
ప్రియురాలు పెళ్లికి అంగీకరించలేదని..
ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం 6 గంటల సమయంలో ఆరణి సమీపం ఈచతాంగాంల్ చెరువులో రక్తపు మడుగులో యువతి మృతి చెంది ఉండటాన్ని గమనించిన స్థానికులు ఆరణి తాలుకా పోలీసులకు సమాచారం తెలిపారు. డీఎస్పీ జరీనాబేగం, పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి విచారణ చేపట్టారు. మృతదేహం వద్ద యువతి కళాశాల గుర్తింపు కార్డు లభించింది. కళాశాల నిర్వాహకులను ఫోన్లో సంప్రదించగా మోనిక మంగళవారం కళాశాలకు రాలేదని తెలిసింది. దీంతో మోనిక స్నేహితుల వద్ద పోలీసులు విచారణ జరిపారు.
ఇదిలాఉండగా రాత్రి 10 గంటల సమయంలో ఆరణి తాలుకా పూంగాంబాడి గ్రామానికి చెందిన గోకుల్నాథ్ ఈ హత్య చేసినట్లు పోలూరు పోలీస్స్టేషన్లో లొంగిపోయాడు. విచారణలో ఇతడు బెంగళూరులో కూలీ పనులు చేస్తున్నట్లు పాఠశాల సమయం నుంచే మోనికను ప్రేమిస్తున్నట్లు తెలిపాడు. తాము ఫోన్లో తరచూ మాట్లాడుకుంటున్నామని వివాహం చేసుకునేందుకు మోనిక తల్లి దండ్రుల వద్ద కోరగా వారు అంగీకరించలేదని తెలిపాడు. అనంతరం మోనిక గోకుల్నాథ్ను దూరం పెట్టడంతో మంగళవారం స్నేహితురాలి ద్వారా ఫోన్లో మాట్లాడి ఆమెను చెరువు వద్దకు రప్పించి పెళ్లికి అంగీకరించాలని కోరాడు. మోనిక పెళ్లికి తిరస్కరించడంతో ఆగ్రహించిన గోకుల్నాథ్ కత్తితో దారుణంగా హత్య చేసి పరారైనట్లు తెలిపాడు.
యువకుడి గుడిసెకు నిప్పు: