'ఉక్కుపై ఉత్పత్తికి అంతరాయం లేదు'
Published Fri, Sep 2 2016 12:48 PM | Last Updated on Thu, Sep 19 2019 2:50 PM
విశాఖ: దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మె ప్రభావం విశాఖ ఉక్కు కర్మాగారంపై పాక్షికంగా పడింది. సూపర్వైజర్లు, బీఎంఎస్ సంఘానికి చెందిన కార్మికులు యథావిధిగా విధులకు హజరయ్యారు. స్టీల్ ప్లాంట్ ప్రధాన ర్వారం వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తు ఏర్పాటుచేశారు. సమ్మె వల్ల ఉత్పత్తికి ఎలాంటి అంతరాయం లేదని యాజమాన్యం తెలిపింది.
Advertisement
Advertisement