త్వరలో స్పోర్ట్స్ పాలసీ: కొల్లు రవీంద్ర
Published Wed, Apr 12 2017 4:33 PM | Last Updated on Fri, May 25 2018 7:04 PM
అమరావతి: యువతను ముందుకు తీసుకుని వెళ్లే గురుతర బాధ్యత మాపై ఉందని ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. విలేకరులతో మాట్లాడుతూ.. ప్రభుత్వం యువతకు పెద్ద ఏత్తున ప్రాధాన్యత ఇస్తుందన్నారు. బడ్జెట్లో నిరుద్యోగ భృతి కోసం రూ.500 కోట్లు కేటాయించామన్నారు. నిరుద్యోగ భృతి ఏవిధంగా యువతకు చేరితే మంచిదో ఆలోచిస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి యువతతో మాట్లాడి నిరుద్యోగ భృతి ఎలా వారికి చేరాలో నిర్ణయిస్తామన్నారు. క్రీడలను ప్రోత్సహించేందుకు ప్రతి నియోజకవర్గంలో ఒక స్టేడియం నిర్మిస్తామన్నారు. త్వరలో స్పోర్ట్స్ పాలసీ తీసుకువస్తామన్నారు
Advertisement
Advertisement