burnt
-
Uttar Pradesh: ఘోర అగ్ని ప్రమాదం.. నలుగురు సజీవ దహనం
ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్ జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. లోని ప్రాంతంలోని ఒక ఇంట్లో జరిగిన అగ్నిప్రమాదంలో ముగ్గురు పిల్లలతో పాటు ఒక మహిళ సజీవదహనమయ్యింది.ఒక కుటుంబంలోని నలుగురు మృతిచెందడంతో ఆ ప్రాంతంలో విషాదఛాయలు నెలకొన్నాయి. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాలను స్వాధీనం చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మీడియాకు అందిన వివరాల ప్రకారం ఈ ఘటన కాంచన్ పార్క్ కాలనీలో జరిగింది.ఈరోజు (ఆదివారం) ఉదయం 7 గంటల సమయంలో పీఆర్వీ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక ఇంట్లో మంటలు చెలరేగాయి. అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో ఆ ఇంట్లో ఎనిమిది మంది ఉన్నారు. ఈ దుర్ఘటనలో ముగ్గురు పిల్లలతో పాటు ఒక మహిళ సజీవ దహనమయ్యింది. వారు తీవ్రంగా కాలిపోవడంతో పాటు ఊపిరాడక విలవిలలాడిపోతూ ప్రాణాలొదిలారు.అగ్నిమాపక దళం బృందం మంటలను అదుపు చేసింది. అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా వెల్లడికాలేదు. మంటలను ఆర్ఫిన అగ్నిమాపక దళం ఇంటి గోడను పగలగొట్టి, ఇంట్లో చిక్కుకున్న ఒక మహిళ ముగ్గురు పిల్లలను రక్షించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఈ నలుగురి పరిస్థితి మరింత విషమంగా ఉందని తెలుస్తోంది. ఇది కూడా చదవండి: దీక్ష విరమించను.. వైద్య చికిత్సకు ఓకే: రైతు నేత జగ్జీత్ సింగ్ దల్లెవాల్ -
ఇస్కాన్ కేంద్రానికి నిప్పు
కోల్కతా: బంగ్లాదేశ్లో హిందూ ఆలయాలపై దాడులు కొనసాగుతున్నాయి. రాజధాని ఢాకాలోని ఓ ఇస్కాన్ కేంద్రానికి శనివారం వేకువజామున గుర్తు తెలియని దుండగులు నిప్పుపెట్టారు. ధౌర్ గ్రామంలోని నమ్హట్టా ప్రాంతంలో ఉన్న శ్రీ రాధా కృష్ణ ఆలయం, శ్రీ మహాభాగ్య లక్ష్మీ నారాయణ ఆలయాలపై ఈ దాడి జరిగిందని ఇస్కాన్ కోల్కతా ఉపాధ్యక్షుడు రాధారమణ్ దాస్ ‘ఎక్స్’లో వెల్లడించారు. పెట్రోల్ పోసి నిప్పంటించడంతో శ్రీ లక్ష్మీ నారాయణ విగ్రహంతోపాటు అన్ని వస్తువులు పూర్తిగా కాలిపోయాయన్నారు. హిందూమత పెద్ద చిన్మయ్ కృష్ణ దాస్ బెయిలివ్వకుండా జైలులో ఉంచారంటూ...ఆయన భద్రతపై రాధారమణ్ దాస్ ఆందోళన వ్యక్తం చేశారు. దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో ఇస్కాన్ అనుయాయులు బయట తిరిగేటప్పుడు ముందు జాగ్రత్తగా నుదుటన తిలకం ధరించవద్దని కోరారు. మైనారిటీలకు భద్రత కల్పిస్తామని యూనస్ సారథ్యంలోని ఆపద్ధర్మ ప్రభుత్వం ఇచ్చిన హామీ ఎక్కడా అమలు కావడం లేదని రాధారమణ్ దాస్ ఆవేదన వ్యక్తం చేశారు. -
ఎల్లో మీడియా డ్రామా.. తుస్సుమనిపించిన అధికారులు
తూర్పుగోదావరి, సాక్షి: ధవళేశ్వరంలో పొలవరం ఆర్ అండ్ ఆర్ కార్యాలయం వద్ద ఫైల్స్ దగ్ధం అంటూ ఉద్దేశపూర్వక కథనాలతో ఎల్లో మీడియా హడావిడి చేసింది. అయితే దీనిపై అధికారులు వివరణ ఇచ్చి గాలి తీసేశారు. అవి ఫైల్స్ కావని, పనికిరాని కాగితాలని, వాటి మీద వచ్చిన కథనాల్లో ఏమాత్రం వాస్తవం లేదని అధికారులు వివరణ ఇచ్చారు.‘‘పోలవరం ఎల్ఎంసీ కార్యాలయంలో బీరువాల్లో నిరుపయోగమైన కాగితాలను మాత్రమే బయటపడేశాం. ఈ పేపర్లు ఆర్ అండ్ ఆర్ కు ఏ మాత్రం సంబంధించినవి కావు. సిబ్బంది తగలబెట్టిన కాగితాలు ఉపయోగం లేనివి మాత్రమే. అని ఆర్ అండ్ ఆర్ స్పెషల్ కలెక్టర్ సరళ తెలిపారు. అయితే పనికి రానివే అయినా అలా తగలబెట్టడం కరెక్ట్ కాదని ఆర్డీవో కేఎన్ జ్యోతి అంటున్నారు. ‘‘అవి ముమ్మాటికీ నిరుపయోగమైనవే. అవి ఫైల్స్ కావు. అన్ని సైన్ లేని జిరాక్స్ కాపీలు మాత్రమే. కార్యాలయంలో నిరుపయోగంగా ఉన్నాయని బయటపడేసి దహనం చేశారు. అయితే అలా నిరుపయోగమైన కాగితాలను సైతం బహిరంగంగా కాల్చకూడదు. ఈ ఘటనపై ఉన్నతాధికారులకు నివేదిక అందిస్తాం. బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటాం’’ అని ఆర్డీవో జ్యోతి తెలిపారు.అనుమానాస్పద రీతిలో కాలి బూడిదైన ఫైల్స్ అంటూ.. సగం కాలిన పేపర్ల ఫొటోలతో ఈనాడు, ఆంధ్రజ్యోతి తదితర కూటమి అనుకూల మీడియా ఛానెల్స్ కథనాలు ఇచ్చాయి. అవి పోలవరం ఎడమ కాలువ భూ పరిహారం ఫైల్స్ అంటూ అందులో రాసుకొచ్చాయి. అధికారులు విషయం బయటకు చెప్పట్లేదని.. పోలీసులు వచ్చారంటూ ఊదరగొట్టాయి. ఈలోపు.. మీడియా ముందుకు వచ్చిన మంత్రి నిమ్మల రామానాయుడు ప్రభుత్వ కార్యాలయాల్లో ఫైల్స్కు భద్రత లేకుండా పోయిందని.. వైఎస్సార్సీపీ హయాంలోని ఫైల్సే తగలబడి పోతున్నాయంటూ అసలు విషయం తెలియకుండా ఓ స్టేట్మెంట్ ఇచ్చేశారు. చివరకు అధికారుల వివరణతో ఎల్లో మీడియా డ్రామా అంతా ఉత్తదేనని తేలింది. -
రూ.4 కోట్ల విలువైన గంజాయి దహనం
సాక్షి,యాదాద్రి: యాదాద్రి భువనగిరి జిల్లా తుక్కాపురంలో సికింద్రాబాద్ రైల్వే పోలీసులు బుధవారం రూ.4 కోట్ల విలువైన 1,575 కిలోల గంజాయిని దహనం చేశారు. 2021 నుంచి 2023 వరకు సికింద్రాబాద్, వరంగల్, కాచిగూడ, కాజీపేట, నిజామాబాద్, నల్లగొండ, హైదరాబాద్, వికారాబాద్ రైల్వేస్టేషన్ల పరిధిలో ఈ గంజాయిని పట్టుకున్నట్లు రైల్వే ఎస్పీ చందనాదీప్తి తెలిపారు. కోర్టు ఉత్తర్వుల మేరకు గంజాయిని దశల వారీగా తుక్కాపురంలోని రోమా ఇండస్ట్రీస్ మెడికల్ వేస్టేజ్ కంపెనీలోని బాయిలర్లో వేసి దహనం చేశారు. సికింద్రాబాద్ అర్బన్ పరిధిలో రూ.1,44,75,000 విలువ చేసే 579 కిలోల గంజాయి, సికింద్రాబాద్ రూరల్ పరిధిలో రూ.24,50,000 విలువ చేసే 98.68 కిలోల గంజాయి, ఖాజీపేట డివిజన్లో రూ.2.24 లక్షల విలువ చేసే 896.70 కిలోల గంజాయిని పట్టుకున్నట్లు రైల్వే ఎస్పీ వివరించారు. ఆస్తులు జప్తు చేస్తాంఎవరైనా గంజాయిని అక్రమంగా రవాణా చేసినా, విక్రయించినా వారి ఆస్తులు జప్తు చేస్తామని రైల్వే ఎస్పీ చందనా దీప్తి హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. ఉత్తరాంధ్ర, ఒడిశా నుంచి గంజాయి దేశంలోని వివిధ ప్రాంతాలకు సరఫరా అవుతోందన్నారు. గంజాయి రవాణాను అరికట్టేందుకు రైల్వే పోలీసులతో రహస్య బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రైళ్లలో ఎవరైనా అనుమానాస్పదంగా బ్యాగులు పెడితే వెంటనే రైల్వే అధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు. డ్రగ్స్ వల్ల కలిగే నష్టాలను వివరిస్తూ పాఠశాలలు, కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఆమె వెంట రైల్వే డీఎస్పీలు ఎస్.ఎన్. జావేద్ అలీ, టి.కృపాకర్, ఇన్స్పెక్టర్లు, జీఆర్పీ పోలీసులు ఉన్నారు. -
పార్లమెంట్ అలజడి కేసులో వెలుగులోకి కీలక అంశాలు
జైపూర్: పార్లమెంట్లో అలజడి సృష్టించిన కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. నిందితుల ఫోన్లను దహనం చేసిన స్థలాన్ని పోలీసులు గుర్తించారు. అక్కడ కాలిపోయి శిథిలావస్థలో ఉన్న సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుల బట్టలు కాల్చి వేసిన ప్రదేశాన్ని కూడా పోలీసులు గుర్తించారు. దర్యాప్తులో భాగంగా నిందితులను తీసుకువెళ్లి విచారణ చేపట్టారు. Parliament security breach: Police recover burnt phone parts of accused in Rajasthan Read @ANI Story | https://t.co/Jpwc9HIqR6#ParliamentSecurityBreach #Parliament #LokSabha #RajyaSabha pic.twitter.com/OkVJKYfMM7 — ANI Digital (@ani_digital) December 17, 2023 పార్లమెంట్లో మొత్తం ఏడుగురు నిందితులు గందరగోళం సృష్టించిన విషయం తెలిసిందే. లోక్సభ లోపల, పార్లమెంట్ ఆవరణలో పొగ బాంబులతో నిందితులు అరాచకం సృష్టించే పనిచేశారు. ఒంటికి మండే లేపనాలు పూసుకుని ఆత్మాహుతికి పాల్పడటానికి ప్రయత్నించారు. కానీ చివరికి స్మోక్ క్యానిస్టర్లను ప్రయోగించాలని నిర్ణయానికి వచ్చారు. సాగర్ శర్మ, డి.మనోరంజన్, అమోల్ షిండే, నీలం దేవి, ప్రధాన నిందితుడు లలిత్ ఝాలను పోలీసు ప్రత్యేక విభాగం తాలూకు కౌంటర్ ఇంటలిజెన్స్ విభాగం విచారిస్తోంది. నిందితులకు ఏడు రోజుల కస్టడీ విధించిన విషయం తెలిసిందే. అందులో భాగంగా వారు ఆశ్రయం పొందిన, కుట్ర పన్నిన ప్రాంతాలకు శుక్రవారం రాత్రి వారిని తీసుకెళ్లారు. అలాగే నిందితులకు లోక్సభ పాస్లు సిఫార్సు చేసిన బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహా స్టేట్మెంట్ను కూడా నమోదు చేయాలని భావిస్తున్నారు. లోక్సభలో కలకలం జరిగిన తీరుపై పార్లమెంటు అనుమతితో సీన్ రీ కన్స్ట్రక్ట్ చేసే ఆలోచన కూడా ఉన్నట్టు సమాచారం. లలిత్కు సహకరించిన మహేశ్ కుమావత్, కైలాశ్లకు క్లీన్చిట్ ఇవ్వలేదని పోలీసులు తెలిపారు. లలిత్ను బుధవారం పార్లమెంటు ప్రాంగణం నుంచి పారిపోయి అతను రాజస్థాన్లో తలదాచుకున్న నగౌర్కు కూడా తీసుకెళ్లారు. అక్కడ తనతోపాటు సన్నిహితుల సెల్ ఫోన్లను ధ్వంసం చేశానని లలిత్ చెప్పిన ప్రదేశంలో ఆధారాలు సేకరించారు. తమ డిమాండ్లను నెరవేర్చాలని ప్రభుత్వాన్ని ఒత్తిడి చేసేందుకు దేశంలో అరాచకం సృష్టించాలని భావించినట్లు కీలక సూత్రధారి లలిత్ ఝా కస్టడీ విచారణ సందర్భంగా ఢిల్లీ పోలీసులకు తెలిపాడు. లలిత్ ఝా తన ఫోన్ను ఢిల్లీ-జైపూర్ సరిహద్దులో విసిరివేసినట్లు అంగీకరించాడు. ఈ కుట్ర ప్రణాళికను అమలు చేయడానికి ముందు ఢిల్లీలో అనేకమార్లు కలిసినట్లు లలిత్ ఝా చెప్పాడు. ఇతర నిందితుల ఫోన్లను ధ్వంసం చేసినట్లు వెల్లడించాడు. ఇదీ చదవండి: రాజస్థాన్ బీజేపీ కొత్త చీఫ్గా కైలాష్ చౌదరి -
కూతురు ప్రేమపెళ్లి.. ఇటుకలపల్లిలో సర్పంచ్ వీరంగం..
సాక్షి, వరంగల్ జిల్లా: నర్సంపేట మండలం ఇటికాలపల్లి సర్పంచ్ మండల రవీందర్ వీరంగం సృష్టించారు. కూతురు కావ్యశ్రీ అదే గ్రామానికి చెందిన జలగం రంజిత్ ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. ప్రేమ వివాహం ఇష్టంలేని అమ్మాయి తండ్రి సర్పంచ్ ఆగ్రహంతో తన బిడ్డను పెళ్ళి చేసుకున్న యువకుడి ఇంటితో పాటు వారి సహకరించిన ఇద్దరు స్నేహితుల ఇళ్లపై దాడి చేయించాడు. నిప్పంటించడంతో పర్నిచర్ దగ్ధమయ్యింది. ప్రేమజంట హసన్పర్తి పరిధిలోని ఓ హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్నారు. ప్రేమపెళ్లి అనంతరం సర్పంచ్ హసన్పర్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా వారిద్దరికీ కౌన్సిలింగ్ ఇచ్చారు. కావ్యను తనతో రమ్మని తండ్రి ఎంత బతిమలాడిన రాకపోవడంతో ఆగ్రహంతో స్వగ్రామానికి వెళ్లి రంజిత్ ఇంటితో పాటు అతనికి సహకరించిన ఇద్దరు మిత్రుల ఇళ్లను దగ్ధం చేశారు. దీంతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. ఈ ఘటనతో పోలీసులు గ్రామంలో ఎలాంటి అల్లర్లు జరగకుండా గ్రామంలో పికెటింగ్ ఏర్పాటు చేశారు. చదవండి: బండ్లగూడ కారు ప్రమాదం.. సినిమాను తలపించే ట్విస్టులు.. పోలీసులే షాకయ్యారు! -
ఘోర ప్రమాదం.. నూతన జంటతో సహా నలుగురు సజీవ దహనం
భోపాల్: మధ్యప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారు చెట్టును ఢీకొట్టిన ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృత్యువాతపడ్డారు. పెళ్లికి వెళ్లి తిరిగి వస్తుండగా హర్దా జిల్లాలో బుధవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే కారులో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడిని చేరుకుని విచారణ చేపట్టారు. వేగంగా వెళ్తోన్న కారు అదుపుతప్పి కారు చెట్టును ఢీకొట్టడంతో ఇటీవలే వివాహమైన జంటతో సహా ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సజీవ దహనమయ్యారని పోలీసులు తెలిపారు. అగ్నిమాపక సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకొని చూడగా అప్పటికే కారు పూర్తిగా దగ్ధమైందని పేర్కొన్నారు. మృతుల్లో ముగ్గురు మగవాళ్లు, ఒక మహిళ ఉన్నారని తెలిపారు. ఈ దుర్ఘటనలో మృతిచెందిన జంటకు ఆరు నెలల క్రితమే వివాహమైందని చెప్పారు. తదుపరి విచారణ కొనసాగుతోందని పోలీసులు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా గతవారమే మధ్యప్రదేశ్లోని షాజాపూర్లో స్లీపర్ బస్సు.. ట్రాలీని ఢీకొనడంతో నలుగురు మృతి చెందారు. మరో 15 మంది గాయపడ్డారు. బస్సు అహ్మదాబాద్కు ప్రయాణికులతో వెళ్తుండగా ఈ ఘోర ప్రమాదం జరిగింది. చదవండి: Aghora Puja: మృతదేహంపై కూర్చొని అఘోర పూజలు.. వీడియో వైరల్ -
మెదక్ జిల్లా : వ్యక్తి సజీవదహనం కేసులో పురోగతి
-
కారులో గుర్తు తెలియని వ్యక్తి సజీవ దహనం
-
మొబైల్లో గేమ్ ఆడుతుండగా పేలుడు..తీవ్రంగా గాయపడ్డ చిన్నారి
ఇటీవల మొబైల్ ఫోన్లు పేలుడు గురించి తరుచుగా వింటున్నాం. ఎందుకిలా జరుగుతుందో అంతుపట్టడం లేదు. ప్రస్తుతం పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కోవిడ్ మహమ్మారీ నుంచి పిల్లలకు ఆన్లైన్లో క్లాసులకు అలవాటుపడ్డారు. దీంతో పిల్లలు మనకు తెలియకుండానే సెల్ఫోన్లకు బానిసవ్వుతున్నారు. పలువురు తల్లిదండ్రులు కూడా పిల్లలు ఫోన్కి బాగా అతుక్కుపోతున్నారంటూ గగ్గోలు పెడుతున్నారు. అలాంటి తరుణంలో ఈ సెల్ఫోన్ల పేలుడు ఘటనలు ప్రజలను కాస్త భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. అచ్చం అలానే ఇక్కడోక చిన్నారి ఫోన్లో గేమ్ ఆడుతుండగా.. హఠాత్తుగా పేలుడు సంభవించింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లో మధురలోని మేవాటీలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే...మధురకు చెందిన మహ్మద్ జావేద్ అనే వ్యక్తి తన 13 ఏళ్ల కొడుకుకి మొబైల్ ఫోన్ ఇచ్చాడు. ఆ చిన్నారి తన చదువు కోసం అని తండ్రి ఫోన్ని తరుచుగా ఉపయోగిస్తుంటాడు. అందులో భాగంగానే ఆరోజు కూడా ఫోన్ తీసుకున్నాడు. కాసేపటికి అందులో గేమ్ ఆడుతున్నాడు. ఏమైందో ఏమో అకస్మాత్తుగా ఫోన్ పేలిపోయింది. ఆ పేలుడు శబ్దానికి వేరే గదిలో ఉన్న అతడి తల్లిదండ్రులు ఉలిక్కిపడి...హుటాహుటినా వచ్చి చూడగా...బాలుడు తీవ్రగాయాలపాలై మంచంపై పడి ఉన్నాడు. దీంతో ఒక్కసారిగా తల్లిదండ్రులు షాక్కి గురయ్యారు. ఆ చిన్నారి దుస్తులు కాలిపోయి, ఛాతీపై పలు తీవ్రగాయాలయ్యాయి. తొలుత తమకు ఏం జరిగిందో కూడా అర్థం కాలేదు. ఆ తర్వాత పరిశీలించి చూడగా ఫోన్ ముక్కలై పడి ఉండటంతో..మొబైల్ బ్లాస్ట్ అయ్యిందని తెలిసిందని చిన్నారి తండ్రి చెబుతున్నాడు. 24 గంటలు పిల్లలను మానిటర్ చేస్తూ కూర్చొవడం అసాధ్యం అని అంటున్నాడు. పిల్లలు కూడా కాస్త అసహనంగా ఫీలవుతారు. ప్రస్తుతం అంతా ఆన్లైన్ చదువులు కాబట్టి వారు కాస్త ఒత్తిడికి గురవుతున్నారు. కాసేపు రిలాక్స్ అయ్యేందుకని మొబైల్ ఫోన్లు ఇస్తుంటాం. ప్రస్తుత పరిస్థితుల్లో పిల్లలు గేమ్లు కూడా ఆన్లైన్లో ఆడుతుంటారు. అందువల్ల ఇలాంటి ఘటనలు ఎదురైతే తాము ఏంచేయాలని చిన్నారి తండ్రి జావేద్ కన్నీటిపర్యంతమయ్యాడు. (చదవండి: వివాహ మండపంలోకి ఎద్దు ఎంట్రీ..పరుగులు తీస్తున్న జనాలు) -
క్షుద్ర పూజల కలకలం.. కూకట్పల్లిలో సగం కాలిపోయిన స్థితిలో మృతదేహం
సాక్షి, హైదరాబాద్: కేపీహెచ్బీకాలనీ: శ్మశాన వాటికలో సగం కాలిన స్థితిలో కనిపించిన మృతదేహం స్థానికంగా సంచలనం రేపింది. గుర్తు తెలియని వ్యక్తిని హత్య చేసి ఒంటిపై డీజిల్ పోసి దహనం చేసి ఉంటారని భావిస్తున్న ఘటన కేపీహెచ్బీ పోలీస్స్టేషన్ పరిధిలో సోమవారం వెలుగుచూసింది. ఆనవాళ్లు గుర్తించలేని విధంగా దగ్ధమైన మృతదేహం ఎవరిదనే సీఐ కిషన్ కుమార్ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. సోమవారం ఉదయం హైదర్నగర్లోని అలీతలాబ్ పక్కన ఉన్న హిందూ శ్మశాన వాటికలో సగం కాలిన మృత దేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహానికి 20 మీటర్ల దూరంలో చెప్పులు, ఓ బ్యాగ్, అందులో రగ్గు(బెడ్ షీట్) స్వాధీనం చేసుకున్నారు. అదే విధంగా బ్యాటరీ, సిమ్ కార్డు లేని ఓ సెల్ ఫోన్ను కూడా గుర్తించారు. మృతుడి వయసు సుమారు 25 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండవచ్చునని అతడిని హత్య చేసి దహనం చేసి ఉండవచ్చునని అనుమాన్యం వ్యక్తం చేశారు. ఇటీవలి కాలంలో అదృశ్యమైన వ్యక్తుల వివరాలను ఆరా తీసేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. సైబరాబాద్ క్లూస్ టీంతో పాటు పోలీస్ ప్రత్యేక బృందాలు ఘటన స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. అన్నీ అనుమానాలే... శ్మశాన వాటికలో మృతదేహం లభించిన తీరు మొదలు అక్కడి ఆనవాళ్లు అనేక అనుమానాలకు దారి తీస్తున్నాయి. మృతుడి ఒంటిపై ఎలాంటి గాయాలు లేవని పోలీసులు పేర్కొన్నారు. మృతదేహానికి కొద్ది దూరంలో బియ్యం పిండి వంటివి కనిపించడంతో క్షుద్ర పూజలు చేసి ఉండవచ్చునని అనుమానాలు వస్తున్నా పోలీసులు నిర్ధారించడం లేదు. మృతదేహాన్ని శనివారం దహనం చేసి ఉంటారని స్థానికులు పేర్కొంటుండగా పోలీసులు మాత్రం ఆదివారం అర్ధరాత్రి దాటిన తరువాత దహనం చేసి ఉండవచ్చునని పేర్కొంటున్నారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా పూర్తి స్థాయి దర్యాప్తు తర్వాతే వాస్తవాలు తెలుస్తాయని సీఐ పేర్కొన్నారు. ఎవరైనా మృతదేహాన్ని గుర్తిస్తే కేపీహెచ్బీ పోలీస్స్టేషన్లో సంప్రదించాలని కోరారు. -
కూర మాడిందని భార్యను చంపేసి.. గుట్టుచప్పుడు కాకుండా..!
భువనేశ్వర్: కూర మాడిపోయిందనే కోపంతో ఓ వ్యక్తి భార్యను దారుణంగా కొట్టి చంపేశాడు. గుట్టుచప్పుడు కాకుండా ఇంటి వెనకాల పూడ్చిపెట్టాడు. ఆపై తన భార్య నెల రోజులుగా కనిపించటం లేదని బుకాయించే ప్రయత్నం చేశాడు. పోలీసులు తమదైన శైలీలో విచారించగా.. అసలు విషయం బయటపెట్టాడు. ఒడిశాలోని సంబల్పూర్ జిల్లాలో జరిగిన ఈ దారుణ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. 35 ఏళ్ల బాధితురాలి మృతదేహాన్ని బయటకు తీసి పోస్ట్మార్టం నిర్వహించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నెల రోజుల క్రితం బద్మాల్ పంచాయతీలోని రౌత్పారా గ్రామానికి చెందిన రంజన్ బడింగ్(36) అనే వ్యక్తి అక్రమంగా వేటాడి తాబేలును ఇంటికి తీసుకొచ్చాడు. తన భార్య సావిత్రిని కూర చేయమని చెప్పాడు. అయితే, వంట చేస్తుండగా అది కాస్త మాడిపోయింది. దీంతో తాగిన మత్తులో ఉన్న నిందితుడు భార్యతో గొడవకు దిగాడు. తీవ్రంగా కొట్టటంతో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. ఆమెను అలాగే వదిలేసి ఇంట్లోంచి వెళ్లిపోయాడు. రాత్రి తిరిగి వచ్చే సరికి ఆమె ప్రాణాలు కోల్పోయింది. దీంతో గుట్టుచప్పుడు కాకుండా మృతదేహాన్ని ఇంటి వెనకాల ఖాళీ స్థలంలో పూడ్చిపెట్టాడు. తనపై కోపంతో ఇంట్లోంచి వెళ్లిపోయిందని అందరి నమ్మించే ప్రయత్నం చేశాడు. బాధితురాలి తల్లి పోలీసులను ఆశ్రయించగా విషయం వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గ్రామానికి వెళ్లారు. వారిని చూసిన నిందితుడు పరారయ్యేందుకు ప్రయత్నించాడు. పోలీసులు, గ్రామస్థులు కలిసి పట్టుకోవటంతో చేసిన నేరాన్ని అంగీకరించాడు. నిందితుడిని అరెస్ట్ చేసి మృతదేహాన్ని పోస్ట్మార్టానికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఇదీ చదవండి: స్నేహితుడిని బెదిరించి.. సాఫ్ట్వేర్ ఇంజినీర్పై 10 మంది గ్యాంగ్ రేప్ -
నిప్పు రాజేసిన వివాహేతర సంబంధం... భర్త చేతిలో తల్లి కూతుళ్లు సజీవ దహనం
థానే: మహారాష్ట్రలోని ఒక వ్యక్థి ఘోరమైన అకృత్యానికి తెగబడ్డాడు. కట్టుకున్న భార్యని, కూతుళ్లను నిర్ధాక్షణ్యంగా సజీవ దహనం చేసేందుకు యత్నించాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని థానే జిల్లాలోని డోంబివిలీలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం... ఈ ఘటనలో నిందితుడి భార్య 35 ఏళ్ల మహిళ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిందని పోలీసులు తెలిపారు. బాధితురాలి కూతుళ్లు సమీర(14), సమీక్ష(11) 90 శాతం తీవ్రంగా గాయపడ్డారని అన్నారు. ఐతే వారు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు వెల్లడించారు. అలాగే నిందితుడు ప్రీతీ శాంతారామ్ పాటిల్ కూడా ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డాడని, అతను కూడా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని చెప్పారు. పోలీసులు విచారణలో నిందుతుడు మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని భార్యని కూతుళ్లను వేధిస్తున్నాడని, అందులో భాగంగానే నిందితుడు ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలిపారు. ఈ క్రమంలో అతను కూడా తీవ్రంగా గాయపడ్డాడని చెప్పారు. ఐతే ఈ ఘటన శనివారం సాయంత్రం 5.30 గం.ల ప్రాంతంలో జరిగితే సుమారు 8.30 గం.లకు...అంటే దాదాపు మూడు గంటల ఆలస్యంతో వెలుగులోకి వచ్చిందని, అందువల్లే బాధితులు తీవ్రంగా గాయలపాలయ్యారని అన్నారు. (చదవండి: దారుణం.. కత్తులతో పొడిచి చంపుతున్నా చూస్తూ ఉండిపోయారు!) -
ఘోర బస్సు ప్రమాదం... 20 మంది సజీవ దహనం
లాహోర్: పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్లో ఘోర బస్సు ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ప్యాసింజర్ బస్ని ఆయిల్ ట్యాంకర్ ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుందని అన్నారు . దీంతో సుమారు 20 మంది అక్కడికక్కడే సజీవ దహనమయ్యారని పోలీసులు తెలిపారు. ముల్తాన్ హైవేకి సుమారు 350 కి. మీ దూరంలో ఉన్న లాహోర్ సమీపంలో ఈ ప్రమాదం జరిగిందని చెప్పారు. అతి వేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు చెబుతున్నారు. కరాచి నుంచి లాహోర్కి బయులు దేరుతున్న ప్యాసింజర్ బస్సుని ఆయిల్ ట్యాంకర్ ఢీ కొట్టడంతో ఒక్కసారిగా మంటలు చుట్టుముట్టాయని వెల్లడించారు. దీంతో వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి వచ్చి రెస్య్కూ చర్యలు చేపట్టినప్పటికీ ప్రయాణికులను కాపాడటం కష్టతరమైందని అన్నారు. ఈ ఘటనలో సుమారు ఆరుగురు తీవ్ర గాయాల పాలయ్యారని, ఆస్పత్రికి తరలించామని తెలిపారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. ఈ ఘటనలో మృతి చెందిన బాధితుల మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయని అన్నారు. ఆయా మృతదేహాలకు డీఎన్ఏ టెస్ట్లు నిర్వహించి బాధిత కుటుంబాలకు అందజేస్తామని వెల్లడించారు. ఈ మేరకు పాకిస్తాన్ పంజాబ్ ముఖ్యమంత్రి పర్వేజ్ ఈ ఘటనలో మృతి చెందిన బాధితుల పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని అధికారులును ఆదేశించారు. అలాగే మృతి చెందిన బాధిత కుటంబాలు తమ వారిని గుర్తించేలాగా సహకరించాలని అధికారులను కోరారు. (చదవండి: బస్సు బ్రేకులు ఫెయిలై ఘోర ప్రమాదం.. ఐటీబీపీ సిబ్బంది దుర్మరణం) -
ఆస్పత్రిలో అగ్నిప్రమాదం...లక్షలాది విలువైన మందులు ఆహుతి
ఇస్తామాబాద్: పాకిస్తాన్లోని లాహోర్లోని గుల్బర్గ్లోని ది చిల్డ్రన్స్ హాస్పిటల్లో శనివారం భారీ అగ్నిప్రమాదం చోటుచోసుకుంది. మూడో అంతస్తులోని ఫార్మసీ స్టోరేజీలో మంటలు చెలరేగడంతో లక్షలాది రూపాయలు ఖరీదు చేసే విలువైన మందులు దగ్ధమయ్యాయని అధికారులు తెలపారు. అయితే ఈ ఘటనలో ఇప్పటి వరుకు ఎలాంటి ప్రాణం నష్టం జరగలేదని తెలిపారు. 40 మంది రెస్క్యూసిబ్బంది మమ్మురంగా సహాయక చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. ఈ అగ్నిప్రమాదం సంభవించడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదన్నారు. మంటలు అదుపులోకి వచ్చిన తర్వాత గల కారణాలపై దర్యాప్తు జరుపుతామని పోలీసులు తెలిపారు. (చదవండి: పసిఫిక్ మహాసముద్రాన్ని ఒంటరిగా చుట్టి వచ్చిన అత్యంత వృద్ధుడు) -
గ్యాస్ సిలిండర్ పేలి ఇల్లు దగ్ధం
ముంచంగిపుట్టు: బంగారుమెట్ట పంచాయితీ వదనపల్లి గ్రామంలో గురువారం సాయంత్రం గ్యాస్ సిలిండర్ పేలి రేకుల ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. ఇంట్లో వస్తువులు కాలి బూడిదయ్యాయి. ఇంటిలో ఉన్న వారు ప్రమాదాన్ని గ్రహించి వెంటనే పరుగులు పెట్టడంతో ప్రాణాపాయం తప్పింది. బాధితులు అందించిన వివరాలిలా ఉన్నాయి. వదనపల్లిలో కొర్రా సన్యాసిరావు ఇంటిలో సాయంత్రం అతని భార్య బాలబుడి టీ పెట్టడం కోసం గ్యాస్ స్టౌ వెలిగించింది. అప్పటికే గ్యాస్ పైప్ నుంచి గ్యాస్ లీక్ అవుతుంది. ఈ విషయాన్ని గమనించకపోవడంతో స్టౌ వెలిగించిన వెంటనే సిలిండర్ నుంచి మంటలు చెలరేగాయి. దీంతో ఇంట్లో ఉన్న సన్యాసిరావు, అతని భార్య బాలబుడి, మనవరాలు భవానీతో బయటకు పరుగులు పెట్టారు. అప్పటికే ఇంట్లో మంటలు వ్యాప్తి చెంది, గ్యాస్ సిలిండర్ ఒక్కసారిగా పేలి ఇంటిపై కప్పు రేకుల నుంచి బయటకు వచ్చి పడింది. పెద్ద శబ్ధం రావడంతో గ్రామస్తులంతా కేకలు వేస్తూ పరుగులు పెట్టారు. ఇంట్లో కాలుతున్న పలు వస్తువులను ఆర్పే ప్రయత్నం చేసినప్పటికీ అప్పటికే కాలి బూడిదయ్యాయి.రూ.90వేలు డబ్బులతో పాటు 10 ధాన్యం బస్తాలు. 3 చోడి బస్తాలు, దుస్తులు, రేషన్ కార్డు, గృహోపకరణ వస్తువులు కాలిపోయి నిలువ నీడలేనివారయ్యారు. ఈ ప్రమాదంలో రూ.2 లక్షలకు పైగా ఆస్తి నష్టం జరిగిందని బాధితులు సన్యాసిరావు, బాలబుడి తెలిపారు. తహసీల్దార్ నర్సమ్మ, ఎంపీటీసీ సభ్యురాలు కొండమ్మ, వైఎస్సార్సీపీ మండల నేత జగన్నాథం, వీఆర్వో రమేష్లు గ్రామానికి వెళ్లి బాధితులను పరామర్శించి, దగ్ధమైన ఇంటిని పరిశీలించారు.జరిగిన నష్టంపై వివరాలను సేకరించారు. ప్రభుత్వం నుంచి నష్ట పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. బాధితులకు రేషన్ సరుకులు అందించారు. (చదవండి: ప్లాస్టిక్ నిషేధం తక్షణ అవసరం) -
ఇదేం పిచ్చిరా నాయన! తగలెట్టేసి మరీ సెల్ఫీలా!
New selfie points near burnt buses and cars submerged: రాజికీయ, ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకలో అల్లర్లు చెలరేగుతున్నసంగతి తెలిసిందే. తొలుత శాంతియుతంగా చేపట్టిన నిరసనలు కాస్తా హింసాత్మకంగా మారిపోయాయి. ఈ నేపథ్యంలో ఆందోళనకారులు రాజపక్స కుటుంబాల ఇళ్లను, కార్యాలయాలను ధ్యంసం చేశారు కూడా. నేవీ స్థావరంలో తలదాచుకుంటున్న మహిందా రాజపక్స కుటుంబం పై దాడి చేయాలని నిరసనకారలు ఆ ప్రాంతాలను కూడా ముట్టడించారు. ఈ క్రమంలో ఒకవైపు ఆందోళలనకారులు నిరసనలు చేస్తుంటే మరోవైపు కొంతమంది ఆ ధ్వంసమైన కార్లు, చెరువుల్లో మునిగిపోయిన బస్సుల వద్ద సెల్ఫీలు తీసకుంటున్నారు. ఈ హింసాత్మక అల్లర్లుక కారణంగా శ్రీలంక రక్షణ శాఖ కర్ఫ్యూ విధించడమే కాకుండా ప్రభుత్వ ఆస్తులన తగలబెట్టేవారిని నిర్థాక్షిణ్యంగా కాల్చేయండి అంటూ అదేశాలు జారీ చేసింది కూడా. ఐతే ఇక్కడ ప్రజలు ధ్వంసం చేసిన ప్రభుత్వ ఆస్తులను సెల్ఫీ పాయింట్లుగా చేసుకుని సెల్ఫీలు దిగేందుకు ఎగబడటం విశేషం. అంతేకాదు ఈ కర్ఫ్యూ కారణంగా తాము స్కూల్కి వెళ్లలేకపోవడంతో తాము తమ కుటుంబంతో బయటకు వచ్చి సెల్ఫీలు దిగుతున్నమని విద్యార్థులు చెబుతుండటం గమనార్హం. ప్రధానమంత్రి కార్యాలయాలు, నివాసస్థలాల వద్ద బస్సలు, కార్లు దగ్ధం కాగా.. ప్రజలు తమ కుటుంబాలతో సహా వాటి వద్దకు వచ్చి మరీ సెల్ఫీలు దిగుతున్నారు. Sri Lanka | Burnt buses and sunken cars become a new selfie point in Colombo "People are taking selfies here as they want to take it as memory, many people could not join protests, they are taking selfies to show solidarity with the protesters," said Clifford, a local resident pic.twitter.com/UpTKzwRLXF — ANI (@ANI) May 12, 2022 (చదవండి: శ్రీలంక కొత్త ప్రధానిగా రణిల్ విక్రమసింఘే ప్రమాణం) -
అనుమానాస్పద మృతి.. కూతురిని స్కూల్ కిచెన్లో అలా చూసేసరికి..
చైన్నై: ఇంటికి రావాల్సిన తమ చిన్నారి సమయం దాటుతున్న రాలేదు. తీరా వెతుకుతూ వెళ్లిన ఆ తల్లిదండ్రులకు సగం కాలిపోయిన తమ బిడ్డని చూసి తట్టుకోలేకపోయారు. కాపాడుకునే ప్రయత్నం చేసే లోపే వారి కంటి పాప కనుమూసింది. ఈ ఘోరం తమిళనాడులోని దిండిగల్ ప్రాంతంలో చోటు చేసుకుంది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. పంచాయతీ యూనియన్ మిడిల్ స్కూల్లో చదువుతున్న ఓ 5వ తరగతి బాలిక మధ్యాహ్నం విరామ సమయంలో తన ఇంటికి వెళ్లకపోవడంతో ఆమె తల్లిదండ్రులు కంగారు పడ్డారు. బాలిక కోసం వారు పాఠశాలకు వెళ్లి చూడగా పాఠశాల వంటగది సమీపంలో ఆమె తీవ్రంగా కాలిపోయి, కొన ఊపిరితో కనిపించింది. బాలికను చికిత్స నిమిత్తం తక్షణమే ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. కూతురు తమ కళ్ల ముందే మృతి చెందడంతో తట్టుకోలేని ఆ తల్లిదండ్రులు ఒక్కసారిగా కుప్పకూలారు. తమకు న్యాయం చేయాలంటూ బాలిక కుటుంబ సభ్యులుతో పాటు గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగారు. పోస్ట్మార్టం రిపోర్ట్ ప్రకారం పాప ఒంటిపై లైంగిక దాడికి సంబంధించిన గాయాలు లేవని పోలీసులు తెలిపారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని పోలీసులు బాలిక కుటుంబ సభ్యులకు హామి ఇచ్చారు. చదవండి: భార్యపై అనుమానం.. వివస్త్రను చేసి.. తాడుతో బిగించి -
ఘోరం: యువతిని వివస్త్రను చేసి.. ప్రైవేట్ భాగాలను కాల్చి..
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. డ్రాబ్రీ పీఎస్ పరిధిలోని ఓ నాలాలో గుర్తు పట్టలేకుండా ఉన్న ఓ యువతి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఆమెను గుర్తు తెలియని కొందరు వ్యక్తులు వివస్త్రను చేసి అందులో పడేశారని తెలిపారు. ఆమె వివరాలు తెలియకుండా యువతి ముఖంతో పాటు ప్రైవేటు భాగాలను కూడా కాల్చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ విషయాన్ని ధృవీకరించిన ఆ ప్రాంత డీసీపీ.. తమకి సోమవారం సాయంత్రం యువతి మృతదేహం లభ్యమైందని పేర్కొన్నారు. సమాచారం అందుకున్న క్రైమ్ టీమ్, ఎఫ్ఎస్ఎల్ బృందం ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించగా, పలు ఆధారాలు లభించాయన్నారు. దీంతో పాటు, చుట్టుపక్కల ఉన్న సీసీటీవి ఫుటేజీని కూడా పరిశీలిస్తున్నామన్నారు. అలానే, ఈ వయస్సు గల అమ్మాయిలు ఎవరైనా తప్పిపోయిన సమాచారాన్ని కూడా వివిధ స్టేషన్లో పోలీసులు సేకరిస్తున్నారని చెప్పారు. దీంతో పాటు మృతదేహం లభ్యమైన ప్రదేశానికి చుట్టుపక్కల ప్రాంతాలను కూడా గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. ఆమె పై అత్యాచారం చేసి, ఆపై హత్య చేసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. చదవండి: Love Couple Suicide: తెలంగాణ ఆర్టీసీ బస్సులో ప్రేమజంట ఆత్మహత్య -
పప్పూ... ఇది తప్పు!!
జాతీయ పార్టీగా చెప్పుకునే తెలుగుదేశానికి ప్రధాన కార్యదర్శి. మాజీ ముఖ్యమంత్రి కొడుకు. ఎమ్మెల్యేగా గెలవకపోయినా మంత్రిగా పనిచేశాడు. మరి ఈయనకు ప్రజాస్వామ్యమన్నా... దానికి మూలస్తంభాల్లాంటి పత్రికలన్నా ఏ కొంచమైనా గౌరవం ఉందా? ఉంటే ఇలా చేస్తాడా? నిజాలు తనకు నచ్చనంత మాత్రాన ఏకంగా పత్రిక ప్రతులనే తగలబెట్టే సాహసం చేశాడంటే ఈయన రాజకీయాలకు పనికొస్తాడా? అధికారం లేదనే నైరాశ్యంలో.. తమ కుట్రలు బయటపడిపోతున్నాయన్న అక్కసుతో ఇంతకు దిగజారిపోతాడా? ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం మేడపి గ్రామంలో మంగళవారం సాక్షి ప్రతుల్ని చింపి దహనం చేసిన నారా లోకేశ్ను చూసి ప్రజాస్వామ్య వాదులు సిగ్గు పడాలి. తెలుగుదేశం పార్టీ తలదించుకోవాలి. (అది చిడతల నాయుడికే చెల్లింది: పేర్ని నాని) -
పెళ్లి కోసం దాచిన 9 లక్షలు బూడిద
సాక్షి, శ్రీకాకుళం: కొత్తూరు మండలం హంస కాలనీలో సోమవారం అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో వారాడ కృష్ణమూర్తి, బొడ్డు గోపాల్కు చెందిన ఇళ్లు కాలిపోయాయి. షార్ట్సర్క్యూట్తో జరిగిన ఈ ప్రమాదంలో కృష్ణమూర్తికి చెందిన రూ. 9.20 లక్షల నగదు, ఏడు తులాల బంగారం ఆభరణాలు కాలిబూడిదైనట్లు అగ్నిమాపక అధికారి ఐవీ రామయ్య తెలిపారు. కుమార్తె వివాహం కోసం సిద్ధం చేసిన నగదు, బంగారంతోపాటు టీవీ, విలువైన వస్తువులు కాలిపోవడంతో కృష్ణమూర్తి కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా రోదించారు. ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే అగ్నిమాపక కేంద్రం సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు. (సాఫ్ట్ వేర్ ఉద్యోగిని సజీవ దహనం చేసిన అత్తింటివారు) కాలిపోయిన నగదు -
ప్రజాగ్రహం: భారతీయ రెస్టారెంట్కు నిప్పు
వాషింగ్టన్: కరోనాతో అల్లాడిపోతున్న అగ్రరాజ్యం అమెరికాలో ఇప్పుడు నల్లజాతీయులు నిరసనతో కూడా అట్టుడుకుతోంది. మిన్నియాపోలిస్ నగరానికి చెందిన జార్జ్ ఫ్లాయిడ్ అనే నల్ల జాతీయుడిని ఫోర్జరీ కేసులో ఇటీవల అరెస్ట్ చేసిన పోలీసులు.. చివరికి చిత్రహింసలకు గురిచేసి దారుణంగా కొట్టి చంపారు. దీనిపై అమెరికాలో పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఆందోళనల్లో భాగంగా మిన్నియాపోలీస్లోని ప్రముఖ ఇండియన్ రెస్టారెంట్ ‘గాంధీ మహల్’కు నిరసనకారులు నిప్పు పెట్టారు. హఫ్సా ఇస్లాం కుటుంబం ఈ రెస్టారెంట్ను చాలా ఏళ్లుగా సౌత్ మిన్నియాపోలిస్లో నడుపుతున్నారు. అయితే ఈ సంఘటనకు సంబంధించి రెస్టారెంట్ యజమాని కుమార్తె ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. (విడాకులకు దారి తీసిన జార్జ్ మృతి) ‘రెస్టారెంట్ మంటల్లో తగలబడిపోయినందుకు బాధగా ఉంది. అయితే మా నాన్న గారు నాతో ఫోన్లో ఈ విషయంపై మాట్లాడారు. రెస్టారెంట్ తగులబడితే తగులబడని. కానీ జార్జ్ ఫ్లాయిడ్కు న్యాయం జరగాలి. ఆ అధికారులను జైళ్లో పెట్టాలి అని అన్నారు. మా రెస్టారెంట్ను కాపాడానికి చుట్టుపక్కల వారు చాలా ప్రయత్నించారు. మళ్లీ మేం మా రెస్టారెంట్ను తిరిగి నిర్మించుకోగలమనే నమ్మకం ఉంది’ అని ఆమె పోస్ట్ చేశారు. హఫ్సా కుటుంబం ఎన్నో ఏళ్లుగా నల్లజాతీయుల నిరసనలకు అండగా నిలబడుతూ వస్తోంది. ఈ విషయంలో కూడా జార్జ్ ఫ్లాయిడ్కు న్యాయం జరగాలని హఫ్సా కుటుంబం కోరుకుంటుంది.(ఊపిరాడటం లేదు: అమ్మా! అమ్మా!) Powerful words from the family that owns Gandhi Mahal, hours after the restaurant burned down.#Minneapolis #wcco #GeorgeFloyd pic.twitter.com/AgGng0gsEP — Christiane Cordero (@ChristianeWCCO) May 29, 2020 ఫోర్జరీ కేసులో ఇటీవల అరెస్ట్ అయిన జార్జ్ ఫ్లాయిడ్ మెడపై పోలీసులు మోకాలుతో అదిమిపెట్టి ఊపిరాడకుండా చేశారు. ‘నాకు ఊపిరి ఆడటం లేదు.. ప్లీజ్..’ అని నిందితుడు మొత్తుకున్నప్పటికి పోలీసు అధికారి మాత్రం కనికరం చూపకుండా ఐదు నిమిషాల పాటు మెడపై మోకాలు అలాగే పెట్టి ఉంచాడు. దీంతో ప్రాణం పోతుందంటూ గిలగిల కొట్టుకున్న జార్జ్ పోలీసు మోకాలి కిందనే ప్రాణాలు వదిలాడు. స్థానికులు ఈ వీడియోను రికార్డ్ చేయడం.. అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీస్ అధికారులపై ప్రజాగ్రహం వెల్లువెత్తుతోంది. -
చంద్రబాబుపై భగ్గుమన్న బీసీలు
సాక్షి, అమరావతి/సాక్షి, నెట్వర్క్: కుట్రపూరితంగా కేసులు వేయించి తమ రిజర్వేషన్లను అడ్డుకున్న టీడీపీ అధినేత చంద్రబాబుపై రాష్ట్రవ్యాప్తంగా బీసీలు భగ్గుమన్నారు. మేమంటే ఇంత ద్వేషమా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పదవులు రాకుండా తీరని ద్రోహం చేసిన టీడీపీ నేతలకు తగిన బుద్ధి చెబుతామంటూ గురువారం వాడవాడలా కదం తొక్కారు. ఎక్కడికక్కడ చంద్రబాబు దిష్టిబొమ్మలను దహనం చేసి.. తమ ఆవేదనను వ్యక్తం చేశారు. ర్యాలీలు, ధర్నాలకు దిగి చంద్రబాబు దుర్బుద్ధిని ఎండగట్టారు. టీడీపీ నేతల నిర్వాకం వల్ల రిజర్వేషన్లు కోల్పోయామని మండిపడుతూ శ్రీకాకుళంలో బీసీ వర్గాలకు చెందిన ప్రజలు, విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఇక పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులోని ఫైర్స్టేషన్ సెంటర్ వద్ద చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. సీఎం వైఎస్ జగన్ తమకు మంచి చేసేందుకు అదనంగా రిజర్వేషన్లు తీసుకొస్తే.. అడ్డుకుంటారా అంటూ టీడీపీ నేతలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ, రాజమహేంద్రవరం తదితర ప్రాంతాల్లో చంద్రబాబు, టీడీపీ నేతల ఫ్లెక్సీలను పెద్ద ఎత్తున తగలబెట్టారు. వారి చిత్రపటాలకు చెప్పుల దండ వేసి ఊరేగించారు. టీడీపీ నేత బిర్రు ప్రతాప్తో కేసులు వేయించడం ద్వారా చంద్రబాబు నీతిమాలిన రాజకీయాలు చేస్తున్నారని కృష్ణా, గుంటూరు జిల్లా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమను ఓటు బ్యాంకుగా చూస్తున్న టీడీపీని చిత్తుచిత్తుగా ఓడించాలని ప్రకాశం, నెల్లూరు జిల్లాల బీసీ విద్యార్థులు, నాయకులు పిలుపునిచ్చారు. వివిధ ప్రాంతాల్లో ఆందోళనకు దిగి తమ ఆవేదనను వ్యక్తం చేశారు. చంద్రబాబు నిర్వాకంతో బీసీలు 15 వేలకు పైగా పదవులను కోల్పోవాల్సి వస్తోందని కర్నూలు జిల్లా బీసీ సంఘాల నాయకులు వాపోయారు. టీడీపీని పూర్తిగా భూస్థాపితం చేస్తామని అనంతపురం, చిత్తూరు జిల్లాలకు చెందిన బీసీలు, విద్యార్థులు ప్రతినబూనారు. ఆయా జిల్లాల్లోని నియోజకవర్గాల కేంద్రాల్లో చంద్రబాబు దిష్టిబొమ్మలను ఉరి తీసి తమ ఆగ్రహాన్ని తెలియజేశారు. తమను ఆర్థికంగా, రాజకీయంగా అణగదొక్కాలని చూస్తున్న చంద్రబాబుకు తమ సత్తా ఏంటో స్థానిక ఎన్నికల్లో చూపిస్తామంటూ వైఎస్సార్ జిల్లా బీసీలు, ప్రజలు హెచ్చరించారు. (చదవండి: బీసీల కోటాపై టీడీపీ ఆట) -
ముగ్గురు విద్యార్థినులు సజీవ దహనం
చండీగఢ్: చండీగఢ్లో భారీ అగ్ని ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. సెక్టార్ 32 వద్ద ఉన్న పీజీ వసతి గృహంలో శనివారం ఈ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనలో ముగ్గురు విద్యార్థినులు సజీవ దహనమయ్యారు. ల్యాప్టాప్ చార్జ్ చేస్తుండగా మంటలంటుకున్నట్టు అనుమానిస్తున్నారు. అయితే పోలీసులు అగ్నిప్రమాదానికి కారణం ఏమిటో ఇంకా తేల్చలేదు. అలాగే ఈ భవనంలో కనీస భద్రతా చర్యలేవీ తీసుకో లేదనీ, అనేక అగ్నిమాపక భద్రతా ఉల్లంఘనలు జరిగినట్టు అగ్నిమాపక అధికారులు చెప్పారు. సెక్టార్ 32 లోని పీజీ వసతి గృహంలో మంటలు చెలరేగడంతో ముగ్గురు యువతులు మృతి చెందినట్లు ప్రభుత్వ వైద్య కళాశాల, ఆసుపత్రి అధికారులు తెలిపారు. భవనం పై అంతస్తులో అక్రమ నిర్మాణం జరిగినట్టుగా గుర్తించామన్నారు. భవనం మొదటి అంతస్తులో మరణించిన విద్యార్థినులు పేయింగ్ గెస్ట్లుగా వుంటున్నారని చండీగఢ్ పోలీసు సూపరింటెండెంట్ వినీత్ కుమార్ తెలిపారు. 19-22 సంవత్సరాల వయస్సు వీరిని పంజాబ్, హర్యానాకు చెందిన ముస్కాన్, రియా, ప్రాక్షిగా గుర్తించారు. మరో విద్యార్థిని భవనం పైనుంచి కిందికి దూకేయడంతో తీవ్ర గాయాలతో ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతోంది. మొత్తం 36 మంది విద్యార్థులు ఈ భవనంలో ఉన్నట్టు సమాచారం. పోలీసు, రక్షక బృందాల ఆధ్వర్యంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. -
నిండు చూలాలు దారుణ హత్య
సాక్షి, పరిగి: నిండు చూలాలును దారుణంగా హతమార్చి రోడ్డు పక్కన పడేసిన సంఘటన పరిగి మండలం రంగంపల్లి శివారులో గురువారం వెలుగుచూసింది. పోలీసుల వివరాల ప్రకారం.. రంగంపల్లి శివారులోని హైదరాబాద్– బీజాపూర్ రహదారి పక్కన గుంతల్లో కాలిపోయిన స్థితిలో ఉన్న ఓ మహిళ మృతదేహాన్ని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందజేశారు. పరిగి డీఎస్పీ రవీంద్రారెడ్డి, ఎస్ఐ చంద్రకాంత్ సంఘటన స్థలాన్ని సందర్శించి వివరాలు సేకరించారు. ఒక్క ఎడమకాలి పాదం మినహా పూర్తిగా ఆమె శరీరం కాలిపోయి ఉంది. 20 నుంచి 25 ఏళ్ల వయసున్న యువతి అయి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. కాళ్లకు మెట్టెలు, మెడలో మంగళసూత్రంలాంటివి లేకపోవడం, ఆమె జననాంగాలకు ఆనుకుని గర్భస్థ శిశువు పడి ఉంది. ఎక్కడో హత్య చేసిన దుండగులు బుధవారం రాత్రి ఇక్కడ పడవేసి పెట్రోల్ పోసి నిప్పంటించి పరారై ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులను తప్పుతోవ పట్టించేందుకే ఎక్కడో హత్య చేసి ఇక్కడ పడేసి ఉంటారా..? అని భావిస్తున్నారు. వాహనం తచ్చాడిన గుర్తులను బట్టి కారులో తీసుకువచ్చి పడేసి ఉంటారని గుర్తించారు. వివిధ కోణాల్లో దర్యాప్తు.. సంఘటన స్థలాన్ని సందర్శించిన పోలీసులు ఆధారాలు సేకరించారు. మృతదేహాన్ని పరిగి లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గుర్తు తెలియని శవంగా కేసు నమోదు చేసుకుని ద ర్యాప్తు చేపట్టారు. ఈ కేసుకు సంబంధించి వివరాలు ఆయా పోలీస్స్టేషన్లకు పంపించి మిస్సిం గ్ కేసుల విషయంలో ఆరా తీస్తున్నారు. చుట్టు పక్కల పోలీస్స్టేషన్ల పరిధిలో సీసీ కెమెరాల ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. అబార్షన్ వికటించిందా..? లభ్యమైన మృతదేహం గర్భవతి కావడంతో పాటు అవివాహితగా అనుమానిస్తున్న పోలీసు లు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాం పక్కన ఆస్పత్రిలో పేషెం ట్లకు కప్పే బట్ట లభ్యం కావడం సంఘటన వెనక మరో కోణాన్ని వెలుగులోకి తెస్తోంది. పెళ్లి కాకుండానే గర్భం దాల్చడంతో గుట్టుగా అబార్షన్ చేయిం చేందుకు ప్రయత్నించి అది వికటించడంతో యువతి మృతి చెంది ఉంటుందని భావిస్తున్నారు. మృతి చెందాక మృతదేహాన్ని, శిశువును తీసుకువచ్చి ఇక్కడ పడేసి నిప్పంటించి పరారై ఉంటారా...? అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఎవరైనా కనిపించకుండాపోయిన వారు ఉంటే తమను సంప్రదించాలని పోలీసులు కోరారు. 94406 27360, 94406 27275లలో తమను సంప్రదించాలని సూచించారు. -
పేలిన రెడ్మీ నోట్–4 సెల్ఫోన్
చిత్తూరు అర్బన్ : చిత్తూరు నగరంలో చార్జింగ్ పెట్టిన సెల్ఫోన్ పేలిపోయింది. రామ్నగర్ కాలనీకి చెందిన సూర్యచంద్ర ఏడాదిగా రెడ్మీ నోట్–4 ఫోన్ వాడుతున్నాడు. శుక్రవారం ఫోన్కు చార్జింగ్ పెట్టి ఇంటి బయట ఉన్నాడు. ఉన్నట్టుంది శబ్దం రావడంతో లోపలికి వెళ్లి చూడగా ఫోన్ పేలిపోయింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. -
పేలిన మొబైల్
కృష్ణరాజపురం : ఛార్జింగ్ పెడుతుండగా సెల్ఫోన్ పేలిపోయిన ఘటన సోమవారం బొమ్మనహళ్లిలో చోటు చేసుకుంది. బొమ్మనహళ్లి ప్రాంతానికి చెందిన చంద్రు అనే యవకుడు కొద్ది రోజుల క్రితం రెడ్మి మొబైల్ కొనుగోలు చేశాడు. ఈ క్రమంలో సోమవారం మొబైల్ ఛార్జింగ్ పెడుతుండగా మొబైల్ నుంచి ఒక్కసారిగా పొగలు రావడాన్ని గమనించిన చంద్రు వెంటనే దూరంగా పారిపోయాడు. పొగలు రావడం మొదలైన కొద్ది క్షణాల్లో మొబైల్ పెద్ద శబ్దం చేస్తూ పేలిపోయింది. ఘటనలో ఎవరికి ఎటువంటి ప్రమాదం చోటు చేసుకోలేదు. -
చిత్తూరు జిల్లాలో అగ్నిప్రమాదం రెండు కార్లు దగ్ధం
-
బతుకు బుగ్గి
పెనుగంచిప్రోలు : వారంతా నిరుపేదలు...అమ్మ సన్నిధిలో జీవితాలు వెళ్లదీస్తున్నారు...తిరునాళ్ల సందర్భంగా చిరు వ్యాపారాలు చేసుకొని కుటుంబ పోషణకు సంపాదించుకుందామన్న వారి ఆశలు అడియాసలయ్యాయి. ప్రమాదవశాత్తూ ఆదివారం మధ్యాహ్నం చెలరేగిన మంటలు వారి జీవితాల్లో తీరని వేదనను మిగిల్చాయి. పెనుగంచిప్రోలు శ్రీ తిరుపతమ్మవారి చిన్న తిరునాళ్ల సందర్భంగా మునేరులో పాకలు వేసుకొని పేదలు చిరు వ్యాపారాలు నిర్వహిస్తారు. మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో మునేరు వెళ్లే దారిలో ఒక పక్క పాకలో పొంగళ్లు చేస్తుంటే ప్రమాదవశాత్తు గ్యాస్ లీకై మంటలు చెలరేగాయి. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో పాటు గాలి కూడా ఉండటంతో మంటలు వేగంగా వ్యాపించి సుమారు 50 దుకాణాలు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. దీంతో ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని దుకాణదారులతో పాటు, పాకల్లో ఉన్న భక్తులు పరుగులు తీశారు. పాకలు మొత్తం తాటాకు, పట్టాలతో కావడంతో ప్రమాద తీవ్రత బాగా ఉంది. తిరునాళ్లకు వ్యాపారులు ఒకొక్కరు రూ.5 నుంచి రూ.10లకు వడ్డీలకు తెచ్చి సరుకు పాకల్లో ఉంచారు. అది కాస్తా బుగ్గి కావడంతో వ్యాపారులు దిక్కు తోచని స్థితిలో ఉన్నారు. ప్రమాదంలో కోళ్లు, కొబ్బరికాయలు, బొమ్మలు, కుండలు, గుడ్లతో పాటు రెండు రోజుల వ్యాపారంలో వచ్చిన డబ్బులు కూడా బూడిదయ్యాయి. తిరునాళ్ల ఐదు రోజుల పాటు అయితే పసుపు–కుంకుమల రోజు మాత్రమే ఫైర్ ఇంజన్ కావాలని ఆలయ అధికారులు కోరడం, ఆదివారం ఉదయం ఫైర్ ఇంజన్ వెళ్లడం, మధ్యాహ్నం ప్రమాదం జరిగిందని దీనికి ఎవరు బాధ్యత వహిస్తారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అనధికారికంగా మునేరులో పాకలకు విద్యుత్ సౌకర్యం, గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేయడం కూడా ప్రమాదానికి కారణంగా ఉంది. ఒక్క సిలిండర్కు 5 నుంచి 10 పొయ్యులు ఏర్పాటు చేస్తారు. దీంతో పైప్లు లీకై మంటలు వ్యాపించి ప్రమాదాలు జరుగుతున్నాయి. అధికారుల నిర్లక్ష్యమే కారణం మునేరులో జరిగిన ప్రమాదానికి దేవస్థాన అధికారులతోపాటు ఇతర శాఖల అధికారుల నిర్లక్ష్యమే కారణమని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫైర్ ఇంజన్ ఉంటే ఇంత ప్రమాదం జరిగేది కాదన్నారు. ప్రమాద స్థలిని పరి శీలించిన జాయింట్ కలెక్టర్–2 బాబూరావుకు కూడా బాధితులు, స్థానికులు ఇదే విషయాన్ని తెలియజేశారు. దీనిపై ఆయన వెంటనే సమన్వయ సమావేశం సందర్భంగా రాసి న మినిట్స్ తీసుకు రమ్మని ఆలయ అధికారులను ఆదేశించారు. దానిలో కేవలం రెండు రోజులు మాత్రమే ఫైర్ ఇంజన్ కావాలని రాసి ఉండటంతో జేసీ ఈవో ఎం రఘునాథ్, ఇతర అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సమన్వయ సమావేశానికి ఆర్డీవోను ఎలా పిలవాలో తెలియదు, ఐదు రోజుల తిరునాళ్లకు ఒక్క రోజే ఫైర్ ఇంజన్ కావాలని ఎందుకు రాశారు అని ప్రశ్నించారు. ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని వైఎస్సార్సీపీ విజ యవాడ పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను, ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్, జగ్గయ్యపేట మున్సిపల్ చైర్మన్ ఇంటూరి చిన్నా, ఆలయ ఈవో రఘునా«థ్, చైర్మన్ కర్ల వెంకట నారాయణ, డీఈ రమ, వైఎస్సార్సీపీ పంచా యతీ విభాగపు జిల్లా అధ్యక్షుడు తన్నీరు నాగేశ్వరరావు, జిల్లా ఉపాధ్యక్షుడు ఇంజం కేశవరావు, మండల కన్వీనర్లు కంచేటి రమేష్, చిలుకూరి శ్రీనివాసరావు, కాకాని హరి, ముత్యాల చలం, వేల్పుల రవికుమార్, సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి ఇంటూరి నాగేశ్వరరావు, సీపీఎం మండల కార్యదర్శి అరుణ్కుమార్ సందర్శించి బాధితులతో మాట్లాడారు. బాధితులను ఆదుకుంటాం : కలెక్టర్ విజయవాడ: పెనుగంచిప్రోలులో లక్ష్మీతిరుపతమ్మ ఆలయ సమీపంలో జరిగిన అగ్ని ప్రమాద బాధితులను అన్ని విధాల ఆదుకుంటామని కలెక్టర్ బి.లక్ష్మీకాంతం తెలిపారు. లక్ష్మీతిరుపతమ్మ ఆలయంలో ఆదివా రం భక్తులు పొంగళ్ల తయారీ సమయంలో జరిగిన అగ్ని ప్రమా ద ఘటనలో తాత్కాలిక గుడారాలకు నిప్పంటుకుని దగ్ధం కావ డం దురదృష్టకరమన్నారు. ఈ ఘటనలో నష్టపోయిన ఒక్కొక్కరికి రూ.7వేల చొప్పున 42 మందికి పరిహారం చెక్కులను తక్షణమే అందించాలని జాయింట్ కలెక్టర్ –2 పి.బాబూ రావును ఆదేశించినట్లు కలెక్టర్ తెలిపారు. బాధితులకు భోజన సదుపాయాలు కల్పించాలని వా రికి అవసరమైన రుణాలు మంజూరు చేయాలని ఆదేశించానన్నారు. ప్రభుత్వ వైఫల్యం : ఉదయభాను ప్రభుత్వం వైఫల్యం కారణంగానే ఈ ఘోర ప్రమాదం జరిగిందని వైఎస్సార్సీపీ విజయవాడ పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను విమర్శించారు. ప్రమాదంలో చిరు వ్యాపారులు దారుణంగా నష్ట పోయారన్నారు. అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి వ్యాపారాలు చేస్తున్నారని, వారికి ఇలా కావటంచాలా దురదృష్టకరమన్నారు. ఫైర్ ఇంజన్ కేవలం ఒక్కరోజు మాత్రమే ఉండటం వల్ల ఈప్రమాదం జరిగిందన్నారు. అధికారుల నిర్లక్ష్యం కనిపిస్తుందన్నారు. ప్రమాదంలో నష్టపోయిన వారికి ఒకొక్కరికి రూ.1 నుంచి రూ.1.50 లక్షలు నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. సంఘటనాస్థలంలో వివరాలు అడిగి తెలుసుకుంటున్న వైఎస్సార్సీపీ నేత ఉదయ భాను -
వేర్వేరు ప్రాంతాల్లో చెట్లు దగ్ధం
