
కృష్ణరాజపురం : ఛార్జింగ్ పెడుతుండగా సెల్ఫోన్ పేలిపోయిన ఘటన సోమవారం బొమ్మనహళ్లిలో చోటు చేసుకుంది. బొమ్మనహళ్లి ప్రాంతానికి చెందిన చంద్రు అనే యవకుడు కొద్ది రోజుల క్రితం రెడ్మి మొబైల్ కొనుగోలు చేశాడు. ఈ క్రమంలో సోమవారం మొబైల్ ఛార్జింగ్ పెడుతుండగా మొబైల్ నుంచి ఒక్కసారిగా పొగలు రావడాన్ని గమనించిన చంద్రు వెంటనే దూరంగా పారిపోయాడు. పొగలు రావడం మొదలైన కొద్ది క్షణాల్లో మొబైల్ పెద్ద శబ్దం చేస్తూ పేలిపోయింది. ఘటనలో ఎవరికి ఎటువంటి ప్రమాదం చోటు చేసుకోలేదు.
Comments
Please login to add a commentAdd a comment