Bharat Bandh
-
ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా భారత్ బంద్
-
Rajasthan: బంద్తో విద్యాసంస్థల మూసివేత.. ఇంటర్నెట్ నిలిపివేత
ఎస్సీ, ఎస్టీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ రిజర్వేషన్ బచావో సంఘర్ష్ సమితి ఈరోజు (బుధవారం) భారత్ బంద్కు పిలుపునిచ్చింది. బంద్ ప్రభావం రాజస్థాన్లోని విద్యాసంస్థలపై కనిపించింది.బంద్ పిలుపు నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సెలవులు ప్రకటించింది. చిత్తోర్గఢ్ జిల్లా కలెక్టర్ అలోక్ రంజన్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. కాగా భరత్పూర్లో భారత్ బంద్ దృష్ట్యా ఉదయం 9 నుండి సాయంత్రం 6 గంటల వరకు ఇంటర్నెట్ సేవలు నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. దీంతో స్థానికులు పలు ఇబ్బందులు పడుతున్నారు.భద్రతా కారణాల దృష్ట్యా రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో పోలీసు బలగాలను మోహరించారు. చిత్తోర్గఢ్లో షెడ్యూల్డ్ కులాలు- తెగల మహార్యాలీ నిర్వహిస్తున్నారు.ఈ ర్యాలీ సందర్భంగా వీరు జిల్లా కలెక్టర్కు వినతి పత్రం సమర్పిస్తారు. రాజస్థాన్లోని వివిధ విశ్వవిద్యాలయాలలో బుధవారం జరగాల్సిన పలు పరీక్షలను వాయిదా వేశారు. -
ఢిల్లీలో కనిపించని భారత్ బంద్ ప్రభావం
ఎస్సీ, ఎస్టీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కొన్ని వర్గాలు వ్యతిరేకిస్తున్నాయి. ఈ నేపధ్యంలోనే నేడు (బుధవారం) భారత్ బంద్కు రిజర్వేషన్ బచావో సంఘర్ష్ సమితి పలుపునిచ్చింది. అయితే ఈ బంద్ ప్రభావం ఢిల్లీలో కనిపించలేదు.ఢిల్లీలోని వ్యాపారులు, ఫ్యాక్టరీ యజమానుల సమన్వయ సంస్థ చాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ (సీటీఐ) చైర్మన్ బ్రిజేష్ గోయల్, అధ్యక్షుడు సుభాష్ ఖండేల్వాల్ మీడియాతో మాట్లాడుతూ తాము కాష్మీరే గేట్, చాందినీ చౌక్, ఖరీ బావోలి, నయా బజార్, చావ్రీ బజార్, సదర్ బజార్, కరోల్ బాగ్, కమ్లా నగర్, కన్నాట్ ప్లేస్, లజ్పత్ నగర్, సరోజినీ నగర్ తదితర ప్రాంతాలకు చెందిన 100కు పైగా మార్కెట్ సంఘాలతో ఈ విషయమై చర్చించామన్నారు. ఈ దరిమిలా తాము బంద్కు మద్దతు ఇవ్వడంలేదని తెలిపారు. ఢిల్లీలోని మొత్తం 700 మార్కెట్లు పూర్తిగా తెరిచి ఉంటాయని, 56 పారిశ్రామిక ప్రాంతాలు కూడా పని చేస్తాయని తెలిపారు.మాయావతి మద్దతుభారత్ బంద్కు బీఎస్పీ అధినేత్రి మాయావతి మద్దతు పలికారు. ఎస్సీ, ఎస్టీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పునివ్వడం వెనుక బీజేపీ కుట్ర దాగున్నదని ఆమె ఆరోపించారు. అందుకే తాము భారత్ బంద్కు మద్దతు ఇస్తున్నామని తెలిపారు. 1. बीएसपी का भारत बंद को समर्थन, क्योंकि भाजपा व कांग्रेस आदि पार्टियों के आरक्षण विरोधी षडयंत्र एवं इसे निष्प्रभावी बनाकर अन्ततः खत्म करने की मिलीभगत के कारण 1 अगस्त 2024 को SC/ST के उपवर्गीकरण व इनमें क्रीमीलेयर सम्बंधी मा. सुप्रीम कोर्ट के निर्णय के विरुद्ध इनमें रोष व आक्रोश।— Mayawati (@Mayawati) August 21, 2024 -
Farmers Protest: ఫిబ్రవరి 16న భారత్ బంద్
నోయిడా: రైతు సమస్యల పరిష్కారమే ప్రధాన అజెండాగా ఫిబ్రవరి 16వ తేదీన భారత్ బంద్ను పాటించనున్నట్లు రైతు సంఘాలు ప్రకటించాయి. పంటలకు కనీస మద్దతు ధర సంబంధ చట్టం అమలుసహా రైతాంగ కీలక సమస్యల పరిష్కారం కోసం దేశవ్యాప్త బంద్ పాటించాలని భారతీయ కిసాన్ యూనియన్(బీకేయూ) జాతీయ అధికార ప్రతినిధి రాకేశ్ తికాయత్ పిలుపునిచ్చారు. మంగళవారం ముజఫర్నగర్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘ సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం)సహా దేశంలోని అన్ని రైతు సంఘాలు ఆ రోజు భారత్ బంద్లో పాల్గొంటాయి. ఆ రోజు రైతులు తమ పొలం పనులకు వెళ్లకండి. ఒక్క రోజు పనులకు సమ్మె పాటించండి. పొలాల్లో అమావాస్య రోజున రైతులు పనులకు వెళ్లరు. అలాగే ఫిబ్రవరి 16 కూడా రైతులకు అమావాస్యే. వర్తకసంఘాలు, రవాణా సంస్థలు ఆరోజు వ్యాపార కార్యకలాపాలు నిలిపేయాలని కోరుకుంటున్నా. దుకాణాలను మూసేయండి. రైతులు, కార్మికులకు మద్దతుగా నిలబడండి’’ అని తికాయత్ విజ్ఞప్తిచేశారు. -
Agneepath Scheme: భారత్ బంద్ పాక్షికమే!
న్యూఢిల్లీ/పట్నా: అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పలువురు ఇచ్చిన భారత్ బంద్ పిలుపునకు సోమవారం పెద్దగా స్పందన లభించలేదు. ముందస్తు చర్యలు, భద్రత నడుమ .. బంద్ పాక్షికంగా సాగింది. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో రైళ్లు, వాహనాల రాకపోకలకు స్వల్పంగా అంతరాయం కలిగింది. యువకులు రోడ్లపై బైఠాయించగా, అదుపులోకి తీసుకున్నారు అంతే. అయితే.. చాలా రాష్ట్రాల్లో బంద్ ప్రభావం పెద్దగా కనిపించలేదు. ఢిల్లీలో భారీగా ట్రాఫిక్ జామైంది. బిహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, కేరళ, అస్సాం, రాజస్తాన్ తదితర రాష్ట్రాల్లో ఇటీవలి అనుభవాల దృష్ట్యా భద్రతను పటిష్టం చేశారు. సున్నితమైన ప్రాంతాల్లో నిషేధాజ్ఞలు విధించారు. దుకాణాలు, వ్యాపార వాణజ్య సంస్థలు యథావిధిగా కార్యకలాపాలు సాగించాయి. అగ్నిపథ్పై నిరసనల, ఆందోళనల కారణంగా.. రైల్వే శాఖ ముందస్తు జాగ్రత్తలు తీసుకుంది. సోమవారం దేశవ్యాప్తంగా 612 రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగినట్లు రైల్వే శాఖ తెలియజేసింది. 602రెళ్లను రద్దు చేసినట్లు తెలిపింది. మంగళవారం కూడా జాగ్రత్తలు పాటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. 24న సంయుక్త కిసాన్ మోర్చా నిరసనలు అగ్నిపథ్ స్కీమ్కు వ్యతిరేకంగా సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం) ఆధ్వర్యంలో ఈ నెల 24న దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతామని భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ తికాయత్ ప్రకటించారు. వాటిలో యువత, పౌర సమాజం ప్రతినిధులు, రాజకీయ పార్టీల నేతలు, కార్యకర్తలు పాలుపంచుకోవాలని కోరారు. దేశవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలు, మండల కేంద్రాల్లో నిరసనలు నిర్వహిస్తామన్నారు. బీకేయూ నేతృత్వంలో 30న తలపెట్టిన ఆందోళన కార్యక్రమాలనూ 24నే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. -
భారత్ బంద్ ఎఫెక్ట్: విద్యా సంస్థలు మూసివేత, పరీక్షలు రద్దు
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే నేడు(సోమవారం) దేశవ్యాప్తంగా భారత్ బంద్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర సంస్థలు, రైల్వే స్టేషన్ల వద్ద రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, గవర్నమెంట్ రైల్వే పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇదిలా ఉండగా.. అగ్నిపథ్ పథకానికి నిరసనగా ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ (AISF) జార్ఖండ్ బంద్కు పిలుపునిచ్చింది. ఈ క్రమంలో జార్ఖండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సోమవారం జార్ఖండ్లోని అన్ని పాఠశాలలు మూసివేస్తున్నట్టు అధికారులు తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న 9, 11 తరగతుల పరీక్షలను కూడా వాయిదా వేసినట్లు అధికారులు ప్రకటించారు. ఈ సందర్బంగా పాఠశాల విద్య, అక్షరాస్యత విభాగం కార్యదర్శి రాజేష్ కుమార్ శర్మ మీడియాతో మాట్లాడుతూ.. కొన్ని సంస్థలు పిలుపునిచ్చిన బంద్ దృష్ట్యా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లు సోమవారం మూసివేయాలని నిర్ణయించాము. పాఠశాల విద్యార్థులకు, ముఖ్యంగా బస్సులో ప్రయాణించే వారికి ఎలాంటి ఇబ్బందులు తల్తెతకుండా ఉండేందుకు తాము ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. మరోవైపు.. అగ్నిపథ్కు వ్యతిరేకంగా బీహార్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న కారణంగా 20జిల్లాల్లో ఇంటర్నెట్ సర్వీసులను నిలిపివేశారు. పంజాబ్లో కూడా శాంతి భద్రతలు అదుపు తప్పకుండా పోలీసుల అలర్ట్ ప్రకటించారు. యూపీలోనూ కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకున్నారు. జైపూర్, నోయిడాలో పోలీసులు 144 సెక్షన్ విధించారు. All schools in Jharkhand will remain closed today in view of the #BharatBandh protests. #AgnipathProtests #AgnipathScheme https://t.co/I2m9R2IM59 — India.com (@indiacom) June 20, 2022 ఇది కూడా చదవండి: ఎమ్మెల్యే లవ్ ఎఫైర్.. సెక్స్ రాకెట్ బట్టబయలు -
మహోద్యమానికి మద్దతివ్వండి
నేడు భారతదేశం రాజకీయ, సామాజిక, ఆర్థిక రంగాలలో తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతు న్నది. డెబ్బై ఐదు ఏళ్ల భారతదేశ స్వాతంత్య్ర సంస్మరణగా ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ పేరుతో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉత్సవాలు జరుగుతున్నాయి. ‘ఆత్మ నిర్భర్ భారత్’ పేరుతో భారతదేశ స్వావలంబన ఆవిష్కరణకు పూను కున్నట్లుగా చెబుతున్నారు. కానీ ఆత్మనిర్భర్ భారత్ బదులు ‘ఆత్మనిర్బల్ భారత్’గా మార్చి వేస్తున్నారు. గత 75 ఏళ్ల నుంచి దేశ ప్రజల కష్టంతో, చెమట చుక్కలతో పెద్దల దార్శనికతతో సంపాదించిన ప్రభుత్వరంగ ఆస్తు లను మొత్తాన్నీ అధికారికంగానే అమ్మకానికి పెట్టారు. బహిరంగంగానే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆహ్వానిస్తున్నారు. ప్రపంచ స్థాయిలోని అన్ని కార్పొరేట్ సంస్థలకు భారతదేశ ప్రభుత్వరంగ సంస్థలను, దేశ సంపదను... ‘ప్రైవేటీకరణ ’, ‘పెట్టుబడుల ఉపసంహరణ’, ‘నేషనల్ మానిటైజేషన్ పైప్లైన్’ పేరుతో అమ్మకానికి పెడు తున్నారు. ప్రపంచంలో ఎన్ని ఆర్థిక సంక్షోభాలు వచ్చినా ప్రభుత్వ రంగ సంస్థల వల్లనే మనదేశం నిలబడగలిగింది. మోదీ ప్రధాని కాకముందే ప్రపంచంలోని 6వ పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఉందనే విషయం మరువరాదు. చేసిన ప్రమాణం ఏమయ్యింది? ‘హై సౌగంధ ముఝే ఇస్ మిట్టీకి, మై దేశ్ నహీ బిక్నా దూంగా’(దేశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అమ్మనివ్వనని దేశమాతపై ప్రమాణం చేసి చెబుతున్నాను) అంటూ నాటకీయ హావభావాలతో మోదీ అధికారంలోకి వచ్చిన కొత్తలో అనేకసార్లు అన్నారు. ఈ రోజు అందుకు భిన్నంగా జరుగుతున్నది. అధికారంలోకి వచ్చిన తర్వాత దేశాన్ని కొద్దిమంది పారిశ్రామిక వేత్తలకు అతి తక్కువ ధరలతో ప్రభుత్వరంగ సంస్థలను అమ్మివేస్తున్నారు. స్వాతంత్య్ర తొలిదినాల్లో భారతదేశంలో కేవలం ఐదు ప్రభుత్వరంగ సంస్థలు రూ. 29 కోట్ల మూలధనంతో ఉండేవి. 2019 మార్చి నాటికి ఆ సంస్థల సంఖ్య 348కి చేరింది. వాటి మూలధనం రూ. 31,17,000 కోట్లయింది. ఇవి కేంద్ర ఖజానాకు రూ. 3,76,000 కోట్లు ప్రతి ఏడాదీ ఆదాయం సమకూరుస్తున్నాయి. ఐతే నీతి ఆయోగ్ సిఫార సులకు అనుగుణంగా 2021–22 బడ్జెట్ను ప్రవేశపెడుతూ నిర్వహణలో ఉన్న 300 ప్రభుత్వరంగ సంస్థలను కేవలం 24 పరిశ్రమలుగా కుదిస్తామని పార్లమెంట్లో ప్రకటన చేశారు. అలాగే రూ. 40 లక్షల కోట్లకు పైగా ఆస్తులున్న 58 బీమా రంగంలో ఉన్న సంస్థలనూ తెగనమ్మే పనిలో ఉంది కేంద్రం. గత ఐదేళ్లలో ఎల్ఐసీ ఒక్కటే రూ. 28,200 లక్షల కోట్ల పెట్టుబడి పెట్టింది. ఎల్ఐసీని భారతదేశ బంగారు బాతుగా అభివర్ణిస్తారు. ఈనాడు ఎల్ఐసీని కూడా పెట్టుబడిదారులకు అప్పగిస్తున్నారు. అలాగే ప్రభుత్వ బ్యాంకుల ఆస్తుల విలువ దాదాపు రూ. 40 లక్షల వేల కోట్లు ఉంటుంది. మోదీ ప్రభుత్వం 28 ప్రభుత్వ బ్యాంకులను విలీనాల ద్వారా 12కు కుదించింది. 1921– 22లో బ్యాంకులకు రూ. 1.58 లక్షల కోట్ల నిర్వహణ (ఆపరేటివ్) నికర లాభాలు వచ్చాయి. ప్రభుత్వానికి వేలాది కోట్ల రూపాయలు డివిడెండ్ పేరుతో బ్యాంకులు చెల్లిస్తున్నాయి. అటువంటి కామధేను లాంటి బ్యాంకులలో మరో ఎనిమిదింటిని ప్రైవేటీకరించి, కేవలం 4 ప్రభుత్వ బ్యాంకులకు తగ్గిస్తారు. పేదవాడి గుండె చప్పుడు అయిన రైల్వే పరిశ్రమలో కూడా ప్రైవేటీకరణ ప్రారంభమైంది. నాలుగు రంగాలే వ్యూహాత్మకమా? 2021–22 కేంద్ర బడ్జెట్లో ప్రవేశపెట్టబడిన నేషనల్ మానిటైజేషన్ పైప్లైన్ పథకం ప్రకారం కేవలం నాలుగు రంగాలను వ్యూహాత్మక రంగాలుగా పేర్కొన్నారు. అవి 1). అణు ఇంధనం, స్పేస్ అండ్ డిఫెన్స్, 2). ట్రాన్స్పోర్టు అండ్ టెలికమ్యూనికేషన్, 3). పవర్, పెట్రోలియం, కోల్, ఖనిజాలు, 4). బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, ఆర్థిక సేవలు. ఈ నాలుగు రంగాలలో మాత్రమే వ్యూహాత్మకంగా అతి తక్కువ వాటాను అంటే 2 నుంచి 3 శాతం మాత్రమే కేంద్ర ప్రభుత్వం కలిగి ఉంటుంది. అలాగే బ్రిటీష్ కాలం నుంచి ఉన్న 44 కార్మిక చట్టాలలోని కీలకమైన 29 చట్టాలను నాలుగు కోడ్లుగా మార్చి, సమ్మెచేయలేని పరిస్థితులు కల్పిస్తున్నారు. న్యాయ సహాయం కూడా అందని విధంగా చేసి ప్రభుత్వరంగ సంస్థల నుంచి ప్రభుత్వ సర్వీసు సెక్టార్ వరకు అన్ని రంగాలలో కార్మికులను రోడ్లపైకి తెస్తున్నారు. అలాగే 2015– 16లో 8.5గా ఉన్న పీఎఫ్ వడ్డీ రేటును 8.1కు తగ్గించడం జరిగింది. దీని ప్రభావం దేశంలో ఉన్న కోట్లాది మంది పెన్షనర్లపై పడుతుంది. కేంద్ర ప్రభుత్వ ప్రైవేటీకరణ వలన ఇకపైన ప్రభుత్వ, ప్రభుత్వరంగ సంస్థల్లో ఉద్యోగాలు ఉండవు. ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు కార్మికులే మిగులుతారు. ప్రైవేటీకరణను గట్టిగా సమర్థించే మాంటెక్ సింగ్ అహ్లూవాలియా సైతం ప్రైవేటీకరణ వలన ఉద్యోగాలు కోల్పోవడం తప్పనిసరిగా జరుగుతుందనిపేర్కొన్నారు. మొత్తంగా దేశంలోని కేవలం ఒక్క శాతం మినహా 140 కోట్ల మంది భవిష్యత్తును పణంగా పెట్టి దేశాన్ని అమ్మకానికి పెట్టిన నరేంద్ర మోదీకీ, ఆయన ప్రభుత్వా నికీ... ఆ అధికారం ఎవరిచ్చారు? (క్లిక్: ఆ ఒప్పందం సఫలం కావాలంటే...) ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆస్తుల అమ్మకాన్ని అడ్డు కోకుంటే ఇప్పటికే ఆకలి సూచీ పట్టికలో 116 దేశాల్లో 101 స్థానంలో ఉన్న భారతదేశం మరింత సంక్షోభంలోకి నెట్టివేయబడుతుంది. ఆకలి చావులతో కూడిన కరవు దేశంగా మారే ప్రమాదం ఉన్నది. ఒక్క శాతం మంది చేతిలో 90 శాతం సంపద పేరుకుపోతే అది అభివృద్ధి కాదు. అంతులేని అసమానతల ప్రతీక! ఈ నేపథ్యంలో దేశంలో ఈ నెల 28, 29 తేదీల్లో రెండు రోజులపాటు జరిగే సార్వత్రిక సమ్మెలో పాల్గొంటున్న కార్మికులకు దేశ ప్రజలు సంపూర్ణ మద్దతు ఇవ్వాలి. దేశాన్ని కాపాడుకోవడానికి అవసరమైతే రైతాంగ తరహా మహా కార్మిక ఉద్యమానికి దేశం సన్నద్ధం కావాలి. (క్లిక్: ఈ విజయం ఎలా సాధ్యమైంది?) - కూనంనేని సాంబశివరావు మాజీ ఎమ్మెల్యే, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి -
అత్యవసర సేవలపై సమ్మె ప్రభావం
న్యూఢిల్లీ: కేంద్ర కార్మిక సంఘాల ఉమ్మడి వేదిక పిలుపు మేరకు సోమ, మంగళవారాల్లో జరగనున్న దేశవ్యాప్త సమ్మెతో అత్యవసర సేవలకు అంతరాయం కలిగేలా కన్పిస్తోంది. రవాణా, బ్యాంకింగ్, రైల్వేలు, విద్యుత్పై ప్రభావం పడనుంది. సమ్మెలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలకు చెందిన 20 కోట్లకు పైగా కార్మికులు పాల్గొంటారని ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి అమర్జీత్ కౌర్ తెలిపారు. వ్యవసాయ, తదితర రంగాల కార్మికులూ పాల్గొంటారన్నారు. బొగ్గు, ఉక్కు, చమురు, టెలికాం, ఆదాయ పన్ను, బ్యాంకులు, బీమా రంగాల కార్మిక సంఘాలు సమ్మె నోటీసులివ్వగా రైల్వే, రక్షణ రంగ సంఘాలు మద్దతు ప్రకటించాయి. ప్రైవేటీకరణ చర్యలను, కార్మిక చట్టాల మార్పులను వెనక్కి తీసుకోవాలన్నది వీటి డిమాండ్. ఉపాధి హామీ పథకానికి కేటాయింపులు పెంచాలని, కాంట్రాక్ట్ సిబ్బందిని రెగ్యులరైజ్ చేయాలని కూడా కోరుతున్నాయి. సమ్మె నేపథ్యంలో జాతీయ గ్రిడ్లో విద్యుత్ సరఫరా నిరంతరాయంగా కొనసాగేలా చూడాలని ప్రభుత్వ శాఖలు, విభాగాలకు కేంద్ర విద్యుత్ శాఖ సూచించింది. వినియోగదారులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని సూచించింది. -
Fact Check: డిసెంబర్ 31 వరకు భారత్ బంద్..?
డిసెంబర్ 31 వరకు కేంద్ర ప్రభుత్వం భారత్ బంద్ ప్రకటించినట్లు ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. కొందరు నిజమో కాదో అని తెలుసుకోకుండా ఇతరులకు ఈ పోస్టుని షేర్ చేస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో ఒక గందరగోళం నెలకొంది. సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ ప్రచారంపై కేంద్ర ప్రభుత్వానికి చెందిన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెక్ టీమ్ స్పందించింది. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెక్ టీమ్ ఈ పోస్ట్ నకిలీదని స్పష్టం చేసింది. "సోషల్ మీడియాలో వైరల్ చిత్రంలో డిసెంబర్ 31 వరకు భారత్ బంద్ ప్రకటించినట్లు పేర్కొన్నారు! కానీ, ఏ లాక్డౌన్కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం అటువంటి ప్రకటన చేయలేదు. దయచేసి అటువంటి తప్పుదోవ పట్టించే చిత్రాలు లేదా సందేశాలను షేర్ చేయవద్దు" అని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) ఫ్యాక్ట్ చెకింగ్ టీమ్ ట్వీట్ చేసింది. దేశంలో ఓమిక్రాన్ వేరియంట్ కేసులు ఎక్కువగా నమోదవతున్న సమయంలో ఈ నకిలీ సందేశం ప్రసారం అవుతోంది. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని నమ్మొద్దని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ కోరింది. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అనేది నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ ఆధ్వర్యంలో నడుస్తున్న వెబ్సైట్. నిజనిర్ధారణ విషయాలతో ప్రజల్లో అవగాహన కల్పిస్తుంటుంది. सोशल मीडिया पर वायरल एक #फर्जी तस्वीर में दावा किया जा रहा है कि 31 दिसंबर तक भारत बंद का ऐलान कर दिया गया है! #PIBFactCheck ▶️ केंद्र सरकार द्वारा #लॉकडाउन के संबंध में ऐसी कोई घोषणा नहीं की गई है। ▶️ कृपया ऐसी भ्रामक तस्वीरों या संदेशों को साझा न करें। pic.twitter.com/BT1Tfxoebr — PIB Fact Check (@PIBFactCheck) December 23, 2021 (చదవండి: జనవరి 1 నుంచి అమలులోకి వచ్చే కొత్త రూల్స్ ఇవే..!) -
భారత్ బంద్కు మిశ్రమ స్పందన
న్యూఢిల్లీ: ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు రైతు చట్టాలకు వ్యతిరేకంగా రైతు సంఘాలు తలపెట్టిన భారత్ బంద్కు మిశ్రమ స్పందన లభించింది. ఉత్తర భారతంలో బంద్ ప్రభావం ఎక్కువగా కనిపించింది. పలు రైళ్లు రద్దు కావడం, రహదారుల దిగ్బంధనం, ధర్నాలు కనిపించాయి. దీంతో దేశంలోని వివిధ ప్రాంతాల్లో సాధారణ జనజీవనం స్తంభించింది. సోమవారం ఉదయం 6 నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరిగిన ఈ బంద్లో ఘర్షణలు జరగలేదు. ఢిల్లీ, పంజాబ్, హరియాణా, పశ్చిమ యూపీతో పాటు కేరళ, బిహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఒడిశాలో బంద్ ప్రభావం కనిపించింది. 40 రైతు సంఘాలతో కూడిన కిసాన్ సంయుక్త మోర్చా ఈ బంద్ను నిర్వహించింది. తమ పిలుపునకు 23కుపైగా రాష్ట్రాల్లో అనూహ్య, చరిత్రాత్మక స్పందన లభించిందని, అవాంఛనీయ సంఘటన జరగలేదని మోర్చా తెలిపింది. రైతు ఆందోళనలు ఆరంభమై 10 నెలలు అవుతున్న వేళ తాము తలపెట్టిన బంద్కు సంపూర్ణ సహకారం లభించిందని తెలిపింది. దేశంలోని ఇతర ప్రాంతాల కన్నా ఉత్తర భారతదేశంలో బంద్ ప్రభావం ఎక్కువగా కనిపించింది. అనేక రైళ్లు ఆలస్యం కావడం లేదా రద్దు కావడం జరిగింది. పలుప్రాంతాల్లో ధర్నాల కారణంగా భారీ ట్రాఫిక్ జామ్లు ఏర్పడ్డాయి. ముఖ్యంగా ఢిల్లీ పరిసర నగరాలపై బంద్ ఎక్కువ ప్రభావం చూపింది. పంజాబ్లో బంద్ అధిక శాతం విజయవంతమైంది. హరియాణాలోని సిర్సా, కురుక్షేత్ర, ఫతేబాద్ రహదారులను రైతులు దిగ్బంధించారు. బంద్కు కాంగ్రెస్, ఆప్, ఎస్పీ, బీఎస్పీ, లెఫ్ట్పార్టీలు, స్వరాజ్ ఇండియా, ఆర్జేడీ మద్దతునిచ్చాయి. బంద్కు మద్దతు ఇవ్వమని టీఎంసీ తెలిపింది, అయితే రైతు ఆందోళనకు మద్దతిస్తామని పేర్కొంది. భారత్ బంద్తో దేశవ్యాప్తంగా 50 రైళ్ల రాకపోకలు ఆలస్యమయ్యాయని రైల్వే అధికారులు చెప్పారు. బంద్ అనంతరం అన్ని సర్వీసులను పునరుద్ధరించామన్నారు. ఢిల్లీ చుట్టుపక్కల రైల్రోకోలు జరిగాయని, దీంతో సుమారు 50 రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. చర్చలే శరణ్యం: తికాయత్ రైతు సమస్యలకు పరిష్కారం కోర్టుల్లో దొరకదని, చర్చలే సమాధానమని రైతు నేత రాకేశ్ తికాయత్ అభిప్రాయపడ్డారు.తమ ఆందోళనలు ఎలా ముగుస్తాయో తెలియదని, కానీ దేశీయ యువత తమతో చేతులు కలిపిందని చెప్పారు. తినే తిండిని మార్కెట్ వస్తువుగా మార్చకుండా ఉండడానికే తాము ఆందోళన చేస్తున్నామన్నారు. చట్టాల ఉపసంహరణతోనే ఈ ఆందోళనలు ముగుస్తాయని స్పష్టం చేశారు. చట్టాల రద్దు, వ్యవసాయ రంగ ప్రైవేటీకరణను ఆపడం, మద్దతు ధరకు చట్టబద్ధమైన హామీ కూడా రైతుల ప్రధాన డిమాండన్నారు. ప్రజలకు ఒక్కరోజు ఇబ్బందులు కలిగిఉండొచ్చని, కానీ రైతుల కోసం మర్చిపోవాలని కోరారు. ఇప్పటివరకు చట్టాలకు సంబంధించి ప్రభుత్వం– రైతు సంఘాల మధ్య 11 రౌండ్ల చర్చలు జరిగాయి. -
TS: ఎక్కడికక్కడ అరెస్టులు.. భారత్ బంద్ ప్రశాంతం
సాక్షి, హైదరాబాద్/ఉప్పల్: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక చట్టాలు, లేబర్ కోడ్ను వ్యతిరేకిస్తూ పిలుపునిచ్చిన భారత్ బంద్ రాష్ట్రంలో ప్రశాంతంగా సాగింది. రాష్ట్రంలో బీజేపీయేతర ప్రతిపక్ష పార్టీలు సోమవారం నిర్వహించిన ఈ ఆందోళన కార్యక్రమం అవాంఛనీయ ఘటనలు లేకుండా ముగిసింది. ఆదివారం రాత్రి నుంచే జోరుగా వర్షం కురుస్తుండటంతో సోమవారం ఉదయం ఆందోళనకారులు, ప్రజలు రోడ్లపైకి వచ్చేందుకు ఇబ్బందిపడ్డారు. పోలీసులు ఉదయం నుంచే అఖిలపక్ష నేతలను గృహ నిర్బంధం చేయడంతోపాటు ఆందోళనకు దిగిన వారిని ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకున్నారు. జాతీయస్థాయిలో 19 ప్రతిపక్ష పార్టీలు పిలుపునిచ్చిన బంద్లో భాగంగా ఉద యం నుంచే కాంగ్రెస్, లెఫ్ట్, టీజేఎస్, తెలంగాణ ఇంటి పార్టీతో పాటు పలు కార్మిక, ప్రజా సంఘాల నాయకులు రాష్ట్రంలోని బస్డిపోల వద్దకు చేరుకుని బస్సులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. వీరిని పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. దీంతో ఉదయం 10 గం. తర్వాత రాష్ట్రంలోని చాలా ప్రాం తాల్లో బస్సుల రాకపోకలు యథావిధిగా సాగా యి. అయితే, ప్రైవేట్ విద్యాసంస్థలు మాత్రం స్వచ్ఛందంగా బంద్ను పాటించాయి. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలను తెరచినా విద్యార్థి సంఘాలు, పలు పార్టీల నేతలు అక్కడకు చేరుకుని మూసివేయించారు. ఉదయం 10 గంటల తర్వాత వాణిజ్య దుకాణాలు యథావిధిగా నడిచాయి. మాల్స్, మార్కెట్లు కూడా పలుచోట్ల ఉదయం నుంచే కార్యకలాపాల్లో నిమగ్నంకాగా, కొన్ని ప్రాంతాల్లో మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఆం దోళనకారులు మూసివేయించారు. రాష్ట్రవ్యాప్తంగా పలు పార్టీలు ర్యాలీలు, ప్రదర్శనలు నిర్వహించా యి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి నిరసనగా నినాదాలు చేశాయి. ఈ బంద్లో పాల్గొన్న ముఖ్య నేతలనూ పోలీసులు అరెస్టు చేసి.. కొంతసేపటి తర్వాత వ్యక్తిగత పూచీకత్తుపై వదిలిపెట్టారు. బంద్లో భాగంగా ప్రతిపక్షాల రాస్తారోకోతో ఖమ్మం బైపాస్ రోడ్డులో బారులు తీరిన వాహనాలు ఎక్కడికక్కడ నిర్బంధం... బంద్ సందర్భంగా పలువురు కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీల నేతలను సోమవారం ఉదయాన్నే గృహ నిర్బంధం చేశారు. ఉప్పల్ బస్డిపో ఎదుట జరిగిన ఆందోళనలో టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఐ నేత అజీజ్పాషా తదితరులు పాల్గొన్నారు. వారిని పోలీసులు అరెస్టు చేశారు. హయత్నగర్ లోని విజయవాడ జాతీయ రహదారిపై టీజేఎస్ నేత ప్రొఫెసర్ కోదండరామ్, సీపీఐ రాష్ట్ర కార్య దర్శి చాడా వెంకట్రెడ్డి, సీపీఎం నాయకులు జూల కంటి రంగారెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు మల్లు రవి, మధుయాష్కీ గౌడ్, మల్రెడ్డి రాంరెడ్డి, న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి గోవర్దన్ తదిత రులు ర్యాలీ నిర్వహించారు. వీరిని అరెస్టు చేసే క్రమంలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. కోదండరాం దుస్తులు చినిగిపోయాయి. శంషాబాద్ వద్ద సీపీఐ నేత నారాయణ, పుల్లూరు టోల్గేట్ వద్ద ఏఐసీసీ కార్యదర్శి సంపత్కుమార్, పెబ్బేరు వద్ద మాజీ మంత్రి చిన్నారెడ్డి, మేడ్చల్ జాతీయ రహదారిపై మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, ముంబై హైవేపై మాజీ మంత్రి దామోదర రాజనర్సింహ, బంజా రాహిల్స్లో ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్కుమార్, తుక్కుగూడ వద్ద ఏఐసీసీ కార్య దర్శి వంశీచందర్రెడ్డి ఆందోళనలో పాల్గొనగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరా బాద్– విజయవాడ, హైదరాబాద్– శ్రీశైలం, హైద రాబాద్–బెంగళూర్ వెళ్లే జాతీయ రహదారులు రాస్తారోకోలతో స్తంభించిపోయాయి. హైదరాబా ద్లో ఆటోలు, క్యాబ్లు, బస్సులు, ఎంఎంటీఎస్, మెట్రో రైళ్లు యథావిధిగా నడిచాయి. పలు ప్రాంతాల్లో బంద్ ఇలా... ►సిద్దిపేట జిల్లాలో బంద్ పాక్షికంగా జరిగింది. పలుచోట్ల ప్రతిపక్షాల కార్యకర్తలు ర్యాలీలు నిర్వహించారు. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ బస్ డిపో వద్ద కాంగ్రెస్, వామపక్ష పార్టీలు ధర్నా నిర్వహించారు. మిరుదొడ్డి మండలం భూంపల్లి చౌరస్తాలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను కాంగ్రెస్ కార్యకర్తలు దహనం చేశారు. ►నల్లగొండ బస్స్టాండ్ ఎదుట బైఠాయించిన అఖి లపక్ష నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ఇంటి పార్టీ అధ్య క్షుడు చెరకు సుధాకర్, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఉమ్మడి నల్లగొండ పరిధి లోని మిర్యాలగూడ, కోదాడ, సూర్యాపేట, హుజూర్నగర్, దేవరకొండ, నకిరేకల్ ప్రాం తాల్లో ఆందోళనకు దిగిన అఖిలపక్ష నేతలను పోలీసులు అరెస్టు చేసి తర్వాత వ్యక్తిగత పూచీకత్తుపై వదిలిపెట్టారు. ►ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా పరిధిలోని నారా యణపేటలో మధ్యాహ్నం వరకు బస్సులు రోడ్డెక్కలేదు. మిగతా మహబూబ్నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, గద్వాల జిల్లాల్లో ఉదయం 10 నుంచే బస్సులు నడిచాయి. పలు షాపులు, హోటళ్లు, వ్యాపార సంస్థలు తెరిచే ఉన్నాయి. ►ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బంద్ సంపూర్ణంగా సాగింది. సోమవారం తెల్లవారుజాము నుంచే అఖిలపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి వాహనాలను అడ్డుకున్నారు. జోరు వర్షంలో సైతం ఖమ్మం ఆర్టీసీ బస్డిపో, బస్టాండ్, మధిర, సత్తుపల్లి, కొత్తగూడెం, మణుగూరు, భద్రాచలం బస్డిపోల ఎదుట బైఠాయించారు. దీంతో మధ్యాహ్నం వరకు ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 610 బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. మధ్యాహ్నం 2 గంటల తర్వాత కొన్ని బస్సులను నడిపారు. ►రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం లో బంద్లో పాల్గొన్న కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీ నా యకులను పోలీసులు అరెస్టు చేశారు. యాచా రం, అబ్దుల్లాపూర్మెట్, ఇబ్రహీంపట్నం, ఆది భట్ల ప్రాంతాల్లో పోలీసులు వారిని అదుపులో కి తీసుకున్నారు. కాంగ్రెస్ నేత మల్రెడ్డి రంగా రెడ్డిని ఉదయమే గృహ నిర్బంధం చేశారు. ►ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో బంద్ ప్రశాం తంగా జరిగింది. నిజామాబాద్ జిల్లా కేంద్రం తో పాటు బోధన్, ఆర్మూర్, భీంగల్ పట్టణాల్లో దుకాణాలు కొంత ఆలస్యంగా తెరిచారు. కాం గ్రెస్, సీపీఐ, సీపీఎం, న్యూడెమోక్రసీ పార్టీలు పట్టణాలు, మండల కేంద్రాల్లో ప్రదర్శనలు చేస్తూ వ్యాపార సముదాయాలను మూసేయిం చారు. మధ్యాహ్నం తరువాత దుకాణాలు, పెట్రోల్ బంక్లు తెరుచుకున్నాయి. ఆ చట్టాలు రద్దు చేయాలి.. ‘ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా దేశాన్ని పెట్టుబడిదారు లకు తాకట్టు పెట్టి తెగన మ్మేందుకు సిద్ధమయ్యారు. రైతు చట్టాలను నిరసిస్తూ నాడు మంత్రి కేటీఆర్ కూడా బంద్లో పాల్గొన్నారు. ఇప్పుడు ఢిల్లీ పిలుపుతో కేసీఆర్ అక్కడ విందులో పాల్గొన్నారు. అందరికి ఉద్యోగాలు వచ్చే వరకు, నోటిఫికేషన్ ఇచ్చే వరకు కేసీఆర్ ఫ్లెక్సీలకు లిక్కర్తో అభిషేకం చేయాలి. ప్రతి బార్ షాపు ముందు కేసీఆర్ బొమ్మ పెట్టాలి’. – టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి మోదీ సర్కార్పై వ్యతిరేకతతో... దేశంలో ఆరు రాష్ట్రాలు బంద్లో పాల్గొంటున్నాయి. రైతు ప్రభుత్వం అని చెప్పు కుంటున్న తెలంగాణ సర్కా ర్ మద్దతు ఇవ్వడం లేదు. ఈ బంద్ ప్రజలను ఇబ్బంది పెట్టడం కోసం కాదు.. మోదీ ప్రభుత్వం మీద వ్యతిరేకతతో ప్రజలే ప్రకటిం చింది. – సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆ అధికారం లేదు... నిరసన హక్కును నియంత్రించే అధికారం తప్ప.. నిరాకరించే అధికారం ప్రభుత్వానికి లేదు. నిరసన ప్రజల హక్కు, దాన్ని ప్రభుత్వం గౌరవించాలని కోర్టు లు తీర్పిచ్చినా సర్కార్ పట్టించుకో వడంలేదు. నిరసనకారులను అరెస్ట్ చేస్తుండటా న్ని చూస్తే కేంద్రంతో రాష్ట్ర సర్కార్ కుమ్మకైనట్లు అర్థమవుతోంది. – టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం ఆ చట్టాలు రైతులకు ఉరితాళ్లు కేంద్ర ప్రభుత్వ రైతు చట్టాలు రైతుల పాలిట ఉరితాళ్లుగా మారుతున్నాయి. ప్రభుత్వం చేస్తున్న రైతు వ్యతిరేక చట్టాలు అదానీ, అంబానీకి బానిసలుగా మార్చేవి మాత్రమే. మోదీకో హటావో.. దేశ్కో బచావో అన్నది ఇప్పుడు అత్యవసరం. – సీపీఐ జాతీయ నేత నారాయణ -
ఏపీ: ‘భారత్ బంద్’ ప్రశాంతం
సాక్షి, అమరావతి: గులాబ్ తుపానుతో భారీవర్షం కురుస్తున్న వేళ పటిష్ట బందోబస్తు మధ్య రాష్ట్రంలో సోమవారం ‘భారత్ బంద్’ ప్రశాంతంగా ముగిసింది. సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు మేరకు జరిగిన దేశవ్యాప్త బంద్లో రాజకీయ పార్టీలు తమ జెండాలను పక్కనబెట్టి రైతు సంక్షేమమే అజెండాగా పాల్గొన్నాయి. జన ప్రయోజనమే తమ ప్రాధాన్యత అని నినదించాయి. రాష్ట్రంలో అధికార వైఎస్సార్సీపీ బంద్కు మద్దతు తెలపడంతో బస్సులు, బడులు బంద్ అయ్యాయి. దారులు మూసుకుపోయాయి. రైళ్లు రద్దయ్యాయి. వాణిజ్య సముదాయాలు, వ్యాపారకేంద్రాలు మధ్యాహ్నం వరకు మూతపడ్డాయి. ముందస్తు హెచ్చరికలతోపాటు భారీవర్షం కూడా తోడవడంతో అత్యవసరమైతే తప్ప జనం రోడ్ల మీదకు రాలేదు. సినీ థియేటర్లలో ఉదయం ఆటలు రద్దయ్యాయి. పాడేరు ఏజెన్సీలో స్వల్ప ఉద్రిక్తత ఏర్పడింది. అంబులెన్స్, డాక్టర్లు.. ఇతర అత్యవసర సేవలకు అంతరాయం కలిగించకుండా శాంతియుతంగా నిరసనలు తెలిపినట్టు సంయుక్త కిసాన్ మోర్చా రాష్ట్ర కమిటీ ప్రకటించింది. వర్షాలను లెక్కచేయకుండా ఉదయం ఏడు గంటలకే వామపక్షాల, కార్మికసంఘాల నేతలు ఆందోళనకారులతో కలిసి విజయవాడ ఆర్టీసీ బస్టాండ్కు చేరుకుని ర్యాలీ నిర్వహించారు. విశాఖ ఉక్కును ప్రైవేట్పరం చేయవద్దని కోరుతూ భారీ ప్రదర్శనలు నిర్వహించి ప్లకార్డులు ప్రదర్శించారు. తిరుపతిలో రైలు పట్టాలపై బైఠాయించి రైళ్ల రాకపోకలను అడ్డుకున్నారు. పోలీసులు జోక్యం చేసుకుని వారిని బయటకు పంపించారు. కేంద్ర ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలను అవలంభిస్తోందంటూ ఆందోళనకారులు నినాదాలతో హోరెత్తించారు. కార్మిక కర్షక మైత్రి, లౌకిక ప్రజాతంత్ర శక్తుల ఐక్యత వర్ధిల్లాలని, సాగురంగాన్ని కార్పొరేట్ సంస్థల నుంచి కాపాడాలని, నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని, పెట్రో ఉత్పత్తుల ధరలు తగ్గించాలని, విశాఖ ఉక్కును ప్రైవేటుపరం చేయవద్దని, లేబర్ కోడ్లను రద్దుచేయాలని, రాష్ట్ర విభజన హామీలను అమలు చేయాలని నినాదాలు చేశారు. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో ప్లకార్డులను ప్రదర్శించారు. భారత్ బంద్కున్న చారిత్రక నేపథ్యం దృష్ట్యా రాజకీయ పార్టీలు అంతర్గత విభేదాలను, వైరుధ్యాలను పక్కనబెట్టి బంద్లో పాల్గొన్నాయి. రైతుసంఘాలు భారత్ బంద్కు పిలుపు ఇచ్చిన నేపథ్యంలో వర్షంలోనే విశాఖలో బంద్ కొనసాగింది. నిరసనకారులు రోడ్లపై బైఠాయించి బంద్లో పాల్గొన్నారు. అన్ని జిల్లాల్లోను బంద్ విజయవంతమైంది. పలుచోట్ల వినూత్నంగా కేంద్ర ప్రభుత్వానికి నిరసనలు తెలిపారు. రైతుల గుండెచప్పుడు ఢిల్లీకి వినిపించడంలో సహకరించినందుకు ధన్యవాదాలని కిసాన్ మోర్చా నాయకులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ బంద్కు బీజేపీ దూరంగా ఉంది. రైతు సంఘాల ఆందోళనకు వైఎస్సార్సీపీ సంఘీభావం – వైఎస్సార్సీపీ రైతు విభాగం అధ్యక్షుడు, వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ ఎం.వి.ఎస్.నాగిరెడ్డి సాక్షి, అమరావతి: రైతు సంఘాల పిలుపు మేరకు సంయుక్త కిసాన్ మోర్చా సోమవారం దేశవ్యాప్తంగా నిర్వహించిన ఆందోళనలకు రైతు పక్షపాత పార్టీగా వైఎస్సార్సీపీ సంఘీభావం ప్రకటించినట్లు ఆ పార్టీ రైతు విభాగం అధ్యక్షుడు, వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ ఎం.వి.ఎస్.నాగిరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మధ్యాహ్నం ఒంటిగంట వరకు స్వచ్ఛందంగా ఆర్టీసీ బస్సులను కూడా నిలిపేసినట్లు తెలిపారు. గతంలో కూడా ఇదే మాదిరిగా దేశవ్యాప్త రైతు సంఘాల ఆందోళనలకు వైఎస్సార్సీపీ సంఘీభావం ప్రకటించినట్లు ఆయన గుర్తుచేశారు. -
తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్న భారత్ బంద్
-
Bharat Bandh: బెంగళూరు డీసీపీ కాలిపై నుంచి దూసుకెళ్లిన కారు
Bharat Bandh Highlights: బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులో భారత్ బంద్ ర్యాలీలో భాగంగా కారులో వెళుతున్న నిరసనకారుడు.. తన కారును డీసీపీ ధర్మేందర్ కుమార్ మీనా పాదాల మీదుగా తీసుకెళ్లాడు. బెంగళూరు సిటీ నార్త్ డివిజన్ డీసీపీ మీనా.. గోరగుంటెపాళ్య వద్ద వాహనాన్ని ఆపడానికి ప్రయత్నిస్తుండగా ఈ సంఘటన జరిగింది. ఈ ఘటన తర్వాత నిరసనకారుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ప్రమాదంలో డీసీపీ కాలుకి గాయలవ్వడంతో ఆసుపత్రికి తరలించారు. ఉత్తర ప్రదేశ్లో యోగి ఆదిత్యానాథ్ ప్రభుత్వం విఫలమైందని భారతీయ కిసాన్ యూనియన్ నాయకుడు రాకేశ్ తికైత్ మండిపడ్డారు. పంటలను కనీస మద్దతు ధరకు విక్రయించడం లేదని విమర్శించారు. యోగి ఆదిత్యనాథ్ తన మ్యానిఫెస్టోలో చెరకు ధరను రూ. 375-రూ. 450 కి పెంచుతానని హామీ ఇచ్చాడని అయితే అతను దానిని రూ. 25 మాత్రమే పెంచారని అన్నారు. పోలీసుల బారికేడ్లను పగలగొట్టిన రైతులు నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా చేపట్టిన భారత్ బంద్ నేపధ్యంలో తమిళనాడు నిర్మానుష్యంగా మారింది. చెన్నైలోని అన్నాసలై ప్రాంతంలో పోలీసులతో ఘర్షణ పడిన రైతులు పోలీసుల బారికేడ్లను పగలగొట్టారు. దీంతో పరిస్థితి చెయ్యి దాటింది. ఆందోళనకారులను పోలీసులు అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు. #WATCH | Tamil Nadu: Protesters agitating against the three farm laws break police barricade in Anna Salai area of Chennai, in support of Bharat Bandh called by farmer organisations today; protesters detained by police pic.twitter.com/iuhSkOeGFV — ANI (@ANI) September 27, 2021 గురుగ్రామ్-ఢిల్లీ సరిహద్దు: రైతు సంఘాలు చేపట్టిన భారత్ బంద్ నేపథ్యంలో దేశ రాజధానిలో ప్రవేశించే వాహనాలను ఢిల్లీ పోలీసులు, పారామిలిటరీ సిబ్బంది తనిఖీ చేస్తుండగా గురుగ్రామ్-ఢిల్లీ సరిహద్దులో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. కేరళ: కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా కేరళలో భారత్ బంద్ కొనసాగుతోంది. రాష్ట్రంలో పలు రోడ్లు నిర్మానుష్యంగా మారాయి. రైతుల నిరసనకు మద్దతుగా.. తిరువనంతపురంలో వ్యాపారులు దుకాణాలు మూసివేశారు. ఎల్డీఎఫ్, యూడీఎఫ్కు అనుబంధంగా ఉన్న కార్మిక సంఘాలు భారత్ బంద్లో పాల్గొన్నాయి. ఢిల్లీ- అమృత్సర్: ఢిల్లీ- అమృత్సర్ జాతీయ రహదారిపై రైతులు నిరసన తెలుపుతున్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా భారత్ బంద్ కొనసాగుతోంది. జాతీయ స్థాయిలో 19 ప్రతిపక్ష పార్టీలు తీసుకున్న నిర్ణయం మేరకు భారత్ బంద్ను విజయవంతం చేసేందుకు బీజేపీయేతర ప్రతిపక్షాలు నడుంబిగించాయి. పంజాబ్- హర్యానా: భారత్ బంద్లో భాగంగా పంజాబ్-హర్యానా సరిహద్దులను మూసివేసి రైతులు నిరసన తెలుపుతున్నారు. ఉదయం 4 గంటల నుంచే సరిహద్దులను వేసివేసినట్లు ఓ రైతు మీడియాతో పేర్కొన్నాడు. ఉత్తరప్రదేశ్: ఘజిపూర్ సరిహద్దులో రైతుల నిరసన కొనసాగుతోంది. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతు సంఘాలు చేపట్టిన భారత్ బంద్ కొనసాగుతోంది. రైతుల నిరసనలతో ఉత్తర్ ప్రదేశ్ నుంచి ఘజిపూర్ వైపు వెళ్లే వాహనాలు నిలిచిపోయాయి. సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టిన నల్ల చట్టాలను రద్దు చేయాలని రైతు సంఘాలు చేపట్టిన భారత్ బంద్ను కొనసాగుతోంది. భారత్ బంద్కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఏపీలోని విజయవాడ బస్టాండ్ ఎదుట వామపక్ష, కాంగ్రెస్ పార్టీల ఆందోళన చేపట్టాయి. కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. వాహానాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. వామపక్ష పార్టీల బంద్కు వ్యాపార వాణిజ్య, విద్యా సంస్థలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. వర్షం సైతం లెక్క చేయకుండా విజయవాడ ఆర్టీసీ బస్టాండ్ వద్ద రైతులకు మద్దతుగా వామపక్ష, కాంగ్రెస్ పార్టీల నాయకులు ఆందోళన చేస్తున్నారు. -
కొనసాగుతున్న భారత్ బంద్
-
భారత్బంద్కు వైఎస్ షర్మిల మద్దతు
సాక్షి, హైదరాబాద్: రైతు చట్టాలను రద్దు చేయాలని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభు త్వం తీసుకొచ్చిన నల్ల చట్టాలకు వ్యతిరేకంగా సోమవారం నిర్వహించనున్న భారత్బంద్కు తమ పార్టీ సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించారు. శనివారం ఈ మేరకు ఆ పార్టీ మీడియా కోఆర్డినేటర్ భరత్రెడ్డి ప్రకటన విడుదల చేశారు. భారత్బంద్ను జయప్రదం చేయాలని పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, వైఎస్సార్ అభిమానులను కోరారు. ఈ క్రమంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న నిరంకుశ విధానాలను ఎండగట్టాలని విజ్ఞప్తిచేశారు. మోసకారి ప్రభుత్వం తల వం చేందుకు తాను పాదయాత్రను చేపట్టబోతున్నట్లు షర్మిల తన ట్విట్టర్లో పేర్కొన్నారు. పేదోడి పొట్టకొట్టే రాబందుల రెక్కలు తుంచేందుకు, ప్రజలను పీడించే పాలకుల భరతం పట్టేందుకు వస్తున్నా.. అని షర్మిల అన్నారు. చదవండి: (నేడే భారత్ బంద్) -
ఆంధ్రప్రదేశ్: నేటి బంద్కు సర్వం సన్నద్ధం
సాక్షి, అమరావతి: కేంద్ర ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని ఆరోపిస్తూ 500కు పైగా రైతు, ప్రజాసంఘాలు సోమవారం తలపెట్టిన భారత్ బంద్కు రాష్ట్రంలో పూర్తి సన్నాహాలు చేసినట్టు సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్.కె.ఎం.) ప్రకటించింది. బంద్కు అధికార వైఎస్సార్సీపీ సహా పలు రాజకీయ పార్టీలు మద్దతు ప్రకటించాయి. కేంద్ర కార్మిక, ఉద్యోగ సంఘాలు, ఇతర ప్రజాసంఘాలు, స్వచ్ఛంద సంస్థలు బంద్లో పాల్గొంటున్నట్టు తెలిపాయి. బంద్కు సహకరిస్తామని రాష్ట్ర మంత్రి పేర్ని నాని తెలిపారు. రాష్ట్రంలో మధ్యాహ్నం వరకు ఆర్టీసీ బస్సులను నిలిపేస్తున్నారు. విద్య, వాణిజ్య, వ్యాపారసంస్థలు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నాయి. సినిమా హాళ్లలో ఉదయం పూట ఆటలు రద్దుచేస్తున్నట్టు సినిమా థియేటర్ల యాజమాన్యాలు ఇప్పటికే నోటీసు బోర్డులు పెట్టాయి. లారీలు, ఆటోలను తిప్పబోమని ఆయా సంస్థలు ప్రకటించాయి. రవాణా పూర్తిగా స్తంభించనున్నందున అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు పెట్టుకోవద్దని ఎస్.కె.ఎం. బాధ్యులు వై.కేశవరావు, రావుల వెంకయ్య, వడ్డే శోభనాద్రీశ్వరరావు తదితరులు విజ్ఞప్తి చేశారు. అన్ని వర్గాల ప్రయోజనాల కోసం జరుగుతున్న ఈ బంద్కు ప్రజలంతా సహకరించాలని కోరారు. రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగేలా వ్యవహరిస్తున్న బీజేపీ ప్రభుత్వానికి రాష్ట్రంలో జరిగే బంద్తోనైనా కనువిప్పు కలగాలని, అందుకుబంద్ సరైన అవకాశమన్నారు. బంద్ ఎందుకంటే.. కేంద్ర ప్రభుత్వం చేసిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దుచేయాలని కోరుతూ 10 నెలలుగా సాగుతున్న పోరాటానికి మద్దతుతోపాటు ఆ చట్టాల రద్దు కోసం, కోట్లాదిమంది కార్మికుల ప్రయోజనాలను కాలరాసేలా తీసుకువచ్చిన లేబర్ కోడ్స్ను రద్దు చేయాలని సంయుక్త కిసాన్ మోర్చా కోరుతోంది. ప్రతి పంటకు కనీస మద్దతు ధరకు చట్టం చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటీకరణను నిలిపివేయాలని, ఉపాధి హామీ కూలీల రోజువారీ వేతనాన్ని పెంచాలని, పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తోంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని పార్లమెంటు సాక్షిగా చెప్పి మాట తప్పడాన్ని నిరసిస్తోంది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను ప్రైవేటుపరం చేయవద్దని నినదిస్తోంది. పోలవరం నిర్వాసితులకు పరిహారం ఇవ్వకుండా జాప్యం చేయడాన్ని విమర్శించింది. బంద్పై ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా రైతు, ప్రజాసంఘాలు విస్తృతంగా ప్రచారం నిర్వహించాయి. అన్ని వర్గాల మద్దతు కూడగట్టాయి. ఈ బంద్కు బీజేపీ మినహా ప్రధాన పార్టీలన్నీ మద్దతునిచ్చాయి. వైఎస్ జగన్ ప్రభుత్వం స్వచ్ఛందంగా మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఆర్టీసీ బస్సులను నిలిపేసింది. ప్రతిపక్ష టీడీపీ తన శ్రేణులను బంద్లో పాల్గొనాలని పిలుపునిచ్చింది. బంద్ను జయప్రదం చేసేందుకు వామపక్షాలు 15 రోజులుగా పలు కార్యక్రమాలను నిర్వహించాయి. నేడు పాఠశాలలకు సెలవు భారత్ బంద్కు మద్దతుగా ఉపాధ్యాయ సంఘాల సూచన మేరకు సోమవారం పాఠశాలలకు సెలవు ప్రకటిస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి సురేష్ తెలిపారు. ఈ సెలవుకు ప్రత్యామ్నాయంగా మరో రోజు పనిదినంగా నిర్వహించాలని విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీచేసినట్లు ఆదివారం ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సివిల్స్ కోచింగ్కు ఎంపిక పరీక్ష వాయిదా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే సివిల్స్ పరీక్షలకు ఉచిత కోచింగ్ ఇచ్చేందుకు సోమవారం జరగాల్సిన ఎంపిక పరీక్షను బంద్ కారణంగా వాయిదా వేసినట్టు ఏపీ స్టడీ సర్కిల్ సంచాలకుడు ఉసురుపాటి వెంకటేశ్వర్లు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇస్తున్న ఈ ఉచిత కోచింగ్ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 3,573 మంది దరఖాస్తు చేశారని, వీరికి సోమవారం నిర్వహించాల్సిన పరీక్షను వాయిదా వేశామని పేర్కొన్నారు. ఏపీపీజీఈసెట్లో నేటి పరీక్షలు వాయిదా భారత్ బంద్ నేపథ్యంలో సోమవారం జరగాల్సిన ఏపీపీజీఈసెట్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు సెట్ చైర్మన్, కన్వీనర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం జియో ఇంజనీరింగ్, జియో ఇన్ఫర్మేటిక్స్, ఫార్మసీ, కంప్యూటర్ సైన్సు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సబ్జెక్టులలో ప్రవేశ పరీక్షలను వాయిదా వేశామని, ఇదే సెట్కు సంబంధించి మంగళ, బుధవారాల్లో జరగాల్సిన పరీక్షలు యథాతథంగా జరుగుతాయని వివరించారు. వార్డు సభ్యులకు శిక్షణ 29 నుంచి.. పంచాయతీ వార్డు సభ్యులకు సోమవారం నుంచి జరగాల్సిన శిక్షణ కార్యక్రమాలను ఉత్తరాంధ్ర తుపాను ప్రభావం, భారత్ బంద్ నేపథ్యంలో 2 రోజులు వాయిదా వేసినట్టు ఏపీ ఎస్ఐఆర్డీ డైరెక్టర్ జె.మురళి తెలిపారు. ఈనెల 29 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఈ శిక్షణ కార్యక్రమాలు ప్రారంభమవుతాయన్నారు. -
నేడే భారత్ బంద్
సాక్షి, హైదరాబాద్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా భారత్ బంద్ జరగనుంది. జాతీయ స్థాయిలో 19 ప్రతిపక్ష పార్టీలు తీసుకున్న నిర్ణయం మేరకు ఈ ఆందోళనను రాష్ట్రంలో విజయవంతం చేసేందుకు బీజేపీయేతర ప్రతిపక్షాలు సిద్ధమయ్యాయి. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో సీపీఎం, సీపీఐ, సీపీఐఎంఎల్(న్యూడెమొక్రసీ), లిబరేషన్, తెలంగాణ జనసమితి, తెలంగాణ ఇంటి పార్టీతో పాటు పలు ప్రజా సంఘాలు ఈ బంద్లో పాల్గొననున్నాయి. సోమవారం ఉదయం నుంచి సాయంత్రం 4 గంటల వరకు బంద్ను విజయవంతం చేసేలా ఆయా పార్టీలు ఇప్పటికే ప్రణాళిక రూపొందించుకున్నాయి. మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో సమన్వయ కమిటీలను ఏర్పాటు చేసుకుని ప్రజాసంఘాలు, పార్టీల అనుబంధ సంఘాల వారీగా సమావేశాలు నిర్వహించాయి. రాష్ట్రంలోని ప్రజలందరూ ఈ బంద్కు స్వచ్ఛందంగా సహకరించాలని ఇప్పటికే పలు పార్టీలు కోరాయి. అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు పెట్టుకోవద్దని, ప్రజల కోసం జరుగుతున్న ఈ బంద్లో అందరూ భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశాయి. బంద్లో పాల్గొనే ముఖ్యనేతలు... ►వరంగల్ హైవేపై బోడుప్పల్ వద్ద టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి. ►హయత్నగర్లో టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ, కాంగ్రెస్ నేతలు మల్లు రవి, మల్రెడ్డి రంగారెడ్డి. ►బెంగళూర్ హైవేపై శంషాబాద్ వద్ద సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్, సీనియర్ ఉపాధ్యక్షుడు వేం నరేందర్రెడ్డి. ►బెంగళూర్ హైవేపై పుల్లూరు టోల్గేట్ వద్ద ఏఐసీసీ కార్యదర్శి సంపత్కుమార్. ►బెంగళూర్ హైవేపై పెబ్బేరు వద్ద మాజీ మంత్రి చిన్నారెడ్డి. ►శ్రీశైలం హైవేపై తుక్కుగూడ వద్ద మాజీ ఎమ్మెల్యే వంశీచందర్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నర్సింహారెడ్డి. కాంగ్రెస్ శాసనసభ్యుల నిరసన... బంద్కు మద్దతుగా కాంగ్రెస్ శాసనసభ్యులు అసెంబ్లీ వరకు నిరసనగా రానున్నారు. ట్యాంక్బండ్ దగ్గరున్న అంబేద్కర్ విగ్రహం నుంచి అసెంబ్లీ వరకు గుర్రపు బండ్లపై వచ్చి శాసనసభ సమావేశాల్లో పాల్గొననున్నారు. పెట్రో ధరలు, నిత్యావస సరుకుల ధరల పెంపుతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి సైకిల్పై అసెంబ్లీకి రానున్నారు. బంద్ను విజయవంతం చేయాలి.. ‘కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా, ప్రజలెదుర్కొంటున్న సమస్యలపై నిర్వహిస్తోన్న భారత్ బంద్ను విజయవంతం చేయాలి. ఈ బంద్లో అఖిలపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనాలి. ప్రజలను భాగస్వాములను చేసి ఆందోళనను సక్సెస్ చేయాలి. కాంగ్రెస్కు చెందిన డీసీసీ అధ్యక్షులు, నియోజకవర్గాల బాధ్యులు, వర్కింగ్ ప్రెసిడెంట్లు, సీనియర్ ఉపాధ్యక్షులు, అన్ని స్థాయిల ప్రజాప్రతినిధులు, అనుబంధ సంఘాల నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొనాలి. ఇతర పార్టీలను సమన్వయం చేసుకుంటూ కార్యక్రమాన్ని ముందుకు నడిపించాలి. అలాగే ఈనెల 30న జిల్లా కలెక్టర్లకు వినతిపత్రాలు సమర్పించాలి’. – టీపీసీసీ చీఫ్ రేవంత్ నేడు బస్సులు యథాతథం... రాష్ట్రంలో సోమవారం బస్సులు య«థావిధిగా నడుస్తాయని అధికారులు పేర్కొన్నారు. ఉద్యోగులంతా విధులకు హాజరవుతారని, సాధారణ రోజుల్లో తరహాలోనే ఆర్టీసీ కార్యకలాపాలు కొనసాగుతాయని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్కు వెళ్లే బస్సుల వేళలను మాత్రం మార్పు చేశారు. ఏపీకి వెళ్లే బస్సులను ఆదివారం సాయంత్రం ఏడు తర్వాత నిలిపేశారు. అయితే 10 ఆర్టీసీ సంఘాలతో కూడిన జేఏసీ మాత్రం సమ్మెకు మద్దతు ప్రకటించింది. అయితే బస్సులను ఆపబోమని, విధులకు హాజరవుతామని జేఏసీ నేత వీఎస్రావు, రాజిరెడ్డి తెలిపారు. -
దేశ హితం కోసం కలిసి ఉద్యమిద్దాం
అవినీతి, దోపిడీ గుణం, అధికార దర్పం తలకెక్కిన నియంతల కబంధహస్తాల నుండి దేశాన్ని కాపాడుకునేందుకు ప్రజలు దండు కడుతున్నారు. బ్రిటిష్ వాళ్ళను తరిమికొట్టిన స్వాతంత్య్ర సంగ్రామం, రజాకార్లను తరిమికొట్టిన తెలంగాణ సాయుధ పోరాటాలే స్ఫూర్తిగా భారత్ బంద్లో పాల్గొనడానికి ముందుకు వస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో 19 రాజకీయ పార్టీలు దేశవ్యాప్త బందుకు పిలుపునిచ్చాయి. దీనికి భారతదేశ రాజకీయాల గతిని మార్చే శక్తి ఉంది. గతంలో ఎన్నో ప్రజా ఉద్యమాలు, నిరసన ప్రదర్శనలు జరిగినప్పటికీ దీనికి ఓ ప్రత్యేకస్థానం ఉంటుంది. ఏడేండ్లలో బీజేపీ దేశాన్ని ఆగం చేసిన తీరూ, జాతీయ ఆస్తులను ఒక్కరిద్దరు బడా పారిశ్రామిక వేత్తలకు కట్టబెట్టిన వైనం, అమలు కాని ఎన్నికల హామీలు, అడ్రస్ లేని అచ్ఛే దిన్, పెరిగిన నిరుద్యోగం, తగ్గిన జీడీపీ, పెగాసస్ గూఢచర్యం, రఫేల్ కుంభకోణం, కరోనా వైఫల్యాలు, రైతుల పాలిట శాపంగా మారిన నల్ల వ్యవసాయ చట్టాలు తదితర ప్రజావ్యతిరేక విధానాల నుండి ఈ దేశాన్ని కాపాడుకోవటానికి కలిసికట్టుగా నడుం బిగిస్తున్న సందర్భమిది. నాడు కాంగ్రెస్ హయాంలో 10 శాతం వృద్ధిరేటు సాధించిన జీడీపీ, ఇపుడు మోదీ ప్రభుత్వ వైఫల్యం వల్ల తిరోగమనంలో 0 శాతం కంటే తక్కువగా నమోదయింది. బంగ్లాదేశ్ కంటే వెనుకబడిన పరిస్థితి. 60% చిన్న మధ్యతరగతి పరిశ్రమలు మూతపడితే వాటిని గాలికి వదిలేసి, 72 వేల కోట్ల రూపాయలు క్యాపిటల్ ఇన్ఫ్యూజన్ కింద కార్పొరేట్ కంపెనీలకు పంచి పెట్టారు. 70 ఏండ్లలో కాంగ్రెస్ దేశాన్ని; భారత రైల్వే, ఎల్ఐసీ, బీఎస్ఎన్ఎల్, భారత్ పెట్రోలియం, ఎయిర్ పోర్టులు, నౌకాశ్రయాల వంటి జాతీయ ఆస్తులను నిర్మిస్తే, మోదీ 7 ఏండ్లలో వాటిని తన అనుయాయులకు అమ్మేస్తున్నాడు. ఎన్నికల సందర్భంగా, యువతకు, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామన్న మాట నిలబెట్టుకోలేదు. పార్లే–జీ బిస్కెట్ తయారీ సంస్థ మూతపడే పరిస్థితి ఏర్పడింది. ఫోర్డ్కార్ల పరిశ్రమ దేశం వదలి పోయింది. పార్లమెంటులో ప్రతిపక్ష పార్టీలు, యువతకు ఉద్యోగాలు కావాలని అడిగితే, అమిత్ షా పకోడీ షాపులు పెట్టుకోవాలని ఉచిత సలహా ఇచ్చారు. మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం పౌరుల జీవితాలలోకి తొంగి చూస్తున్నది. పెగాసస్ అనే సాఫ్ట్వేర్ వాడి దేశంలోని ప్రతిపక్ష పార్టీల నాయకులు, ఎలక్షన్ కమిషన్ మాజీ చీఫ్ కమిషనర్, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కుటుంబ సభ్యులు, సీనియర్ జర్నలిస్టులు, సామాజిక ఉద్యమకారుల ఫోన్లను హ్యాక్ చేస్తున్నారు. హ్యాక్ చేసి, కీలకమైన సమాచారం దొంగిలిస్తున్నారనే అంశంపై, పార్లమెంటు శీతాకాల సమావేశాలు స్తంభించిపోయాయి. మెజారిటీ ప్రజల మద్దతుతో ఏర్పడిన కర్ణాటక, మధ్యప్రదేశ్, రాజస్తాన్ ప్రభుత్వాలను కూల్చి, కాంగ్రెస్ శాసనసభ్యులను చీల్చి, అనైతికంగా బీజేపీ ప్రభుత్వాలను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించారు మోదీ–షా ద్వయం. కర్ణాటక, మధ్యప్రదేశ్లో ఈ కుట్రలకు కాంగ్రెస్ కూటమి అధికారం కోల్పోయింది. కానీ రాజస్తాన్లో బీజేపీ పాచిక పారలేదు. ఒకరిద్దరు పారిశ్రామిక వేత్తలకు అనుకూలంగా వ్యవసాయ చట్టాలను తెచ్చి, రైతులు తమ పంటలకు గిట్టుబాటు ధర నిర్ణయంచుకునే స్వేచ్ఛ లేకుండా చేస్తున్నారు. రైతుల ఉత్పత్తుల వర్తక, వాణిజ్యం (ప్రోత్సాహం, సదుపాయ కల్పన) బిల్లు–2020 సెక్షన్–13 ప్రకారం, ఈ చట్టం అమలు క్రమంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అధికారులు మరియు ఏ ఇతర వ్యక్తులపైనగాని కేసులు వేయరాదు. సెక్షన్–15 ప్రకారం, ఈ చట్టం అమలు క్రమంలో తలెత్తిన వివాదాలు సివిల్ కోర్టు విచారణ పరిధిలోకి రావు. ఈ రెండు నిబంధనలూ రాజ్యాంగ విరుద్ధమైనవి. కాంట్రాక్టు వ్యవసాయం రైతుల స్వేచ్ఛను హరించే యత్నం. తమ గొంతు నొక్కే చట్టాలను రద్దు చేయాలని రైతులు ఢిల్లీ పొలిమేరలలో ఆందోళన చేస్తే, ఆ ఉద్యమాన్ని అణిచి వేసేందుకు కుట్రలు పన్నుతున్నారు. 2014లో ఉన్న ధరలు 2021 వరకు 200 శాతం పెరిగాయి. ప్రపంచంలో ఎక్కడా సాధ్యపడని ఒక వింత మోదీ హయాంలో ఆవిష్కృతమైంది. నిత్యావసరమైన ఉల్లిగడ్డ, సౌకర్యమైన పెట్రోలు, విలాసమైన బీరు... ఈ మూడూ ఒకే ధర రూ.100కు దొరుకుతున్నాయి. మోదీ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైంది. దేశ హితం కోరుకునే పార్టీలు, మేధావులు, కవులు, కళాకారులు, సామాజిక వేత్తలు, ప్రజలు పాల్గొని భారత్ బంద్ను విజయవంతం చేయాలి. అది మన బాధ్యత. కొనగాల మహేష్ వ్యాసకర్త ఏఐసీసీ సభ్యులు ‘ మొబైల్: 9866 776999 (నేడు జరగనున్న ‘భారత్ బంద్’ సందర్భంగా) -
'భారత్ బంద్కు వైఎస్సార్సీపీ సంపూర్ణ మద్దతు': రేపు బస్సులు తిరగవు
సాక్షి, కృష్ణా జిల్లా: వ్యవసాయ చట్టాలు, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణలకు వ్యతిరేకంగా తలపెట్టిన భారత్ బంద్కు వైఎస్సార్సీపీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. బంద్లో భాగంగా 26వ తేదీ అర్ధరాత్రి నుంచి 27వ తేదీ 1 గంట వరకు ఆర్టీసీ బస్సులు నడవవు. ఆ తర్వాత నుండి బస్సులు యధావిధిగా తిరుగుతాయి. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని మంత్రి పేర్ని నాని తెలిపారు. రైతు సంఘాలు శాంతియుతంగా బంద్లో పాల్గొనాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయొద్దని, రైతు చట్టాలను రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తరుపున కేంద్రాన్ని కోరుతున్నాం’ అని పేర్ని నాని విన్నవించారు. చదవండి: (26న ‘గులాబ్’ తుఫాన్.. నేడు, రేపు భారీ వర్షాలు) -
భారత్ బంద్ పాక్షికం
న్యూఢిల్లీ: వివాదాస్పద సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు పిలుపునిచ్చిన భారత్ బంద్ శుక్రవారం పంజాబ్, హరియాణా మినహా మిగతా ప్రాంతాల్లో పాక్షికంగా విజయవంతమైంది. పంజాబ్, హరియాణాల్లో రోడ్డు, రైలు రవాణాను రైతులు అడ్డుకున్నారు. రెండు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో హైవేలను దిగ్బంధించారు. రైళ్లను అడ్డుకున్నారు. ఢిల్లీ సరిహద్దుల్లో నిర్వహిస్తున్న రైతు ఉద్యమానికి 4 నెలలు పూర్తయిన సందర్భంగా రైతు సంఘాల ఉమ్మడి వేదిక ‘సంయుక్త కిసాన్ మోర్చా’ శుక్రవారం ఉదయం 6నుంచి సాయంత్రం 6 గంటల వరకు భారత్ బంద్కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. బంద్ కారణంగా 4శతాబ్ది ఎక్స్ప్రెస్ రైళ్లు రద్దయ్యాయని, 35 ప్యాసెంజర్ రైళ్లను, 40 గూడ్స్ రైళ్లను రైతులు అడ్డుకున్నారని రైల్వే ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. యూపీలోని బల్లియాలో 20 మంది సీపీఐఎంఎల్ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బంద్ ప్రభావం ఢిల్లీపై పెద్దగా లేదు. -
భారత్ బంద్ విజయవంతం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్లో బంద్ విజయవంతమైంది. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ ఢిల్లీలో పోరాడుతున్న రైతుల పిలుపు మేరకు శుక్రవారం భారత్ బంద్ నిర్వహించారు. దీనికి మద్దతుగా ఆంధ్రప్రదేశ్లోనూ బంద్ను తలపెట్టిన పలు ప్రధాన పక్షాలు.. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను నిలుపుదల చేయాలనే ప్రధాన డిమాండ్తో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంపూర్ణ మద్దతు తెలపడంతో పాటు ఈ మేరకు ఆదేశాలు జారీ చేయడంతో ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. బీజేపీ, జనసేన మినహా వైఎస్సార్సీపీ, వామపక్షాలు, టీడీపీ, కాంగ్రెస్, బీఎస్పీ, ఆమ్ ఆద్మీ తదితర పార్టీలు సంఘీభావంగా నిలిచాయి. లారీ అసోసియేషన్, ఉద్యోగ, కార్మిక, విద్యార్థి, వాణిజ్య, వర్తక సంఘాలు స్వచ్ఛందంగా మద్దతు తెలిపి బంద్లో పాలుపంచుకున్నాయి. శుక్రవారం తెల్లవారుజాము నుంచే పలు ప్రాంతాల్లో వైఎస్సార్సీపీ శ్రేణులు, వామపక్ష పార్టీలకు చెందిన నేతలు రోడ్లపై రాస్తారోకో, ధర్నాలతో నిరసన తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని, ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరించే చర్యలు విడనాడాలని, పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని, మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ ఆందోళనకారులు నినదించారు. బంద్ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా సినిమా థియేటర్లు, హోటల్స్, వర్తక, వాణిజ్య సంస్థలు మూతబడ్డాయి. ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీలకు సెలవు ఇచ్చారు. విజయవాడ బస్టాండ్ వద్ద బోసిపోతున్న పోలీస్ కంట్రోల్ రూం సెంటర్ ► విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్టాండ్ (పీఎన్బీఎస్) వద్ద ధర్నా చేపట్టారు. బంద్ సందర్భంగా పలువురు నేతల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీలు, రాస్తారోకోలు నిర్వహించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ► గుంటూరులో వివిధ పార్టీల నేతలు ఆర్టీసీ బస్టాండ్ నుంచి మార్కెట్ సెంటర్, శంకర్ విలాస్ సెంటర్ మీదుగా లాడ్జి సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. ► కర్నూలు కొత్త బస్టాండ్ వద్ద మధ్యాహ్నం తర్వాత కూడా ఆర్టీసీ బస్సులను బయటకు రాకుండా ఆందోళనకారులు అడ్డుకున్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్ వద్ద వామపక్షాలు ఆందోళన చేపట్టాయి. జిల్లా వ్యాప్తంగా ఎనిమిది ఆర్టీసీ డిపోల వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ► అనంతపురం, కడప, చిత్తూరు, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి తదితర జిల్లాల్లో ఆర్టీసీ బస్టాండ్ల వద్ద పలు పార్టీలు, కార్మీక సంఘాల నేతలు ఆందోళనలు నిర్వహించారు. ప్రైవేటు వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. భీమవరంలో బస్సులపై రాళ్లు రువ్విన ఆందోళనకారులు పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో బంద్ సందర్భంగా స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. భీమవరం శివారున ఉన్న తిరుమల విద్యా సంస్థకు బంద్ సందర్భంగా సెలవు ప్రకటించారు. క్లాసులు జరగకపోయినా హాస్టల్లో విద్యార్థులు చదువుకోవడాన్ని గమనించిన భారత విద్యార్థి సమాఖ్య (ఎస్ఎఫ్ఐ) ప్రతినిధులు అక్కడికి చేరుకుని ఆందోళనకు దిగారు. ఈ సమయంలో కొంత వాగ్వాదం జరగడంతో విద్యా సంస్థకు చెందిన బస్సులపై ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. స్థానికులు జోక్యం చేసుకని సర్దుబాటు చేశారు. రాళ్లు రువ్వడంపై కాలేజీ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. తిరుపతిలో గుండు కొట్టించుకుని నిరసన తెలుపుతున్న ఉద్యమకారులు బంద్కు మావోయిస్టు పార్టీ మద్దతు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరిగిన బంద్కు మద్దతు తెలుపుతున్నట్టు మావోయిస్టు పార్టీ కార్యదర్శి గణేష్ ఆడియో విడుదల చేశారు. మావోయిస్టులు ఎప్పుడూ ప్రజల వెంటే ఉంటారని, బంద్కు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ యోచన విరమించుకోవాలని, వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. నినాదాలతో మారుమోగిన విశాఖ సాక్షి, విశాఖపట్నం: విశాఖపట్నంలో జరిగిన పలు నిరసన కార్యక్రమాల్లో ‘విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు’, ‘విశాఖ ఉక్కు – ప్రైవేటీకరణ వద్దు’ అంటూ ఆందోళనకారులు నినదించారు. జిల్లా వ్యాప్తంగా పలు విద్యా సంస్థలు, వాణిజ్య, వర్తక సముదాయాలు, దుకాణాలు మూతపడ్డాయి. నగరంలో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. జిల్లాలో ఆర్టీసీ బస్సులన్నీ మధ్యాహ్నం ఒంటి గంట వరకు డిపోలకే పరిమితమయ్యాయి. శుక్రవారం ఉదయం 6 గంటల నుంచే వైఎస్సార్సీపీ శ్రేణులు, వామపక్ష, ప్రజా సంఘాల నేతలు, ట్రేడ్ యూనియన్ ప్రతినిధులు, సీపీఐ, సీపీఎం, ఏఐటీయూసీ, సీఐటీయూసీ, సీఎఫ్ఐటీయూ, టీఎన్టీయూసీ , డీవైఎఫ్ఐ, ఐవైఎఫ్, ఏపీ మహిళా సమాఖ్య, ఎస్ఎఫ్ఐ, ఐద్వా, ఏఐడీఎస్వో, పీడీఎస్వో నాయకులు నిరసనలో పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో నగర, రూరల్ పరిధిలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు, కార్యకర్తల ఆధ్వర్యంలో పలు చోట్ల రాస్తారోకోలు చేపట్టారు. విశాఖపట్నం మద్దిలపాలెం డిపోలో నిలిచిపోయిన ఆర్టీసీ బస్సులు ► గాజువాక, విశాఖ తూర్పు, విశాఖ పశ్చిమ, విశాఖ ఉత్తర నియోజకవర్గాలలో వైఎస్సార్సీపీ నేతలు ఆందోళన నిర్వహించారు. హెచ్పీసీఎల్ గేటు వద్ద వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ నేతలు నినాదాలు చేస్తూ రాస్తారోకో నిర్వహించారు.మోకాళ్లపై నిరసన తెలిపారు. ► గాజువాక, లంకెలపాలెం, కూర్మన్నపాలెం, షీలానగర్, పెదగంట్యాడ ప్రాంతాల్లో ఆయా వైఎస్సార్సీపీ పార్టీల నేతలు, అఖిలపక్ష కారి్మక సంఘాల నేతలు కేంద్రం విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మద్దిలపాలెం కూడలిలో నిరసన చేపట్టి, వెంకోజిపాలెం వరకు ప్రదర్శన కొనసాగించారు. ► హుకుంపేట, అరకులోయ జంక్షన్, పాడేరు, అనకాపల్లి మెయిన్రోడ్ జంక్షన్లో రాస్తారోకోలు నిర్వహించారు. -
భారత్ బంద్ ప్రశాంతం
సాక్షి నెట్వర్క్: అఖిల భారత కిసాన్ ఫెడరేషన్ (ఏఐకేఎఫ్) పిలుపు మేరకు శుక్రవారం తలపెట్టిన భారత్ బంద్ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ప్రశాంతంగా జరిగింది. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, మహబూబ్నగర్, కరీంనగర్, మెదక్, నల్లగొండ జిల్లాల్లో వివిధ సంఘాలు, రాజకీయ పక్షాల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీలు, ప్రదర్శనలు చేపట్టారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అక్కడక్కడా రోడ్లపై బైఠాయించడమే కాకుండా, పలుచోట్ల దుకాణాలు మూసేయించారు. హన్మకొండలో పీడీఎస్యూ, ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో ప్రధాని మోదీ దిష్టిబొమ్మతో శవయాత్ర నిర్వహించగా.. పోలీసులు అడ్డుకున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బంద్ సందర్భంగా పోలీసులు బస్టాండ్ల వద్ద బందోబస్తు చర్యలు చేపట్టారు. కరీంనగర్లో ఆందోళనలు చేసిన వారిని పోలీసులు అరెస్టు చేసి పీటీసీకి తరలించారు. మెదక్లోనూ రోడ్డుపై బైఠాయించిన వామపక్ష పార్టీల నాయకులను, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. -
ఏపీ: డిపోలకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు
సాక్షి, అమరావతి: సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతు సంఘాలు శుక్రవారం భారత్ బంద్కు పిలుపు నిచ్చాయి. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ ఢిల్లీలో రైతులు ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ బంద్కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంపూర్ణ మద్దతును ప్రకటించింది. ఇదే రోజున ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖ ఉక్కు కార్మికులు కూడా బంద్ చేపట్టారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో అనేక రూపాల్లో నిరసనల కార్యక్రమాలు చేపట్టారు. అంబులెన్స్, అత్యవసర సేవలు మినహా నేడు ఏపీ వ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి. మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత బస్సులు రోడ్డెక్కనున్నాయి. కాగా, వామపక్ష పార్టీలు, కార్మిక సంఘాలు, ఉద్యోగ సంఘాలు బంద్లో పాలుపంచుకుంటున్నాయి. బీజేపీ, జనసేన మినహా మిగిలిన రాజకీయ పార్టీలన్నీ బంద్కు మద్దతు తెలిపాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున బంద్లో పాల్గొన్నాయి. ఈ సందర్భంగా విశాఖ స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఉద్యోగ సంఘాల నేతలు డిమాండ్ చేస్తూ నిరసనలు చేపట్టారు. గ్రేటర్ విశాఖలో సైతం ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ఇక విద్యాసంస్థల యాజమాన్యాలు కూడా పాఠశాలలు, కళాశాలలకు స్వచ్ఛందంగా సెలవులు ప్రకటించాయి. అదే విధంగా వ్యాపార, వాణిజ్య సముదాయాలు సైతం బంద్కు మద్దతు తెలుపుతూ స్వచ్చందంగా మూతపడ్డాయి. మద్దిలపాలెం, గాజువాక జంక్షన్లో వామపక్షాలు నిరసనలు చేపట్టగా.. చిత్తూరు జిల్లాలో సైతం వ్యాపార, వాణిజ్య సముదాయాలు స్వచ్ఛందంగా మూసివేసి విశాఖ స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణ, సాగుచట్టాలను రద్దు చేయాలంటూ నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. బంద్ నేపథ్యంలో డీజీపీ సవాంగ్ అవసరమైన చర్యలు చేపట్టారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూడాలని అన్ని జిల్లాల ఎస్పీలు, నగర పోలీస్ కమిషనర్లను డీజీపీ ఆదేశించారు. చదవండి: నేడే భారత్ బంద్ -
నేడే భారత్ బంద్
న్యూఢిల్లీ: సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతు సంఘాలు శుక్రవారం భారత్ బంద్కు పిలుపునిచ్చాయి. దీనివల్ల దేశవ్యాప్తంగా రవాణా సేవలపై ప్రభావం పడుతుందని అంచనా. అయితే ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలు, పాండిచ్చేరిలో మాత్రం భారత్ బంద్ లేదు. సంయుక్త కిసాన్ మోర్చా ప్రకటన ప్రకారం శుక్రవారం ఉదయం ఆరుగంటల నుంచి సాయంత్రం ఆరుగంటల వరకు దేశవ్యాప్తం గా బంద్ నిర్వహిస్తారు. రవాణా సేవలను బంద్ సందర్భంగా అడ్డుకుంటామని రైతు నేత బల్బీర్ సింగ్ చెప్పారు. పలు ట్రేడ్ యూనియన్లు, సంఘా లు తమ బంద్కు మద్దతు తెలిపాయన్నారు. అంబులెన్స్, ఫైర్ వంటి ఎమర్జెన్సీ సేవలను మాత్రం అడ్డుకోమని తెలిపారు. వ్యవసాయ చట్టాలపై తాము చేస్తున్న ఆందోళన ఆ తేదీకి నాలుగు నెలలు పూర్తవుతున్న నేపథ్యంలో భారత్ బంద్ నిర్వహించాలని నిర్ణయించినట్లు రైతు నేత బూటా సింగ్ తెలిపారు. పాలు, కూరల రవాణాను కూడా అడ్డుకుంటామని కిసాన్ మోర్చా నేత దర్శన్ పాల్ చెప్పారు. మేం పాల్గొనం రైతు సంఘాలు పిలుపునిచ్చిన భారత్ బంద్లో తాము పాల్గొనమని అఖిల భారత ట్రేడర్ల సమాఖ్య ప్రకటించింది. శుక్రవారం మార్కెట్లు తెరిచే ఉంచుతామని సమాఖ్య పేర్కొంది. చర్చల ద్వారానే చట్టాలపై ప్రతిష్ఠంభన వీడుతుందని, అందువల్ల సాగు చట్టాలపై చర్చలు జరపాలని సమాఖ్య కార్యదర్శి ప్రవీణ్ ఖండేల్వాల్ అభిప్రాయపడ్డారు. అయితే కిసాన్ మోర్చా మాత్రం పలు యూనియన్లు, పార్టీలు, సంఘాలు తమకు మద్దతు ఇచ్చినట్లు చెబుతోంది.బంద్ ప్రభావం పంజాబ్, హర్యానాల్లో మాత్రమే ఎక్కువగా ఉంటుందని కిసాన్ మోర్చా సీనియర్ సభ్యుడు అభిమన్యు కోహర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. బంద్లో పాల్గొనాలని ట్రేడర్ల సమాఖ్యలకు రైతులు విజ్ఞప్తి చేశారని, సాగు చట్టాలు ట్రేడర్లపై కూడా పరోక్షంగా నెగెటివ్ ప్రభావం చూపుతాయని చెప్పారు. -
భారత్ బంద్కు సర్కారు మద్దతు
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా ఈనెల 26న రైతు సంఘాలు, విశాఖ ఉక్కు కార్మికులు తలపెట్టిన భారత్ బంద్కు వైఎస్సార్సీపీతో పాటు రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ మద్దతు ప్రకటిస్తోందని రవాణా శాఖ మంత్రి పేర్ని నాని వెల్లడించారు. ఇటు రైతులు, అటు కార్మికుల ఆందోళనకు పూర్తిగా సంఘీభావం తెలియజేస్తున్నామని చెప్పారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్రం చేసిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా రైతు సంఘాలు శుక్రవారం తలపెట్టిన భారత్ బంద్కు వ్యాపార, కార్మిక సంఘాలు, లారీ, గూడ్స్ వాహనాల యాజమానులు, వివిధ వర్గాలు పెద్దఎత్తున మద్దతు ప్రకటించాయన్నారు. అలాగే, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరించొద్దంటూ రాష్ట్ర ప్రభుత్వం, ప్రజలు కేంద్రానికి తమ నిరసనను తెలియజేసినప్పటికీ విశాఖ ఉక్కును ప్రైవేట్పరం చేస్తామని కేంద్రం ప్రకటించిందని మంత్రి పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో.. విశాఖ ఉక్కు కార్మికులు కూడా అదేరోజు తలపెట్టిన భారత్ బంద్కు రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందని పేర్ని నాని చెప్పారు. ఆ రోజు అన్ని వర్గాల వారు శాంతియుతంగా నిరసన తెలపాలని పిలుపునిచ్చారు. కాగా, ఆ రోజు మ.ఒంటి గంట వరకు ఆర్టీసీ బస్సులను నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. టీడీపీ నేతలు ఇసుకను దోచేశారు ఇదిలా ఉంటే.. దండుపాళ్యం బ్యాచ్లా టీడీపీ నేతలు ఐదేళ్ల పాటు వందల కోట్లు విలువచేసే ఇసుకను దోచుకుతిన్నారని మంత్రి నాని మండిపడ్డారు. అప్పట్లో ఇసుక రీచ్లను టీడీపీకి చెందిన దళారులు, నేతల చేతుల్లో పెట్టి, పేద వారిని కనీసం వాటి దగ్గరకు కూడా రానివ్వకుండా దోచుకున్న చరిత్ర చంద్రబాబుదని ఘాటుగా విమర్శించారు. -
26న భారత్ బంద్కు ఏపీ ప్రభుత్వం మద్దతు
సాక్షి, అమరావతి : ఈనెల 26న నిర్వహించే భారత్ బంద్కు ఆంధప్రదేశ్ ప్రభుత్వం తమ మద్దతు ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఈనెల 26న రైతు సంఘాలు భారత్ బంద్ నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో విశాఖ స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా బంద్కు కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ సందర్భంగా మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ.. రైతాంగ, ఉక్కు ఉద్యమాలకు తమ మద్దతు ఉంటుదని తెలిపారు. 26న మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఏపీఎస్ఆర్టీసీ బస్సులు బంద్ ఉంటాయని పేర్కొన్నారు. చదవండి: ‘క్లీన్ ఆంధ్రప్రదేశ్’పై సీఎం జగన్ సమీక్ష -
‘26వ తేదీన రాష్ట్ర బంద్’
గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్): కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కిసాన్ సంయుక్త మోర్చా పిలుపు మేరకు భారత్ బంద్లో భాగంగా ఈ నెల 26న రాష్ట్ర వ్యాప్తంగా బంద్ చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల సమన్వయ సమితి నిర్ణయించింది. సమితి సమావేశం ప్రెస్క్లబ్లో శుక్రవారం జరిగింది. సమితి రాష్ట్ర కన్వీనర్ వడ్డే శోభనాద్రీశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ.. 26న బంద్ను విజయవంతం చేయడానికి 17న విజయవాడలో సన్నాహక సమావేశం జరుపుతున్నట్లు తెలిపారు. 19న వ్యవసాయ మార్కెట్ కమిటీల ముందు నిరసన వ్యక్తం చేయాలని, 15న విశాఖ ఉక్కు పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో జరిగే పోరాటంలో భాగస్వామ్యం కావాలని సమావేశంలో తీర్మానం చేశామన్నారు. సమావేశంలో రైతు సంఘాల నేతలు రావుల వెంకయ్య, వై.కేశవరావు తదితరులు పాల్గొన్నారు. -
'ఉక్కు' పిడికిలి బిగిసింది
సాక్షి,అమరావతి/ఉక్కునగరం(విశాఖ)/పటమట (విజయవాడతూర్పు)/పట్నంబజారు(గుంటూరు): విశాఖ స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలంటూ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం ఆందోళనలు జరిగాయి. అఖిలపక్ష కార్మిక సంఘాల(జేఏసీ) పిలుపు మేరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రాస్తారోకోలు, నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ముఖ్యంగా విశాఖతోపాటు ఉత్తరాంధ్ర జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరంలలో భారీ ఎత్తున ఆందోళనలు కొనసాగాయి. విశాఖలో భారీ రాస్తారోకో.. విశాఖ జాతీయ రహదారిపై కూర్మన్నపాలెం కూడలిలో ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో కార్మికులు శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి రోడ్డుపై బైఠాయించారు. ప్లకార్డులు, బ్యానర్లు ప్రదర్శిస్తూ విశాఖ ఉక్కు–ఆంధ్రుల హక్కు అంటూ నినదించారు. దీంతో లంకెలపాలెం నుంచి బీహెచ్పీవీ వరకు ట్రాఫిక్ స్తంభించింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఈ సందర్భంగా పోలీసులు, కార్మికులకు మధ్య వాగ్వాదంతో ఉద్రిక్తత నెలకొంది. విశాఖ స్టీల్ప్లాంట్ను అమ్మితే మోదీ ప్రభుత్వం మూల్యం చెల్లించుకోక తప్పదని కార్మికులు హెచ్చరించారు. గాజువాక మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ కూడా ఆందోళనలో పాల్గొన్నారు. ► విశాఖపట్నం జిల్లాలోని జీకే వీధి, చోడవరం, పెదబయలు, నక్కపల్లి, కొయ్యూరు, విజయనగరం జిల్లా శృంగవరపుకోట, కొత్తవలస, శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి, టెక్కలి, పలాస ప్రాంతాల్లో నిరసన ప్రదర్శనలు, రాస్తారోకోలు నిర్వహించారు. ► అలాగే అనంతపురం జిల్లా పెనుకొండ, నల్లచెరువు, తనకల్లు, కర్నూలు జిల్లా కోడుమూరు, కృష్ణా జిల్లా విజయవాడ, తిరువూరు, మొవ్వ, తూర్పుగోదావరి జిల్లా కాజులూరు, పశ్చిమగోదావరి జిల్లా భీమవరం, తాడేపల్లిగూడెం, కొయ్యలగూడెం, ప్రకాశం జిల్లా మార్టూరు, ఒంగోలు, వైఎస్సార్ జిల్లా కడప, రాజంపేట తదితర ప్రాంతాల్లోనూ రాస్తారోకోలు, ప్రదర్శనలు, ధర్నాలు జరిగాయి. గుంటూరు జిల్లాలోనూ పలుచోట్ల ఆందోళనలు కొనసాగాయి. ఆయా ప్రాంతాల్లో నిర్వహించిన ఆందోళనల్లో సీపీఎం, సీపీఐ, సీఐటీయూ తదితర కార్మిక సంఘాల నేతలు పాల్గొన్నారు. భారత్ బంద్ పాక్షికం.. పెట్రోల్, డీజిల్ ధరల పెంపు, కొత్త ఈ–వే బిల్లును వ్యతిరేకిస్తూ శుక్రవారం తలపెట్టిన భారత్ బంద్ ప్రభావం ఆంధ్రప్రదేశ్లో పాక్షికంగానే కన్పించింది. అయితే భారత్ బంద్లో భాగంగా నిత్యావసర ధరలను తగ్గించాలని, వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలనే డిమాండ్లతోపాటు విశాఖ ఉక్కు నినాదాన్ని కూడా జోడించి రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఆందోళనలు నిర్వహించారు. భారత్ బంద్ నేపథ్యంలో.. లారీ యజమానుల సంఘం పిలుపు మేరకు రాష్ట్రంలో పలుచోట్ల రహదారులపై వాహనాలు నిలిచిపోయాయి. విజయవాడలోని రామవరప్పాడు, భవానీపురం, ఇబ్రహీంపట్నం, తాడేపల్లిలో లారీలు పెద్దసంఖ్యలో నిలిచాయి. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విజయవాడ బెంజిసర్కిల్ వద్ద ఆందోళన నిర్వహించారు. విశాఖలోని గాజువాక యార్డులో ట్రాన్స్పోర్ట్ లారీలు నిలిచిపోయాయి. గుంటూరు జిల్లాలో 13 వేల లారీలు ఉండగా.. బంద్ కారణంగా 8 వేల లారీలు నిలిచిపోయాయని లారీ అసోసియేషన్ నేతలు తెలిపారు. -
కాచుకున్న కరోనా!
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల పర్వం ముగిసింది. ప్రచారంలో, రోడ్షోలు, సభలు సమావేశాల్లో జనం ఎలాంటి భౌతిక దూరం పాటించకుండా పాల్గొన్నారు. మంగళవారం భారత్బంద్ సందర్భంగా కూడా ధర్నాలతో పాటు ఇతర కార్యక్రమాల్లో జనం కరోనా కాలాన్ని మరిచిపోయారు. లింగోజిగూడ కార్పొరేటర్గా విజయం సాధించిన ఆకుల రమేష్ గౌడ్కు రెండు రోజుల క్రితం కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో ప్రజాప్రతినిధులు, ప్రచారంలో పాల్గొన్న జనానికి కోవిడ్భయం పట్టుకుంది. తమకు కూడా కరోనా సోకి ఉంటుందని జనం గుబులు పడుతున్నారు. అసలే చలికాలం ఆపై జ్వరంతో ఎక్కువ మంది బాధపడుతున్నారు. కార్పొరేటర్కు కరోనా వచి్చందనే వార్త వైరల్ కావడంతో గ్రేటర్లో తిరిగి ఈ వ్యాధి వ్యాప్తి చెందుతోందని ఇటు వైద్య శాఖ అటు సాధారణ జనం భయాందోళనకు గురవుతున్నారు. కేసులు ఇలా.. ⇔ ఎన్నికల ముందు నవంబర్లో రోజుకు సుమారు 100కుపైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మంగళవారం 180 మందికి కరోనా నిర్ధారణ అయింది. ⇔ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వారు క్వారంటైన్లోకి వెళ్లక పోవడం ఆందోళన కల్గిస్తున్న అంశం. దీంతో ఈ సంఖ్య రానున్న మూడు, నాలుగు రోజుల్లో పెరిగే అవకాశం ఉందని వైద్యులు పేర్కొంటున్నారు. ⇔ ఆయా రాజకీయ నాయకులతో వైరస్ సోకే ప్రమాదం పొంచి ఉందని అంటున్నారు. మున్ముందు కేసుల సంఖ్యను నివారించాలంటే ప్రచారంలో పాల్గొన్న ఆయా పారీ్టల నేతలు, కార్యకర్తలు క్వారంటైన్లోకి వెళ్తే మంచిదని సూచిస్తున్నారు. ⇔ వీరంతా వారం రోజుల పాటు క్వారంటైన్లో ఉండాలి. కానీ అవేవీ పట్టనట్లుగా వీరు వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. వీరంతా కచి్చతంగా క్వారంటైన్లో ఉండాలని డైరెక్టర్ ఆఫ్ హెల్త్, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అధికారులు చెబుతున్నారు. సాధారణ జనంతో కలిసి సంచరించడంతో కోవిడ్ వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. సెకండ్ వేవ్ ఎఫెక్ట్ ఉంటుందా? రాష్ట్రానికి సెకండ్ వేవ్ కరోనా ముప్పు పొంచి ఉందని వార్తలు వస్తున్నాయి. దీంతో మరోసారి కోవిడ్ వ్యాపించే ప్రమాదం ఉంది. ప్రచారంలో పాల్గొన్న నాయకులు, కార్యకర్తల ద్వారా వచ్చే అవకాశం ఉందని సమాచారం. ఎన్నికల ప్రచారం ముగిసిన అనంతరం వివిధ రాజకీయ పారీ్టలకు చెందిన నాయకులు, కార్యకర్తలు, నేతలు, అభిమానులతోపాటు ఇతర జిల్లాల నుంచి హైదరాబాద్కు ప్రచారం నిమిత్తం వచి్చనవారు తిరిగి సొంత జిల్లాలు, గ్రామాలకు వెళ్లిపోయారు.ఈ ప్రభావం కూడా మరో వారం రోజుల్లో బయటకు వచ్చే ప్రమాదం ఉందని వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు పేర్కొన్నారు. 18 మందికి పాజిటివ్ ఇటీవల జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్, కౌంటింగ్లో పాల్గొన్న వారిలో బుధవారం 18 మందికి కరోనా సోకినట్లు వైద్యాధికారులు నిర్ధారించారు. పార్టీలు నేతలు, పోలీసులకు సైతం.. గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఓ ఎమ్మెల్యే, ఓ ఎంపీ కుమారుడు, నలుగురు కార్పొరేటర్లు, వారి కుటుంబికులు, అధికారులకు కరోనా వచి్చనట్లు వైద్యాధికారులు వెల్లడించారు. ఎన్నికల విధులు నిర్వర్తించిన ముగ్గురు పోలీస్ అధికారులకు, ఎస్ఆర్నగర్ పీఎస్ పరిధిలో ఆరుగురు సిబ్బందికి రెండోసారి కరోనా వచి్చనట్లు అధికారులు చెబుతున్నారు. దీంతో పోలింగ్, కౌంటింగ్ లో పాల్గొన్న మిగతా ఉద్యోగులు భయాందోళనకు గురవుతున్నారు. -
రైతు వెంటే తెలంగాణ రాష్ట్రం
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతు సంఘాలు పిలుపునిచ్చిన భారత్ బంద్ చెదురు మదురు ఘటనలు మినహా మంగళవారం ప్రశాంతంగా ముగిసింది. దాదాపుగా అన్ని పార్టీలు రోడ్డెక్కి నిరసన తెలిపాయి. సీఎం కేసీఆర్ పిలుపు మేరకు టీఆర్ఎస్ కార్యకర్తలు, ప్రజలు ధర్నాల్లో పాల్గొన్నారు. విపక్ష కాంగ్రెస్, ప్రజాసంఘాలు, ఉద్యోగ, కార్మిక సంఘాలు కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా భారీ ప్రదర్శనలు నిర్వహించాయి. ఉదయం నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా ప్రజారవాణా స్తంభించింది. వివిధ యూనివర్సిటీల పరిధిలో జరగాల్సిన పరీక్షలు వాయిదా పడ్డాయి. ఆర్టీసీ, ప్రైవేటు ట్రాన్స్పోర్టు వాహనాలు రోడ్డెక్కలేదు. రైల్వే సర్వీసులకు, ఆసుపత్రులు, పెట్రోల్ బంకులు తదితర అత్యవసర సర్వీసులకు బంద్ నుంచి మినహాయింపు ఇవ్వడంతో ఎలాంటి ఆటంకం కలగలేదు. కొన్నిచోట్ల ధర్నాలు, వ్యవసాయ చట్టాల విషయంలో టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ నాయకుల మధ్య వాగ్వాదాలు చోటుచేసుకున్నాయి. పోలీసుల జోక్యంతో ఉద్రిక్తతలు చల్లారాయి. పలుచోట్ల వాణిజ్య, వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా మూతబడ్డాయి. మరికొన్నిచోట్ల మాత్రం ఆందోళనకారులు బలవంతంగా మూయించారు. మొత్తంమీద మంగళవారం రాష్ట్రంలో నిర్వహించిన భారత్ బంద్లో చెదురు ముదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా భారత్ బంద్కు మద్దతు ప్రకటించడంతో అన్ని నియోజకవర్గాల్లో మంత్రులు, అన్ని పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు అంతా «ఎక్కడికక్కడ ధర్నాలకు దిగారు. మంత్రులంతా జాతీయ రహదారులను దిగ్బంధించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఉమ్మడి జిల్లాలవారీగా బంద్ ఎలా జరిగిందంటే... హైదరాబాద్ పరిధిలో... రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో మంగళవారం భారత్ బంద్తో జనజీవనం స్తంభించింది. ప్రజారవాణా నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. దూరప్రాంతాల నుంచి రైళ్లలో నగరానికి చేరుకున్న వారు ఇళ్లకు చేరుకోవడం కష్టంగా మారింది. ఎంజీబీఎస్, జేబీఎస్లలో ఉదయం నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ప్రయాణికులు బస్సుల కోసం పడిగాపులు కాశారు. మంత్రి తలసాని సికింద్రాబాద్లో రైతులకు మద్దతుగా నిరసన కార్యక్రమంలో పాల్గొనగా, ఆజంపురాలో హోంమంత్రి మహమూద్ అలీ బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. రంగారెడ్డిలో... జిల్లాలోని షాద్నగర్లో మంత్రి కేటీఆర్ ఆందోళనకు దిగారు. కేంద్రం కార్పొరేట్ శక్తులకు మేలు చేసేలా కొత్త వ్యవసాయ చట్టాలు రూపొందించిందని దుయ్యబట్టారు. మద్దతు ధర అంశాన్ని చట్టంలో ఎక్కడా ప్రస్తావించకపోవడాన్ని తప్పుబట్టారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి మహేశ్వరంలో తుక్కుగూడ వద్ద శ్రీశైలం హైవే వద్ద జరిగిన నిరసనలో పాల్గొన్నారు. వరంగల్లో.. రైతు బిల్లులుకు వ్యతిరేకంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మడికొండలో హైదరాబాద్ రహదారిపై ధర్నా చేశారు. మంత్రి సత్యవతి రాథోడ్, మానుకోట జిల్లా కేంద్రంలో ధర్నా చేశారు. నల్లగొండ జిల్లాలో హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై వందలాది ట్రాక్టర్లతో సూర్యాపేట జిల్లా రైతులు నిరసనకు దిగారు. జనగాం ఎక్స్రోడ్డు వద్ద మంత్రి జగదీశ్రెడ్డి, ఎంపీ లింగయ్య యాదవ్, కేతెపల్లి మండలం కొర్ల పహాడ్ వద్ద ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి రాస్తారోకోలో పాల్గొన్నారు. హుజూర్నగర్లో టీఆర్ఎస్, కాంగ్రెస్ల మధ్య వాగ్వాదం చోటుచేసుకోగా పోలీసులు ఇరు వర్గాలను శాంతింపజేశారు. మహబూబ్నగర్లో.. మహబూబ్నగర్లో జరిగిన నిరసనలో మంత్రి శ్రీనివాస్గౌడ్ పాల్గొని కేంద్రం తీరును తప్పుబట్టారు. ఆలంపూర్ చెక్పోస్టు వద్ద ధర్నాలో మంత్రి నిరంజన్రెడ్డి పాల్గొన్నారు. షాద్నగర్ మార్కెట్ కమిటీ యార్డు వద్ద ఎంపీ రేవంత్ రెడ్డి కార్యకర్తలతో కలిసి నిరసన తెలిపారు. కరీంనగర్లో.. కరీంనగర్ శివారులోని అలుగునూరు వద్ద హైదరాబాద్ హైవేపై మంత్రి గంగుల కమలాకర్ సహా పలువురు సీనియర్ నేతలు నిరసన తెలిపారు. ధర్మారం, చొప్పదండిలో మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. చొప్పదండి వద్ద కాంగ్రెస్ నేత మేడిపల్లి సత్యం అనుచరులతో కలసి మంత్రి కొప్పులను అడ్డగించడంతో ఉద్రిక్తత తలెత్తింది. బస్టాండ్ వద్ద జరిగిన ధర్నాలో టీఆర్ఎస్ కార్యకర్తలు, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్కు మధ్య వాగ్వాదం జరిగింది. కోరుట్ల కార్గిల్ చౌరస్తాలో మొక్కజోన్నలకు మద్దతు ధర కల్పించాలని రైతులు ఆందోళనకు దిగారు. మెదక్లో.. సన్న వడ్లు కొనాలంటూ ధర్నాలు చేస్తున్న బీజేపీ నేతలు.. ముందు కేంద్రం జారీ చేసిన లెవీ సేకరణ చట్టాన్ని రద్దు చేయాలని మంత్రి హరీశ్రావు డిమాండ్ చేశారు. హుస్నాబాద్, తుప్రాన్, గజ్వేల్లో జరిగిన రాస్తోరోకోలో మంత్రి హరీశ్రావు పాల్గొని నిరసన తెలిపారు. ఆదిలాబాద్ జిల్లాలో.. మంత్రి ఇంద్రకరణ్రెడ్డి నిర్మల్ పట్టణంలో బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. జోగు రామన్న బోరాజ్ వద్ద జాతీయ రహదారిపై ధర్నాలో పాల్గొన్నారు. కాంగ్రెస్ నాయకులు కూడా జిల్లా కేంద్రాలు, జాతీర రహదారులపై ధర్నాలు నిర్వహించారు. నిజామాబాద్లో.. కామారెడ్డిలో 44వ జాతీయ రహదారిపై ఎమ్మెల్సీ కవిత, విప్ గంప గోవర్దన్ రాస్తారోకోకు దిగారు. కేంద్రం మద్దతు ధర విషయాన్ని ప్రస్తావించక పోవడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. మంత్రి వేల్పుల ప్రశాంత్రెడ్డి 64వ జాతీయ రహదారిపై ధర్నాలో పాల్గొన్నారు. ఖమ్మం జిల్లాలో.. మంత్రి పువ్వాడ అజయ్ ఖమ్మం పట్టణంలో రాస్తారోకోలో పాల్గొన్నారు. బూర్గంపాడు మండలం కారపాక పట్టణంలో జాతీయ రహదారి ప్రభుత్వ విప్ రేగా కాంతారావు ధర్నాలో పాల్గొన్నారు. పలుచోట్ల చెదురుమదురు ఘటనలు.. భారత్ బంద్కు అనుకూలంగా హైదరాబాద్లో ఆందోళన చేస్తున్న జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ను కొందరు అడ్డుకున్నారు. ఇంతకాలం రైతుల సమస్యలు పక్కనబెట్టి ఇప్పుడు ఆందోళనలు ఎలా చేస్తున్నారని ప్రశ్నించారు. బంద్పై నిలదీసిన ఓ వ్యక్తిని ఎమ్మెల్యే ఆగ్రహంతో నెట్టేడం వివాదాస్పదమైంది. మియాపూర్లో ప్రధాన రహదారులపై పోలీసులు బారికేడ్లు పెట్టడంతో వాటిని తొలగించాలని వాహనదారులు వాగ్వాదానికి దిగారు. ఆదిలాబాద్ జిల్లా గుడి హత్నూర్లో షాపులు తెరిచిన వారితో ఆందోళనకారులు వాగ్వాదానికి దిగారు. హైదరాబాద్లోని పాతబస్తీ పూర్తిగా బంద్ పాటించింది. కొన్ని ప్రాంతాల్లో ఆందోళనకారులకు, వ్యాపారులకు వాగ్వాదం నడిచింది. ఆమనగల్లులో ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ వర్గీయులు బాహాబాహీకి దిగారు. కర్రలు, నీళ్ల సీసాలు విసురుకున్నారు. -
నల్ల చట్టాలు పోవాల్సిందే..
షాద్నగర్ టౌన్, రూరల్: కేంద్ర ప్రభుత్వం రైతుల నెత్తిన నల్ల చట్టాలను రుద్ది, వ్యవసాయ రంగాన్ని పూర్తిగా కార్పొరేట్ శక్తులకు అప్పగించేందుకు కుట్ర పన్నుతోందని మున్సిపల్ శాఖ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. కర్షకులు తమ కడుపులు మాడ్చుకొని.. ఎముకలు కొరికే చలిని లెక్కచేయకుండా ఢిల్లీలో వారం రోజులుగా రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని ఆందోళన చేస్తున్నా కేంద్రం స్పందించడం లేదన్నారు. ఈ మూడు రైతు వ్యతిరేక చట్టాలను కేంద్రం వెనక్కితీసుకునే వరకు టీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన పోరాటం చేస్తుందని కేటీఆర్ స్పష్టం చేశారు. రైతన్నల బాగు కోసం.. వారికి అండగా నిలవాలనే సంకల్పంతో భారత్ బంద్ విజయ వంతానికి సీఎం కేసీఆర్ పిలుపు ఇచ్చారని చెప్పారు. భారత్ బంద్ కార్యక్రమంలో భాగంగా కేటీఆర్ మంగళ వారం రంగారెడ్డి జిల్లా షాద్నగర్ మండల పరిధిలోని బూర్గుల గేట్ వద్ద బెంగళూరు జాతీయ రహదారిపై రైతులతో కలిసి ధర్నా చేశారు. ఈ సందర్భంగా మాట్లా డుతూ.. ఈ చట్టాల పర్యవసానాలపై రైతులకు అవగాహన కల్పించే విధంగా టీఆర్ఎస్ తర ఫున గ్రామ గ్రామాన కార్యక్రమాలు చేపడతామన్నారు. వ్యవసాయం రాష్ట్రాల పరిధిలోని అంశమని, రాష్ట్రాల హక్కును హరించే విధంగా కేంద్రం వ్యవసాయ చట్టా లను చేయ డం సరికాదన్నారు. కేంద్రం బ్లాక్ మెయిలింగ్ రాజకీయా లకు పాల్పడుతోందని, వీటిని మానుకొని రైతుల సంక్షేమానికి పాటు పడాలని కేటీఆర్ హితవు పలికారు. సన్నాల మద్దతు ధరకు కేంద్రమే అడ్డు సన్నధాన్యానికి మద్దతు ధర ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నా... కేంద్ర ప్రభుత్వం అడ్డుతగులుతోందని కేటీఆర్ అన్నారు. రాష్ట్రాలు మద్దతు ధర ఇస్తే కొనుగోళ్లను నిలిపివేస్తామని కేంద్రం నియంత్రణలో పనిచేసే ఎఫ్సీఐ స్పష్టంగా చెబుతోందన్నారు. పంటలకు కనీస మద్దతు ధర ఇవ్వాలని రైతులు కోరుతున్నా కేంద్రం నిమ్మకు నీరె త్తినట్లు వ్యవహరిస్తోందన్నారు. దేశంలోని కోట్లాది మంది రైతుల్లో 85 శాతం చిన్న, సన్నకారు రైతులేనని... వారికి కార్పొరేట్ శక్తులతో కొట్లాడే బలం లేదన్నారు. మార్కెట్ కమిటీలు రద్దు చేస్తామని కేంద్రం చెప్పడం సరికాదన్నా రు. రైతులు ఎక్కడైనా పంటలు అమ్ముకోవచ్చని కేంద్రం చెబుతోందని.. చిన్న, సన్నకారు రైతులు తమ పంటలను మరోచోటికి తరలించి అమ్ముకోవడం సాధ్యమేనా? అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు కేశవరావు, మన్నె శ్రీనివాస్రెడ్డి, మంత్రి శ్రీనివాస్గౌడ్, ఎమ్మెల్యేలు అంజయ్య యాదవ్, లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
హోరెత్తిన 'జై కిసాన్'
న్యూఢిల్లీ/చండీగఢ్: నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు పిలుపునిచ్చిన భారత్ బంద్ విజయవంతమైంది. రైతులు, వారి మద్దతుదారుల దేశవ్యాప్త నిరసన ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా, విజయవంతంగా ముగిసింది. సామాన్యులకు ఇబ్బంది కలగకుండా నాలుగు గంటల పాటు(మంగళవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు) బంద్ నిర్వహించాలన్న రైతు సంఘాల పిలుపునకు ప్రజలు స్వచ్ఛందంగా స్పందించారు. ఢిల్లీ, పంజాబ్, హరియాణా, ఉత్తరప్రదేశ్.. తదితర రాష్ట్రాల్లో బంద్ 100% విజయవంతమైంది. ఒడిశా, మహారాష్ట్ర, రాజస్తాన్, పశ్చిమబెంగాల్, జార్ఖండ్, బిహార్ల్లోనూ బంద్ ప్రభావం అధికంగా కనిపించింది. దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో రైతులకు మద్దతుగా వ్యాపారస్తులు దుకాణాలను మూసి వేశారు. రైల్వే ట్రాక్స్ను, కీలక రహదారులను, చౌరస్తాలను నిరసనకారులు దిగ్బంధించారు. సింఘు వద్ద రైతుల కోసం సిద్ధమవుతున్న ఆహారం బంద్ విజయవంతమైందని, బంద్కు ప్రజలనుంచి లభించిన మద్దతు చూసిన తరువాతైనా తమ డిమాండ్లకు కేంద్రం అంగీకరించాలని రైతు సంఘాల నేతలు పేర్కొన్నారు. బంద్ విజయవంతమైన నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా అనూహ్యంగా నేరుగా రంగంలోకి దిగారు. ఆయన మంగళవారం రాత్రి రైతు సంఘాల నేతలతో ప్రత్యేకంగా సమావేశమై చర్చలు జరిపారు. ‘మరో మార్గం లేదు. వ్యవసాయ చట్టాల రద్దుకు ఒప్పుకుంటారా? లేదా అన్నదే షా ముందు మేం పెట్టే ఏకైక డిమాండ్’ అని షా తో చర్చలకు వెళ్లేముందు రైతు నేత రుద్రు సింగ్ తేల్చి చెప్పారు. ‘సూపర్ బంద్’తో కేంద్ర ప్రభుత్వ కళ్లు, చెవులు తెరుచుకున్నాయని రైతు సంఘం నేతలు వ్యాఖ్యానించారు. ఢిల్లీ సరిహద్దుల్లోని సింఘు వద్ద వారు మీడియాతో మాట్లాడారు. నిరసన కార్యక్రమం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. అయితే, ఢిల్లీ, హరియాణా ప్రజలను ఇబ్బంది పెట్టాలనుకోవడం లేదని, రామ్లీలా మైదానంలో నిరసనలను కొనసాగించేందుకు అభ్యంతరం లేదన్నారు. ఓపెన్ జైలు వంటి బురాడీ గ్రౌండ్కు మాత్రం వెళ్లబోమని స్పష్టంచేశారు. కశ్మిర్ నుంచి కన్యాకుమారి వరకు బంద్ జరిగిందని హరియాణా భారతీయ కిసాన్ యూనియన్ అధ్యక్షుడు గుర్నామ్ సింగ్ వ్యాఖ్యానించారు. రైతుల బంద్ పిలుపునకు కాంగ్రెస్, ఎస్పీ, ఆర్జేడీ, టీఎంసీ, వామపక్షాలు, ఆప్, బీఎస్పీ, ఎన్సీపీ తదితర ప్రధాన ప్రతిపక్ష పార్టీలు మద్దతివ్వడమే కాకుండా, ప్రత్యక్షంగా నిరసనల్లో పాల్గొన్నాయి. ముఖ్యమైన కార్మిక సంఘాలు నల్ల బ్యాడ్జీలతో విధుల్లో పాల్గొంటూనే, విరామ సమయాల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహించాయి. 25 రాష్ట్రాల్లోని దాదాపు 10 వేల ప్రాంతాల్లో బంద్ కొనసాగిందని స్వరాజ్ ఇండియా నేత యోగేంద్ర యాదవ్ తెలిపారు. సింఘు, టిక్రి తదితర ఢిల్లీ సరిహద్దుల్లోని రైతు నిరసన కేంద్రాలు ‘జై కిసాన్’, ‘కిసాన్ ఏక్తా జిందాబాద్’ అనే నినాదాలతో హోరెత్తాయి. టిక్రిలో జరిగిన సభలో సుమారు 2 వేల మంది పాల్గొన్నారు. ఉద్యమం నుంచి దృష్టి మళ్లించేందుకే తమను కొందరు ‘ఖలిస్తానీ’, ‘పాకిస్తానీ’ అంటున్నారని, ఇక్కడ అంతా రైతులమేనని, హిందూ, ముస్లిం, సిఖ్ భేదాలేవీ లేవని వారు స్పష్టం చేశారు. పంజాబ్, హరియాణాల్లో షాపులు, వాణిజ్య సముదాయాలు, పెట్రోల్ బంక్లు మూతపడ్డాయి. పంజాబ్లోని ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, శిరోమణి అకాలీదళ్, ఆప్లు ఈ బంద్కు మద్దతిచ్చిన విషయం తెలిసిందే. రైతులకు మద్దతుగా పంజాబ్లో 50 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు మూకుమ్మడిగా ‘క్యాజువల్ లీవ్’ తీసుకున్నారు. పశ్చిమబెంగాల్లో రైల్వే ట్రాక్లను దిగ్బంధించారు. రహదారులపై ధర్నా చేశారు. అధికార టీఎంసీ బంద్కు మద్దతు ప్రకటించినప్పటికీ.. బంద్లో క్రియాశీలకంగా పాల్గొనలేదు. బెంగాల్లో కాంగ్రెస్, వామపక్ష కార్యకర్తలు బంద్లో చురుగ్గా పాల్గొన్నారు. బిహార్లోని ప్రధాన నగరాలు, పట్టణాల్లో నిరసనకారులు ధర్నా నిర్వహించారు. ఒడిశాలోని రైలు సేవలకు అంతరాయం కలిగింది. భువనేశ్వర్, కటక్, భద్రక్, బాలాసోర్ ప్రాంతాల్లో కాంగ్రెస్, వామపక్షాల కార్యకర్తలు, నిరసన కారులు రైల్వే ట్రాక్లపై కూర్చుని నిరసన తెలిపారు. ఛత్తీస్గఢ్లో వ్యాపారస్తులు షాపులను స్వచ్ఛందంగా మూసివేశారు. మహారాష్ట్రలో అధికార శివసేన– కాంగ్రెస్–ఎన్సీపీ కూటమి మద్దతివ్వడంతో బంద్ విజయవంతంగా ముగిసింది. రైతులకు మద్దతుగా అహ్మద్నగర్ జిల్లాలోని స్వగ్రామం రాలేగావ్ సిద్ధిలో ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే ఒకరోజు నిరహార దీక్ష చేపట్టారు. అస్సాంలో పలు పట్టణాల్లో దుకాణాలను మూసేశారు. తమిళనాడులో డీఎంకే, కాంగ్రెస్, ఇతర మిత్రపక్షాలు నిరసనల్లో పాల్గొన్నాయి. కర్ణాటకలోనూ బంద్ ప్రభావం కనిపించింది. రాజస్తాన్ రాజధాని జైపూర్లో కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య స్వల్ప ఘర్షణ చోటు చేసుకుంది. రైతుల శక్తిని ఈ బంద్ కేంద్రానికి చూపిందని ఆల్ ఇండియా కిసాన్ సభ ప్రధాన కార్యదర్శి హన్నన్ మొల్లా వ్యాఖ్యానించారు. నేడు రాష్ట్రపతితో విపక్ష నేతల భేటీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్తో ప్రతిపక్ష పార్టీల నేతలు నేడు సమావేశం కానున్నారు. ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ సహా విపక్షాలకు చెందిన మొత్తం ఐదుగురు సభ్యుల బృందం బుధవారం సాయంత్రం 5 గంటలకు రాష్ట్రపతిని కలవనున్నారు. కేంద్రం చేసిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ దేశ రాజధాని సరిహద్దుల్లో రైతులు పెద్ద ఎత్తున చేపట్టిన ఆందోళనలు, ఆ చట్టాల్లో రైతులు లేవనెత్తిన అభ్యంతరకర అంశాలను రాష్ట్రపతి దృష్టికి విపక్ష నాయకులు తీసుకెళ్ళనున్నారు. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్తో భేటీ కంటే ముందు విపక్ష నాయకులు చర్చించి తమ సమష్టి వైఖరిని రాష్ట్రపతికి వెల్లడిస్తాయని ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ మంగళవారం ప్రకటించారు. గత 13 రోజులుగా కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ విధానాలకు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్న రైతులు తమ డిమాండ్లను సాధించుకొనే వరకు వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని ఇప్పటికే తేల్చి చెప్పారు. భారత్ బంద్ నిరసన కార్యక్రమాన్ని సైతం చేపట్టారు. వ్యవసాయ సవరణ చట్టాలను పూర్తిగా రద్దు చేయాలని రైతు సంఘాలు పట్టుబడుతున్నాయి. ఇప్పటికే ఐదుసార్లు కేంద్రంతో జరిగిన చర్చలు విఫలం కావడంతో నేడు 11 గంటలకు ఆరో విడత చర్చలు జరుగనున్నాయి. సాగు చట్టాల సవరణలకు కేంద్రం సిద్ధంగా ఉందని, చట్టాలను రద్దు చేయడం అసాధ్యమని కేంద్ర మంత్రులు ఇప్పటికే తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలో నేడు జరిగే చర్చల్లో ప్రభుత్వం వైఖరి మార్చుకోని పక్షంలో ఉద్యమాన్ని తీవ్రం చేస్తా మని రైతు సంఘాల నేతలు హెచ్చరించారు. రాజకీయం చేయొద్దనే.. బంద్కు సంబంధించి నిరసనల్లో ప్రత్యక్షంగా పాల్గొనకూడదని ప్రతిపక్ష నేతలంతా కలిసికట్టుగా ఆలోచించి నిర్ణయం తీసుకున్నామని వామపక్ష నేతలు వెల్లడించారు. రైతు సంఘాలు కూడా ఇదే కోరుకున్నాయన్నారు. అందువల్లనే నిరసన ప్రదేశాల్లో పార్టీ బ్యానర్లను ప్రదర్శించలేదన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం ప్రతిపక్షాలు రైతులకు మద్దతిస్తున్నాయని బీజేపీ విమర్శిస్తున్న విషయం తెలిసిందే. రైతు నిరసనను రాజకీయం చేయకూడదని తాము భావించామని సీపీఎం నేత సీతారాం ఏచూరి పేర్కొన్నారు. ఇది పూర్తిగా రాజకీయాలకు అతీతమైన ఉద్యమమని సీపీఐ నేత డీ రాజా పేర్కొన్నారు. వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ కమిటీ (ఎపీఎంసీ) చట్టం కొన్ని సవరణలతో కొనసాగాలన్నదే తన ఉద్దేశమని, గతంలో కేంద్ర వ్యవసాయ మంత్రిగా కూడా అదే విషయాన్ని స్పష్టం చేశానని ఎన్సీపీ నేత శరద్ పవార్ వివరణ ఇచ్చారు. ఈ విషయమై గతంలో తాను రాసిన లేఖపై బీజేపీ రాజకీయం చేస్తోందన్నారు. రైతు నేతలతో అమిత్ షా చర్చలు రైతు ప్రతినిధులతో హోం మంత్రి అమిత్ షా మంగళవారం రాత్రి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. కేంద్ర మంత్రులతో మరో విడత చర్చలు నేడు జరగనున్న నేపథ్యంలో.. అందుకు ఒక రోజు ముందు హోంమంత్రి కొందరు ఎంపిక చేసిన రైతు ప్రతినిధులతో సమావేశమవడం ప్రాధాన్యత సంతరించుకుంది. రైతు సంఘాల నుంచి 13 మంది నేతలను చర్చలకు ఆహ్వానించారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. వీరిలో పంజాబ్ నుంచి 8 మంది, ఇతర జాతీయ రైతు సంఘాల నుంచి ఐదుగురు ఉన్నారన్నాయి. గతంలో ఐదు విడతలుగా రైతు ప్రతినిధులతో చర్చలు జరిపిన కేంద్ర మంత్రులు నరేంద్ర సింగ్ తోమర్, పియూష్ గోయల్, సోమ్ ప్రకాశ్ కూడా ఈ చర్చల్లో పాల్గొన్నారు. మొదట అమిత్ షా నివాసంలో ఈ చర్చలు జరుగుతాయని భావించారు. కానీ అనూహ్యంగా వేదికను పుసాలోని నేషనల్ అగ్రికల్చరల్ సైన్స్ కాంప్లెక్స్కు మార్చారు. అయితే, మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలన్న డిమాండ్పై రైతు సంఘాల ప్రతినిధులు వెనక్కు తగ్గకపోవడంతో.. చర్చలు అసంపూర్తిగా ముగిసిన విషయం తెలిసిందే. షా తో చర్చలు ముగిసిన అనంతరం.. రైతు ప్రతినిధులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. ప్రభుత్వం సవరణల ప్రతిపాదనతో ముందుకు వచ్చినప్పుడు బుధవారం నాటి చర్చలకు అర్థం లేదని ఒక రైతు నేత అభిప్రాయపడ్డారు. ‘రేపు(బుధవారం) చర్చలు జరిగే అవకాశం లేదు. సవరణలకు మేం సిద్దంగా లేము. చట్టాల రద్దుకు వారు సిద్ధంగా లేరు. ఇక చర్చలకు అర్థమేముంది’ అని ఆయన పేర్కొన్నారు. అయితే, షాతో సమావేశానికి హాజరైన పలువురు ఇతర నేతలు మరో విధంగా స్పందించారు. సవరణలతో పాటు, కనీస మద్దతు ధర విధానానికి స్పష్టమైన హామీ ప్రభుత్వం నుంచి లభిస్తే చాలన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రభుత్వం చెబుతున్న సవరణలను పరిశీలించిన తరువాత భవిష్యత్ కార్యాచరణను నిర్ణయిస్తామని తెలిపారు. ‘చట్టాల రద్దు కుదరదని హోం మంత్రి స్పష్టం చేశారు. ఆ చట్టాలకు ఎలాంటి సవరణలు చేస్తామో రాతపూర్వకంగా రేపు ఇస్తామని చెప్పారు. ఇతర రైతు సంఘాల నేతలతో చర్చించి రేపటి సమావేశానికి హాజరు కావాలో, వద్దో నిర్ణయించుకుంటాం’ అని ఆల్ ఇండియా కిసాన్ సభ ప్రధాన కార్యదర్శి హన్నన్ మోల్లా వివరించారు. ట్రాక్టర్ టు ట్విట్టర్.. అమృత్సర్లో అన్నదాతల ట్రాక్టర్ ర్యాలీ సాగు చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన భారత్ బంద్కు సోషల్ మీడియాలో అనూహ్య మద్దతు లభించింది. నాగళ్లు, ట్రాక్టర్లు, పంటలు ఫోటోలతో ట్విటర్ హోరెత్తిపోయింది. రైతన్నలకు సంఘీ భావంగా నెటిజన్లు మెసేజ్ లతో హోరెత్తించారు. ఆజ్ భారత్ బంద్ హై అన్న హ్యాష్ట్యాగ్ సాయంత్రం వరకు ట్రెండింగ్లోనే ఉంది. స్టాండ్ విత్ఫార్మర్స్, కిసాన్, ఫార్మర్స్ప్రొటెస్ట్, ట్రాక్టర్టు ట్విట్టర్, నోఫార్మర్స్ నోఫుడ్ అన్న హ్యాష్ ట్యాగ్లు వినియోగించారు. బంద్ ప్రభావాన్ని తెలియజేసే ఫొటోలు, నిర్మానుష్యంగా ఉన్న మార్కెట్ యార్డు ఫోటో లను షేర్ చేశారు. భారత్ మ్యాప్కి ఒక నాగలి తాళం వేస్తున్నట్టుగా ఉన్న ఒక చిత్రం ట్విట్టర్లో విస్తృతంగా షేర్ అయింది. ‘మన ఆర్థిక వ్యవస్థలో అన్నీ రిటైల్గా కొనుగోలు చేసి, తన దగ్గరున్న సమస్తాన్ని హోల్సేల్లో అమ్ముకునే ఏకైక వ్యక్తి రైతు... అన్నదాత లేకపోతే మనకి తిండి లేదు. నా సహోదరుడికి అండగా ఉంటా’ అని ఒక నెటిజన్ స్పందిస్తే, ‘మన కడుపులు నింపే అన్నదాతకు బాష్ప వాయువులు, వాటర్ కెనాన్లు, కరకు లాఠీల మోతలు బహుమానమా’ అని మరొకరు ఆవేదన వ్యక్తం చేశారు. రైతన్నలు ట్రెండింగ్లో ఉంటారని ఎవరూ ఊహించలేదని మరి కొందరు కామెంట్లు చేశారు. -
రైతు వెంటే రాష్ట్రం
సాక్షి, అమరావతి/ నెట్వర్క్: కేంద్రం తెచ్చిన వివాదాస్పద వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రైతు సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు మంగళవారం నిర్వహించిన భారత్ బంద్ రాష్ట్రంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా ప్రశాంతంగా ముగిసింది. అన్నదాతకు అండగా తలపెట్టిన బంద్కు పలు రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు, కార్మిక, ఉద్యోగ సంఘాలు మద్దతు పలికాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం కూడా సంఘీభావం ప్రకటించింది. మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రభుత్వ కార్యాలయాలు మూసివేశారు. ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో వామపక్షాలతో పాటు రైతు, కార్మిక సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు రోడ్డుపైకి వచ్చిన ర్యాలీలు, ధర్నాలు వంటి నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. దీంతో ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. విద్యాసంస్థలు, వర్తక వాణిజ్య సంస్థలు స్వచ్చందంగా మూతపడ్డాయి. రాష్ట్ర సరిహద్దులో ట్రాక్టర్లతో నిరసన విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారిపై జగ్గయ్యపేటకు సమీపంలోని రాష్ట్ర సరిహద్దు వద్ద రైతులు ట్రాక్టర్లతో నిరసనకు దిగడంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ నిలిచిపోయింది. విజయవాడ లెనిన్ సెంటర్లో వ్యవసాయ సంఘాల ఐక్య కార్యచరణ కమిటీ నాగళ్లు, గొర్లు వంటి వ్యవసాయ పనిముట్లతో వినూత్న ప్రదర్శన నిర్వహించింది. పండిట్ నెహ్రూ బస్టాండ్ (పీఎన్బీఎస్) ఎదుట వామపక్షాలు ఆందోళన చేపట్టాయి. విశాఖ ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద మానవహారం నిర్వహించాయి. తిరుపతిలోనూ ప్రజలు బంద్ పాటించగా.. తిరుమలకు మినహాయింపు ఇవ్వడంతో తిరుపతి–తిరుమల మధ్య రాకపోకలు యధావిధిగా కొనసాగాయి. గుంటూరు చుట్టుగుంట సెంటర్లో మానవహారం వరి కంకులతో ప్రధాని దిష్టిబొమ్మ దహనం అనంతపురంలో సీపీఐ నాయకులు ఎడ్లబండ్లపై తిరుగుతూ నిరసన తెలియజేశారు. సీపీఎం నాయకులు టవర్క్లాక్ వద్ద రోడ్డుపై కూర్చుని భోజనం చేశారు. తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరంలో వామపక్షాలు, ప్రజాసంఘాలు, ఉపాధ్యాయ సంఘాల నేతలు అంబేడ్కర్ సెంటర్లో ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మపై వరి కంకులు వేసి దహనం చేసి వినూత్నంగా నిరసన తెలిపారు. వ్యవసాయ చట్టాల రద్దుకు డిమాండ్ నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్న సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తదితరులు.. రైతు వ్యతిరేక చట్టాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు, అఖిల భారత కిసాన్ సభ ఉçపాధ్యక్షులు రావుల వెంకయ్య, కౌలు రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, సీపీఐ(ఎంఎల్) లిబరేషన్, న్యూ డెమోక్రసీ, ఏఐటీయూసీ, సీఐటీయూ, ఐద్వా, ఎన్ఎఫ్ఐడబ్ల్యూ, విద్యార్థి, యువజన సంఘాల ప్రతినిధులు నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. టీడీపీ రెండు కళ్ల సిద్ధాంతం ఎప్పుడూ రెండు కళ్ల సిద్ధాంతాన్నే అనుసరించే తెలుగుదేశం పార్టీ భారత్ బంద్ విషయంలోనూ అదే వైఖరిని అవలంబించింది. కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలకు మద్దతు పలికిన టీడీపీ.. మరోవైపు తాము రైతుల పక్షమన్నట్టుగా నమ్మించే ప్రయత్నం చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. విజయవాడ, ఇతర ప్రాంతాల్లో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, పలువురు మాజీ మంత్రులు నిరసన కార్యక్రమాల్లో పాల్గొని వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ మాట్లాడటం విస్మయం కలిగించింది. -
భారత్ బంద్ ఎఫెక్ట్.. రంగంలోకి అమిత్ షా
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ఆందోళనలు తీవ్ర స్థాయికి చేరాయి. రైతు సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు దేశంలోని పలు రాష్ట్రాలు మంగళవారం బంద్ పాటించాయి రైతులకు మద్దతుగా పలు సంఘాలు రోడ్లపైకి వచ్చి నిరసన వ్యక్తం చేశాయి. పలు దఫాలుగా రైతులతో కేంద్రం చర్చలు జరిపినప్పటికీ ఫలితం రాలేదు. దీంతో కేంద్ర హోమంత్రి అమిత్ షా రంగంలోకి దిగారు. రైతు సంఘాల నేతలతో చర్చించేందుకు సిద్ధమయ్యారు. (చదవండి : విజయవంతంగా ముగిసిన భారత్ బంద్) మంగళవారం సాయంత్రం 7 గంటలకు చర్చలకు రావాల్సిందిగా అమిత్ షా నుంచి పిలుపు వచ్చినట్లు రైతు సంఘం నేతలు తెలిపారు. అమిత్ షా నుంచి తనకు ఫోన్ కాల్ వచ్చిందని, చర్చలకు రావాలని ఆయన తమను ఆహ్వానించారని రైతు సంఘం నేత రాకేశ్ చెప్పారు. ఢిల్లీ చుట్టుపక్కల జాతీయ రహదారులపై నిరసనలు తెలుపుతున్న రైతు నేతలందరూ ఈ చర్చలకు హాజరవుతారని చెప్పారు. కొత్త చట్టాలు రద్దు అయ్యేవరకు ఆందోళనలు కొనసాగిస్తామని రైతు సంఘాల నేతలు పేర్కొన్నారు. కాగా, రైతులతో కేంద్రం ఇప్పటి వరకు ఐదు విడతలుగా చర్చలు జరిగాయి. ఈ చర్చల్లో అమిత్ షా పాల్గొనలేదు. భారత్ బంద్ తర్వాత రైతులతో అమిత్ షా సమావేశం కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.ఈ రోజు సాయంత్రం అమిత్ షా తో రైతులు ఏమి మాట్లాడతారు. ఆయన ఏం చెప్తారు అనేది ఆసక్తికరంగా మారింది. సమస్యలను పరిష్కరించడంలో , ప్రతిష్టంభన పరిస్థితిని అధిగమించడంలో ఏ మేరకు ఉపయోగపడుతుంది అనేది వేచి చూడాలి -
భారత్ బంద్లో వీరేరి?
