బంగారం షాపులపై ఐటీ దాడులు
Published Sat, Dec 3 2016 3:20 PM | Last Updated on Thu, Sep 27 2018 3:37 PM
తెనాలి: పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో భారీగా బంగారు కొనుగోళ్లు చేసిన వారిపై ఐటీ శాఖ అధికారులు కన్నేశారు. గుంటూరు తెనాలి టీబీ రోడ్లోని బంగారం దుకాణాలపై ఇన్కం ట్యాక్స్ అధికారులు శనివారం దాడులు నిర్వహించారు. స్థానిక భవదీప్ జ్యూయలర్స్లో అధికారులు తనిఖీలు చేపడుతున్నారు. విషయం తెలుసుకున్న ఇతర బంగారం వ్యాపారస్థులు దుకాణాలు మూసి వేశారు.
Advertisement
Advertisement