రోడ్డు ప్రమాదంలో నలుగురి మృతి | Four killed in road accident | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో నలుగురి మృతి

Published Sun, Jan 5 2014 11:08 PM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM

అమరావతి నుంచి బుల్డాణా దిశగా వెళ్తున్న ఎంఎస్‌ఆర్టీసీ బస్సు శనివారం రాత్రి ప్రమాదానికి గురవడంతో నలుగురు దుర్మరణం పాల య్యారు.

 సాక్షి, ముంబై: అమరావతి నుంచి బుల్డాణా దిశగా వెళ్తున్న ఎంఎస్‌ఆర్టీసీ బస్సు శనివారం రాత్రి ప్రమాదానికి గురవడంతో నలుగురు దుర్మరణం పాల య్యారు. అకోలా సమీపంలోని మర్జితాపూర్ ప్రాంతంలో ఎదురుగా వస్తున్న కంటెయినర్ లారీ బస్సును ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో 24 మందికి తీవ్ర గాయాలవడంతో అకోలాలోని ఆస్పత్రికి తరలించారు. మృతుల్లో ముగ్గురి వివరాలు మాత్రమే తెలిశాయి. వారిని కిరణ్ భురసాకలే (53), రవీంద్ర తావ్డే (52), వీర్ బేండ్వాల్‌గా గుర్తించారు. ఇంకొకరి గురించి తెలుసుకోడానికి ప్రయత్నిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ దుర్ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు ఎంఎస్‌ఆర్టీసీ ఆర్థికసాయం అందజేయనుంది. మృతుల కుటుంబానికి రూ.ఐదు వేలు, గాయపడిన వారికి రూ.500 చొప్పున ఆర్థికసాయం ప్రకటించింది.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement