మంత్రి కడియం దిష్టిబొమ్మ దహనం | Effigies of kadiam sreehari burnt in medak district | Sakshi
Sakshi News home page

మంత్రి కడియం దిష్టిబొమ్మ దహనం

Published Wed, Jun 17 2015 3:45 PM | Last Updated on Thu, Jul 11 2019 5:37 PM

Effigies of kadiam sreehari burnt in medak district

మెదక్: వైద్య కళాశాలల్లో ప్రవేశ ఫీజు పెంపుదలను నిరసిస్తూ బుధవారం మెదక్ జిల్లా జహీరాబాద్ పట్టణంలో ఏబీవీపీ నాయకులు తెలంగాణ విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి దిష్టిబొమ్మను దహనం చేశారు. స్థానిక అతిథి గృహం వద్ద జరిగిన ఈ ఆందోళనలో ఏబీవీపీ నేతలు మాట్లాడుతూ ఏంబీబీఎస్ సీట్ల ఫీజును రూ.2 లక్షల నుంచి రూ.9 లక్షలకు పెంచడంవల్ల విద్యార్థులపై తీవ్ర ఆర్ధిక భారం పడుతుందన్నారు. పెంచిన ఫీజును తగ్గించకుంటే ఆందోళన తీవ్రతరం చేస్తామన్నారు. ఏబీవీపీ రాష్ట్ర కమిటీ సభ్యుడు సుధాకర్, బాగ్ కన్వీనర్ వెంకట్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement