి ఆ వివరాలు ప్రయాణికుడికి ఇస్తుండటంతో నమ్మకం మరింత రెట్టింపు అవుతుంది. తీరా ప్రయాణం రేపు అనగా..పీఎన్ఆర్ స్టేటస్ చెక్ చేస్తే కాని తాము మోసపోయినట్లు తెలియడం లేదు. వాట్సాప్ గ్రూపుల్లోకి చొరబడి స్వదేశానికి వచ్చే వారిని కనిపెట్టిన బిహార్, రాజస్థాన్, యూపీకి చెందిన కొందరు సైబర్ నేరగాళ్లు యూఎస్లో ఉంటున్న భారతీయుల వాట్సాప్ గ్రూపుల్లోకి తెలిసిన వారి ద్వారా యాడ్ అవుతున్నారు. ట్రావెల్ ఏజెంట్ను అంటూ పరిచయం చేసుకోవడం, తన ద్వారా విమాన టికెట్లు బుక్ చేస్తే 40శాతం నుంచి 60శాతం డిస్కౌంట్ వస్తుందని చెబుతున్నారు. నమ్మకం కోసం తమకు అనుకూలంగా ఉన్న వ్యక్తికి రూ.50వేలకే టికెట్ను ఇస్తున్నారు. ఆ టికెట్ను వాట్సప్ గ్రూపులో చూసిన వారంతా తమకు కూడా కావాలంటూ కేటుగాళ్లను సంప్రదిస్తున్నారు. వీరు టికెట్ను ప్రయాణికులకు కావాల్సిన తేదీల్లో బ్లాక్ చేస్తూ ఆ వివరాలను పంపిస్తున్నారు. కొద్దిరోజుల క్రితం ఎస్సార్నగర్కు చెందిన ఓ కుటుంబం వారి చేతిలో మోసపోయింది. దీంతో నగరంలో ఉంటున్న సమీప బంధువుకు చెప్పడంతో అతను సైబర్క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తమ బావ నుంచి రూ.10లక్షలు చేశారంటూ పోలీసుల ఎదుట వాపోయాడు. ఇదే తరహాలో పలు కుటుంబాలు రూ.25లక్షల నుంచి రూ.40లక్షల మేర నష్టపోయినట్లు సైబర్ క్రైం అందిన ఫిర్యాదుల ఆధారంగా స్పష్టమవుతోంది. ఆశపడి మోస పోవద్దు.. యూఎస్ నుంచి ఇండియాకు అంత తక్కువ రేటుకు టికెట్ రాదు. ఇండియాకు వచ్చేవారైనా, ఇతర దేశాలకు వెళ్లే వారైనా వారి మాటలు నమ్మి మోసపోవద్దు. ఎయిర్వేస్కు సంబంధించిన అధికారిక వెబ్సైట్లలో మాత్రమే టికెట్ను బుక్ చేసుకునేందుకు ప్రయతి్నంచండి. అక్కడ జర్నీ తేదీని బట్టి టికెట్ ధర మారుతూ ఉంటుంది. 5–10శాతం మించి డిస్కౌంట్ ఎవరూ ఎక్కువగా ఇవ్వరు, ఒకవేళ ఇస్తామన్నా ఒకటికి పదిసార్లు ఆలోచించి, ఇతరులను సంప్రదించి మాత్రమే టికెట్ బుక్ చేసుకోండి. గుర్తు తెలియని వ్యక్తుల మాటలు నమ్మి మోసపోవద్దు. – కేవీఎం ప్రసాద్, సిటీ సైబర్క్రైం ఏసీపీ -
హైదరాబాద్లో వెలుగులోకి ‘దొంగ–పోలీసు–దోస్తీ’ వ్యవహారాలు
సాక్షి, హైదరాబాద్: తమ ముఠా కోల్పోయిన సొమ్ము, సొత్తు కోసం పరిధులు సృష్టించి మరీ కేసు నమోదు చేసిన అధికారి ఒకరైతే... కానిస్టేబుల్ పైరవీ చేయడంతో ఓ పిక్ పాకెటర్ను విడిచిపెట్టిన అధికారి మరొకరు... నల్లగొండలో జైలుకు వెళ్లిన కానిస్టేబుల్ ఈశ్వర్ వ్యవహారంతో నగర పోలీసు విభాగం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. దీంతో దొంగలతో మిలాఖత్ అయిన, వారికి సహకరిస్తున్న