సాక్షి, న్యూఢిల్లీ : రైతు....అనగానే మనకు మదిలో నాగలి పట్టిన లేదా పొలానికి నీరు పట్టేందుకు కాల్వతీస్తున్న రైతన్న మెదలుతాడు. మరి పొలం దున్నే రైతమ్మ కనిపించదా? అంటే కనిపించదనే చెప్పాలి. నాట్లు వేస్తూనో, నాట్లు కడుతూనో వ్యవసాయ కూలీలుగా మాత్రం మహిళలు కనిపిస్తారు. మగవాళ్లు మాత్రమే కష్టపడి వ్యవసాయం చేస్తారనే పాత కాలం నాటి మాటే మన మెదళ్లలో గూడుకట్టుకు పోయింది. కాలక్రమంలో వ్యవసాయం గిట్టుబాటు కాకుండా పోవడంతో మన రైతులు ఉపాధి కోసం పల్లెల నుంచి పట్టణాల బాట పట్టారు. దాంతో వారి భార్యలు, అక్కా చెల్లెళ్లు పొలాల్లో రైతులుగా, రైతు కూలీలుగా మారి పోయారు. ఈ క్రమంలో రైతన్నలకన్నా రైతమ్మలు ఎక్కువయ్యారు. దేశంలో వ్యవసాయ గణాంకాల ప్రకారం 73.2 శాతం మంది మహిళలు వ్యవసాయ రంగంలో పనిచేస్తున్నారు. వారిలో 12.8 శాతం మందికి మాత్రమే సొంతంగా వ్యవసాయ భూములు ఉన్నాయి. వ్యవసాయ భూములు కలిగిన మహిళలకు ప్రభుత్వ సంస్థల నుంచి రుణాలు, సబ్సిడీలు లభించక పోవడం విచిత్రం. వ్యవసాయం చేస్తోన్న ఎక్కువ మంది మహిళలు వారి భర్తల పేరిట గల భూముల్లో పని చేస్తున్నారు. (చదవండి: ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ హౌజ్ అరెస్ట్) పశ్చిమ బెంగాల్లోని ఉత్తర్ దినాజ్పూర్ జిల్లాల్లో మనకు మహిళా రైతులు ఎక్కువగా కనిపిస్తారు. వారంతా రాజ్బన్సీ, నామశుద్రాస్, కపాలీసీ, ఆదివాసీలు పిలిచే ఎస్సీ, ఎస్టీ, ఇతర వెనకబడిన వర్గాలకు చెందిన మహిళలే వ్యవసాయ రంగంలో పనిచేస్తున్నారు. బెంగాల్లో మమతా బెనర్జీ ప్రభుత్వమే ఉన్నప్పటికీ మహిళా రైతుల గురించి ప్రత్యేకంగా ఏమీ పట్టించుకోవడం లేదు. రాజ్గంజ్ పట్టణంలో మహిళల పొలం పనులు తెల్లవారు జామున ఐదు గంటలకే ప్రారంభం అవుతుంది. వారు పొలం దున్నడం నుంచి విత్తనాలు చల్లడం, నీళ్లు పెట్టడం, ఎరువులు, క్రిమి సంహారక మందులు వాడకంతోపాటు మార్కెట్కు వెళ్లి పంటలను అమ్మే వరకు అన్ని విధులు వారే నిర్వహిస్తారు. పశువులు మేపడం, పాలు పిండడం అదనం. ఇక అందరి తల్లుల మాదిరి ఇంటి పనులు, పిల్లల పోషణ బాధ్యతలు వారే నిర్వహిస్తారు. రాత్రి పొద్దెక్కి నిద్రపోయే వరకు వారికి క్షణం తీరిక ఉండదు. పొలం నుంచి ఇంటికి ఇంటి నుంచి పొలానికి తిరగడంలో వారి జీవితం గడచిపోతుంది. అంతటిలాగే ఆ పట్టణంలో కూడా మగవారు, ఆడవారి మధ్య వ్యవసాయ వేతనాల్లో ఎంతో వ్యత్యాసం ఉంది. వ్యవసాయ పనులు చేసే మగ కూలీలకు రోజుకు 250 రూపాయలు, మహిళలకు రోజుకు 150 రూపాయలే చెల్లిస్తున్నారు. ఆ పట్టణంలోని ఎక్కువ మంది మహిళా రైతులు వితంతువులు కాగా, వారి వ్యవసాయ భూములు ఇప్పటికీ వారీ దివంగత భర్తల పేరుతోనే ఉన్నాయి. వారి పేరిట ఆ భూములను బదలాయించమంటూ అధికారులను వేడుకుంటున్నా, ఓట్ల కోసం వచ్చే నేతలకు మొర పెట్టుకుంటున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని వారు వాపోతున్నారు. కొత్తగా తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ మంగళవారం కొనసాగుతున్న భారత్ బంద్ ఆందోళనలో ఎక్కడా మహిళా రైతులు కనిపించడంలేదు. ఎప్పటిలాగే ఆందోళన కార్యక్రమాలను మగవారికి అప్పగించి మహిళా రైతులు పొలం పనుల్లో నిమగ్నమై ఉండవచ్చు. రైతు నేతలతో చర్చోప చర్చలు జరపుతున్న రాజ్యాధికార నేతలు వ్యవసాయ మహిళల తల రాతలను ఇకనైనా పట్టించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
రాహుల్.. కొత్తిమీరకు, మెంతికి తేడా తెలుసా?
గాంధీనగర్: కేంద్రం తీసుకువచ్చిన నూతన చట్టాలకు వ్యతిరేకంగా రైతులు భారత్ బంద్కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీలు, వ్యాపార సంఘాలు రైతులకు మద్దతుగా రోడుపైకి వచ్చి నిరసన తేలుపుతున్నాయి. కానీ గుజరాత్లో మాత్రం భారత్ బంద్ పాటించమని ముఖ్యమంత్రి విజయ్ రూపానీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నేడు ఉత్తర గుజరాత్లోని మెహసానాలో నిర్వహించిన ఓ కార్యక్రమానికి హాజరయ్యారు రూపానీ. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీపై విమర్శలు చేశారు. మెంతి కూరకు, కొత్తిమీరకు తేడా తెలియని రాహుల్ రైతుల గురించి మాట్లాడటం వింతగా ఉందన్నారు. విజయ్ రూపానీ మాట్లాడుతూ.. ‘దేశ ప్రజలు కాంగ్రెస్ పార్టీని, విపక్షాలను తరిమి కొట్టారు. ఇప్పుడు వారు రైతులకు మద్దతు తెలపుతున్నాం అంటూ ప్రజలని తప్పుదోవ పట్టిస్తున్నారు. రాహుల్ ఈ ప్రశ్నకు సమాధానం చెబితే నీకు వ్యవసాయం, రైతుల గురించి ఏ మేరకు అవగాహన ఉందో అందరికి అర్థమవుతుంది. మెంతి కూరకు, కొత్తిమీరకు తేడా తెలుసా నీకు.. సమాధానం చెప్పు’ అంటూ రూపానీ ఎద్దేవా చేశారు. (చదవండి: విశ్వాస పునరుద్ధరణ కీలకం) అంతేకాక నరేంద్ర మోదీ ఏళ్లుగా దేశంలో పరిష్కారం కాకుండా ఉన్న సమస్యలని సాల్వ్ చేస్నున్నారని తెలిపారు రూపానీ. ‘ప్రస్తుతం రైతుల పేరు చెప్పి కాంగ్రెస్ లబ్ది పొందాలని భావిస్తుంది. కానీ అధికారంలో ఉన్నన్ని రోజులు ఆ పార్టీ విద్యుత్, విత్తనాలు, ఎరువులు, కనీస మద్దతు ధర, సాగు నీరు వంటి అంశాల గురించి అస్సలు పట్టించుకోలేదు. బీజేపీ హయాంలో వీటన్నింటిని సాధిస్తుంటే తట్టుకోలేకపోతుంది’ అంటూ రూపానీ విమర్శించారు. -
భారత్ బంద్: ఆ అదృష్టం ఎవరికి రాదు.. కానీ..
సాక్షి, సిద్దిపేట: రైతులకు వ్యతిరేకంగా కేంద్రం తెచ్చిన బిల్లులను వెంటనే రద్దు చేయాలని నేడు రైతులు భారత్ బంద్కు పెలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం రైతులు దేశవ్యాప్తంగా నిరసన, ధర్నాలు చేపట్టారు. ఈ సందర్భంగా సిద్దిపేటలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి హనుమంతారావ్, గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డిలు రైతులకు మద్దతు తెలుపుతూ ప్రజ్ఞాపూర్ రాజీవ్ రహదారిపై బైఠాయించి ధర్నా, రాస్తారోకో చేపట్టారు. అనంతరం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ కండువాలు మోసి పార్టీకి సేవ చేసన నాయకులను కాదని ఇతర పార్టీ నుంచి వచ్చిన రాములమ్మను స్టార్ క్యాంపైనర్గా బాధ్యతలు ఇచ్చామన్నారు. ఆ అదృష్టం ఎవరికి రాదని, కాంగ్రెస్ పార్టీలో కోవర్ట్లు ఉన్నారని, పార్టీ వదిలిపెట్టినప్పుడు మీకు తెలిసిందా? అని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక బిల్లును ఉపసంహరించుకునేంతవరకు కాంగ్రెస్ పార్టీ దేనికైనా సిద్దమే అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు బిల్లు వలన కార్పొరేట్ వ్యవస్థలకు లాభమే కానీ రైతుకు మాత్రం ఉరిశిక్ష వేసినట్లే అని ఆయన వ్యాఖ్యానించారు. -
భారత్ బంద్: సీఎం హౌజ్ అరెస్ట్..
న్యూఢిల్లీ: కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ రైతు సంఘాలు పిలునిచ్చిన ‘భారత్ బంద్’ కొనసాగుతుంది. రైతులకు దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలు, వివిధ వర్గాల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. రైతులకు మద్దతుగా పలు సంఘాలు రోడ్లపైకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ‘భారత్ బంద్’ నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను హౌస్ అరెస్ట్ చేశారు. ఈ మేరకు ఆమ్ ఆద్మీ పార్టీ ట్విటర్లో ఓ పోస్ట్ చేసింది. సింఘా సరిహద్దుల్లో రైతుల ఆందోళనకు మద్దతు తెలిపి వచ్చినప్పటీ నుంచి ఆయనను గృహ నిర్బంధంలో ఉంచినట్టు ఆప్ ఆరోపించింది. కేజ్రీవాల్ నివాసం నుంచి ఎవరూ బయటకు వెళ్లడానికి కానీ, బయటవారు లోనికి ప్రవేశించడానికి కానీ పోలీసులు అనుమతించడం లేదని ఆరోపించింది. ఈ మేరకు ఆప్ లీడర్ సౌరవ్ భరద్వాజ్ ‘ఆయనను బయటకు రానీవ్వడం లేదు.. మమ్మల్ని ఎవరిని లోనికి అనుమతించడం లేదు. నిన్న ముఖ్యమంత్రిని కలవడానికి వెళ్లిన ఎమ్మెల్యేలను పోలీసులు కొట్టారు. పని వారిని కూడా లోనికి వెళ్లనివ్వడం లేదు. ఆయన నివాసం బయట బీజేపీ నాయకులు బైఠాయించారు’ అంటూ ట్వీట్ చేశారు. (మా రాష్ట్రంలో బంద్ పాటించం: సీఎం) No one is allowed to go inside, he is not allowed to come out. MLAs, who had a meeting with CM yesterday, were beaten up by Police when they went to meet him. Workers were not allowed to meet him either. BJP leaders are being made to sit outside his residence: Saurabh Bharadwaj https://t.co/uuz6HrR6xd — ANI (@ANI) December 8, 2020 అయితే ఆప్ వ్యాఖ్యలను ఢిల్లీ పోలీసులు ఖండించారు. కేజ్రీవాల్ను గృహ నిర్భంధంలో ఉంచామని చెప్పడం అవాస్తమని అన్నారు. తాము ఆప్, ఇతర పార్టీల మధ్య ఘర్షణ తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నట్టుగా తెలిపారు. ఈ క్రమంలోనే ట్విటర్లో కేజ్రీవాల్ నివాసం వద్ద ఎలా ఉందో చూడండి అని ఓ ఫొటోను పోస్ట్ చేసింది.దీనిపై ఆమ్ ఆద్మీ పార్టీ కూడా స్పందించింది. పోలీసులకు, ఆప్ ఎమ్మెల్యేలకు మధ్య వాగ్వాదం జరుగుతున్న ఓ వీడియోను పోస్ట్ చేసిన ఆప్.. ఆధారాలను తారుమారు చేయవద్దని కోరింది. ఈ వీడియో ఏమిటో చెప్పాల్సిందిగా పోలీసులను ప్రశ్నించింది. తమ ఎమ్మెల్యేలను సీఎం కేజ్రీవాల్ను కలవడానికి అనుమతించకుండా ఎందుకు లాగివేస్తున్నారో చెప్పాలని ప్రశ్నించింది. (చదవండి: పాత చట్టాలతో కొత్త శతాబ్దం నిర్మించలేం) Important : BJP's Delhi Police has put Hon'ble CM Shri @ArvindKejriwal under house arrest ever since he visited farmers at Singhu Border yesterday No one has been permitted to leave or enter his residence#आज_भारत_बंद_है#BJPHouseArrestsKejriwal — AAP (@AamAadmiParty) December 8, 2020 ఇక, సోమవారం రోజున సింఘా సరిహద్దుల్లో నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న రైతులను క్రేజ్రీవాల్ కలిశారు. రైతుల డిమాండ్లు సమ్మతమైనవేనని, వారి డిమాండ్లకు మద్దతు ప్రకటిస్తున్నామని చెప్పారు. కనీస మద్దతు ధర అంశాన్ని వ్యవసాయ చట్టాల్లో చేర్చాల్సిందిగా ఆప్ పార్లమెంట్లో కేంద్రాన్ని కోరిన విషయన్ని ఆ పార్టీ నేతలు గుర్తుచేస్తున్నారు. -
తెలుగు రాష్ట్రాల్లో భారత్ బంద్ ప్రభావం
-
భారత్ బంద్ సందర్భంగా కరీంనగర్లో ఉద్రిక్తత
-
చట్టాలను వెనక్కి తీసుకోకపోతే ఆందోళన ఉధృతం
-
‘పీసీసీ కోసం సీరియస్గా ట్రై చేస్తున్నా’
సాక్షి, హైదరాబాద్: పీసీసీ చీఫ్ పదవి కోసం తాను సీరియస్గా ట్రై చేస్తున్నానని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి తేల్చిచెప్పారు. సోమవారం గాంధీభవన్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ రైతులకు నష్టం చేసే చట్టాలను బీజేపీ తీసుకొచ్చిందని, రైతులకు మద్దతుగా నేటి బంద్లో కాంగ్రెస్ పార్టీ పాల్గొంటుందని తెలిపారు. వ్యవసాయ బిల్లు పార్లమెంట్లో పెట్టినప్పుడే సోనియాగాంధీ, కాంగ్రెస్ ఎంపీలు వ్యతిరేకించారని గుర్తుచేశారు. బీజేపీ తపన రాజకీయాల కోసం తప్ప ప్రజల కోసం కాదన్నారు. రైతులను మోసం చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై పోరాటం కొనసాగుతుందని చెప్పారు. మంగళవారం సంగారెడ్డి హైవేను రెండు గంటలు దిగ్బంధం చేస్తామన్నారు. (చదవండి: కాంగ్రెస్ ఓటమి.. రేవంత్ వర్గంలో ఆశలు) -
విజయవంతంగా ముగిసిన భారత్ బంద్
భారత్ బంద్ విజయవంతంగా ముగిసింది. రైతులకు వివిధ రాజకీయ పార్టీలు మద్దతుగా నిలిచాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. బంద్కు స్వచ్ఛందంగా సహకరించింది. తెలంగాణలోనూ బంద్ విజయవంతంగా సాగింది. తెలంగాణ రోడ్లపై టీఆర్ఎస్, కాంగ్రెస్లు నిరసన తెలిపాయి. రైతులకు పూర్తి అండగా నిలుస్తామని పలు పార్టీల నేతలు పేర్కొన్నారు. రైతు మెడకు ఉరి తాడుగా మారిన చట్టాలను రద్దు చేయాలి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలన్న డిమాండ్తో రైతు సంఘాలు ఇచ్చిన భారత్ బంద్ పిలుపులో భాగంగా పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో జాతీయ రహదారిని దిగ్బంధం చేయడం జరిగింది. ఈ సందర్బంగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ.. రైతు మెడకు ఉరి తాడుగా మారిన వ్యవసాయ చట్టాలను రద్దు చేసేవరకు పోరాటం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు భూపాల్ రెడ్డి, నియోజకవర్గానికి చెందిన ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ధర్నాలో పాల్గొన్నారు. రోడ్డుపై బైఠాయించిన కేటీఆర్ కేంద్రం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయచట్టాలకు వ్యతిరేకంగా చేపట్టిన భారత్ బంద్లో పాల్గొనడానికి మంత్రి కేటీఆర్ బూర్గులకు చేరుకున్నారు. అనంతరం షాద్నగర్జాతీయ రహదారిపై బైఠాయించి కేంద్రం తెచ్చిన వ్యవసాయచట్టాలకు వ్యతిరేకంగా నిరసన చేట్టారు. నల్లబెలూన్లు ఎగురవేసిన నిరసన తెలిపిన ఎంఎల్సీ కవిత కామారెడ్డి: భారత్ బంద్కు మద్దతుగా ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ ఆధ్వర్యంలో నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే సురేందర్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ కార్యకర్తలు టెక్రియల్ చౌరస్తాకు ర్యాలీగా చేరుకున్నారు. అనంతరం నిజామాబాద్- ముంబై జాతీయ రహదారిని దిగ్భందించారు. టీఆర్ఎస్ కార్యకర్తలు రహదారిపైకి భారీగా చేరుకున్నారు. కార్యక్రమంలో ఎంఎల్సీ కవిత, ఎంపీ బీబీ పాటిల్ పాల్గొని నల్ల బెలూన్లు ఎగురవేసి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం జాతీయ రహదారి దిగ్భందనంలో కవిత బైటాయించారు. వైఎస్సార్ జిల్లాలో.. రైతాంగాన్ని ఆదుకోవాలని కోరుతూ నేడు అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో భారత్ బంద్ తలపెట్టారు. దీంతో కమలాపురంలో కడప- తాడిపత్రి జాతీయ రహదారి క్రాస్ రోడ్డు వద్ద సీపీఐ ఆధ్వర్యంలో బంద్ చేపట్టారు. మరికాసేపట్లో బూర్గులకు చేరుకోనున్న కేటీఆర్ మంత్రి కేటీఆర్ మరికాసేపట్లో బూర్గుల చేరుకోనున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిర్వహిస్తున్న భారత్ బంద్లో పాల్గొననున్నారు. కాగా ఇప్పటికే మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ కార్యకర్తలు బూర్గులకు చేరుకున్నారు. కాసేపట్లో హైదరాబాద్- బెంగళూర్ హైవేను దిగ్భందించనున్నారు. ఇప్పటికే కార్యకర్తలు రోడ్లపైకి చేరుకోడంతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. విజయవాడలో.. భారత్ బంద్లో భాగంగా లెనిన్ సెంటర్లో రైతు, కార్మిక, విద్యార్థి, మహిళా సంఘాలు, వామపక్ష నేతల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. వ్యవసాయ పనిముట్లతో మహిళా సంఘాల నేతలు నిరసన తెలుపుతున్నారు. ఆల్ ట్రేడ్ యూనియన్ నాయకులు మీడియాతో మాట్లాడుతూ.. కనీస మద్దతు ధరల చట్టం, స్వామినాథన్ సిఫార్సులు అమలు చేయకుండా కేంద్రం నల్ల చట్టాలు తెచ్చింది. రైతులకు వ్యతిరేకంగా తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను బీజేపీ ప్రభుత్వం ఉపసంహరించుకోవాలి. 62 లక్షల కోట్ల వ్యవసాయ ఉత్పత్తులు కార్పొరేట్ శక్తులకు ధారాదత్తం చేయాలని చూస్తున్నారు. రైతాంగానికి మద్దతుగా నిలిచిన సీఎం జగన్మోహన్రెడ్డికి ధన్యవాదాలు. కేంద్రం మెడలు వంచైనా.. చట్టాలు రద్దు చేసేవరకు పోరాడతాం. చట్టాలను రద్దు చేయకుంటే ఉద్యమం ఉధృతం చేస్తాము' అని ట్రేడ్ యూనియన్ నాయకులు తెలిపారు. తెలంగాణలో.. తెలంగాణలో భారత్ బంద్ కొనసాగుతోంది. పలుచోట్ల మంత్రులు, ఎమ్మెల్యేలు నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. సూర్యాపేటలో మంత్రి జగదీష్ రెడ్డి నిరసన కార్యక్రమాల్లో పాల్గొనగా.. మంత్రి తలసాని సికింద్రాబాద్లో రైతులకు మద్దతుగా నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ మాట్లాడుతూ.. 'దేశానికి రైతు వెన్నెముక. ప్రస్తుతం రైతులు దేశవ్యాప్తంగా ఇబ్బందులు పడుతున్నారు. వ్యవసాయ చట్టాలతో కార్పొరేట్ వ్యవస్థలకు దారాదత్తం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ చట్టాలతో రైతుల నడ్డి విరుగుతుంది. రాజ్యసభలో అన్ని పార్టీలు వ్యతిరేకించినా చట్టాలను ఆమోదించుకున్నారు. సంఖ్యా బలం ఉందని ఈ నల్ల చట్టాలను తీసుకొచ్చారు. చట్టాలను వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఉంది. దేశంలో రైతులను ఆదుకున్న ప్రభుత్వం టీఆర్ఎస్ మాత్రమే. కొంత మంది మూర్కులు అనవసరంగా మాట్లాడుతున్నారు. శివరాజ్ సింగ్ చౌహాన్ ఏం మాట్లాడుతున్నారు. చట్టాలను వెనక్కి తీసుకోకపోతే ఆందోళన ఉధృతం రైతుల నిరసన చేస్తుంటే రాజకీయ పార్టీలపై నెడుతున్నారు. వ్యాపారస్తులు, అన్ని వర్గాల ప్రజలు బంద్కు సహకరించాలి. చట్టాలను వెనక్కి తీసుకోకపోతే ఆందోళన ఉధృతం అవుతుంది. పంటలకు గిట్టుబాటు ధర లేదు. తెలంగాణలో పండిన పంట దేశంలో వేరే చోట అమ్ముకోవాలంటే ఎలా. రైతులు ఇబ్బందులు పడుతున్నా పట్టదా. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలో రైతాంగం కోలుకుంటోంది. ఎవర్ని పెంచి పోషించడం కోసం ఈ చట్టాలు. పంజాబ్, హరియాణలో నిరసనలు ఇంత ఉధృతంగా ఎందుకు జరుగుతుందో ఆలోచించాలి. టీఆర్ఎస్ ఓడిపోయింది కాబట్టి భయపడుతోందని అంటున్నారు. ఇలాంటి రాజకీయాలు, ఎన్నికలు మేం ఎన్ని చూడలేదు. అధికారం శాశ్వతం కాదు. నిజంగా సమస్య లేకపోతే కేంద్రం ఎందుకు చర్చలు జరుపుతుంది. ఇప్పటికైనా కేంద్రం దిగిరావాలి' అని మంత్రి తలసాని కోరారు. కరీంనగర్లో స్వల్ప ఉద్రిక్తత భారత్ బంద్ సందర్భంగా కరీంనగర్ బస్ స్టేషన్ వద్ద స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. బంద్లో భాగంగా బస్ స్టేషన్ వద్ద వామపక్షాలతోపాటు కాంగ్రెస్ కార్యకర్తలు బైఠాయించి ధర్నా చేస్తుండగా అదే సమయంలో టీఆర్ఎస్ కార్యకర్తలు అక్కడికి చేరుకోవడంతో ఆందోళనకు దారితీసింది. టీఆర్ఎస్ కార్మిక విభాగం రాష్ట్ర అధ్యక్షులు రూప్ సింగ్ ఆధ్వర్యంలో కొందరు విపక్ష పార్టీల ధర్నా వద్దకు రావడంతో కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్తో పాటు కాంగ్రెస్ కార్యకర్తలు టీఆర్ఎస్ గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ప్రతిగా టీఆర్ఎస్ కార్యకర్తలు నినాదాలు చేయడంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. వెంటనే పోలీసులు ఇరువర్గాల మధ్య నిలిచి సర్దిచెప్పడంతో ఆందోళన సద్దుమణిగింది. ఆ తరువాత వేరువేరుగా రోడ్డుపై బైఠాయించి ధర్నా కొనసాగిస్తున్నారు. భారత్ బంద్కు ఆస్ట్రేలియాలోని తెలుగువారి మద్దతు కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన 3 రైతు వ్యతిరేక చట్టాలను ఉపసంహరించుకోవాలని తలపెట్టిన భారత్ బంద్కు మద్దతుగా ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ తెలంగాణ అసోసియేషన్ ప్రతినిధుల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. దేశవ్యాప్తంగా రైతుల నుంచి వస్తున్న వ్యతిరేకతను కేంద్ర ప్రభుత్వం అర్థం చేసుకొని ఆ చట్టాలను ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. వ్యవసాయ చట్టాలు రైతులకు గొడ్డలిపెట్టు: మంత్రి శ్రీనివాస్ గౌడ్ కేంద్ర నూతన వ్యవసాయ చట్టాలు రైతులకు గొడ్డలిపెట్టుగా మారనున్నాయని, ఈ చట్టాల ద్వారా కార్పొరేటు సంస్థలకు మేలు చేసేందుకు కేంద్రం ఆరాటపడుతున్నట్టు ఉందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. రైతు సంఘాల భారత్ బంద్ పిలుపులో బాగంగా మహబూబ్ నగర్లో జరిగిన నిరసన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. రైతు ప్రయోజనాల కోసం వారితో కలిసి పోరాడుతామని, కేంద్రం తన నూతన వ్యవసాయ చట్టాలను ఉపసంహరించే వరకు తమ ఆందోళన ఆగదని హెచ్చరించారు. దేశానికి అన్నం పెట్టే అన్నదాతకు అండగా నిలవాల్సిన భాద్యత అందరిపైనా ఉందని.. కేంద్రం అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేసే కుట్ర పన్నుతోందని మంత్రి పేర్కొన్నారు. అనంతపురం జిల్లాలో.. కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా అనంతపురం జిల్లాలో వామపక్షాల ఆధ్వర్యంలో బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఢిల్లీలో రైతుల దీక్షకు మద్దతుగా విద్యా, వ్యాపార సముదాయాలు మూసివేసి బంద్కు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నారు. జిల్లా వ్యాప్తంగా బస్సు సర్వీసులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. నిర్మానుష్యంగా జేబీఎస్ బస్టాండ్ కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన రైతు చట్టాలని వ్యతిరేకిస్తూ భారత్ బంద్ చేపట్టారు. దీనిలో భాగంగా సికింద్రాబాద్, జేబీఎస్ బస్టాండ్ వద్ద బంద్ సంపూర్ణంగా కొనసాగుతోంది. కంటోన్మెంట్, పికెట్ డిపోలో బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. జేబీఎస్ బస్టాండ్ నిర్మానుష్యంగా మారింది. ప్రయాణికులు లేక బస్టాండ్ వెలవెలబోతోంది. జేబీఎస్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. వరంగల్ జిల్లాలో నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ భారత్ బంద్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రశాంతంగా కొనసాగుతోంది. రైతు సంఘాలు చేపట్టిన బంద్కు బీజేపీ మినహా అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలపడంతో ఎక్కడికక్కడ అన్ని బంద్ అయ్యాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ బస్సు సర్వీస్లను నిలిపివేసింది. దీంతో 950 బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ఉదయాన్నే టీఆర్ఎస్, కాంగ్రెస్, వామపక్ష పార్టీల కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి బంద్ను నిర్వహిస్తున్నారు. జిల్లాకు చెందిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఎమ్మెల్యే అరూరి రమేష్, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి మడికొండ వద్ద తమ నిరసన తెలుపనున్నారు. అలాగే ఎమ్మెల్యే రాజయ్య, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, ఘనపూర్లో ఎమ్మెల్యే నరేందర్ నాయుడు పెట్రోల్ బంక్ వద్ద తమ ధర్నా కొనసాగించనున్నారు. వ్యాపార, వాణిజ్య సంస్థలు స్వచ్ఛందగా బంద్ పాటిస్తున్నాయి. పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పహారా కాస్తున్నారు. సూర్యాపేట జిల్లాలో భారీగా ట్రాఫిక్ జామ్ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ రైతులు తలపెట్టిన భారత్ బందులో భాగంగా హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై సూర్యాపేట జిల్లా రైతులు నిరసనకు దిగారు. చివ్వేంల మండలం గుంపుల తిరుమలగిరి వద్ద రైతులు ట్రాక్టర్లను రోడ్డుపై అడ్డంగా ఉంచి వ్యవసాయ చట్టాలకు వ్యతిరకేంగా నినాదాలు చేస్తున్నారు. దీంతో హైవేపై ట్రాఫిక్ భారీగా స్తంభించి పోయింది. హుస్నాబాద్: కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలు కార్పొరేట్లకు దోచిపెట్టేందుకే తప్ప రైతులకు ఎలాంటి ప్రయోజనం ఉండదని ఆర్థిక శాఖ మంత్రి టి.హరీశ్రావు అన్నారు. కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలు రైతుల నడ్డివిరిచేలా ఉన్నాయని చెప్పారు. పంటను దేశంలో ఎక్కడైనా అమ్ముకోవచ్చని చెబుతున్న ఈ చట్టం తేనె పూసిన కత్తిలాంటిదని విమర్శించారు. ప్రస్తుతం రైతు పండించిన పంట మార్కెట్ యార్డులో అమ్ముకొని మద్దతు ధర పొందేవారని తెలిపారు. అయితే.. అంబానీ, అదానీ వంటి కార్పొరేట్లకు అమ్మితే జవాబుదారీ ఎవరుంటారని ప్రశ్నించారు. ప్రస్తుతం కృత్రిమ కొరత సృష్టించకుండా నిత్యావసర సరుకులు స్టాక్ పెట్టుకోవడానికి వీలు లేకుండా చట్టం ఉండేదని, కొత్త చట్టం ద్వారా బడా వ్యాపారులు నిత్యావసర వస్తువులను స్టాక్ పెట్టుకునేలా వారికి లాభం చేకూర్చేలా ఉందన్నారు. ఢిల్లీలో రైతులు చేస్తున్న ఆందోళనకు బ్రిటన్ ప్రధానితో పాటు అమెరికా వీధుల్లో తెలుగు ప్రజలు మద్దతు తెలుపుతుంటే, కేంద్ర ప్రభుత్వం స్పందించడం లేదని విమర్శించారు. లెవీ సేకరణ చట్టాన్ని రద్దు చేయాలి సన్న వడ్లు కొనాలంటూ ధర్నాలు చేస్తున్న బీజేపీ నేతలు.. ముందు కేంద్రం జారీ చేసిన లేవీ సేకరణ చట్టాన్ని రద్దు చేసేలా చేయాలని మంత్రి హరీశ్రావు డిమాండ్ చేశారు. ఏ రాష్ట్రమైనా కేంద్రం నిర్ణయించిన ధర కంటే ఒక్క రూపాయి ఎక్కువ ధర పెట్టినా లెవీ సేకరణ నిలిపివేస్తామని కేంద్రం అడ్డంకులు సృష్టిస్తోందన్నారు. చట్టాలు తెచ్చేది మీరే, ధరలు పెంచుతూ ధర్నాలు చేసేది మీరే అని ధ్వజమెత్తారు. తమ ప్రభుత్వం కరెంట్, రైతు బీమా, రైతుబంధు ఇలా రైతుల కోసం ఏటా రూ.50 వేల కోట్లు ఖర్చు పెడుతుంటే, సన్నరకం ధాన్యానికి ఇంకో రూ.400 కోట్లు ఖర్చు పెట్టలేమా అని ప్రశ్నించారు. తూర్పుగోదావరి జిల్లాలో.. రైతు వ్యతిరేక బిల్లులను రద్దు చేయాలని కోరుతూ జిల్లాలో బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రంపచోడవరంలోని సీపీఐ, సీపీఎం, సీపీఐ ఎంఎల్ మరియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో తెల్లవారుజాము నుండి నాయకులు రోడ్లపైకి చేరి రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలంటూ నినాదాలు చేస్తూ బంద్ను పాటిస్తున్నారు. బంద్కు మద్దతుగా రంపచోడవరంలో దుకాణాలు, వ్యాపార సముదాయాల స్వచ్ఛందంగా మూతపడ్డాయి. బండెనక బండి.. రైతన్నకు మద్దతు దండి ►భారత్బంద్కు మద్దతుగా రైతులు, టీఆర్ఎస్ శ్రేణుల ర్యాలీ హన్మకొండ: కేంద్రప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ భారత్ బంద్ను విజయవంతం చేయాలని కోరుతూ హన్మకొండలో ఎడ్ల బండ్లతో రైతులు, టీఆర్ఎస్ శ్రేణులు వినూత్న ర్యాలీ నిర్వహించారు. ఈ మేరకు కాజీపేట రైల్వేస్టేషన్ నుంచి హన్మకొండ బాలసముద్రంలోని ఏకశిల పార్కు వరకు చేపట్టిన ఈ ర్యాలీని చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ ప్రారంభించి మాట్లాడారు. రైతాంగమంతా కేంద్రం తీసుకువచ్చిన చట్టాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నా కేంద్ర ప్రభుత్వానికి చీమ కుట్టినట్టయినా లేదని ధ్వజమెత్తారు. కర్నూలు జిల్లాలో.. నూతన వ్యవసాయ చట్టాలను కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరణ చేసుకొని కర్నూలులో వామపక్షాలు పార్టీలు, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో భారత్ బంద్ కొనసాగుతోంది. జిల్లాలో ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి. వ్యాపార, వాణిజ్య, విద్యా సంస్థలు బంద్కు స్వచ్చందంగా మూసివేశారు. ఢిల్లీ రైతులకు మద్దతు ఇస్తూ ప్రభుత్వ కార్యాలయాలు మధ్యాహ్నం వరకు మూసివేస్తున్నారు. కర్నూలులో ప్రధాన కూడళ్లలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఢిల్లీ రైతులకు మద్దతు ఇస్తూ కేంద్ర ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో.. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జిల్లాలో భారత్ బంద్ ప్రశాంతంగా సాగుతోంది. విద్యా, వాణిజ్య సముదాయాలు స్వచ్చందంగా మూసివేశారు. శ్రీకాకుళం, టెక్కలి, పాలకొండ, పలాసలో ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి. శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా ముఖ్య కూడళ్లు, టోల్ప్లాజాల వద్ద పోలీసులను మోహరించారు. గ్రేటర్ విశాఖ పరిధిలో.. అన్నదాతలకు మద్దతుగా గ్రేటర్ విశాఖ పరిధిలో బంద్ ప్రశాంతంగా జరుగుతోంది. నగరంలోని ద్వారక బస్ స్టేషన్కే ఆర్టీసీ బస్సులు పరిమితం అయ్యాయి. వ్యాపార సముదాయాలు, దుకాణాలు మూసివేసి స్వచ్చందంగా మూసివేసి మద్దతుగా నిలిచారు. వామపక్ష పార్టీలు నేతల నిరసన ర్యాలీ చేపట్టారు. అందులో భాగంగా మద్దిలపాలెం జంక్షన్లో జాతీయ రహదారిపై వాహనాలు నిలిపివేశారు. సీపీఐ, సీపీఎంతో పాటు వివిధ ప్రజా సంఘాలు చేపట్టిన ఈ బందుకు వైఎస్సార్సీపీ మద్దతు పలికింది. కేంద్ర ప్రభుత్వం బిల్లును వెనక్కి తీసుకునేంత వరకు ఆందోళన కొనసాగిస్తామని ప్రజా సంఘాల నాయకులు హెచ్చరిస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో... నూతన వ్యవసాయ చట్టాన్ని వ్యతిరేకిస్తూ భారత్ బంద్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రశాంతంగా కొనసాగుతోంది. రైతు సంఘాలు చేపట్టిన బంద్కు రాజకీయ పార్టీలు, రాష్ట్రంలో అధికార పార్టీ టిఆర్ఎస్ మద్దతు తెలపడంతో బంద్ సంపూర్ణంగా కొనసాగుతోంది. కరీంనగర్లో వేకువజామునే సీపీఐ, సీపీఎం నాయకులు కార్యకర్తలు బస్ స్టేషన్ వద్దకు చేరుకొని బస్సులు బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారు. డిపో ముందు బస్ స్టేషన్ వద్ద బైఠాయించారు. దీంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. కేంద్ర ప్రభుత్వానికి, మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు నూతన వ్యవసాయ చట్టాన్ని రద్దు చేసే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మినహా అన్ని రాజకీయ పార్టీలు టిఆర్ఎస్ కాంగ్రెస్ వామపక్ష పార్టీల నాయకులు రోడ్లపైకి వచ్చి వర్తక వ్యాపార వాణిజ్య సంస్థలను బంద్ చేయించారు. గోదావరిఖని బస్ డిపో ముందు బైఠాయించి ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆందోళనలో పాల్గొన్నారు. మంథనిలో బంద్ సంపూర్ణంగా కొనసాగుతోంది. వ్యాపారస్తులు, కూరగాయల మార్కెట్ నిర్వాహకులు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నారు. సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నేడు దేశవ్యాప్తంగా బంద్ జరుగుతోంది. రైతు సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు దేశంలోని పలు రాష్ట్రాలు బంద్ పాటిస్తున్నాయి. మంగళవారం తెల్లవారుజాము నుంచే పలు చోట్ల బంద్ ప్రారంభించారు. ఆర్టీసీ బస్సులు చాలా చోట్ల డిపోలకు పరిమితమయ్యాయి. అత్యవసర సేవలకు అంతరాయం కలిగించకుండా శాంతియుతంగా ఆందోళన కార్యక్రమాలు కొనసాగించాలని రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ బంద్ సంపూర్ణంగా కొనసాగుతోంది. విద్యా సంస్థలు, వ్యాపార సముదాయాలు తెరుచుకోలేదు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
‘భారత్ బంద్’లో మంత్రులు
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వ నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా మంగళవారం రైతు సంఘాలు చేపట్టిన భారత్ బంద్కు టీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే భారత్ బంద్కు మద్దతుగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు సహా మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటారు. మంత్రి కేటీఆర్ రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గంలోని బూర్గుల వద్ద బెంగళూరు జాతీయ రహదారిపై రైతులతో కలసి ధర్నాలో పాల్గొంటారు. ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు గజ్వేల్ నియోజకవర్గం తూప్రాన్ వై జంక్షన్ వద్ద నాగ్పూర్ రహదారి దిగ్బంధనం కార్యక్రమంలో పాల్గొంటారు. జిల్లాల్లో మంత్రులు, శాసనసభ్యులు.. వ్యవసాయ చట్టాలపై జరుగుతున్న భారత్ బంద్కు సంఘీభావంగా పలువురు మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, పార్టీ ప్రజా ప్రతినిధులు మంగళవారం తాము ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాల్లో నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటారు. మంత్రులు వేముల ప్రశాంత్రెడ్డి వేల్పూరు, ఎర్రబెల్లి దయాకర్రావు మడికొండ, సత్యవతి రాథోడ్ మహబూబాబాద్లో జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఎమ్మెల్సీ కవిత నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జరిగే నిరసన కార్యక్రమంలో పాల్గొననున్నారు. బంద్కు బందోబస్తు.. కేంద్రం ఇటీవల ఆమోదించిన వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా విపక్ష పార్టీలు భారత్ బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో తెలంగాణ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ మేరకు ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా బందోబస్తు ఏర్పాట్లు చేశారు. బంద్ నేపథ్యంలో అన్ని జిల్లాల ఎస్పీలు, కమిషనర్లతో డీజీపీ మహేందర్రెడ్డి టెలీకాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ మినహా దాదాపు అన్ని పార్టీలు బంద్లో పాల్గొంటున్న నేపథ్యంలో పోలీసులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు. పలు రైతు అనుబంధ సంఘాలు, విద్యార్థి సంఘాలు, ట్రేడ్ యూనియన్లు, ట్రాన్స్పోర్ట్ యూనియన్లు కూడా బంద్లో పాల్గొంటున్న నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రణాళికలపై ఆయన పలు సూచనలు చేశారు. సామాన్య ప్రజలకు ఇబ్బంది కలగకుండా నిరసన తెలుపుకోవాలని సూచించారు. బంద్ అనుకూల, వ్యతిరేక నేతలపై ఇంటెలిజెన్స్ పోలీసుల నిఘా కొనసాగుతోంది. వీలును బట్టి హౌస్ అరెస్టు చేసే అవకాశాలున్నాయని సమాచారం. -
నేడు భారత్ బంద్
న్యూఢిల్లీ: వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతు సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు నేడు భారత్ బంద్ జరగనుంది. ఈ దేశవ్యాప్త నిరసనకు ఇప్పటికే కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీ, ఆప్, టీఎంసీ, వామపక్షాలు, డీఎంకే, ఆర్జేడీ, ఎన్సీపీ, టీఆర్ఎస్ సహా దాదాపు అన్ని ప్రతిపక్ష పార్టీలు మద్దతు ప్రకటించాయి. ఆయా పార్టీల కార్యకర్తలు బంద్లో చురుగ్గా పాలుపంచుకోనున్నారు. బంద్లో పాల్గొని, రైతుల న్యాయబద్ధ డిమాండ్లకు మద్దతివ్వాలని దేశ ప్రజలకు రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. బంద్ను పాటించాలని ఎవరినీ ఒత్తిడి చేయవద్దని సూచించాయి. శాంతియుతంగా నిరసన తెలపాలని, అంబులెన్స్లు, ఎమర్జెన్సీ సేవలకు మినహాయింపునివ్వాలని విజ్ఞప్తి చేశాయి. మరోవైపు, రైతులు ప్రకటించిన భారత్ బంద్నకు నైతిక మద్దతు తెలుపుతున్నామని పది కార్మిక సంఘాల ఐక్య కమిటీ సోమవారం ప్రకటించింది. బంద్కు మద్దతు తెలుపుతూనే, కార్మికులు విధుల్లో పాల్గొంటారని పేర్కొంది. డ్యూటీలో ఉండగా నల్ల రిబ్బన్లు ధరించి నిరసన వ్యక్తం చేస్తారని, విధుల్లోకి వెళ్లేముందు కానీ విధులు ముగిసిన తరువాత కానీ నిరసన ప్రదర్శన నిర్వహిస్తారని తెలిపింది. కార్మికులు స్ట్రైక్ చేయాలంటే ముందుగా నోటీసు ఇవ్వాల్సి ఉంటుందని హిందూ మజ్దూర్ సభ ప్రధాన కార్యదర్శి హర్భజన్ సింగ్ వివరించారు. కాగా, బంద్ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా శాంతిభద్రతల విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్రం సూచనలు జారీ చేసింది. ఢిల్లీ–మీరట్ ఎక్స్ప్రెస్ హైవేపై పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లు కోవిడ్–19 ముప్పు పొంచి ఉన్న కారణంగా, మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి కరోనా నిబంధనలు కచ్చితంగా అమలయ్యేలా చూడాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశించింది. భద్రతను కట్టుదిట్టం చేయాలని, శాంతిసామరస్యాలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని స్పష్టం చేసింది. రైతులు నిరసన తెలుపుతున్న ఢిల్లీలోని పలు సరిహద్దుల వద్ద పోలీసులను భారీగా మోహరించారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలన్న ప్రధాన డిమాండ్తో ఢిల్లీ సరిహద్దుల్లో గత 12 రోజులుగా నిరసన తెలుపుతున్న రైతులతో కేంద్ర మంత్రులు ఇప్పటివరకు ఐదు విడతలుగా జరిపిన చర్చలు అసంపూర్ణంగా ముగిసిన విషయం తెలిసిందే. మరో విడత చర్చలు బుధవారం జరగనున్నాయి. వేలాదిగా రైతులు నిరసన తెలుపుతున్న సింఘు సరిహద్దును ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సోమవారం సందర్శించారు. రైతులకు ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేసిన సదుపాయాలను పరిశీలించారు. ‘తాత్కాలిక జైళ్లుగా ఢిల్లీలోని స్టేడియంలను వాడుకునేందుకు అనుమతించాలని మాపై భారీగా ఒత్తిడి వచ్చింది. మేం వారి ఒత్తిడికి తలొగ్గలేదు. అది ఉద్యమానికి సహకరించింది’ అని కేజ్రీవాల్ తెలిపారు. రైతులకు కష్టం కలగకుండా తమ ప్రభుత్వం చూసుకుంటుందన్నారు. ‘ఒక ముఖ్యమంత్రిగా కాకుండా, ఒక సేవకుడిలా మీ వద్దకు వచ్చాను’ అని రైతులతో పేర్కొన్నారు. ఆప్ నేతలు, కార్యకర్తలు రైతులకు సేవ చేసేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. మద్దతివ్వండి బంద్లో స్వచ్ఛందంగా పాల్గొనాలని దేశ ప్రజలకు రైతు సంఘాలు విజ్ఞప్తి చేశాయి. బంద్లో పాల్గొనేలా ఎవరినీ ఒత్తిడి చేయవద్దని తమ మద్దతుదారులను కోరాయి. శాంతియుతంగా బంద్ జరపాలని, హింసాత్మక చర్యలకు పాల్పడవద్దని భారతీయ కిసాన్ ఏక్తా సంఘటన్ అధ్యక్షుడు జగ్జిత్ సింగ్ దాలేవాలా కోరారు. ‘మేం పిలుపునిచ్చిన బంద్ రాజకీయ పార్టీలిచ్చే బంద్ లాంటిది కాదు. ఇది ఒక సైద్ధాంతిక లక్ష్యం కోసం మంగళవారం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 వరకు.. నాలుగు గంటల పాటు జరిపే ప్రతీకాత్మక బంద్. ఈ నిరసనతో సామాన్య ప్రజలకు ఇబ్బంది కలగకూడదనేది మా ప్రధాన ఉద్దేశం. అందుకే ఆ నాలుగు గంటల పాటు ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని కోరుతున్నాం’ అని రైతు సంఘం నేత రాకేశ్ తికాయిత్ వివరించారు. ఆ నాలుగు గంటల పాటు దుకాణాలను మూసేయాలని వ్యాపారస్తులను కోరుతున్నామన్నారు. ఆ నాలుగు గంటల పాటు టోల్ ప్లాజాలను, కీలక రహదారులను నిర్బంధిస్తామని వెల్లడించారు. రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేసేవరకు తమ ఆందోళన కొనసాగు తుందని రైతు నేత బల్బీర్ సింగ్ రాజేవాల్ స్పష్టం చేశారు. తాజా చట్టాలు రైతులకు లబ్ధి చేకూరుస్తాయని ఇన్నాళ్లు చెప్పిన ప్రభుత్వం.. ఇప్పుడు వాటికి సవరణలు చేసేందుకు సిద్ధమని ఎందుకు చెప్తోందని మరో రైతు నేత దర్శన్ పాల్ ప్రశ్నించారు. బంద్కు మద్దతుగా మంగళవారం అన్ని రవాణా కార్యకలాపాలను నిలిపేస్తామని ఆల్ ఇండియా మోటార్ ట్రాన్స్పోర్ట్ కాంగ్రెస్(ఏఐఎంటీసీ) ప్రకటించింది. ఏఐఎంటీసీ దేశవ్యాప్తంగా దాదాపు 95 లక్షల మంది ట్రక్కు యజమానులకు ప్రాతినిధ్యం వహిస్తోంది. దీంతో, దేశవ్యాప్తంగా నిత్యావసరాల రవాణాపై ప్రతికూల ప్రభావం పడనుంది. అతిపెద్ద రైల్వే కార్మిక విభాగాలైన ‘ఆల్ ఇండియా రైల్వేమెన్స్ ఫెడరేషన్’, ‘నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ రైల్వేమెన్’ కూడా బంద్కు మద్దతు ప్రకటించాయి. బంద్కు మద్దతుగా రైల్వే కార్మికులు నిరసన ప్రదర్శనలు చేస్తారని తెలిపాయి. కాగా, తమ కార్యకలాపాలు మంగళవారం కూడా కొనసాగుతాయని వాణిజ్యవేత్తల సంఘం సీఏఐటీ, ఆల్ ఇండియా ట్రాన్స్పోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ స్పష్టం చేశాయి. బంద్లో నేరుగా పాల్గొనబోవటం లేదని బ్యాంక్ యూనియన్లు తెలిపాయి. బ్యాంకు ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలతో విధుల్లో పాల్గొంటారని ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రకటించింది. విరామ సమయాల్లో బంద్కు మద్దతుగా బ్యాంక్ బ్రాంచ్ల ముందు ప్లకార్డులను ప్రదర్శిస్తారని తెలిపింది. ప్రతిపక్షాల ద్వంద్వ నీతి రైతుల ఉద్యమానికి మద్దతివ్వడం విపక్షాల ద్వంద్వ నీతికి నిదర్శనమని బీజేపీ విమర్శించింది. సాగు చట్టాల్లోని నిబంధనలను కాంగ్రెస్, ఎన్సీపీ తదితర విపక్షాలు గతంలో మద్దతిచ్చిన విషయాన్ని గుర్తు చేసింది. వ్యవసాయ మార్కెట్ కమిటీ చట్టాన్ని రద్దు చేస్తామని, వ్యవసాయ ఉత్పత్తుల వాణిజ్యంలో ఉన్న అన్ని ఆంక్షలను తొలగిస్తామని 2019 లోక్సభ ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ హామీ ఇచ్చిందని కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ గుర్తు చేశారు. స్వార్థం కోసం ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ సమాజంలో అశాంతి నెలకొల్పేందుకు కుట్ర చేస్తున్నాయని ప్రతిపక్షాలపై ఆరోపణలు గుప్పించారు. ఎన్నికల్లో ఓటమి పాలవుతూ.. ఉనికి కోసం రైతు ఉద్యమాన్ని వాడుకుంటున్నాయని, రైతుల్లోని కొన్ని వర్గాలను తమ గుప్పిట్లో పెట్టుకున్నాయన్నారు. 16 రాష్ట్రాలపై ప్రభావం బంద్ వల్ల 16 రాష్ట్రాల్లో రైళ్ల రాకపోకలకు ఇబ్బందులు కలగవచ్చని రైల్వే శాఖ పేర్కొంది. రైళ్లలో, రైల్వే స్టేషన్లలో భద్రతను పెంచాలని సూచించింది. బంద్లో పాల్గొనే వామపక్ష అనుకూల అతివాదులు సమస్యలు సృష్టించే అవకాశాలున్నాయని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ డైరెక్టర్ జనరల్ అరుణ్ కుమార్ హెచ్చరించారు. శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా జాగ్రత్త వహించాలని జోనల్ మేనేజర్లకు సూచించారు. సైకిల్పై 300 కి.మీ. పంజాబ్, హరియాణాల నుంచి ఢిల్లీ సరిహద్దులకు వెళ్లి నిరసనలు చేస్తున్న రైతులకు మద్దతు తెలిపేందుకు ఇద్దరు యువకులు సైకిల్ మీద ఏకంగా 300 కిలోమీటర్లు ప్రయాణించారు. జోవన్ ప్రీత్ సింగ్ (24), గురిందర్ జీత్ (26)లు పంజాబ్లోని బర్నాలా నుంచి రెండు రోజుల క్రితం ప్రయాణమై సోమవారానికి ఢిల్లీ సరిహద్దుకు చేరుకున్నారు. ట్రాక్టర్లలో ప్రయాణించాలంటే పోలీసులు అడ్డుకుంటున్నారని, అందుకే సైకిళ్లపై వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. దారిపొడవునా అప్పటికే రైతులు ఉండటంతో తిండికేమీ లోటు లేదని, రాత్రి వేళ ట్రాక్టర్లలో పడుకున్నామని చెప్పారు. ఆ చట్టాలు మంచివే.. కొత్త సాగు చట్టాలు రైతులకు ప్రయోజనం చేకూర్చేవేనని కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ మరోసారి చెప్పారు. ఈ చట్టాలను సమర్ధిస్తున్న రైతుల బృందంతో తోమర్ సోమవారం సమావేశమయ్యారు. పద్మశ్రీ పురస్కార గ్రహీత, హరియాణాకు చెందిన రైతు కన్వల్ సింగ్ చౌహాన్ నేతృత్వంలో ఈ బృందం తోమర్ను కలిసింది. ఈ బృందంలో భారతీయ కిసాన్ యూనియన్(అత్తార్) జాతీయ అధ్యక్షుడు అత్తార్ సింగ్ సంధూ కూడా ఉన్నారు. సాగు చట్టాలను రద్దు చేయవద్దని, అవసరమైతే కొన్ని సవరణలు చేయాలని ఈ బృందం మంత్రిని కోరింది. ఈ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు చేస్తున్న ఉద్యమాన్ని తమ ప్రభుత్వం ఎదుర్కోగలదని తోమర్ వ్యాఖ్యానించారు. రైతుల కోసం వైఫై.. ఢిల్లీ–హరియాణా సరిహద్దుల వద్ద ఉన్న రైతులకు ఇంటర్నెట్ సదుపాయం కల్పించేందుకు ఢిల్లీకి చెందిన ఓ ఎన్జీఓ ముందుకు వచ్చింది. ఢిల్లీ సరిహద్దు వద్ద ఓ రూటర్ ఏర్పాటు చేశామని, అలాగే హరియాణా సరిహద్దు వద్ద పోర్టబుల్ డివైజ్ల నుంచి వైఫై సదుపాయం కల్పిస్తున్నట్లు చెప్పారు. దీని ద్వారా రైతులు తమ ఇంట్లో ఉన్నవారితో మాట్లాడుకుంటారని, రైతుల పిల్లలు ఆన్లైన్ క్లాసులకు హాజరువుతారని ఎన్జీవో సభ్యులు తెలిపారు. అర్జున, పద్మ అవార్డులను వెనక్కు ఇచ్చేందుకు రాష్ట్రపతి భవన్ వైపు వెళ్తున్న మాజీ క్రీడాకారులు రైతుల డిమాండ్లు ► ప్రత్యేక పార్లమెంటు సమావేశం ఏర్పాటు చేసి మూడు వ్యవసాయ చట్టాలను, విద్యుత్ సవరణ చట్టాన్ని రద్దు చేయాలి. ► కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)ని వ్యవసాయ చట్టంలో చేర్చాలి. ► మండీల నుంచి కొనుగోళ్లను ప్రభుత్వమే చేపట్టాలి. ► రైతులు, వ్యాపారుల మధ్య వివాదాల పరిష్కారానికి ప్రత్యేక వ్యవసాయ కోర్టులు నెలకొల్పాలి. రైతుల అనుమానాలు ► సాగు రంగంలో ప్రైవేటు సంస్థల రాకతో వ్యవసాయ ఉత్పత్తుల ధరలు 15 నుంచి 20శాతం వరకు పడిపోయే ప్రమాదం ఉంది. ► ఒకే దేశం –ఒకే మార్కెట్ విధానంతో భవిష్యత్లో కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) అన్నదే లేకుండా పోతుంది. ► మండీ వ్యవస్థ నిర్వీర్యమై పండిన పంటను అమ్ముకోవడం కష్టమవుతుంది. ► రైతులు, వ్యాపారుల మధ్య వివాదాలను సబ్ డివిజినల్ మెజిస్ట్రేట్ పరిధిలోనే పరిష్కరించుకోవాల్సి రావడం. ► కాంట్రాక్ట్ ఫార్మింగ్తో భూములకు రక్షణ కరువవుతుంది. ► నిత్యావసర సరుకుల సవరణ చట్టంతో వ్యాపారులు, దళారులు కృత్రిమ కొరత సృష్టించే అవకాశం ఉంది. ప్రభుత్వం ఏమంటోంది? ► సాగు చట్టాలకు రైతు సంఘాలు కోరిన మేరకు సవరణలు చేపట్టేందుకు సిద్ధం. ► కనీస మద్దతు ధర విధానం యథా ప్రకారం కొనసాగుతుంది. దీనిపై భయాలు, సందేహాలు పూర్తిగా నిరాధారమైనవి. ► రాష్ట్రానికి చెందిన మండీలను ప్రభావితం చేయడం మా ఉద్దేశం కాదు. ఈ దిశగా ఏపీఎంసీ చట్టాన్ని మరింత బలోపేతం చేస్తాం. ► రైతులు అభ్యంతరం తెలుపుతున్న 39 అంశాల్లోని 8 అంశాల్లో సవరణలు చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. ► కొన్ని కీలక అంశాలపై రైతు సంఘాలను సూచనలు కోరుతున్నాం. పీటముడి ఎక్కడ? ► వ్యవసాయ చట్టాలను పూర్తిగా వెనక్కి తీసుకోకపోతే కనీసం కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)ని చట్టంలో చేర్చాలని రైతులు పట్టుబడుతున్నారు. ఎంఎస్పీని చట్టంలో చేర్చడమంటే రైతులకు చట్టపరంగా ధరలపై హక్కు వచ్చినట్టే. ఆ డిమాండ్ తీర్చడం అసాధ్యమని కేంద్రం అంటోంది. -
రైతులకు రాష్ట్ర సర్కారు సంఘీభావం
సాక్షి, అమరావతి: రైతు సంఘాలు మంగళవారం భారత్ బంద్కు పిలుపు ఇచ్చిన నేపథ్యంలో రైతులకు రాష్ట్ర ప్రభుత్వం సంఘీభావం తెలుపుతోంది. కొత్త వ్యవసాయ చట్టాలపై రైతు సంఘాలకు, కేంద్రానికి మధ్య జరుగుతున్న చర్చలు జయప్రదం కావాలని ఆకాంక్షించింది. కనీస మద్దతు ధర విషయంలో రైతులు వ్యక్తం చేస్తున్న ఆందోళనకు తగిన పరిష్కారం లభించగలదన్న ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. దేశవ్యాప్తంగా రైతు సంఘాలు తమ ఆందోళనలో భాగంగా మంగళవారం నిర్వహించ తలపెట్టిన బంద్ విషయంలో వారి మనోభావాలను గౌరవిస్తున్నామని అందులో పేర్కొన్నారు. రైతు సంఘాలు హింసాత్మక చర్యలకు తావివ్వకుండా మధ్యాహ్నం ఒంటి గంటలోపు బంద్ను ముగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇదే సమయంలో రైతులకు సంఘీభావంగా రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలను మధ్యాహ్నం ఒంటిగంట తరవాత తెరవాలని ఆదేశిస్తున్నట్టు ఆయన ప్రకటించారు. బస్సు సర్వీసులను మధ్యాహ్నం ఒంటిగంట వరకు నడపవద్దని ఆర్టీసీని ఆదేశించామన్నారు. విద్యాసంస్థలు మూసివేయాలన్నారు. బంద్ పూర్తిగా స్వచ్ఛందంగా, ప్రశాంత వాతావరణంలో జరిగేలా సహకరించాలని రైతు సంఘాలకు విజ్ఞప్తి చేశారు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని, రైతు బాగుంటేనే దేశం బాగుంటుందని నమ్మే పార్టీగా, రైతు పక్షపాత ప్రభుత్వంగా ఈ ప్రకటన చేస్తున్నామని కన్నబాబు స్పష్టం చేశారు. చంద్రబాబు మరో యూటర్న్.. వ్యవసాయ బిల్లుల విషయంలో చంద్రబాబు వైఖరిపై కన్నబాబు మండిపడ్డారు. కేంద్రంలో వ్యవసాయ బిల్లులకు చంద్రబాబు పార్టీ బేషరతుగా, గట్టిగా పార్లమెంటులో మద్దతు పలికిన విషయం ప్రజలు గ్రహించాలని కోరారు. అదే సమయంలో కనీస మద్దతు ధరకు పూర్తి భరోసా ఇస్తున్నామని, రైతుల ప్రయోజనాలకు విఘాతం కలగదన్న కేంద్ర ప్రభుత్వ హామీ నేపథ్యంలోనే వైఎస్సార్సీపీ ఈ బిల్లులకు షరతులతో కూడిన మద్దతు పలికిందన్న సంగతి తెలిసిందేనన్నారు. బిల్లుకు పార్లమెంటులో బేషరతుగా మద్దతు పలికిన చంద్రబాబు.. ఇప్పుడు యూటర్న్ తీసుకుని జిల్లా కలెక్టర్లకు విజ్ఞాపనలు ఇవ్వాలని నిర్ణయించడం ఎంతటి దిగజారుడు రాజకీయమో కనిపిస్తోందన్నారు. వ్యవసాయ చట్టాల అంశంలో కలెక్టర్లకు ఏం పాత్ర ఉంటుందని ప్రశ్నించారు. ‘‘వ్యవసాయ బిల్లులు సెప్టెంబర్లో ఆమోదం పొందితే నవంబర్ వరకు కనీసం చంద్రబాబు కేంద్ర ప్రభుత్వానికి ఒక్క ఉత్తరం ముక్క కూడా రాయలేదు. ఇవాళ కూడా ఢిల్లీ వెళ్లి గతంలో మాదిరిగా ఓ ధర్నా చేస్తానని ప్రకటించడం లేదు. మరెందుకు ఈ డ్రామాలు?’’ అని ఆయన నిలదీశారు. -
విశ్వాస పునరుద్ధరణ కీలకం