కొండాపురం: గుర్తుతెలియని ఆకతాయిలు చేసిన పనికి మండలంలోని సత్యవోలు పంచాయతీ లింగనపాలెం గ్రామానికి వెళ్లే రోడ్డు వెంబడి ఉన్న జామయిల్, టేకు, మామిడి, తాటి చెట్లు దగ్ధమయ్యాయి. వివరాలిలా ఉన్నాయి. ఆకతాయిలు నిప్పు వేయండంలో రోడ్డుకు ఇరువైపుల ఉన్న కర్రతుమ్మ, తాటి చెట్లు సుమారు 1.50 కిలోమీటర్ వరకు పూర్తిగా బూడిదయ్యాయి. అలాగే జామయిల్, మామిడి, టేకు చెట్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. గ్రామస్తులు మంటలను ఆర్పేందుకు ప్రయత్నించినా ప్రయోజనం లేకుండాపోయింది. వింజమూరు ఫైర్ స్టేషన్కు సమాచారం అందజేశారు. నిమ్మతోట వింజమూరు: స్థానిక బీసీకాలనీకి చెందిన లక్కు రమణయ్య అనే వ్యక్తి నిమ్మతోట ఆదివారం అగ్నికి ఆహుతైంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం సంభవించిందని బాధితుడు తెలిపారు. తోటలోని డ్రిప్పైపులు, స్టార్టరు, 20 నిమ్మ చెట్లు కాలిపోయాయి. చుట్టుపక్కల పొలాల్లోని కూలీలు గుర్తించి మంటలను అదుపు చేశారు. సుమారు రూ.50,000 ఆస్తి నష్టం వాటినిట్లు బాధితుడు తెలిపాడు. మామిడి తోట సీతారామపురం: మండలంలోని నాగరాజుపల్లిలో 15 ఎకరాల మామిడి తోట దగ్ధమైంది. ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన ఎస్.రమాదేవి. పి.పిచ్చమ్మ, కె.సుబ్బమ్మ, ఎన్.రత్తమ్మ, ఎం.రత్తమ్మ, పి.పెదవెంగమ్మకు 2.50 ఎకరాల చొప్పున భూమిని ఏడు సంత్సరాల క్రితం ప్రభుత్వం మంజూరు చేసింది. హార్టికల్చర్ కింద వారు మామిడి మొక్కలు నాటారు. గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు వేయడంతో మామిడితోట దగ్ధమైంది. రూ.20 లక్షల నష్టం వాటిల్లినట్లు బాధితులు తెలిపారు. ప్రభుత్వం నష్టపరిహారం అందజేయాలని కోరుతున్నారు. జామాయిల్ తోట అనుమసముద్రంపేట(ఆత్మకూరు): ఆత్మకూరు మున్సిపాలిటీలోని నెల్లూరుపాళెం విజయా డెయిరీ సమీపంలో ఆదివారం జామాయిల్ తోట దగ్ధమైంది. వివరాలిలా ఉన్నాయి. డెయిరీకి సమీపంలో ఆత్మకూరుకు చెందిన మన్నెం సుబ్బారెడ్డి, డాక్టర్ వసుందరమ్మలు సుమారు 75 ఎకరాల్లో జామాయిల్ వేశారు. ఆదివారం ప్రమాదవశాత్తు మంటలు చేలరేగాయి. స్థానికులు గుర్తించి అగ్నిమాపక సిబ్బంది సమాచారం అందించడంతో వారు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. అప్పటికే సుమారు 15 ఎకరాల్లో జామాయిల్ దగ్ధమైంది. ప్రమాద సమయంలో ఆ ప్రాంతంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. అగ్నిమాపక అధికారులు పి.సుధాకరయ్య, కె.పెంచలయ్య, ఖాజామొహిద్దీన్ తదితరులు పాల్గొని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. -
భార్యతో గొడవ..ఇంటికి నిప్పుపెట్టిన ప్రబుద్ధుడు
బొబ్బిలి: భార్యతో గొడవ పడిన భర్త ఇంటికి నిప్పంటించిన సంఘటన బొబ్బిలిలోని ఇందిరమ్మకాలనీలో సోమవారం చోటుచేసుకుంది. ఇంటి యజమాని ప్రభావతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. కాలనీలో ఫొటో స్టూడియో నిర్వహిస్తున్న సురేష్, తన భార్య స్వాతితో గొడవపడి ఇంటికి నిప్పంటించాడు. దీంతో ఇంటితో పాటు సామాన్లు కాలిబూడిదయ్యాయి. వెంటనే స్థానికులు అగ్నిమాపక శాఖాధికారులకు సమాచారం అందివ్వడంతో వారు వచ్చి మంటలను అదుపు చేశారు. ఇంటిలోని సామన్లు కాలిపోవడంతో బాధితురాలు స్వాతి లబోదిబోమంటోంది. -
సీటు బెల్ట్ తీసుకునే లోపే..దారుణం
బెంగళూరు:కారులో ప్రయాణిస్తున్నపుడు సీటు బెల్ట్ పెట్టుకోవడం..ద్విచక్ర వాహనంపై వెళుతున్నపుడు హెల్మెట్ ధరించడం తప్పనిసరి. అయితే దురదృష్టవశాత్తు ఆపదలో రక్షించాల్సిన ఆ సీట్ బెల్టే బెంగళూరుకు చెందిన ఓ వ్యాపారి ప్రాణాలను బలితీసుకుంది. కారు ఇంజీన్కు అకస్మాత్తుగా మంటలు అంటుకోవడంతో ఆయన సజీవ దహనమైన ఘటన కలకలం రేపింది. అయితే చివరి నిమిషంలో తన కుటుంబ సభ్యుల కాపాడుకున్నా ఆయన మాత్రం మంటల్లో కాలి బూడిద కావడం మృతుని కుటుంబ సభ్యులను మరింత కలవర పరిచింది. దురదృష్టకరమైన ఈ సంఘటన ఆదివారం ఉదయం మదుక్కారై టోల్ గేటు సమీపంలో చోటు చేసుకుంది. నగల వ్యాపారి దిలీప్కుమార్ (38 )భార్యా పిల్లలతో కారులో కొచ్చికి బయలుదేరారు. ఇంతలో వాహనం ఇంజిన్కు హఠాత్తుగా మంటలు అంటుకున్నాయి. దీంతో వెంటనే తేరుకున్న దిలీప్ కుమార్ తన భార్య ఇద్దరు పిల్లల్ని బయటకు తోసేసి మరీ ప్రమాదంనుంచి రక్షించారు. ఇంతలో మంటలు బాగా వ్యాపించడంతో సీట్ బెల్టు తీసుకునే లోపే భార్యా పిల్లల చూస్తుండగానే ఆయన మంటలకు ఆహుతైపోవడం తీవ్ర విషాదాన్ని రేపింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. -
ఫ్రిజ్లోంచి ఎగసిన మంటలు
రాయదుర్గం అర్బన్: ఓ ఇంట్లోని ఫ్రిజ్లోంచి ఉన్నపళంగా మంటలు చెలరేగడంతో ఎలక్ట్రానిక్స్ వస్తువులు, ఇతర సామగ్రి కాలిపోయాయి. బాధితులు తెలిపిన మేరకు.. పట్టణంలోని ఐఓసీ గోదాము పక్కన హమాలీ గొల్ల గోవిందు నివాసం ఉంటున్నాడు. ఆదివారం ఉదయం 7 గంటలకు గోవిందు బజార్లోకి వెళ్లాడు. భార్య మంజుల 7.30 గంటలకు సమీపంలోని తమ టీస్టాల్కు వెళ్లింది. ఇంట్లో ఎవ్వరూ లేరు. సరిగ్గా 8.30 గంటల సమయంలో ఫ్రిజ్లో లోపాల వల్ల మంటలు చెలరేగాయి. పక్కనే ఉన్న టీవీ, నిత్యావసర సరుకులు, రూ.4వేల నగదు, ఒక సెల్ఫోన్ కాలిపోయాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన వచ్చి మంటలు ఆర్పివేశారు. సిలిండర్ గనుక పేలి ఉంటే ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండేదని స్థానికులు తెలిపారు. ప్రమాదంలో రూ.50వేల నష్టం వాటిల్లిందని బాధితులు తెలిపారు. స్విచ్బోర్డులో షార్ట్సర్క్యూట్ జరిగి ఉండొచ్చని ఫైర్ ఆఫీసర్ ఖాద్రీ తెలిపారు. అయితే షార్ట్సర్క్యూట్తో మంటలు చెలరేగలేదని విద్యుత్ సిబ్బంది స్పష్టం చేశారు. -
గడ్డివామి దగ్ధం
బొమ్మనహాళ్(రాయదుర్గం) : గోవిందవాడ గ్రామంలో ఆదివారం మధ్యాహ్నం రెండు గంటలకు వరి గడ్డివామి దగ్ధమైంది. గుర్తు తెలియని వ్యక్తులు ఎవరో బీడీ తాగి ఆర్పకుండా పడేయడం వల్ల ఈ ప్రమాదం జరిగి ఉంటుందని బాధిత రైతు కుమారస్వామి తెలిపాడు. దాదాపు రూ.80వేల నష్టం వాటిల్లిందని ఎస్ఐ శ్రీరామ్ శ్రీనివాస్కు ఫిర్యాదు చేసి, తహసీల్దార శివయ్యకు రాతపూర్వకంగా అర్జీ అందజేశారు. ప్రభుత్వం తమను ఆదుకోవాని విజ్ఞప్తి చేశారు. -
అరటితోట దగ్ధం..రూ.5 లక్షలు ఆస్తినష్టం
ముదిగుబ్బ (ధర్మవరం) : ముదిగుబ్బ మండల పరిధిలోని దొరిగిల్లులో దివాకర్రెడ్డి అనే రైతుకు చెందిన అరటితోటలో సోమవారం అగ్ని ప్రమాదం జరిగి, పూర్తిగా కాలిపోయింది. బాధిత రైతు తహసీల్దార్ పీవీ రమణకు వినతిపత్రం అందజేశాడు. ఈ ప్రమాదంలో సుమారు రూ.5 లక్షలు పంట నష్టం వాటిల్లినట్లు రైతు పేర్కొన్నాడు. పంటను పరిశీలించి, తగు చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ రైతుకు హామీ ఇచ్చారు. -
ఆరు ఎకరాల్లో అరటితోట దగ్ధం
పుట్లూరు : మండలంలోని ఓబుళాపురం గ్రామ సమీపంలో సోమవారం జరిగిన అగ్ని ప్రమాదంలో ఆరు ఎకరాల్లో సాగు చేసిన అరటితోట దగ్ధమైంది. చాగంటి పుల్లారెడ్డి అనే రైతుకు చెందిన అరటితోటకు మంటలు వ్యాపించడంలో సమీప పొలాల్లోని రైతులు ఫైరింజి¯ŒS సిబ్బందికి సమాచారం అందించారు. ఫైరింజి¯ŒS వచ్చేలోపు అరటితోట దగ్ధమైంది. ఈ ప్రమాదంలో దాదాపు 20 టన్నుల అరటిగెలలు కాలిపోయాయి. డ్రిప్పు పరికరాలు బూడిద కావడంతో రూ.6 లక్షల మేరకు నష్టం జరిగినట్లు బాధిత రైతు వాపోయాడు. -
అగ్నిప్రమాదం.. 70 ఇళ్లు దగ్ధం
వేలేరుపాడు: పశ్చిమగోదావరిజిల్లా వేలేరుపాడు మండలం కట్కూరులో అగ్నిప్రమాదం సంభవించింది. ఆదివారం అర్ధరాత్రి జరిగిన ఈ ప్రమాదంలో 70 పూరిళ్లు దగ్ధమయ్యాయి. పలువురు గాయపడ్డారు. ఓ ఇంట్లో సిలిండర్ పేలిన కారణంగా ఈ అగ్నిప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. బాధితులు కట్టుబట్టలతో నిరాశ్రయులయ్యారు. నష్టం వివరాలు తెలియాల్సి ఉంది. -
రెండు గుడిసెలు దగ్ధం
ముదిగుబ్బ (ధర్మవరం) : ముదిగుబ్బ మండలం పాయగట్టుపల్లిలో ఆదివారం జరిగిన అగ్ని ప్రమాదంలో రెండు గుడిసెలు దగ్ధమయ్యాయి. ఓ బాలిక ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకునేఽ ప్రయత్నంలో పక్కనే ఉన్న గుడిసెలకు మంటలు వ్యాపించాయి. కదిరి నుంచి అగ్నిమాపక సిబ్బంది గ్రామానికి చేరుకొని మంటలు ఆర్పివేశారు. ఆర్ఐ పవన్కుమార్, వీఆర్ఓ గ్రామానికి చేరుకొని నష్టాన్ని అంచనా వేశారు. బాలిక ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు తెలియరాలేదు. -
సర్పంచ్ కారును దగ్ధం చేశారు
నిడమనూరు: సర్పంచ్ ఇంటి వద్ద పార్క్ చేసిన కారును ఆర్థరాత్రి దుండగులు తగులబెట్టిన ఘటన కృష్ణా జిల్లాలో చోటు చేసుకుంది. నిడమనూరు సర్పంచ్ కోటేశ్వరరావు కారును గుర్తు తెలియని దుండగులు బుధవారం రాత్రి దగ్ధం చేశారు. కోటేశ్వరరావు ఇటీవలే టీడీపీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్లో చేరారు. పార్టీ మారడంతో టీడీపీ వర్గీయులే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని ఆయన ఆరోపిస్తున్నారు. ఈ మేరకు పడమట పీఎస్లో కోటేశ్వరరావు ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణ జరుపుతున్నారు. -
రెండు బైకులను తగులబెట్టిన దుండగులు
హైదరాబాద్ సిటీ: నారాయణగూడ పోలీస్స్టేషన్ పరిధిలోని బషీర్బాగ్ చంద్రానగర్లో మంగళవారం రెండు ద్విచక్రవాహనాలను గుర్తు తెలియని దుండగులు తగులబెట్టారు. ఇళ్లముందర నిలిపి ఉంచిన మోటార్ బైక్లను పెట్రోల్ పోసి నిప్పుపెట్టారు. గతంలో కూడా దుండగులు ఇలా ద్విచక్రవాహనాలను తగులబెట్టారని బస్తీవాసులు పేర్కొన్నారు. నారాయణగూడ పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మామిడి తోట దగ్ధం
పెద్దవూర: ప్రమాదవశాత్తు నిప్పంటుకుని మామిడి తోట దగ్ధమైన సంఘటన శనివారం మండలంలోని ఊట్లపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం గ్రామానికి చెందిన వంగాల నారాయణరెడ్డి 12 ఎకరాల్లో మామిడి తోటను సాగు చేస్తున్నాడు. మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ప్రమాదవశాత్తు తోటకు నిప్పంటుకుంది. దీంతో తోటలలోని నాలుగు సంవత్సరాల వయస్సున్న 700 మామిడి చెట్లు దగ్ధమయ్యాయి. అలాగే డ్రిప్లు, పైపులు కాలిపోయాయి. హాలియా ఫైర్స్టేషన్కు ఫోన్ చేసినా కలువకపోవడంతో అక్కడ ఉన్న రైతులు బైక్పై వెళ్లి ఊట్లపల్లి పుష్కరఘాట్లో ఫైరింజన్ను తీసుకువచ్చి మంటలను ఆర్పేలోపే తోట అంతటికి మంటలు వ్యాపించాయి. దీంతో సుమారు రూ.3 లక్షల నష్టం సంభవించినట్లు బాధిత రైతు వాపోయాడు. -
మహిళపై అత్యాచారం ఆపై...
మహబూబ్ నగర్ జిల్లా : ఎప్పుడూ రద్దీగా ఉండే రోడ్డుకు సమీపంలోనే ఓ గుర్తు తెలియని మహిళను అత్యాచారం చేసి, ఆపై దారుణంగా హత్య చేశారు. మృతదేహాన్ని గుర్తుపట్టకుండా దుండగులు కిరోసిన్ పోసి నిప్పంటించిన సంఘటన వంగూరు మండలం చారకొండ గ్రామ శివారులో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. చారకొండ సమీపంలో బుధవారం ఉదయం గుండె యాద య్య గౌడ్ వ్యవసాయ పొలంలో కాలిపోయి గుర్తుపట్టనట్లు ఉన్న మహిళ మృతదేహాన్ని గమనించిన చుట్టు పక్కల రైతులు వెంటనే డిప్యూటీ సర్పంచ్, పొలం యజమానికి సమాచారం ఇచ్చారు. వెంటనే వారు అక్కడికి చేరుకుని, విషయం పోలీసులకు చేరవేశారు. కల్వకుర్తి సీఐ వెంకట్, వంగూరు, వెల్దండ ఎస్ఐలు నరేష్, జానకిరాంరెడ్డి, వంగూరు ట్రైనీ ఎస్ఐ ఉదయ్కిరణ్ వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని హత్యకు సంబంధించిన వివరాలను తెలుసుకుని, పంచనామా నిర్వహించారు. నిందితుల ఆచూకీ తెలుసుకునేందుకు జిల్లాకేంద్రం నుంచి డాగ్స్క్వాడ్ను రప్పించారు. అయినప్పటికీ ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కల్వకుర్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మంగళవారం అర్ధరాత్రి దుండగులు మహిళను అత్యాచారం చేసి ఆ తర్వాత హత్య చేసి, మృతదేహాన్ని గుర్తు పట్టకుండా ఒంటిపై కిరోసిన్ పోసి నిప్పంటించినట్లు ప్రాథమిక అంచనా వేస్తున్నారు. ఇందుకు సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ వెంకట్ తెలిపారు. మృతురాలి చేతిమీద రాజప్ప అని రాసి ఉందని, జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో నమోదైన మిస్సింగ్ కేసుల వివరాలను తెలుసుకుని మృతురాలి ఆచూకీ తెలుసుకుంటామని, ఆతర్వాత ఇందుకు బాధ్యులైన వారిని గుర్తిస్తామన్నారు. ఈ సంఘటనతో చారుకొండ ప్రజలు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. -
రూ.4 లక్షల కరెన్సీ నోట్లు బుగ్గిపాలు
దుగ్గొండి: వరంగల్ జిల్లాలోని దుగ్గొండి మండలం మర్రిపల్లి గ్రామానికి చెందిన గాదం రవి పెంకుటిల్లు బుధవారం రాత్రి అగ్నిప్రమాదంలో దగ్ధమైంది. ఈ ప్రమాదంలో రూ.నాలుగు లక్షల విలువైన కరెన్సీ నోట్లు(రూ.500, 1000) కాలిబూడిదయ్యాయి, కొన్ని సగం వరకు కాలిపోయాయి. బంగారు ఆభరణాలు మంటలకు మాడిపోయాయి. మరో రెండు రోజుల్లో భూమి కొనుగోలుకు డబ్బులు చెల్లించాల్సి ఉందని, తను కష్టపడి సంపాదించుకున్న సొమ్మంతా బుగ్గిపాలైందని రవి దంపతులు బోరున విలపిస్తున్నారు. -
రేప్ చేసి..నిప్పంటించాడు
కాన్పూర్ : ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ లో దారుణం చోటు చేసుకుంది. ఇంట్లో ఒంటరిగా వున్న వివాహిత మహిళ(30)పై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడి, సజీవ దహనం చేసిన ఘటన కలకలం రేపింది. పోలీసుల వివరాల ప్రకారం బాధితురాలి భర్త వ్యవసాయ కార్మికుడు. స్థానికంగా నివాసం ఉండే బ్రిజ్ కిషోర్ అనే వ్యక్తి వివాహితపై ఈ దారుణానికి ఒడిగట్టాడు. అనంతరం నిప్పంటించి పారిపోయాడు. చుట్టుపక్కల వారి ద్వారా సమాచారం అందుకున్న భర్త.... తీవ్రంగా గాయపడిన ఆమెను ఆసుపత్రికి తరలించాడు. చికిత్స పొందుతూ ఆమె మంగళవారం రాత్రి మరణించింది. కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాన్ని పోస్ట్మార్టానికి తరలించారు. అయితే తమ ఫిర్యాదు స్వీకరించడానికి ముందు స్థానిక పోలీసులు నిరాకరించారని బాధిత మహిళ బంధువులు ఆరోపించారు. పోలీసు ఉన్నతాధికారుల జోక్యం తరువాత మాత్రమే స్పందించినట్లు తెలిపారు. -
చంపి..కాఫీ తోటల్లో కాల్చేశారు
అనంతగిరి(విశాఖపట్టణం): విశాఖ జిల్లా అనంతగిరి మండలం ఎగువపోచ పంచాయతీ గీసుపురం కాఫీ తోటల్లో ఓ వ్యక్తి మృతదేహం వెలుగుచూసింది. గుర్తు తెలియని వ్యక్తిని ఎక్కడో చంపేసి..రెండు రోజుల క్రితం కాఫీ తోటల్లో కాల్చేసి ఉంటారని భావిస్తున్నారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని, దర్యాప్తు చేస్తున్నారు. -
సీఎం చంద్రబాబు దిష్టిబొమ్మ దహనం
పాలకొల్లు : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎస్సీలకు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలకు నిరసనగా పశ్చిమగోదావరి జిల్లాలో మంగళవారం ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు. పాలకొల్లులో వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు చిల్లం ఆనంద్ప్రకాశ్ ఆధ్వర్యంలో స్థానిక గాంధీ బొమ్మ సెంటర్లో కార్యకర్తలు చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేశారు. ఎస్సీలకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. -
అగ్ని ప్రమాదంలో 14 ఇళ్లు దగ్ధం
గార: ప్రమాదవశాత్తు సంభవించిన అగ్నిప్రమాదంలో 14 తాటాకు ఇళ్లు కాలిపోయాయి. ఈ సంఘటన శ్రీకాకుళం జిల్లా గార మండలం శ్రీకూర్మం పంచాయతి పరిధిలోని డొక్లపేట గ్రామంలో బుధవారం అర్ధరాత్రి దాటాక జరిగింది. అర్ధరాత్రి మంటలు ఎగిసిపడటాన్ని గుర్తించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చేసరికి 14 ఇళ్లు కాలి బూడిదయ్యాయి. ఆస్తినష్టం ఎంత జరిగిందనే వివరాలు తెలియాల్సి ఉంది. -
దావుద్ కారును తగలబెట్టిన యువత
-
మూడు బైక్లు దగ్ధం
బంజారాహిల్స్ (హైదరాబాద్) : గుర్తుతెలియని వ్యక్తులు అర్ధరాత్రి సమయంలో వేర్వేరు ప్రాంతాల్లో మూడు బైకులను దగ్ధం చేశారు. ఈ ఘటన బంజారాహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకొంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీకృష్ణనగర్ ఏ బ్లాకులో రెండు చోట్ల, కమలాపురి కాలనీ ఆంధ్రా బ్యాంకు సమీపంలో ఒకచోట బైకులను శనివారం అర్ధరాత్రి 1 గంట సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు దగ్ధం చేశారు. ఈ పనికి ఎవరు పాల్పడ్డారనే దానిపై పోలీసులు విచారణ చేపట్టారు. క్లూస్ టీం సిబ్బంది ఘటనా స్థలంలో ఆధారాలు సేకరించారు. తన బైకును ఎందుకు తగలబెట్టారో అర్ధం కావడం లేదని బాధితుడు సత్యనారాయణ పోలీసుల విచారణలో వెల్లడించారు. స్థానికంగా సీసీ ఫుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు. నిందితుల కోసం గాలింపు చేపట్టారు. -
’ఆగ్రహంతో కారును తగులబెట్టారు’
-
అగ్నిప్రమాదం.. అనుమానం!
-
చేతబడి చేస్తోందని కాల్చేశారు
-
చేతబడి చేస్తోందని కాల్చేశారు
చేతబడి అనుమానంతో ఒక మహిళను గుర్తుతెలియని వ్యక్తులు సజీవ దహనం చేశారు. ఈ ఘనట విశాఖపట్టణం జిల్లా డుమ్రిగూడ మండలం రాంసింగ్ గూడలో జరిగింది. మానవుడు అభివృద్ధి వైపు దూసుకుపోతున్నా.. మూడనమ్మకాలు ప్రజలను మూర్ఖులుగా మారుస్తుందని ఈ ఘటన నిరూపించింది. వివరాల్లోకి వెళితే.. గూడేనికి చెందిన రాజమ్మ (45) అనే మహిళ చేతబడి చేస్తోందన్న అనుమానంతో ఆమెను శనివారం సాయంత్రం ఇంట్లో సజీవ దహనం చేశారు. ఆమె ఉంటున్న గుడిసెకు నిప్పు పెట్టడంతో ఆమె మంటల్లో పడి మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
రాజధాని ప్రాంతంలో రైతుపై అరాచకం
-
రహదారిపై మోటార్ బైక్ దగ్ధం
శ్రీశైలం : శ్రీశైల దేవస్థానం పరిధిలోని రామయ్య టర్నింగ్ వద్ద శుక్రవారం ఒక మోటార్బైక్ రన్నింగ్లో ఉండగానే మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. ఆ బైక్పై మాచర్ల నుంచి శ్రీశైలం వస్తున్న ఎస్. క్రాంతి కుమార్ శ్రీశైలానికి ఒక కిలోమీటర్ దూరంలోని రామయ్య టర్నింగ్ వద్దకు రాగానే స్పార్క్ప్లగ్ నుంచి మంటలు చెలరేగాయని తెలిపారు. అవి పెట్రోల్ ట్యాంకుకు అంటుకుని బైక్ పూర్తిగా దగ్థమైంది. అదృష్టవశాత్తు ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు. -
చంద్రబాబు దిష్టిబొమ్మ దహనం
తూర్పుగోదావరి: ఖమ్మం జిల్లా నుంచి విలీనమైన మండలాలు, గ్రామాల్లో ప్రజల ఇబ్బందులను ప్రభుత్వం తీర్చడంలేదంటూ తూర్పు గోదావరి జిల్లా చింతూరులో బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేశారు. సీపీఎం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో.. కనీస మౌలిక సదుపాయాలు కూడా ప్రభుత్వం కల్పించలేక పోయిందని నిరసించారు. ప్రజల సంక్షేమాన్ని పట్టించుకోనందుకు నిరసనగా ఈనెల 20న బంద్ పాటించాలని నాయకులు పిలుపునిచ్చారు. -
ఇద్దరు పిల్లలు సహా తల్లి ఆత్మాహుతి
విజయనగరం: ఇద్దరు పిల్లలతో కలసి ఓ తల్లి ఆత్మాహుతికి పాల్పడింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయనగరం జిల్లా కొత్తూర్ మండలం దిమిలి గ్రామానికి చెందిన చల్లా భాగ్యలక్ష్మి (28) ఆదివారం మధ్యాహ్నం ఇంటి తలుపులు వేసుకుని లోపల తనతోపాటు, ఇద్దరు పిల్లలపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. ఈ ఘటనలో భాగ్యలక్ష్మితోపాటు ఆమె నాలుగేళ్ల కుమార్తె, నెల రోజుల బాబు సజీవ దహనమయ్యారు. ఇల్లు కూడా దహనమైంది. కాగా, ఆత్మాహుతికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. -
అంతిమ యాత్రలో అపశ్రుతి
బనగానపల్లె (కర్నూలు జిల్లా): అంతిమ యాత్ర లో టపాసులు పేల్చడంతో నిప్పురవ్వలు వెళ్లిపడి 20 గడ్డి వాములు దగ్ధమయ్యాయి. ఈ సంఘటన బుధవారం సాయంత్రం కర్నూలు జిల్లా బనగానపల్లె మండలం మీరాపురం గ్రామంలో జరిగింది. దీంతో గ్రామస్తులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. విషయం తెలిసిన అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపుచేశారు. ఈ ఘటనతో గ్రామ ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. -
మంత్రి కడియం దిష్టిబొమ్మ దహనం
మెదక్: వైద్య కళాశాలల్లో ప్రవేశ ఫీజు పెంపుదలను నిరసిస్తూ బుధవారం మెదక్ జిల్లా జహీరాబాద్ పట్టణంలో ఏబీవీపీ నాయకులు తెలంగాణ విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి దిష్టిబొమ్మను దహనం చేశారు. స్థానిక అతిథి గృహం వద్ద జరిగిన ఈ ఆందోళనలో ఏబీవీపీ నేతలు మాట్లాడుతూ ఏంబీబీఎస్ సీట్ల ఫీజును రూ.2 లక్షల నుంచి రూ.9 లక్షలకు పెంచడంవల్ల విద్యార్థులపై తీవ్ర ఆర్ధిక భారం పడుతుందన్నారు. పెంచిన ఫీజును తగ్గించకుంటే ఆందోళన తీవ్రతరం చేస్తామన్నారు. ఏబీవీపీ రాష్ట్ర కమిటీ సభ్యుడు సుధాకర్, బాగ్ కన్వీనర్ వెంకట్ తదితరులు పాల్గొన్నారు. -
ఇంజినీరింగ్ విద్యార్థికి నిప్పు!