పోలీసుల వ్యవహారాలను వెలికితీస్తోంది. ఇప్పటికే కొందరు అధికారులు, సిబ్బంది చేసిన దందాలను గుర్తించారు. వీటిని తీవ్రంగా పరిగణిస్తున్న కొత్వాల్ సీవీ ఆనంద్ కఠిన చర్యలకు సిద్ధమవుతున్నారు. తక్షణం మారిపోయిన సీన్.. చట్ట ప్రకారం నేరం ఎక్కడ జరిగితే కేసు ఆ పరిధిలోకి వచ్చే ఠాణాలోనే నమోదు చేయడమో, జీరో ఎఫ్ఐఆర్ కట్టి అక్కడికి బదిలీ చేయడమో జరగాలి. సామాన్యులు తీవ్రంగా నష్టపోయిన అంశాల్లోనూ పోలీసులు ఇదే చేస్తుంటారు. ఈ ‘బాధిత ముఠా’ కోసం సదరు అధికారి ఆ నిబంధనను తుంగలో తొక్కారు. ఈ గ్యాంగ్కు చెందిన ఓ వ్యక్తి వెస్ట్ జోన్ పరిధిలో ఉండగా గుట్ట వరకు ఎత్తుకుపోయారు అనే మెలిక పెట్టారు. దీంతో కేసు పరిధి పశ్చిమ మండలంలోని ఠాణాకు మారిపోయింది. ఈ కేసు ‘దర్యాప్తు’ చేసిన సదరు అధికారి అవతలి ముఠాను పట్టుకుని రూ.20 లక్షల వరకు ‘రికవరీ’ చేసి ‘బాధితులకు’ అందించాడు. తన వాటాగానూ పెద్ద మొత్తమే తీసుకున్నాడు. ఇది ఇప్పుడు వెలుగులోకి రావడంతో ఉన్నతాధికారులు సైతం ముక్కున వేలేసుకుంటున్నారు. గుట్ట వ్యవహారం వెస్ట్కు వచ్చింది.. 2019లో యాదగిరిగుట్టలో జరిగిన ఓ వివాదానికి సంబం«ధించిన కేసు నగరంలోని వెస్ట్జోన్ పరిధిలో ఉన్న ఓ ఠాణాలో నమోదైంది. ఈ కేసును ‘పరిష్కరించిన’ సదరు అధికారి రూ.10 లక్షలకు పైగా ‘రికవరీ’ చేసి తమ ముఠాకు అప్పగించాడు. 2018–19ల్లో రెండు పిక్ పాకెటింగ్ గ్యాంగ్స్ యాదగిరిగుట్ట పరిధిలో విరుచుకుపడ్డాయి. డబ్బు పంపకాలకు సంబంధించి వీటి మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. దీంతో ఓ గ్యాంగ్పై దాడి చేసిన మరో గ్యాంగ్ మొత్తం సొమ్ము కాజేసింది. ఈ ‘బాధిత గ్యాంగ్’తో అప్పట్లో పశి్చమ మండల పరిధిలోని ఓ ఠాణాలో పని చేసిన ఇన్స్పెక్టర్కు దగ్గరి సంబంధాలు ఉన్నాయి. వాళ్లు వచ్చి జరిగిన విషయం ఈయనకు చెప్పడంతో వీళ్లకు రావాల్సిన డబ్బు రికవరీ కోసం భారీ స్కెచ్ వేశాడు. పిక్ పాకెటర్ నుంచి రూ.3 లక్షలు వసూలు.. ఈ అధికారి వ్యవహారం ఇలా ఉండగా.. మరో అధికారి ఏకంగా తన కార్యాలయంలోనే సెటిల్మెంట్ చేశారు. పక్షం రోజుల క్రితం ఈ ఉదంతం చోటుచేసుకుంది. నందనవనం ప్రాంతానికి చెందిన ఓ పిక్ పాకెటర్ను నగర పోలీసు కమిషనరేట్కు చెందిన ఓ కానిస్టేబుల్ నాగోల్ వద్ద పట్టుకున్నారు. ఇతగాడిని తమ కార్యాలయానికి తీసుకువెళ్లి విచారించడానికి సిద్ధమయ్యారు. ఈలోపు విషయం తెలుసుకున్న ఓ ‘పోలీసు దొంగ’ రంగంలోకి దిగాడు. ఆ పిక్ పాకెటర్ను విడిచిపెట్టడానికి రూ.2 లక్షలు అధికారికి ఇచ్చేలా, వేరే ఇద్దరు నేరగాళ్లకు పట్టిచ్చేలా సెటిల్మెంట్ చేశాడు. ఇది