
సత్యాగ్రహ దీక్షను జయప్రదం చేయాలి
కాపు కులస్తులకు ముద్రగడ బహిరంగ లేఖ
కిర్లంపూడి: ఈనెల 26న చేపట్టనున్న కాపు సత్యాగ్రహ దీక్షను జయప్రదం చేయాలని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో సోమవారం విడుదల చేసిన ప్రకటనలో పిలుపునిచ్చారు. ఆ రోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కాపు సత్యాగ్రహ దీక్ష చేయాలని సూచించారు.
కాపు కులస్తులందరూ దీక్షలో పాల్గొనాలన్నారు. ఇతర కుల సోదరుల మద్దతు కూడా కోరాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. కర్నూలు జిల్లా కేంద్రంలో జరిగే దీక్షలో తాను పాల్గొంటానని ముద్రగడ ఆ లేఖలో పేర్కొన్నారు.