సాగు రంగ సంస్కరణల కోసమంటూ కేంద్రం తీసుకొచ్చిన చట్టాలకు నిరసనగా జరుగుతున్న ఉద్యమం మంగళవారం నిర్వహించే దేశవ్యాప్త బంద్తో మరింత ఉధృతమయ్యే అవకాశంవుంది. ఈ చట్టాలు ఇప్పటికే రాజకీయ ప్రకంపనలు సృష్టించాయి. పంజాబ్లో చిరకాలంగా బీజేపీకి మిత్రపక్షంగా వుంటున్న అకాలీదళ్ ఎన్డీఏకు దూరమైంది. గత కొన్ని రోజులుగా రైతు సంఘాల ప్రతినిధులతో కేంద్రం సాగిస్తున్న చర్చలు ఇంకా ఒక కొలిక్కిరాలేదు. చట్టాల రద్దు తప్ప మరి దేనికీ అంగీకరించబోమని రైతు సంఘాలు అంటున్నాయి. బుధవారం కూడా చర్చలు కొనసాగుతాయి గనుక ఒక ఆమోదయోగ్యమైన పరిష్కారం కుదురుతుందని ఆశించాలి. ఆ సంగతలావుంచితే ఆందోళన తీవ్రత పెరగడానికి మొదటినుంచీ కేంద్రం అనుసరిస్తున్న వైఖరే కారణమని చెప్పాలి. రైతులతో నేరుగా ముందే చర్చించి వుంటే, ఆ సంస్కరణలవల్ల కలుగుతాయంటున్న లాభాల గురించి వారికి అవగాహన కలిగిస్తే ఆందోళన ఈ స్థాయిలో సాగేది కాదు. అయితే తాము చర్చించామన్నదే కేంద్రం జవాబు. కరోనా వైరస్ సమస్యవల్ల 90 లక్షలమందికిపైగా రైతులతో వెబినార్ల ద్వారా మాట్లాడామంటున్నది. తమనెవరూ ఆహ్వానించలేదని, చర్చించలేదని రైతు సంఘాలు చెబుతున్నాయి. ఇక పార్లమెంటులో దాదాపు చర్చే జరగలేదు. బిల్లులకు చాలాముందే ఆర్డినెన్స్లు తీసుకురావడం, ఆ తర్వాత వాటి స్థానంలో తీసుకొచ్చిన బిల్లులు మూజువాణి ఓటుతో ఆమోదం పొందడంలాంటి కారణాలవల్ల రైతుల్లో సందేహాలు బలపడటానికి ఆస్కారం ఏర్పడింది. బిల్లుల్ని క్లాజులవారీగా క్షుణ్ణంగా చర్చించేలా సెలెక్ట్ కమిటీకి పంపివుంటే వేరుగా వుండేది. సాగు రంగంలో సంస్కరణలు అవసరమే అనుకున్నా వాటిని ఆదరా బాదరాగా తీసుకొస్తున్నారన్న అభిప్రాయం కలిగేలా ప్రవర్తించడం... రైతులపై బాష్పవాయుగోళాల, వాటర్ కేనన్ల ప్రయోగం సర్కారు తప్పిదం. దేశంలో ఏమూలనున్న రైతులైనా తమ దిగుబడులు ఎక్కడైనా అమ్ముకోవడానికి తాజా సంస్కరణలు అవకాశమిస్తున్నాయని, ఇందువల్ల మంచి ధర వచ్చినచోటే తమ ఉత్పత్తులు అమ్ముకోవడానికి వారికి వీలవుతుందని కేంద్రం వాదన. ఆ చట్టాల వల్ల లబ్ధిపొందామని చెబుతున్న రైతులతో ఒకటి, రెండు చానెళ్లు కార్యక్రమాలు కూడా రూపొందించాయి. అయితే రైతులకు మేలు కలిగే నిబంధనలున్నమాట వాస్తవమే అయినా, వాటికి తగిన రక్షణలు కల్పిం చకపోతే రైతులకు నష్టం కలుగుతుందని అకాలీదళ్ ఆర్డినెన్సుల జారీ సమయంలోనే తెలిపింది. వాటిని ఆపమని కోరింది. కనీస మద్దతు ధర(ఎంఎస్పీ) విషయంలో చట్టపరమైన రక్ష ణలుండాలని కోరింది. అయినా కేంద్రం దాన్ని పట్టించుకోలేదు. కొందరు తమ రాజకీయ ప్రయోజనాల కోసం రైతులను రెచ్చగొడుతున్నారని బీజేపీ చేస్తున్న ఆరోపణ నిజమే అనుకున్నా ఆర్డినెన్సులు రూపొందించే దశలోనే దాన్ని అంచనా వేసివుండాల్సింది. కేవలం వదంతులు, అపోహలతోనే ఇంత పెద్ద ఉద్యమం నడుస్తోందని ఇప్పుడు నమ్మించే ప్రయత్నం చేయడం వల్ల ఫలితం వుండదు. ఇప్పుడున్న వ్యవసాయ మార్కెట్ కమిటీలను రద్దు చేయడం వల్ల దళారుల గుత్తాధిపత్యం పోతుందని, రైతులు తమకు మంచి ధర వచ్చినచోట అమ్ముకోవచ్చని చెప్పడం బాగానే వున్నా...అందుకు తగిన ప్రత్యామ్నాయ వ్యవస్థలను ఏర్పర్చకుండా రైతులకు ఒరిగేదేమీ వుండదు. అలాంటి ప్రత్యామ్నాయ వ్యవస్థలను తమ ఏలుబడిలోని హరియాణా వంటి ఒకటి రెండు రాష్ట్రాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేసి చూపించవలసింది. వాటివల్ల మంచి ఫలితాలొస్తే రైతులే ఆ సంస్కరణల్ని స్వాగతిస్తారు. అందుకు భిన్నంగా హడావుడి ప్రదర్శించడం ఎందుకు? మన దేశంలో మెజారిటీ రైతులు చిన్న కమతాల్లో వ్యవసాయం సాగిస్తున్నవారే. వారు తమ దిగుబడికి ఎక్కడో బ్రహ్మాండమైన ధర పలుకుతోందని తెలుసుకుని అక్కడికెళ్లి అమ్ముకోవడం కుదిరే పనికాదు. వాస్తవానికి అన్ని రాష్ట్రాల్లోనూ మండీ వ్యవస్థ ఒకేలా లేదు. పంజాబ్, హరియాణా వంటిచోట్ల అవి బలంగా పనిచేస్తున్నాయి. దానికితోడు ప్రభుత్వం ఏటా ప్రకటించే మద్దతు ధర, సేకరణ విధానం కారణంగా అక్కడ పండించే ఉత్పత్తులకు మంచి రేటు పలుకుతోంది. గోధుమలు క్వింటాలుకు రూ. 1,900 పలుకుతుంటే మండీల వ్యవస్థ సరిగాలేని బిహార్ వంటిచోట్ల అది రూ. 800 మాత్రమే. వరి, గోధుమ తప్ప ఇతర దిగుబడులకు మద్దతు ధర ప్రకటించినా ఆ రేటుకు వారు అమ్ముకునేది తక్కువే. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ల్లో బక్క రైతులకు తోడ్పడే రైతుబంధు, వైఎస్సార్ ఆసరా వంటి పథకాలున్నాయి. ఆంధ్రప్రదేశ్లో అయితే కరోనా కాలంలో రైతులు పంటలు అమ్ముకోలేని పరిస్థితి ఏర్పడినప్పుడు ప్రభుత్వం రూ. 3,900 కోట్లు వెచ్చించి మొక్కజొన్న, కందులు, ఉలవలు, జొన్నలు, పొగాకు, అరటి తదితర పంటల్ని కొనుగోలు చేసింది. రైతు సంక్షేమానికి ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకుంటున్నచోట రైతులు ఆందోళనకు దిగే అవసరం ఏర్పడదు. కారణాలేమైనా... కారకులెవరైనా ప్రభుత్వం, రైతుల మధ్య ఇప్పుడు పరస్పర విశ్వాసం సన్నగిల్లిందన్నదైతే వాస్తవం. దాన్ని ఏమేరకు పునరుద్ధరించుకోగలమన్న అంశంపై శ్రద్ధ పెట్టడానికి బదులు ఎప్పటిలాగే రైతుల ఆందోళనపై కూడా ఖలిస్తానీ వేర్పాటువాదం, అర్బన్ మావోయిస్టు వంటి ముద్రలేయడం వల్ల ప్రయోజనం వుండదు. ఇలాంటి ఉద్యమాలు జరుగుతున్నప్పుడు స్వప్రయోజనం కోసం చొరబడే శక్తులు ఎప్పుడూ వుంటాయి. వాటిని ఉద్యమ నిర్వాహకులు గమ నించుకుని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. కానీ మొత్తం ఉద్యమానికే ఆ రంగు పులమాలనుకోవడం మంచిది కాదు. ఈ బంద్ ప్రశాంతంగా జరగాలని, ప్రతిష్టంభన సాధ్యమైనంత త్వరగా ముగిసి, ఒక మెరుగైన పరిష్కారం లభించాలని అందరూ కోరుకుంటారు. -
షాద్నగర్లో కేటీఆర్.. సిద్ధిపేటలో హరీష్రావు
సాక్షి, హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం అమలులోకి తెచ్చిన నూతన రైతు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపడుతున్న భారత్ బంద్కు టీఆర్ఎస్ మద్దతు తెలిపింది. మంగళవారం జరగనున్న బంద్కు మద్దతు తెలుపుతూ కీలక నేతలు ధర్నాల్లో పాల్గొననున్నారు. షాద్నగర్ జాతీయ రహదారిపై ధర్నాలో కేటీఆర్.. సిద్ధిపేట హైవేపై ధర్నాలో హరీష్రావు.. నిజామాబాద్ హైవేపై ధర్నాలో కవిత పాల్గొననున్నారు. ( ఢిల్లీలో ఉగ్ర కలకలం..!) 4 గంటలు మాత్రమే భారత్ బంద్ న్యూఢిల్లీ : మంగళవారం జరగనున్న రైతుల భారత్ బంద్ సమయంలో మార్పు చోటుచేసుకుంది. రేపు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు.. 4 గంటలు మాత్రమే భారత్ బంద్ చేపట్టాలని రైతు సంఘాలు నిర్ణయించాయి. సామాన్య ప్రజలకు ఇబ్బంది లేకుండా బంద్ వేళలలో మార్పులు చేశామని తెలిపాయి. కాగా, భారత్ బంద్ నేపథ్యంలో రేపు ఎక్కడ లారీలు అక్కడే నిలిపివేయాలని లారీల యజమానుల సంఘం నిర్ణయించింది. -
రైతుల ఆందోళనలకు ఉద్ధవ్ మద్దతు
సాక్షి, ముంబై: ఢిల్లీలో రైతులు చేస్తున్న ఆందోళనకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే మద్దతు ప్రకటించినట్లు ఆకాళీదల్ వెల్లడించింది. శిరోమణి ఆకాళీదల్ వర్కింగ్ కమిటీ బృందం ఆదివారం ఉద్దవ్ ఠాక్రేతో భేటీ అయింది. ఈ సందర్భంగా రైతుల ఆందోళనకు మద్దతు ఇస్తున్నట్టు ఆయన ప్రకటించినట్లు పేర్కొంది. గత కొన్ని రోజులుగా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన బిల్లులకు వ్యతిరేకంగా రైతులు ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆకాళీదల్ నేతలు, ఎంపీ చందు మాజరా తదితరులు ఉద్దవ్ ఠాక్రేతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆందోళన చేస్తున్న రైతులకు మద్దతు పలుకాలని ఉద్దవ్ను కోరారు. తొందర్లోనే ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్తో కూడా భేటీ కానున్నట్లు చందు మాజరా తెలిపారు. చదవండి: (హైదరాబాద్ ఫలితాలతో నూతనోత్తేజం!) ఎన్సీపీ మద్దతు: జయంత్ రైతు సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు పార్టీ కార్యకర్తలు మంగళవారం భారత్ బంద్లో పాల్గొనాలని మహారాష్ట్ర ఎన్సీపీ అధ్యక్షుడు జయంత్ పాటిల్ ఒక ప్రకటనలో తెలిపారు. వ్యవసాయ చట్టాలపై పార్లమెంటులో చర్చలు చేపట్టకపోవడాన్ని ఆయన ఖండించారు. రైతులు, కేంద్రం మధ్య జరుగుతున్న చర్చలు విఫలమవడంతో సంఘాలు ఇచ్చిన బంద్ పిలుపు మేరకు ఎన్సీపీ మద్దతు తెలుపుతోందన్నారు. రైతుల నిరసనలపై ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ డిసెంబర్ 9 న రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్తో భేటీ కానున్నారని తెలిపారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లోనే మూడు వ్యవసాయ బిల్లులను ప్రవేశపెట్టినప్పుడు ఎన్సీపీ వాకౌట్ చేసిందని జయంత్ గుర్తుచేశారు. 26నుంచి రైతులు చేస్తున్న ఆందోళనలకు మద్దతిస్తున్నామని అన్నారు. చదవండి: (రైతుల కోసం ఉరికి కూడా సిద్ధం: తేజస్వీ యాదవ్) -
భారత్ బంద్కు విపక్షాల మద్దతు
న్యూఢిల్లీ/ముంబై: రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలన్న డిమాండ్తో రైతు సంఘాలు ప్రకటించిన రేపటి ‘భారత్ బంద్’కు అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తోంది. ఈ దేశవ్యాప్త బంద్కు ఆదివారం కాంగ్రెస్, శివసేన, డీఎంకే, ఆప్ పార్టీలు తమ మద్దతు తెలిపాయి. ఇప్పటికే తృణమూల్ కాంగ్రెస్, ఆర్జేడీ, వామపక్షాలు, 10 కార్మిక సంఘాల ఐక్య కమిటీ బంద్కు మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. సత్వరం పరిష్కారం చూపనట్లయితే.. ఈ ఉద్యమం ఢిల్లీ నుంచి దేశం నలుమూలలకు విస్తరిస్తుందని ఎన్సీపీ నేత శరద్ పవార్ కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. డిసెంబర్ 9న పవార్ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ను కలిసి రైతు ఉద్యమ తీవ్రతను వివరించి, జోక్యం చేసుకోవాలని కోరుతారని ఎన్సీపీ అధికార ప్రతినిధి మహేశ్ వెల్లడించారు. పవార్తో పాటు రాష్ట్రపతిని కలిసే ప్రతినిధి బృందంలో సీతారాం ఏచూరి (సీపీఎం), డీ రాజా (సీపీఐ), టీఆర్ బాలు(డీఎంకే) ఉంటారన్నారు. రైతు ఆందోళనలపై కేంద్రం తీవ్రంగా యోచిస్తోందని అధికార వర్గాలు వెల్లడించాయి. అవసరమైతే ప్రత్యేక పార్లమెంటు సమావేశాలను నిర్వహించే విషయం కూడా పరిగణిస్తోందని తెలిపాయి. మరోవైపు, రేపటి(డిసెంబర్ 8, మంగళవారం) బంద్లో అన్ని వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని రైతు సంఘాలు విజ్ఞప్తి చేశాయి. ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్ నుంచి 250 మందికి పైగా రైతులు ఈ ఉద్యమంలో పాల్గొనేందుకు ఢిల్లీ వస్తున్నారని తెలిపాయి. ‘ఇది కేవలం పంజాబ్ రైతుల నిరసన కాదు. ఇది దేశవ్యాప్త నిరసన. కేంద్రం త్వరగా స్పందించనట్లయితే.. ఈ ఉద్యమాన్ని మరింత బలోపేతం చేస్తాం. మేం భారత్ బంద్కు పిలుపునివ్వడంపై నిన్నటి(శనివారం) చర్చల సందర్భంగా మంత్రులు ఆందోళన వ్యక్తం చేశారు’ అని రైతు నేత బల్దేవ్ సింగ్ యాదవ్ మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు. బంద్ నుంచి అంబులెన్స్లకు, అత్యవసర విభాగాలకు మినహాయింపు ఇచ్చామన్నారు. బంద్లో అంతా శాంతియుతంగా పాల్గొనాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ హింసాత్మక చర్యలకు దిగవద్దని విజ్ఞప్తి చేశారు. భారత్ బంద్కు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నామని కాంగ్రెస్ ప్రకటించింది. బంద్కు మద్దతుగా అన్ని రాష్ట్రాలు, జిల్లాల కేంద్రాల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తామని తెలిపింది. నటుడు కమల్హాసన్ పార్టీ ‘ఎంఎన్ఎం’ కూడా బంద్కు సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ, హెచ్ఎంఎస్, సీఐటీయూ..తదితర 10 కార్మిక సంఘాలు కూడా బంద్కు మద్దతు తెలిపాయి. ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయిస్ అసోసియేషన్ సహా పలు బ్యాంక్ యూనియన్లు భారత్ బంద్కు మద్దతు తెలిపాయి. ఎన్ఆర్ఐ కుటుంబాల మద్దతు ఈ ఉద్యమంలో అన్ని విధాలుగా సాయం చేసేందుకు విదేశాల్లోని తమ కుటుంబ సభ్యులు సిద్ధంగా ఉన్నారని కొందరు రైతులు వెల్లడించారు. దీర్ఘకాలం ఉద్యమం సాగించేందుకు వీలుగా రైతులు సిద్ధమై వచ్చిన విషయం తెలిసిందే. పళ్లు, కూరగాయలు, ఇతర నిత్యావసరాలను వారు సిద్ధం చేసి పెట్టుకున్నారు. ఢిల్లీ శివార్లకు భారీగా చేరుకున్న రైతులకు స్థానికులు, స్వచ్ఛంద సంస్థలు, స్థానిక గురుద్వారా సభ్యులు కూడా ఇతోధిక సాయం అందిస్తున్నారు. కెనడా, అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, బ్రిటన్ సహా పలు యూరోప్ దేశాల్లో పంజాబ్ మూలాలున్న ప్రవాస భారతీయులున్నారు. వారు వివిధ మాధ్యమాల ద్వారా ఇప్పటికే రైతు ఉద్యమానికి మద్దతు తెలిపారు. విపక్ష నేతల ఉమ్మడి ప్రకటన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతు సంఘాలు ప్రకటించిన భారత్ బంద్కు మద్దతుగా కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్, పీఏజీడీ చైర్మన్ ఫరూఖ్ అబ్దుల్లా తదితరులు ఆదివారం ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశారు. రైతుల న్యాయబద్ధ డిమాండ్లను కేంద్రం అంగీకరించాలని అందులో వారు కోరారు. ఈ ప్రకటనపై తేజస్వీ యాదవ్(ఆర్జేడీ), అఖిలేశ్యాదవ్(ఎస్పీ), డీ రాజా(ఆర్జేడీ), దీపాంకర్ భట్టాచార్య (సీపీఐఎంఎల్) తదతరులు సంతకాలు చేశారు. లండన్లోని భారత దౌత్య కార్యాలయం ఎదుట ప్లకార్డులతో ఎన్ఆర్ఐల నిరసన -
రైతుల కోసం రోడ్డెక్కుతాం..
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు అప్పగిస్తూ కేంద్ర ప్రభుత్వం నల్ల చట్టాలను తెచ్చిందని, దాన్ని వ్యతిరేకంగా ఈ నెల 8న జరిగే ‘భారత్ బంద్’కు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కె.తారక రామారావు ప్రకటించారు. కేంద్రం మెడలు వంచేందుకు రైతులు చేస్తున్న పోరాటానికి తమ పార్టీ సెల్యూట్ చేస్తోందని, రైతుల కోసం ఎన్నో పురోగమనశీల నిర్ణయాలు తీసుకున్న రాష్ట్రంగా అన్నదాతల ఆందోళనకు మద్దతు పలుకుతున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు. భారత్ బంద్లో తనతోపాటు మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ శ్రేణులు ఈ నెల 8న జాతీయ రహదారులపై ధర్నాకు దిగుతున్నట్లు ప్రకటించారు. రైతు విభాగం సభ్యులు, రైతు బంధు సమితి బాధ్యులు కూడా ఈ ధర్నాలో పాల్గొనాల్సిందిగా పిలుపునిచ్చారు. భారత్ బంద్కు సంఘీభావంగా వ్యాపార, వాణిజ్య సంఘాలు మంగళవారం 2 గంటలు ఆలస్యంగా తమ కార్యకలాపాలు ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు. ట్రాన్స్పోర్ట్ ఆపరేటర్లు, ఆర్టీసీ కూడా తమ ఆందోళనకు సహకరించాల్సిం దిగా కేటీఆర్ కోరారు. ఈ మేరకు వ్యాపార, వాణిజ్య సంస్థల ప్రతి నిధులను పార్టీ శ్రేణులు కలసి బంద్కు సహకారం కోరాలని సూచించారు. మంత్రులు సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, మహమూద్ అలీ, టీఆర్ఎస్ పార్లమెం టరీ పార్టీ నేత కె.కేశవరావుతో కలసి ఆదివారం తెలంగాణ భవన్లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. వ్యవసాయ బిల్లులను పార్లమెంటులో తమ పార్టీ ఎంపీలు వ్యతిరేకిస్తూ ఓటు వేసినా కేంద్ర ప్రభుత్వం మందబలంతో ఆమోదించిందని మండిపడ్డారు. రైతుల ఉద్యమానికి కేసీఆర్ వెన్నుదన్ను.. రైతుల ఆందోళనకు సీఎం వెన్నుదన్నుగా ఉంటారని, అవసరమైతే ఉద్యమానికి నేతృత్వం వహించే శక్తి కేసీఆర్కు ఉందని మంత్రి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో రైతు సంక్షేమానికి ఏటా రూ.60 వేల కోట్లు వెచ్చిస్తున్నామన్నా రు. ఈ భేటీ ఎమ్మెల్యే బాల్క సుమన్, ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డి, జీహెచ్ఎంసీ మేయర్ రామ్మోహన్ పాల్గొన్నారు. -
ఢిల్లీతో ఢీకి టీఆర్ఎస్ రెడీ
ఈ నెల 8న రైతులు తలపెట్టిన ‘భారత్ బంద్’కు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ స్వయంగా ప్రకటించారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో బంద్కు మద్దతుగా ధర్నాలు, ర్యాలీలు నిర్వహించేందుకు పార్టీ సిద్ధమవుతోంది. రాజకీయంగా టీఆర్ఎస్ను ఇరుకున పెట్టేలా బీజేపీ ఇటీవల రాష్ట్రంలో అనుసరిస్తున్న వైఖరిని తిప్పికొట్టేలా వ్యూహరచన చేయడంపై టీఆర్ఎస్ దృష్టి సారించింది. సాక్షి, హైదరాబాద్: తాజా రాజకీయ పరిస్థితుల్లో బీజేపీపై దూకుడుగా వెళ్లాలని టీఆర్ఎస్ నిర్ణయిం చింది. వ్యవసాయ చట్టాలు, ప్రభుత్వరంగ సంస్థల అమ్మకం, కేంద్ర ప్రభుత్వ ఇతర ప్రజావ్యతిరేక విధానాలను ఎండగడుతూ ప్రత్యక్ష కార్యాచరణకు దిగనుంది. భావసారూప్య పార్టీలతో కలిసి జాతీయ స్థాయిలో ఉద్యమించేందుకూ సిద్ధమవు తోంది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నుంచి బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి అంశాల వారీగా మద్దతు ఇస్తూ వచ్చిన టీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలోని తాజా సమీకరణాలతో భిన్న వైఖరి తీసుకోనుంది. ఓ వైపు క్షేత్రస్థాయిలో టీఆర్ఎస్ యంత్రాంగాన్ని క్రియాశీలం చేస్తూనే... మరోవైపు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని నిర్ణయించింది. విపక్షనేతలతో టచ్లో కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ చేతులెత్తేసిందని, మోదీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడటానికి జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయ శక్తి అవసరం ఉందనే విషయాన్ని సీఎం కేసీఆర్ పలు సందర్భాల్లో ప్రస్తావిస్తూ వస్తున్నారు. డిసెంబర్ రెండో వారంలో బీజేపీ వ్యతిరేక పార్టీలతో హైదరాబాద్లో భారీ సదస్సును నిర్వహిస్తామని గత నెలలో కేసీఆర్ ప్రకటించారు. రైతు సమస్యలపై ఢిల్లీలో జరుగుతున్న ఆందోళన కార్యక్రమాల ఫలితాన్ని చూసిన తర్వాత వివిధ రాష్ట్రాలకు చెందిన నేతలతో సమావేశం ఏర్పాటు చేయాలని కేసీఆర్ భావిస్తున్నారు. బీజేపీ విధానాలను వ్యతిరేకిస్తున్న ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్, అఖిలేశ్ యాదవ్, స్టాలిన్ వంటి నేతలతో కేసీఆర్ ఇప్పటికే పలు దఫాలు చర్చలు జరిపారు. ఇటీవల జరిగిన బీహార్ ఎన్నికల సందర్భంగా ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్ కూడా తనతో టచ్లో ఉన్నట్లు కేటీఆర్ వెల్లడించారు. క్షేత్రస్థాయిలో మరింత బలంగా రాష్ట్ర ఆవిర్భావం తర్వాత అభివృద్ది లక్ష్యంగా పనిచేస్తూ... రాజకీయ పార్టీలు, విమర్శల జోలికి పెద్దగా వెళ్లకపోవడం కూడా తమకు నష్టం చేసిందని టీఆర్ఎస్ భావిస్తోంది. కేంద్ర నిధులు, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై బీజేపీ ఇటీవలి కాలంలో విమర్శలు పెంచినా తిప్పికొట్టడంలో టీఆర్ఎస్ విఫలమైందనే భావన నెలకొంది. దుబ్బాక ఉప ఎన్నికతో పాటు గ్రేటర్ ఎన్నికల ఫలితాలే దీనికి నిదర్శనమని టీఆర్ఎస్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో పార్టీ యంత్రాంగంలో కదలిక తేవడంతో పాటు, ప్రజల్లోకి దూకుడుగా వెళ్లాలని టీఆర్ఎస్ నిర్ణయించింది. ఈ వ్యూహంలో భాగంగా జిల్లాల్లో పార్టీ కార్యాలయాల ప్రారంభోత్సవాలు, శిక్షణ కార్యక్రమాలను అట్టహాసంగా నిర్వహించాలని భావిస్తోంది. పార్టీ అధ్యక్షుడు కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ల క్షేత్రస్థాయి పర్యటనలు వీలైనన్ని ఎక్కువగా ఉండేలా చూడనుంది. అలాగే మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ యంత్రాంగం నిరంతరం ప్రజల్లో ఉండేలా చూడాలని నిర్ణయించింది. భారత్ బంద్కు సంపూర్ణ మద్దతు: కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: రైతులు ఈ నెల 8న తలపెట్టిన భారత్ బంద్కు టీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. టీఆర్ఎస్ శ్రేణులు బంద్లో ప్రత్యక్షంగా పాల్గొంటాయని వెల్లడించారు. కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు న్యాయమైన పోరాటాన్ని చేస్తున్నారని భారత్ బంద్ను కేసీఆర్ సమర్థించారు. రైతు ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా ఉన్నందునే పార్లమెంటులో వ్యవసాయ బిల్లులను టీఆర్ఎస్ వ్యతిరేకించిందని కేసీఆర్ గుర్తుచేశారు. కొత్త వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకునే వరకు పోరాటం కొనసాగించాల్సిన అవసరం ఉందన్నారు. భారత్ బంద్ విజయవంతానికి టీఆర్ఎస్ పార్టీ కృషి చేస్తుందని, బంద్కు సంఘీభావం తెలిపి రైతులకు అండగా నిలవాలని ప్రజలకు సీఎం కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. -
భారత్ బంద్ : కేసీఆర్ కీలక నిర్ణయం
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీలో రైతులు చేపట్టిన దీక్షకు తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ మద్దతు ప్రకటించారు. రైతులపై కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా ఈ నెల 8న రైతు సంఘాలు తలపెట్టిన భారత్ బంద్కు సంపూర్ణ మద్దతు తెలిపారు. భారత్ బంద్లో రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ శ్రేణులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. భారత్ బంద్ విజయవంతానికి టీఆర్ఎస్ పార్టీ కృషి చేస్తుందని చెప్పారు. బంద్ను విజయవంతం చేసి రైతులకు అండగా నిలవాలని కేసీఆర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రైతుల పోరాటం న్యాయబద్ధమైనది, వారి డిమాండ్స్కు టీఆర్ఎస్ పార్టీ మద్దతినిస్తుందని ఆదివారం ఓ ప్రకటన ద్వారా సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. (చర్చల్లో ప్రతిష్టంభన.. పట్టువీడని రైతులు) ఢిల్లీలోని విజ్ఞాన్భవన్లో శనివారం మధ్యాహ్నం 2.30 గంటలకు కేంద్ర మంత్రులు, 40 మంది రైతు సంఘాల ప్రతినిధులతో ఐదో విడత చర్చలు జరిగాయి. దాదాపు 4 గంటలపాటు జరిగిన చర్చలకు కేంద్రం తరఫున వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ నాయకత్వం వహించారు. అయినప్పటికీ.. ఆందోళన బాట పట్టిన రైతు సంఘాలతో కేంద్రం జరిపిన చర్చలు ఎటూ తేలకుండానే ముగిశాయి. శనివారం జరిగిన ఐదో విడత చర్చల్లో వ్యవసాయ చట్టాల రద్దుపైనే రైతు సంఘాల ప్రతినిధులు ప్రధానంగా పట్టుబట్టారు. అయితే, నిర్దుష్ట ప్రతిపాదనలు చేసేందుకు కేంద్రం 9వ తేదీ వరకు సమయం కోరింది. దీంతో 11 రోజులుగా దేశ రాజధాని కేంద్రంగా చేపట్టిన రైతు సంఘాల ఆందోళన మరికొద్ది రోజులు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. తమ డిమాండ్ల సాధనకు 8వ తేదీన రైతు సంఘాలు భారత్ బంద్కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ బంద్కు పలు ప్రతిపక్ష పార్టీలు, కార్మిక సంఘాలు మద్దతు ప్రకటించాయి. మంగళవారం నాటి బంద్కు మద్దతుగా పెద్ద ఎత్తున రైతులు దేశ రాజధానికి చేరకుంటున్నారు. విపక్షాల మద్దతు.. 8వ తేదీన రైతు సంఘాలు ఇచ్చిన భారత్ బంద్ పిలుపునకు కాంగ్రెస్తోపాటు ఆర్జేడీ, తృణమూల్ కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, సీపీఐఎంఎల్, ఆర్ఎస్పీ, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తదితర వామపక్షాలు, డీఎంకే మద్దతు ప్రకటించాయి. బంద్కు 10 కేంద్ర కార్మిక సంఘాల వేదిక మద్దతుగా నిలిచింది. రైతులకు మద్దతుగా పంజాబ్కు చెందిన పలువురు మాజీ క్రీడాకారులు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు తమ పద్మశ్రీ, అర్జున అవార్డులను వాపసు చేసేందుకు ఢిల్లీకి బయలుదేరారు. -
చర్చల్లో ప్రతిష్టంభన.. పట్టువీడని రైతులు