తెలుసుకున్న కానిస్టేబుల్ ఆగ్రహం వ్యక్తం చేయడంతో సెటిల్మెంట్లో ఇవ్వాల్సిన మొత్తం రూ.3 లక్షలకు పెరిగి ముగ్గురికీ గిట్టుబాటైంది. కఠిన చర్యలకు రంగం సిద్ధం చేస్తున్న కొత్వాల్.. నగరంలో ఒకప్పుడు ఉన్న పరిస్థితులు ప్రస్తుతం లేవు. నగర పోలీసు కమిషనర్గా సీవీ ఆనంద్ బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ఇవి పూర్తిగా మారిపోయాయి. సంస్కరణలకు పెద్దపీట వేస్తున్న ఆయన వీలున్నంత వరకు సిబ్బందికి ఏ లోటు లేకుండా చేస్తున్నారు. అదే సమయంలో క్రమశిక్షణారాహిత్యం, పోలీసు విభాగానికి మచ్చ తెచ్చే పనులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించట్లేదు. ఈ నేపథ్యంలోనే గడచిన ఏడాది కాలంలో పదులు సంఖ్యలో అధికారులు, సిబ్బందిపై వేటు పడింది. ఈ పోలీసు దొంగల దోస్తీ వ్యవహారాన్నీ ఆయన సీరియస్గా తీసుకున్నారు. లోతైన విచారణ చేయిస్తుండటంతో ఈశ్వర్తో పాటు ముగ్గురు ఇన్స్పెక్టర్లు, అయిదుగురు కానిస్టేబుళ్ల వ్యవహారాలు బయటపడినట్లు తెలిసింది. వీరిలో కొందరు కీలక విభాగంలోనూ పని చేస్తున్నట్లు సమాచారం. ఇలాంటి వారిపై నివేదికల ఆధారంగా ఉద్వాసన చెప్పాలని కూడా కొత్వాల్ ఆనంద్ నిర్ణయించినట్లు సమాచారం. -
హైదరాబాద్లో మరికొందరు ‘పోలీస్ దొంగ’లు!.. విమానాల్లో తిరుగుతూ సెటిల్మెంట్లు
సాక్షి, హైదరాబాద్: నల్లగొండ టూ టౌన్ పోలీసులు అరెస్టు చేసిన టాస్క్ఫోర్స్ కానిస్టేబుల్ మేకల ఈశ్వర్ వ్యవహారంతో నగర ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. సిటీలో ఈ తరహా దందాలకు పాల్పడుతున్న ‘పోలీసు దొంగ’ల్లో మరో ముగ్గురిని గుర్తించారు. వీరిలో ఇద్దరు నగర కమిషనరేట్లో పని చేస్తుండగా... మరొకరు సైబరాబాద్లో ఉన్నట్లు తెలిసింది. వీరి వ్యవహారాలకు సంబంధించిన నివేదికలు అందిన తర్వాత చర్యలు తీసుకోవడానికి ఉన్నతాధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ అధికారులకు సహకరించిన, సహరిస్తున్న ముగ్గురు కానిస్టేబుళ్ల వ్యవహారాన్నీ సీరియస్గా తీసుకున్నారు. సమాచారంతో మొదలై సహవాసం వరకు... పోలీసులకు, దొంగలకు మధ్య పరిచయాలు ఉండటం కొత్త విషయం కాదు. వీరికి సమాచారం ఇచ్చే వారిలో పాత నేరగాళ్లే ఎక్కువగా ఉంటారు. ఎంత ఎక్కువ మంది నేరగాళ్లతో పరిచయాలు ఉంటే అంత ఎక్కువ సమాచారం అందుతుంది. ఈశ్వర్ సహా నగరంలో పని చేస్తున్న/చేసిన ముగ్గురు ఇన్స్పెక్టర్లు సమాచారం స్థాయిని దాటి సహవాసం వరకు వెళ్లారు. వీళ్లలో కొందరు పిక్ పాకెటింగ్, స్నాచింగ్స్ గ్యాంగ్స్తో సంబంధాలు ఏర్పాటు చేసుకున్నారు. మరికొందరు ఏకంగా వారికి సంబంధించిన