రంగారెడ్డి: జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. శివమహేశ్ అనే ఇంజినీరింగ్ విద్యార్ధి ఒంటికి నిప్పంటుకున్న ఘటన మొయినా బాద్ మండలం హిమాయత్ సాగర్ లోని అభినవ్ హైటెక్ ఇంజినీరింగ్ కాలేజీ ఎదుట కలకలం సృష్టించింది. తోటి విద్యార్ధులే ఈ ఘాతుకానికి ఒడిగట్టారని అతని స్నేహితులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనలో శివమహేశ్ శరీరం తొంభై శాతం కాలిపోయింది. తీవ్రంగా గాయపడిన శివమహేశ్ను ఉస్మానియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆ విద్యార్థి ఆత్మహత్యాయత్నం చేశాడా?లేక ఎవరైనా దాడి చేశారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ గ్రామానికి చెందిన శివకు మొదట విజ్ఞాన్ జ్యోతి కాలేజీలో సీటు రాగా తల్లిదండ్రులకు తెలియకుండా స్లైడింగ్లో అభినవ్ కాలేజీని ఎంచుకున్నాడు. -
ఇంజినీరింగ్ విద్యార్థికి నిప్పు!
-
అత్తాపూర్ బ్రిడ్జిపై కారు దగ్ధం
రంగారెడ్డి(రాజేంద్రనగర్): రాజేంద్రనగర్ పరిధిలోని అత్తాపూర్ బ్రిడ్జిపై టీఎస్08 యూఏ 1865 నంబర్ గల ఇండికా కారు ప్రమాదవశాత్తూ మంటల్లో చిక్కుకుంది. మంటలు వెనువెంటనే కారును చుట్టుముట్టేశాయి. ప్రమాద సమయంలో కారులో డ్రైవర్తో పాటు ఇద్దరు ప్రయాణికులు ఉన్నారు. డ్రైవర్ వెంటనే అప్రమత్తవటంతో ప్రమాదం తప్పింది. ఫైరింజన్ వచ్చేలోపే కారు పూర్తిగా బూడిదయిపోయింది. ఇండికా కారు, ముందు వెళ్తున్న ఇన్నోవా కారును ఢీకొట్టడంతో షార్ట్ సర్క్యూట్కు గురైంది. -
ఎడ్లపాడులో లోడ్ లారీ దగ్ధం
-
ఎడ్లపాడులో లోడ్ లారీ దగ్ధం
గుంటూరు(ఎడ్లపాడు): పార్శిల్ లోడ్తో వెళుతున్న ఓ లారీ దగ్ధమైంది. ఈ ఘటన గురువారం ఎడ్లపాడు మండలం తిమ్మాపురం సమీపంలోని జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. ఆటో మొబైల్ వస్తువులతో పల్నాడు డైలీ పార్శిల్ సర్వీస్కు చెందిన లారీ వెళుతుండగా ప్రమాదవశాత్తు నిప్పంటుకొని పూర్తిగా కాలిపోయింది. ఎలాంటి ప్రాణనష్టం లేకున్నప్పటికీ ఆస్తి నష్టం ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. ప్రమాదం కారణంగా రోడ్డుపై వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. -
పోలీసు వాహనానికి నిప్పు పెట్టిన దుండగులు
జగ్గయ్యపేట: గుర్తుతెలియని దుండగులు ఏకంగా పోలీసుల వాహనానికి నిప్పుపెట్టారు. ఈ ఘటన కృష్ణా జిల్లాలో శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి... కృష్ణా జిల్లా జగ్గయ్యపేట ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ ఎదుటు నిలిపి ఉంచిన పోలీసుల వాహనానికి గుర్తుతెలియని దుండగులు నిప్పుపెట్టారు. ఈ ఘటనలో వాహనం పాక్షికంగా కాలిపోయింది. -
పత్తి లారీ దగ్ధం
-
పత్తి లారీ దగ్ధం
హనుమాన్జంక్షన్: చెన్నై-కోల్కతా జాతీయ రహదారిపై పత్తి లోడుతో వెళ్తున్న ఓ లారీ అగ్ని ప్రమాదంలో చిక్కుకుంది. ఈ ఘటన బుధవారం ఉదయం కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ పోలీస్స్టేషన్ ఎదురుగా జరిగింది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు జిల్లా ఎడ్లపాడు నుంచి ఓ లారీ పత్తిలోడుతో బయల్దేరింది. ఈ లారీ కృష్ణా జిల్లా బాపులపాడు పరిధిలోని ఎన్ఎస్ఎల్ టెక్స్టైల్స్ కంపెనీకి వెళ్లాల్సి ఉంది. అయితే, లారీ డ్రైవర్కు రూట్ తెలియకపోవడంతో మధ్యలో సబ్రోడ్డులోకి వెళ్లి తిరిగి జాతీయ రహదారికి మళ్లాడు. ఈ కమ్రంలో ఎక్కడో లారీపైనున్న పత్తికి విద్యుత్ తీగలు తగలడంతో మంటలు అంటుకున్నాయి. అగ్ని మాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపులోకి తీసుకురాగా, లారీపైనున్న పత్తిమాత్రం పూర్తిగా దగ్ధమైంది. సుమారు రూ.5.60 లక్షల నష్టం వాటిల్లినట్టు సమాచారం. -
ఔటర్రింగ్రోడ్డులో కారు దగ్ధం
-
ఔటర్రింగ్రోడ్డులో కారు దగ్ధం
రంగారెడ్డి జిల్లా: ఔటర్రింగ్ రోడ్డులో వేగంగా వెళ్తున్న స్పోర్ట్స్ కారు డివైడర్ను ఢీ కొట్టింది. దీంతో కారులో మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. ఈ సంఘటన ఆదివారం రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం హిమాయత్సాగర్ వద్ద ఔటర్రింగ్ రోడ్డుపై జరిగింది. వివరాలు.. రవి అనే సాప్ట్వేర్ ఉద్యోగి మహారాష్ట్ర రిజిస్ట్రేషన్తో ఉన్న స్పోర్ట్స్ కారు (ఎమ్ఎచ్12ఏపీ0055) లో లంగర్హౌస్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్కు ఔటర్రింగ్ రోడ్డుపై వెళ్తున్నాడు. ఈ క్రమంలో హిమాయత్సాగర్ వద్దకు రాగానే కారు డివైడర్ను ఢీ కొనడంతో మంటలు చెలరేగాయి. దీంతో రవి కారును ఆపి వెంటనే బయటకు పరుగు తీశాడు. అదే సమయంలో కారు క్షణాల్లో మంటల్లో చిక్కి దగ్ధమైంది. ఈ ప్రమాదంలో కారు నడుపుతున్న వ్యక్తికి ఎలాంటి ప్రమాదం సంభవించలేదు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. (హిమాయత్సాగర్) -
నాలుగు పూరి గుడిసెలు దగ్ధం
విజయనగరం(జామి): కృష్ణా జిల్లా జామి మండలంలోని మంగళవీధిలో నాలుగు పూరి గుడిసెలు సోమవారం తెల్లవారు జాము 3 గంటలకు దగ్ధమయ్యాయి. ప్రమాదానికి షార్ట్సర్క్యూట్ కారణమని తెలిసింది. స్థానికులు సమాచారాన్ని ఎస్.కోట అగ్నిమాపక సిబ్బందికి తెలియజేయటంతో సంఘటనా స్థలికి చేరుకున్నారు. ఫైర్ ఇంజన్ల వచ్చేసరికి గుడిసెలు పూర్తిగా కాలిపోయాయి. కేవలం మొండి గోడలు మాత్రమే మిగిలాయి. చుక్క రాములమ్మ, చుక్క అర్జున, చుక్క అచ్చిబాబు, చుక్క కృష్ణలకు చెందిన గుడిసెలు ఈ ప్రమాదంలో దెబ్బతిన్నాయి. సుమారు లక్షరూపాయల ఆస్తి నష్టం జరిగింది. ప్రభుత్వపరంగా ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు. -
స్వల్పంగా కాలిన కన్వేయర్బెల్ట్
పరవాడ: బంకర్కు బొగ్గు తరలించే కన్వేయర్ బెల్ట్ స్వల్పంగా కాలింది. ఈ ఘటన విశాఖ జిల్లా పరవాడ సింహాద్రి ఎన్టీపీసీలో ఆదివారం ఉదయం జరిగింది. ఈ అగ్ని ప్రమాదంలో 3, 4 యూనిట్లకు బొగ్గును తరలించే 20-ఏ కన్వేయర్ బెల్ట్ స్వల్పంగా దెబ్బతిన్నది. ఈ రెండు యూనిట్లకు బొగ్గు సరఫరా చేయడానికి అదనపు బెల్ట్ సౌకర్యం ఉండటంతో సరఫరాలో ఎలాంటి మార్పురాలేదు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. -
ఏపీ రాజధాని గ్రామాల్లో ఉద్రిక్తత
-
ఆగి ఉన్న సిటీబస్సులో మంటలు
-
ఆగి ఉన్న సిటీబస్సులో మంటలు
హైదరాబాద్లోని మెహిదీపట్నం ప్రాంతంలో ఓ బస్సులో మంటలు చెలరేగాయి. బుధవారం రాత్రి హయత్నగర్ నుంచి వచ్చిన ఓ బస్సు మెహిదీపట్నంలో రాత్రి 10.30 గంటల ప్రాంతంలో ఆగి ఉన్న సమయంలో ఆ బస్సులో ఉన్నట్టుండి మంటలు చెలరేగాయి. బస్సు పూర్తిగా దగ్ధమైపోయింది. ఈ బస్సు హయత్నగర్ డిపోకు చెందినదిగా గుర్తించారు. సిబ్బంది గుర్తించి అగ్నిమాపక విభాగాన్ని అప్రమత్తం చేసేలోపే మంటలు వ్యాపించాయి. మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సు పూర్తిగా తగలబడిపో్యింది. అయితే, ఈ ప్రమాదానికి కారణం ఏంటన్న విషయం మాత్రం ఇంకా తెలియరాలేదు. పదే పదే బస్సు ప్రమాదాలు, బస్సులు తగలబడిపోతున్న సంఘటనలు జరుగుతుండటంతో ప్రయాణికులు ఆందోళనకు గురవుతున్నారు. ఎప్పుడేం జరుగుతుందోనని ప్రాణాలు అరిచేతుల్లో పెట్టుకుని ప్రయాణం చేయాల్సి వస్తోంది. -
విద్యుత్ఘూతంతో 6 కోళ్ల పారాలు దగ్ధం
-
రాహుల్కు ముద్దు పెట్టిన మహిళ హత్య
గౌహతి : ముద్దు ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. ఉత్సాహం, ఉద్వేగం పట్టలేక ముద్దు పెడితే అది ఆమె ప్రాణాలకే ముప్పుగా పరిణమించింది. కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి ముద్దు పెట్టిన పాపానికి ఓ మహిళ ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఫిబ్రవరి 26న అసోంలోని జోరత్లో స్వయం సహాయక గ్రూపులతో జరిగిన ఓ కార్యక్రమంలో రాహుల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనతో కరచాలనం చేయడానికి వచ్చిన పలువురు మహిళలు రాహుల్కు మరింత చేరువగా వచ్చి హఠాత్తుగా చెంపలపైనా, నుదిటిపైనా ముద్దులు పెట్టారు. దీంతో ఆయన ఒక్కసారిగా లేచి మహిళలకు అభివాదం చేశారు. ఉత్సాహం పట్టలేక కాంగ్రెస్ పార్టీ వార్డు సభ్యురాలు బోంటి...రాహుల్ బుగ్గపై ముద్దు పెట్టింది. మరొకరు తలపై ముద్దిచ్చారు. ఆ సమయంలో ఇది పెద్దగా కలకలం సృష్టించనప్పటికీ ఆ ఘటన ఆ మహిళల ఇంట్లో చిచ్చు పెట్టింది. పేపర్లు, టీవీ ఛానల్స్లో ఈ వార్త పెద్ద ఎత్తున ప్రసారం చేయటంతో బోంటి భర్త తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. దాంతో బోంటీని సజీవ దహనం చేసి ఆ తర్వాత తానూ ఆత్మహత్యాయత్నం చేశాడు. భర్త పెట్టిన నిప్పులో బాధితురాలు అగ్నికి ఆహుతి కాగా భర్త పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. అతను ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. -
ప్రయాణికుల వివరాల కోసం ప్రత్యేక కంట్రోల్ రూం
-
మహబూబ్ నగర్ జిల్లాలో ఘెర రోడ్డు ప్రమాదం