సెటిల్మెంట్లు చేస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. జేబు దొంగలకు చెందిన ఓ బడా నాయకుడు ఇటీవల అస్వస్థతకు గురయ్యాడు. అతడు ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా.. ఓ అధికారి వెళ్లి పరామర్శించడంతో వారి మధ్య సంబంధం బయటపడింది. పిక్ పాకెటింగ్ గ్యాంగ్స్ను పట్టుకున్న ఠాణాలు, ప్రత్యేక విభాగాల వద్దకు వెళ్లే మరో అధికారి వాళ్లను అరెస్టు చూపకుండా వదిలేసేలా పైరవీలు చేయడంలో సిద్ధహస్తుడిగా మారాడు. విమానాల్లో తిరుగుతూ సెటిల్మెంట్లు... ప్రస్తుతం సైబరాబాద్ పరిధిలో విధులు నిర్వర్తిస్తున్న ఓ అధికారి ఈ వ్యవహారాల్లో సిద్ధహస్తుడు. తన మాట వినని, తన గ్యాంగ్కు వ్యతిరేకంగా పని చేస్తున్న ముఠాలను అరెస్టు చేయడంతోనే ఇతడి సక్సెస్ రేటు పెరిగిపోయింది. ఈ సక్సెస్ను మాత్రమే చూసిన ఉన్నతాధికారులకు ఇప్పుడిప్పుడే అతడి పూర్తి వ్యవహారాలు తెలుస్తున్నాయి. అంతర్రాష్ట్ర పిక్ పాకెటింగ్ ముఠాలో ఈ అధికారికి సంబంధాలు ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. ఏ నగరంలోని పోలీసులకు వీరు చిక్కితే ఈయనే వెళ్లి విషయం సెటిల్ చేసి వచ్చేవాడు. దీనికోసం లీవ్ కూడా పెట్టాల్సిన అవసరం లేకుండా విమానాల్లో వెళ్లి వస్తూ పని పూర్తి చేసేవాడు. నగరంలో సుదీర్ఘకాలం పని చేసిన ఈయన ఎప్పుడూ ఫోకల్ పోస్టు కోసం ప్రయత్నించలేదు. కేవలం ఠాణాల్లోని డిటెక్టివ్, క్రైమ్ వింగ్స్లో పని చేయడానికే పైరవీలు చేసుకునేవాడు. ఈశ్వర్తో పాటు అలాంటి వ్యవహారాలు చక్కబెట్టిన కొందరు కానిస్టేబుళ్లకు అధికారులు సహకారాలు అందిస్తూ వారిని బందోబస్తు డ్యూటీలకు దూరంగా ఉంచేవారని తెలిసింది. అంతర్జాతీయ చోరీ ఫోన్ల నెట్వర్క్లో ఈశ్వర్.. అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న ప్రాంతాలు కూడా ఈశ్వర్కు ఆ పరిధిలోని ఠాణాలో పోస్టింగ్ వచ్చాక క్రైమ్ ప్రోన్ ఏరియాలుగా మారిపోయేవని తెలిసింది. ఆ పోలీస్ స్టేషన్లో ఉండే మార్కెట్లు, అనువైన ప్రాంతాలను గుర్తించే ఇతగాడు తన గ్యాంగ్స్ను దింపి నేరాలు చేయించేవాడు. ఇలా కొందరు దొంగలను తమ కంట్రోల్లో పెట్టుకోవడం, రికవరీల్లో సెటిల్మెంట్లు చేయడంలో ఈశ్వర్తో పాటు మరికొందరూ నిష్ణాతులని తెలుస్తోంది. చోరీ ఫోన్లు ట్రాక్ కాకుండా ఉండటానికి ఈశ్వర్ అంతర్జాతీయ నెట్వర్క్తో సంబంధాలు ఏర్పాటు చేసుకున్నట్లు సమాచారం. తన గ్యాంగ్ ద్వారా తన వద్దకు చేరిన ఫోన్ల ఐఎంఈఐ నెంబర్లు క్లోనింగ్ చేసేవాడు. అలా కుదరని పక్షంలో బయటి దేశాలకు... ప్రధానంగా నేపాల్కు పంపేవాడని సమాచారం. గతంలో ఈశ్వర్తో పాటు ప్రస్తుతం ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ అధికారి ఒకే ఠాణాలో పని చేశారు. అçప్పట్లోనూ ఈ గ్యాంగ్స్ నిర్వహణ, సెటిల్మెంట్లకు సంబంధించి ఇద్దరి మధ్యా విభేదాలు వచ్చాయి. చదవండి: Viral: కుటుంబంతో సేదతీరేందుకు వ్యవసాయక్షేత్రంలో రెడీమేడ్ ఇల్లు -
అసోం దంపతులు మహా కిలాడీలు.. మాయమాటలతో లక్షల మోసం
సాక్షి, బెంగళూరు(యశవంతపుర): నా భర్త కస్టమ్స్ అధికారి అని, బెంగళూరు కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో పని ఇప్పిస్తామని, అక్కడ అధికారులు సీజ్ చేసిన వస్తువులను తక్కువ ధరకు ఇప్పిస్తామని చెప్పి మోసాలకు పాల్పడుతున్న జంట కటకటాల పాలైంది. దర్బిన్దాస్ అలియాస్ మోహన్దాస్, అతని భార్య ధనుష్యను కొడిగేనహళ్లి పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ. 34 లక్షల నగదు, 106 గ్రాములు బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ అనూప్శెట్టి తెలిపారు. వివరాలు... ఇందిరానగరలో ఓ అకాడమీని నడుపుతున్న స్నేహ భగవత్ వద్ద ధనుష్య శిక్షణకు చేరింది. తన భర్త విమానాశ్రయంలో కస్టమ్స్లో పని చేస్తున్నట్లు చెప్పింది. జప్తు చేసిన బంగారు నగలను తక్కువ ధరకు ఇప్పిస్తామని నమ్మించింది. అలా స్నేహ నుంచి పలు విడతలుగా రూ. 68 లక్షలను నగదును వసూలు చేసింది. అంతేకాక అకాడమీలో పని చేస్తున్న సిబ్బంది నుంచి కూడా డబ్బులు వసూలు చేసింది. కొన్నిరోజుల తరువాత ధనుష్య మొబైల్ ఫోన్ స్విచాఫ్ చేసుకుని పరారైంది. దీంతో బాధితులు కొడిగేహళ్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా ఆ జంట కోసం గాలింపు చేపట్టారు. చదవండి: (మోసకారి దంపతులు దర్బిన్దాస్, ధనుష్య) పలువురి నుంచి వసూళ్లు దేవనహళ్లి తాలూకాలో కూడా ఇదే తరహా మోసం కేసు వీరిపై నమోదై ఉంది. ధనుష్య పిల్లలు చదువుతున్న స్కూల్ ఉపాధ్యాయులు, పిల్లల తల్లిదండ్రులకు కూడా ఇదే మాదిరి మాయ మాటలు చెప్పి లక్షల రూపాయలు గుంజుకుందని పోలీసుల విచారణలో బయట పడింది. తక్కువ ధరలకు ఐఫోన్లు, ల్యాప్టాప్లను లభిస్తాయని చెప్పుకొని నివాసం ఉండే అపార్ట్మెంట్లోని వారి నుంచి లక్షల రూపాయలను ఆన్లైన్, ఆఫ్లైన్లో తీసుకుంది. వస్తువులన్నీ ఇప్పించండి, లేదా డబ్బయినా తిరిగి ఇవ్వాలని కొందరు ఒత్తిడి చేయడంతో ధనుష్య, ఆమె భర్త మంగళూరుకు పారిపోయారు. కొడిగేనహళ్లి పోలీసులు మంగళూరుకు వెళ్లి ఈ జంటను పట్టుకుంది. వారి ఇంట్లో రూ. 34 లక్షలు నగదు, 106 గ్రాముల బంగారాన్ని సీజ్ చేశారు. బెంగళూరుకు తరలించి విచారణ చేపట్టారు. -
సినీ నటి జీవిత టార్గెట్గా.. జియో పేరుతో టోకరా!
సాక్షి, హైదరాబాద్: సినీ నటి జీవితను టార్గెట్గా చేసుకుని, ఆమె మేనేజర్ను మోసం చేసిన చెన్నై వాసిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. జీవితకు కొన్నాళ్ల క్రితం ఓ గుర్తుతెలియని వ్యక్తి నుంచి ఫోన్ వచ్చింది. ఫారూఖ్ అంటూ పరిచయం చేసుకున్న అతగాడు మీకు ఇంటర్నెట్ కనెక్షన్ ఇచ్చింది నేనే అని మొదలెట్టాడు. ఆ సమయంలో బిజీగా ఉన్న జీవిత అదే విషయం చెప్పి తన మేనేజర్తో మాట్లాడమని సూచించారు. దీంతో అతడితో మాట్లాడిన దుండగుడు తనకు పదోన్నతి వచ్చిన నేపథ్యంలో ఓ బంపర్ ఆఫర్ విషయం చెప్తున్నానన్నాడు. జియో సంబంధిత సంస్థల్లో విక్రయించే వస్తువులు మీకు మాత్రమే 50 శాతం డిస్కౌంట్లో వస్తాయని నమ్మబలికాడు. దానికి సంబంధించి కొన్ని స్క్రీన్ షాట్లను వాట్సాప్ ద్వారా షేర్ చేశాడు. వాటిలో రూ.2.5 లక్షలు ఖరీదైన ఎలక్ట్రానిక్ వస్తువులు రూ. 1.25 లక్షలే వస్తున్నట్లు ఉంది. నిజమని నమ్మిన ఆయన రూ.1.25 లక్షలను ఫారూఖ్గా చెప్పుకున్న వ్యక్తిని ఆన్లైన్లో పంపారు. ఆపై అతడి నుంచి స్పందన లేకపోవడంతో పాటు ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్విచ్ఛాఫ్ రావడంతో తాను మోసపోయానని గుర్తించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో కేసు నమోదైంది. చదవండి: (ప్రేమ పెళ్లి చేసుకున్న యువతి ఆత్మహత్య) నిందితుడు వాడిన ఫోన్ నెంబర్, నగదు బదిలీ అయిన బ్యాంకు ఖాతాలు తదితరాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేశారు. చెన్నైకి చెందిన టి.నాగేంద్ర బాబే నిందితుడని గుర్తించారు. అక్కడకు వెళ్లిన ప్రత్యేక బృందం అతడిని అరెస్టు చేసి మంగళవారం సిటీకి తరలించింది. ఇతడు నేరచరితుడని పోలీసులు చెప్తున్నారు. గతంలో సినిమా పరిశ్రమలో పనిచేస్తున్న వారికి ఫోన్లు చేసి ఆఫర్ల పేరుతో మోసాలు చేసినట్లు గుర్తించారు. సినీ నిర్మాతలకు అవార్డులు ఇప్పిస్తానంటూ నమ్మించి వారి నుంచీ డబ్బులు వసూలు చేశాడు. నగరంతో పాటు సైబరాబాద్లోనూ కేసులు నమోదు కావడంతో గతంలోనూ జైలుకు వెళ్లాడు. గతంలో చెన్నైలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్లో చెఫ్గానూ పని చేశాడు. -
Hyderabad: మహిళా సాఫ్ట్వేర్ ఇంజినీర్ కొంపముంచిన ‘చిత్రాలు’
హిమాయత్నగర్(హైదరాబాద్): నగరానికి చెందిన ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్కు సైబర్ నేరగాళ్లు టోకరా వేశారు. ఆమె పెయింటింగ్ చిత్రాలను కొనుగోలు చేస్తామంటూ లక్షల రూపాయిలు కాజేశారు. దీంతో బాధితురాలు శనివారం సిటీ సైబర్క్రైం పోలీసులను ఆశ్రయించింది. సోమాజిగూడలో నివాసం ఉండే ఆర్టిస్ట్ నగరంలోని ఓ ప్రముఖ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేస్తోంది. ఖాళీ టైంలో పెయింటింగ్ వేసి ఆ చిత్రాలను తన ఇన్స్ట్రాగామ్ అకౌంట్లో పోస్ట్ చేస్తుంటుంది. వీటిని చూసిన కేటుగాడు ఆమెతో మాట కలిపాడు. వాట్సప్ నంబర్ తీసుకుని చాట్ చేసి ఎన్ఎఫ్టీ ఇన్వెస్ట్మెంట్ వెబ్సైట్ వైపు రప్పించాడు. ఈ వెబ్సైట్లో పెయింటింగ్స్ కొనేవారు చాలా మంది ఉన్నారని నమ్మించాడు. తొలుత ఇన్వెస్ట్ చేస్తే లక్షలు వస్తాయన్నాడు. తన పెయింటింగ్స్ అమ్ముడవ్వాలనే ఆశతో ఆర్టిస్ట్ అతగాడు చెప్పిన విధంగా కొంత డబ్బు ఇన్వెస్ట్ చేసింది. ఆ తర్వాత దాని లాభాల కోసం ట్యాక్స్లు, కమీషన్ అంటూ పలు దఫాలుగా ఆమె నుంచి రూ.8లక్షలు కాజేశాడు. ఇంకా ఇంకా అడుగుతూ ఇబ్బంది పెడుతున్న క్రమంలో తాను మోసపోయానని గుర్తించి సైబర్క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ కేవీఎం ప్రసాద్ తెలిపారు. చదవండి: నాటుకోడికి ఫుల్ గిరాకీ.. ఆ టేస్టే వేరు.. రోజుకు వెయ్యి లాభం!