న్యూఢిల్లీ : ఆందోళన బాట పట్టిన రైతు సంఘాలతో కేంద్రం జరుపుతున్న చర్చలు మరోసారి ఎటూ తేలకుండానే ముగిశాయి. శనివారం జరిగిన ఐదో విడత చర్చల్లో వ్యవసాయ చట్టాల రద్దుపైనే రైతు సంఘాల ప్రతినిధులు ప్రధానంగా పట్టుబట్టారు. అయితే, నిర్దుష్ట ప్రతిపాదనలు చేసేందుకు కేంద్రం 9వ తేదీ వరకు సమయం కోరింది. దీంతో 11 రోజులుగా దేశ రాజధాని కేంద్రంగా చేపట్టిన రైతు సంఘాల ఆందోళన మరికొద్ది రోజులు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. తమ డిమాండ్ల సాధనకు 8వ తేదీన రైతు సంఘాలు భారత్ బంద్కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ బంద్కు పలు ప్రతిపక్ష పార్టీలు, కార్మిక సంఘాలు మద్దతు ప్రకటించాయి. ఢిల్లీలోని విజ్ఞాన్భవన్లో శనివారం మధ్యాహ్నం 2.30 గంటలకు కేంద్ర మంత్రులు, 40 మంది రైతు సంఘాల ప్రతినిధులతో ఐదో విడత చర్చలు ప్రారంభమయ్యాయి. దాదాపు 4 గంటలపాటు జరిగిన చర్చలకు కేంద్రం తరఫున వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ నాయకత్వం వహించారు. చర్చల్లో రైల్వేలు, వాణిజ్యం, ఆహారం శాఖల మంత్రి పీయూష్ గోయల్, పంజాబ్కు చెందిన ఎంపీ, వాణిజ్య శాఖ సహాయ మంత్రి సోమ్ ప్రకాశ్ పాల్గొన్నారు. గత సమావేశాల్లో చర్చల సందర్భంగా హామీ ఇచ్చిన అంశాలపై కేంద్రం తీసుకున్న చర్యలను వ్యవసాయ శాఖ కార్యదర్శి సంజయ్ అగర్వాల్ వారికి వివరించారు. రైతుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చర్చల ప్రారంభం సందర్భంగా పంజాబీలో మంత్రి సోమ్ ప్రకాశ్ వారికి తెలిపారు. ఇటీవల తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రైతు ప్రతినిధులు గట్టిగా పట్టుబడ్డారు. స్పష్టమైన హామీ లభించకుంటే బయటకు వెళ్లిపోతామంటూ తెగేసి చెప్పారు. రైతుల పట్ల ప్రభుత్వం సానుకూల ధోరణితో ఉందనీ, వారి సమస్యలను పరిష్కరిస్తామని దీంతో మంత్రులు వారికి సర్దిచెప్పారు. అయితే, సాగు చట్టాల రద్దు విషయం తేల్చాలంటూ రైతు ప్రతినిధులు గంటపాటు మౌనవ్రతం సాగించారు. దీంతో ఈ సమస్యకు పరిష్కారం కనుగొనేందుకు, అంతర్గతంగా చర్చలు జరిపి నిర్దిష్ట ప్రతిపాదనలు తయారు చేసేందుకు ఈ నెల 9 వరకు సమయం కావాలని ప్రభుత్వ ప్రతినిధులు కోరారు. దీంతో చర్చలు ఎటూ తేలకుండానే వాయిదా పడ్డాయి. ఆహారం, టీ వెంట తెచ్చుకున్న రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో సింఘూ వద్ద ఆందోళన సాగిస్తున్న ప్రాంతం నుంచి చర్చల్లో పాల్గొనేందుకు వచ్చిన రైతు సంఘాల ప్రతినిధులు ఆహారం, టీ తమతోపాటు తెచ్చుకున్నారు. గురువారం కూడా రైతులు ఆహారం, టీతోపాటు మంచినీరు తెచ్చుకున్న విషయం తెలిసిందే. రైతు ప్రతినిధుల సూచనలు కోరాం: తోమర్ చర్చల అనంతరం మంత్రి తోమర్ మీడియాతో మాట్లాడారు. ‘కొన్ని కీలక అంశాలపై రైతు సంఘాల నేతల నుంచి నిర్దిష్ట సూచనలను కోరాం. అయితే, చలి తీవ్రత దృష్ట్యా ఆందోళనల్లో పాలుపంచుకుంటున్న వృద్ధులు, మహిళలు, పిల్లల్ని ఇళ్లకు పంపించాలని కోరాం’అని తెలిపారు. వివిధ పార్టీలు..సంఘాల మద్దతు 8వ తేదీన రైతు సంఘాలు ఇచ్చిన భారత్ బంద్ పిలుపునకు కాంగ్రెస్తోపాటు ఆర్జేడీ, తృణమూల్ కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, సీపీఐఎంఎల్, ఆర్ఎస్పీ, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తదితర వామపక్షాలు, డీఎంకే మద్దతు ప్రకటించాయి. బంద్కు 10 కేంద్ర కార్మిక సంఘాల వేదిక మద్దతుగా నిలిచింది. రైతులకు మద్దతుగా పంజాబ్కు చెందిన పలువురు మాజీ క్రీడాకారులు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు తమ పద్మశ్రీ, అర్జున అవార్డులను వాపసు చేసేందుకు ఢిల్లీకి బయలుదేరారు. రహదారులే గ్రామాలుగా... ఢిల్లీకి వెళ్లే కీలక రహదారులపై రైతులు నిరసలు తెలుపుతుండటంతో గడిచిన 10 రోజులుగా ఈ మార్గాల్లో ట్రాపిక్ జాంలు పెరిగిపోయాయి. దీంతో పోలీసులు కొన్ని మార్గాలను మూసివేసి, మరికొన్ని రోడ్లలో వాహనాలను దారి మళ్లిస్తున్నారు. దీర్ఘకాలం పోరుకు రైతులు సమాయత్తం అవుతుండటంతో కొన్ని రోడ్లు గ్రామాలుగా మారిపోయాయి. రైతులు రోడ్లపైనే ట్రాక్టర్లు నిలిపి, వాటిపై టెంట్లు వేసుకున్నారు. అక్కడే వంటావార్పూ చేపట్టారు. అవసరమైన సరుకులు, కాయగూరలు వంటివి అక్కడికి అందుతున్నాయి. సెల్ఫోన్లకు సోలార్ ప్యానళ్లతో చార్జింగ్ చేసుకుంటున్నారు. ఆందోళనల్లో పాలుపంచుకుంటున్న వృద్ధుల కోసం కొందరు వైద్యులు వైద్య శిబిరాలు సైతం ఏర్పాటు చేశారు. వృద్ధులు హుక్కా పీలుస్తూ కాలం గడుపుతున్నారు. చర్చలకు ముందు ప్రధానితో భేటీ రైతు సంఘాల ప్రతినిధులతో చర్చలకు వెళ్లేముం దు మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్లు ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. రైతుల ముందుంచబోయే ప్రతిపాదనలపై వారంతా కలసి చర్చించినట్లు సమాచారం. రైతుల ఆందోళనలపై కేంద్ర మంత్రులతో ప్రధాని చర్చలు జరపడం ఇదే మొదటి సారి. రైతు ప్రతినిధుల మౌనవ్రతం చర్చల సందర్భంగా మూడు వ్యవసాయ చట్టాల రద్దు విషయంలో రైతు సంఘాల ప్రతినిధులంతా మౌనవ్రతం పాటించారు. ప్రధానమైన ఈ డిమాండ్ కేంద్రానికి సమ్మతమా కాదా స్పష్టం చేయాలని కోరుతూ ప్రతినిధులు అవును/ కాదు అని రాసి ఉన్న కాగితాలను వారు నోటికి అతికించుకున్నారని పంజాబ్ కిసాన్ యూనియన్ నేత రుల్ధు సింగ్ తెలిపారు. ప్రభుత్వం వారిని మాట్లాడించేందుకు మౌనంతోనే సమాధానం చెప్పారని మరో నేత కవితా కురుగంటి వెల్లడించారు. కేంద్రం నుంచి ఎటువంటి స్పందన రాలేదని చెప్పారు. సాగు చట్టాలకు ప్రభుత్వం పలు సవరణలు చేస్తామంటూ ముందుకు వచ్చిందనీ, తాము మాత్రం పూర్తిగా రద్దు చేయాలని కోరామని బీకేయూ ఏక్తా అధ్యక్షుడు జోగిందర్ సింగ్ ఉగ్రహన్ చెప్పారు. శనివారం సింఘూ వద్ద జరిగిన ధర్నాలో నినదిస్తున్న రైతుల పిల్లలు చర్చల విరామ సమయంలో వెంట తెచ్చుకున్న ఆహారం తింటున్న రైతు సంఘాల ప్రతినిధులు -
రైతులకు బాసటగా..లంగార్ సేవలు
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో రైతులు ఆందోళన చేపడుతున్న సంగతి తెలిసిందే. గత కొద్దిరోజులుగా ప్రభుత్వానికి రైతులకు మధ్య చర్చలు జరుగుతున్నా అవి ఫలితాన్నివ్వటం లేదు. అదే సమయంలో కేంద్రంపై ఒత్తిడిని మరింత పెంచేందుకు రైతులు తమ ఉద్యమాన్ని ముమ్మరం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ - సింఘు సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతులకు 25 సభ్యులు కలిగిన ఓ ముస్లిం సమాఖ్య బృందం బాసటగా నిలుస్తోంది. నిరసన చేస్తున్న రైతులందిరికీ ఉచితం ఆహారాన్ని అందిస్తోంది. రైతుల ఆందోళన విరమించేదాకా తమ సేవలు కొనసాగుతాయని, రైతుల కోసం 24x7 గంటలు పనిచేస్తామని ముస్లిం సమాఖ్య బృందం ప్రతినిధి ముబీన్ అన్నారు. మనందరికీ అన్నం పెట్టే రైతుకు కష్టం వచ్చినప్పుడు వారిని చూసుకోవడం మనందరి బాధ్యత అని తెలిపారు. (8న భారత్ బంద్) మరోవైపు అసంపూర్తిగా ముగిసిన చర్చలను మరోసారి కొనసాగించేందుకు రైతులు సంఘాల నాయకులు, కేంద్రం సిద్ధమయ్యారు. తమ డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం అంగీకరించకపోతే డిసెంబర్ 8న భారత్ బంద్ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని రైతులు ప్రకటించారు. అదే సమయంలో దేశ రాజధాని ఢిల్లీలోని మిగిలిన రహదారులను సైతం అడ్డుకునే ప్రణాళిక రూపొందించినట్లు రైతు నాయకుడు హర్విందర్ సింగ్ లఖ్వాల్ తెలిపారు. మోడీ ప్రభుత్వం, కార్పొరేట్ సంస్థల దిష్టిబొమ్మలను నేడు దేశవ్యాప్తంగా దగ్ధం చేయాలని నిర్ణయించారు. (‘మద్దతు’ కోసం మట్టిమనుషుల పోరాటం!! ) -
8న భారత్ బంద్
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రంపై ఒత్తిడిని మరింత పెంచేందుకు రైతులు తమ ఉద్యమాన్ని ముమ్మరం చేయాలని నిర్ణయించారు. డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం అంగీకరించకపోతే డిసెంబర్ 8న భారత్ బంద్ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని రైతులు ప్రకటించారు. అదే సమయంలో దేశ రాజధాని ఢిల్లీలోని మిగిలిన రహదారులను సైతం అడ్డుకునే ప్రణాళిక రూపొందించినట్లు రైతు నాయకుడు హర్విందర్ సింగ్ లఖ్వాల్ తెలిపారు. మోడీ ప్రభుత్వం, కార్పొరేట్ సంస్థల దిష్టిబొమ్మలను నేడు దేశవ్యాప్తంగా దగ్ధం చేయాలని నిర్ణయించారు. గణతంత్ర దినోత్సవ కవాతులో రైతులు పాల్గొనాలని ఢిల్లీ –ఘజియాబాద్ సరిహద్దులో ఆందోళనకు నాయకత్వం వహించిన రైతు నాయకుడు రాకేశ్ తికాయత్ పిలుపునిచ్చారు. మరోవైపు భారత ప్రభుత్వ సవరణను అంగీకరించే ప్రసక్తిలేదని, సింఘు సరిహద్దులో ఉద్యమానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కిసాన్ సభ అఖిల భారత ప్రధాన కార్యదర్శి హన్నన్ మొల్లాహ్ తెలిపారు. రైతు ఉద్యమాన్ని పంజాబ్ ఉద్యమం అని మాత్రమే ప్రచారం చేస్తుండడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది కేవలం ప్రభుత్వ కుట్ర అని విమర్శించారు. అయితే ఈ ఉద్యమం భారతదేశం అంతటా జరుగుతోందని, ప్రభుత్వం తమ డిమాండ్లను అంగీకరించని పరిస్థితుల్లో, ఉద్యమం మరింత దూకుడుగా జరుగుతుందని మొల్లాహ్ హెచ్చరించారు. కెనడాకు వార్నింగ్ గురువారం అసంపూర్తిగా ముగిసిన చర్చలను మరోసారి కొనసాగించేందుకు రైతులు సంఘాల నాయకులు, కేంద్రం సిద్ధమయ్యారు. రైతులు చేస్తున్న నిరసనలు పది రోజులకు చేరుకున్న నేపథ్యంలో నేడు మధ్యాహ్నం 2 గంటలకు విజ్ఞాన్ భవన్లో కేంద్రంతో రైతులు మరో దఫా చర్చలు జరుపనున్నారు. ఇదిలా ఉండగా కేంద్ర విదేశాంగ శాఖ భారత్లో కెనడా హైకమిషనర్ నాదిర్ పటేల్ను శుక్రవారం హాజరు కావాల్సిందిగా ఆదేశించింది. అనంతరం కెనడా ప్రధాని, కేబి నెట్ మంత్రులు భారత్లో జరుగుతున్న నిరసనలపై స్పందించడాన్ని తప్పుబడుతూ.. అలాంటి వ్యాఖ్యలు చేస్తే ఇరు దేశాల మధ్య బంధాలు దెబ్బతింటాయని హెచ్చరించింది. -
వ్యవసాయ బిల్లులపై నిరసనలు
చండీగఢ్/న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులపై రైతన్నలు భగ్గుమన్నారు. తమకు నష్టదాయకమైన ఈ బిల్లులను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రోడ్డెక్కారు. ప్రధానంగా పంజాబ్, హరియాణా రాష్ట్రాలు శుక్రవారం అన్నదాతల ఆందోళనలతో అట్టుడికిపోయాయి. దేశవ్యాప్త బంద్లో భాగంగా రైతులు ఎక్కడికక్కడ వీధుల్లోకి వచ్చారు. రహదారులను దిగ్బంధించారు. వ్యవసాయ బిల్లులను ప్రభుత్వం వెనక్కి తీసుకునే వరకూ తాము పోరాటం ఆపే ప్రసక్తే లేదని నినదించారు. రైతుల నిరసనలతో పంజాబ్, హరియాణాలో జనం రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. ఆర్టీసీ బస్సులు డిపోల్లోనే నిలిచిపోయాయి. గురువారం ప్రారంభమైన రైలు రోకో రెండో రోజు శుక్రవారం కూడా కొనసాగింది. రైతులు రైలు పట్టాలపై బైఠాయించారు. వ్యవసాయ బిల్లులపై రైతుల ఉద్యమానికి తమ ప్రభుత్వం అండగా ఉంటుందని పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ ప్రకటించారు. పంజాబ్లో అధికార కాంగ్రెస్ పార్టీతోపాటు ఆమ్ ఆద్మీ పార్టీ బంద్కు మద్దతునిచ్చాయి. ప్రతిపక్ష శిరోమణి అకాలీదళ్ రాష్ట్రంలో పలుచోట్ల రోడ్ల దిగ్బంధం చేపట్టింది. వ్యవసాయ బిల్లులపై ప్రతిపక్ష కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ బిల్లులతో రైతులను బానిసలుగా మారుస్తారా? అని నిలదీసింది. కనీస మద్దతు ధరను రైతుల నుంచి దూరం చేయడం ఏమిటని ప్రశ్నించింది. వారి పోరాటానికి సంపూర్ణ మద్దతు ఉంటుందని వెల్లడించింది. -
భారత్ బంద్: రోడ్డెక్కిన రైతన్న.. రహదారుల దిగ్భందం
న్యూఢిల్లీ: పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా రైతు సంఘాల యూనియన్లు శుక్రవారం భారత్ బంద్కు పిలుపునిచ్చాయి. రైతు సంఘాలు ఇచ్చిన పిలుపుతో పలు రాష్ట్రాలలో రైతులు రోడ్డెక్కారు. జాతీయ రహదారుల దిగ్బంధం, రైల్ రోకో వంటి కార్యక్రమాలను నిర్వహిస్తూ తమ నిరసనలు తెలియజేస్తున్నారు. దేశవ్యాప్తంగా బంద్కు మద్దతుగా.. కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, ద్రవిడ మున్నేట్రా కగం, తృణమూల్ కాంగ్రెస్, రాష్ట్రీయ జనతాదళ్ సహా 18 ప్రతిపక్షపార్టీలు మద్దతు తెలిపాయి. భారత్ బంద్కు పిలుపునిచ్చిన యూనియన్లలో భారతీయ కిసాన్ యూనియన్ (బికెయు), అఖిల భారత రైతు సంఘం (ఎఐఎఫ్యు), అఖిల భారత కిసాన్ సంఘర్ష్ సమన్వయ కమిటీ (ఎఐకెఎస్సిసి), అఖిల భారత కిసాన్ మహాసంఘ్ (ఎఐకెఎం) ఉన్నాయి. (సాగు బిల్లులకు పార్లమెంటు ఓకే) పంజాబ్లో బంద్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. ఢిల్లీ - హర్యానా సరిహద్దును కూడా మూసివేసే అవకాశం ఉంది. అయితే పంజాబ్, హర్యానాల్లో 31 రైతు సంఘాల ఆధ్వర్యంలో రైతులు గత నాలుగు రోజుల నుంచి ధర్నాలు, నిరసనలు కొనసాగిస్తున్నారు. శుక్రవారం రోజున పంజాబ్, హర్యానా, పశ్చిమ ఉత్తరప్రదేశ్ పూర్తిగా షట్డౌన్ చేయనున్నట్లు భారతీయ కిసాన్ యూనియన్ అధ్యక్షుడు రాకేశ్ టకైట్ తెలిపారు. కాగా.. పార్లమెంట్ ఆమోదించిన వ్యవసాయ బిల్లులను తక్షణం రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు నేడు భారత్ బంద్ నిర్వహిస్తున్నారు. ఈ వ్యవసాయబిల్లులతో చిన్న సన్నకారు రైతులు తీవ్రంగా నష్టపోతారని ప్రతిపక్షాలు, రైతు సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. -
సాగు బిల్లులపై కాంగ్రెస్ పోరు
న్యూఢిల్లీ/చండీగఢ్: వ్యవసాయ, కార్మిక సంస్కరణల బిల్లులను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఆందోళనలను ప్రారంభించింది. ఈ నిరసన కార్యక్రమాలను రెండు నెలలపాటు నిర్వహిస్తామని చెప్పింది. ఇందులో భాగంగా పంజాబ్లో గురువారం రైల్ రోకో నిర్వహించింది. కిసాన్ మజ్దూర్ సంఘర్‡్ష కమిటీ, ఇతర రైతు సంఘాలు సంయుక్తంగా ఇచ్చిన పిలుపు మేరకు ఈ రైల్ రోకో కార్యక్రమం మొదలైంది. భారతీయ కిసాన్ యూనియన్ కార్యకర్తలు బర్నాలా, సంగ్రూర్ ప్రాంతంలో రైల్వే పట్టాలపై కూర్చుని తమ నిరసన వ్యక్తం చేశారు. కిసాన్ మజ్దూర్ సంఘర్‡్ష కమిటీదేవిదాస్పూర్, బస్తీ టాంకా వాలాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించింది. ప్రభుత్వ ఉద్యోగులు, కార్మికులు తమ ఆందోళనలకు మద్దతిస్త్నునట్లు కమిటీ ప్రతినిధులు కొందరు తెలిపారు. నేడు భారత్ బంద్ వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ పలు రైతు సంఘాలు శుక్రవారం భారత్ బంద్కు పిలుపునిచ్చాయి. రైతుల ఎజెండాకు కాంగ్రెస్, ఆప్, శిరోమణి అకాలీదళ్ మద్దతు పలికాయి. 25న అంటే శుక్రవారం పూర్తిస్థాయి బంద్ నిర్వహించాలని రైతు సంఘాలు నిర్ణయించాయి. ప్రధాని నరేంద్ర మోదీ రైతులను, కార్మికులను లక్ష్యంగా చేసుకున్నారని ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ ట్విట్టర్లో తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. -
రేపు భారత్ బంద్కు రైతు సంఘాల పిలుపు
సాక్షి, న్యూఢిల్లీ : పార్లమెంట్లో ఆమోదం పొందిన వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ శుక్రవారం తలపెట్టిన భారత్ బంద్కు 20కి పైగా రైతు సంఘాలు మద్దతు ప్రకటించాయి. మరోవైపు ఈ బిల్లులకు నిరసనగా పంజాబ్, హరియాణాల్లో పార్టీలకు అతీతంగా 31 రైతు సంఘాలు ఆందోళనల్లో పాలుపంచుకుంటున్నాయి. అఖిల భారత రైతు సమాఖ్య (ఏఐఎఫ్యూ), భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) అఖిల భారత కిసాన్ మహాసంఘ్ (ఏఐకేఎం) వంటి రైతు సంఘాలు శుక్రవారం దేశవ్యాప్త బంద్కు పిలుపు ఇచ్చాయి. కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రలోనూ పలు రైతు సంఘాలు షట్డౌన్కు పిలుపు ఇవ్వగా భారత్ బంద్కు ఏఐటీయూసీ, సీఐటీయూ, హిందూ మజ్ధూర్ సభ వంటి పలు కార్మిక సంఘాలు మద్దతు ప్రకటించాయి. మద్దతు ధర, ఆహార భద్రతను బహుళజాతి సంస్థలు, కార్పొరేట్ల గుప్పిట్లో పెడితే దేశవ్యాప్తంగా అలజడి రేగుతుందని ఆల్ ఇండియా కిసాన్ సంఘర్ష్ సమన్వయ కమిటీ కన్వీనర్ వీఎం సింగ్ హెచ్చరించారు. వ్యవసాయ బిల్లులను తిప్పిపంపాలని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ బిల్లులను అడ్డుకోవాలని 18 విపక్ష పార్టీలు బుధవారం రాష్ట్రపతిని కలిసి విన్నవించాయి. సభ పున:పరిశీలనకు వ్యవసాయ బిల్లులను వెనక్కిపంపాలని విపక్షాలు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ను అభ్యర్థించాయి. వ్యవసాయ బిల్లుల ఆమోదంతో కనీస మద్దతు ధర లేకపోవడమే కాకుండా వ్యవసాయ మార్కెట్లు కనుమరుగవుతాయని రైతు సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు ఈ బిల్లులు రైతులకు మేలు చేకూరుస్తాయని దళారీలు లేకుండా మెరుగైన ధరకు పంటను అమ్ముకునే వెసులుబాటు రైతులకు అందివస్తుందని కేంద్ర ప్రభుత్వం రైతులకు భరోసా ఇస్తోంది. చదవండి : భారత్ బంద్ : పోలీసు వాహనాలకు నిప్పు -
బ్యాంక్ సేవలపై భారత్ బంద్ ప్రభావం
న్యూఢిల్లీ/ముంబై/చెన్నై: కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా పది కార్మిక సంఘాలు దేశవ్యాప్తంగా నిర్వహించిన భారత్ బంద్... బ్యాంక్ల సేవలపై బాగానే ప్రభావం చూపించింది. వాహన కంపెనీల ప్లాంట్లపై సమ్మె ప్రభావం పాక్షికంగానే ఉంది. ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ, హెచ్ఎమ్ఎస్, సీఐటీయూ, ఏఐయూటీయూసీ, టీయూసీసీ తదితర పది కార్మిక సంఘాలు నిర్వహించిన ఈ సమ్మెకు పలు బ్యాంక్ సంఘాలూ మద్దతిచ్చాయి. ఆర్బీఐ కార్యాలయాల్లోనూ సమ్మె... పలు ఏటీఎమ్లలో డబ్బులు అయిపోయాయి. దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో క్యాష్ విత్డ్రాయల్, నగదు డిపాజిట్ చేయడం, చెక్ క్లియరెన్స్ వంటి బ్రాంచ్ కార్యకలాపాలపై ఈ సమ్మె ప్రభావం కనిపించింది. ముంబైతో సహా దేశవ్యాప్తంగా ఉన్న 19 ఆర్బీఐ కార్యాలయాల్లోని 12,000 మంది సిబ్బంది కూడా ఈ సమ్మెలో పాల్గొన్నారు. దీంతో ఆర్బీఐకు చెందిన కరెన్సీ మేనేజ్మెంట్ తదితర విభాగాలపై తీవ్రమైన ప్రభావమే పడింది. ఎస్బీఐ, ప్రైవేట్ రంగ బ్యాంక్లు యథావిధిగా పనిచేశాయి. మరోవైపు హోండా మోటార్సైకిల్, బజాజ్ ఆటో, కొన్ని వాహన విడిభాగాల కంపెనీల్లో కార్యకలాపాలు నిలిచిపోయాయి. అయితే మారుతీ సుజుకీ, హీరో మోటోకార్ప్, హోండా కార్స్ ఇండియా, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా మోటార్స్, హ్యుందాయ్ మోటార్స్ ఇండియా ప్లాంట్లలో కార్యకలాపాలు సాధారణంగానే కొనసాగాయి. ఈ కంపెనీల ప్లాంట్లలో సమ్మె ప్రభావం కనిపించలేదు. కాగా ఈ సమ్మెలో 25 కోట్ల మంది ప్రజలు పాల్గొన్నారని కార్మిక సంఘాలు వెల్లడించాయి. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక చట్టాల సంస్కరణలు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, ప్రభుత్వ వాటాల విక్రయం, ప్రైవేటీకరణ తదితర విధానాలకు నిరసనగా ఈ సమ్మె జరిగింది. -
బెంగాల్లో బంద్ హింసాత్మకం
కోల్కతా: ట్రేడ్ యూనియన్ల పిలుపు మేరకు బుధవారం జరిగిన భారత్ బంద్ బెంగాల్లో పలు హింసాత్మక సంఘటనలకు దారితీసింది. ఆందోళనకారులు బలవంతంగా బంద్ చేయించారు. పలు ప్రాంతాల్లో బస్సులు, పోలీస్ వాహనాలు ధ్వంసంచేసి నిప్పుపెట్టారు. రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో రోడ్లు, రైల్వే లైన్లపై ఆందోళనలు జరగడంతో సాధారణ జనజీవనానికి ఇబ్బంది ఏర్పడింది. మాల్డాలోని సుజాపూర్, బుర్ద్వాన్ జిల్లాలో ఆందోళనకారులు ప్రధాన రహదారిని దిగ్బంధం చేయడం, టైర్లు కాల్చేయడంతోపాటు ప్రభుత్వ బస్సులతోపాటు ఒక పోలీస్ వ్యాన్సహా పలు ఇతర వాహనాలకు నిప్పు పెట్టారు. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు ప్రయత్నించగా ఆందోళనకారులు వారిపై నాటుబాంబులతో దాడులు చేసినట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో పోలీసులు కొన్నిచోట్ల లాఠీచార్జ్కు పాల్పడగా, మరికొన్ని చోట్ల రబ్బరు బుల్లెట్లను కాల్చినట్లు అధికారులు తెలిపారు. పలుచోట్ల రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. బారాసాత్, నార్త్ 24 పరగణ ప్రాంతాల్లోని కొన్ని రైల్వే ట్రాక్లపై పోలీసులు కొన్ని నాటుబాంబులను స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలోని పారిశ్రామిక ప్రాంతాల్లో ఆందోళనకారులు ర్యాలీలు నిర్వహించడంతో సామాన్య జనం నానా ఇబ్బందులు పడ్డారు. -
భారత్ బంద్ : పోలీసు వాహనాలకు నిప్పు
సాక్షి, న్యూఢిల్లీ : కార్మిక సంఘాలు ఇచ్చిన భారత్ బంద్ పిలుపుతో దేశవ్యాప్త సమ్మెలో భాగంగా పశ్చిమ బెంగాల్లో బుధవారం హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. మాల్ధా జిల్లా సుజాపూర్ ప్రాంతంలో ఆందోళనకారులు రాళ్లు రువ్వడంతో పాటు రెండు పోలీసు వాహనాలకు నిప్పంటించారు. జాతీయ రహదారి 34ను నిర్బంధించడంతో ఆందోళనకారులను చెదరగొట్టేందుకు ప్రయత్నించిన పోలీసులపై రాళ్లు రువ్వారు. పోలీసులు లాఠీచార్జి చేసినా పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో గాలిలోకి కాల్పులు జరపడంతో పాటు భాష్పవాయు గోళాలను ప్రయోగించారు. గత నెలరోజులుగా సీఏఏపై నిరసనలతో మాల్దా జిల్లా అట్టుడుకింది. రైల్వే స్టేషన్లు, రైళ్లు, బస్సులకు ఆందోళనకారులు నిప్పంటించడంతో ఉద్రిక్తతలు తలెత్తిన క్రమంలో భారత్ బంద్ నేపథ్యంలో ముమ్మరంగా బందోబస్తు ఏర్పాట్లు చేశారు. మరోవైపు పోలీస్ యూనిఫాంలో ఉన్న ఓ వ్యక్తి వాహనం అద్దాలు పగులగొడుతున్న వీడియోను చూపిస్తూ పోలీసులే దాడులకు పాల్పడి తమపై నింద మోపుతున్నారని సుజాపూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇషా ఖాన్ చౌదరి ఆరోపించారు. ప్రశాంతంగా సమ్మెలో పాల్గొన్న తమపై ఖాకీలు ప్రతాపం చూపారని మాల్ధా జిల్లా సీపీఎం కార్యదర్శి అంబర్ మిత్రా ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు లెఫ్ట్ పార్టీలు భారత్ బంద్కు పిలుపు ఇవ్వడాన్ని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వ్యతిరేకించారు. వామపక్షాల బంద్ పిలుపును చౌకబారు రాజకీయ ఎత్తుగడగా ఆమె అభివర్ణించారు. బంద్ సందర్భంగా హింసకు పాల్పడితే ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని ఆమె హెచ్చరించారు. చదవండి : భారత్ బంద్.. లెఫ్ట్ పార్టీలపై మమత ఫైర్ -
భారత్ బంద్.. లెఫ్ట్ పార్టీలపై మమత ఫైర్
కోల్కతా : వామపక్ష పార్టీలపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. లెఫ్ట్ పార్టీలు భారత్ బంద్కు పిలుపునివ్వడంపై విమర్శలు గుప్పించారు. చీప్ పబ్లిసిటీ కోసమే ఆ పార్టీలు బంద్కు పిలుపునిచ్చాయని ధ్వజమెత్తారు. బుధవారం మమత మాట్లాడుతూ.. బంద్కు పిలుపునిచ్చిన లెఫ్ట్ పార్టీలు బస్సులపై బాంబులు వేసి చీప్ పబ్లిసిటీ పొందాలని చూస్తున్నాయని ఆరోపించారు. ఇలాంటి చర్యలకు పాల్పడటం కన్నా.. రాజకీయంగా సమాధి కావడం ఉత్తమమని అన్నారు. రాష్ట్రంలో రాజకీయ ఉనికి లేనివారు.. బెంగాల్ ఆర్థిక పరిస్థితిని దిగజార్చడానికి సమ్మెల పేరిట నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని మమత మండిపడ్డారు. బెంగాల్లో ఎటువంటి సమ్మెలను అనుమతించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. సీపీఎంకు ఎటువంటి భావజలం లేదన్న మమత.. రైల్వే ట్రాక్లపై బాంబులను విసరడం, ఉద్యమం పేరుతో ప్రయాణికులపై దాడికి పాల్పడటం గుండాగిరికి నిదర్శనమన్నారు. ఈ చర్యలను తను ఖండిస్తున్నట్టు చెప్పారు. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక విధానాలకు, సీఏఏకు, ఎన్నార్సీకి వ్యతిరేకంగా జరుగుతుందని మమత గుర్తుచేశారు. అయితే బంద్ వెనక ఉన్న ఉద్దేశానికి తన మద్దతు ఉంటుందన్న ఆమె.. తమ పార్టీ గానీ, ప్రభుత్వం గానీ బంద్కు వ్యతిరేకమని స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా సీఏఏ, ఎన్నార్సీలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనల్లో ఆ పార్టీలు ఎక్కడ కనిపించలేదన్నారు. కానీ ఇప్పుడు ఆ పేరుతో బంద్కు పిలుపునివ్వడం ఆశ్చర్యంగా ఉందని ఎద్దేవా చేశారు. కాగా, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తమ ఉద్యోగులు బుధవారం రోజున సాధారణ సెలువు పొందడంపై నిషేధం విధించింది. మరోవైపు దేశవ్యాప్తంగా భారత్ బంద్ కొనసాగుతోంది. బెంగాల్లో పలు చోట్ల కార్మిక సంఘాల నాయకులు రోడ్లపై, రైల్వే ట్రాక్ల బైఠాయించి నిరసన తెలిపారు. ప్రజా వ్యతిరేక విధానాలపై ఇచ్చిన బంద్కు కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిపింది. -
కొనసాగుతున్న భారత్ బంద్.. విజయవాడలో ఉద్రిక్తత
నేడు దేశ వ్యాప్తంగా భారత్ బంద్ కొనసాగుతుంది. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ 10 ప్రధాన కార్మిక సంఘాలు నేడు భారత్ బంద్కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెల్లవారుజాము నుంచే పలు చోట్ల బంద్ ప్రారంభమైంది. ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణ, పెట్టుబడుల ఉపసంహరణతో పాటు ప్రజా వ్యతిరేక విధానాలపై వ్యతిరేకంగా ఈ సమ్మె జరగనుంది. దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ బంద్లో దాదాపు 25 కోట్ల మంది దాకా పాల్గొంటున్నారని కార్మిక సంఘాలు అంచనా వేస్తున్నాయి. విజయవాడ: విజయవాడలో బంద్ కొనసాగుతోంది. బస్టాండ్ ఎదుట జాతీయ రహదారిపై వామపక్ష పార్టీల నేతలు ఆందోళనకు దిగారు. ఎన్ఆర్సీ, సీఏఏ బిల్లులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ బంద్ చేపట్టినట్లు తెలిపారు. దీంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. శాంతియుతంగా నిరసన చేస్తున్న వారిపై పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణ, ఎన్ఆర్సీ, సీఏఏ ,అలాగే కార్మిక వ్యతిరేక విధానాలను అనుసరిస్తుందని కేంద్రంలోని బీజేపీకి కాలం చెల్లిందాని ఆందోళన కారులు నిరసన తెలియజేస్తున్నారు. దీంతో అక్కడ ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విశాఖపట్నం : కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ విశాఖ జిల్లా మద్దిలపాలెం కూడలిలో వామపక్ష నేతలతో పాటు కార్మిక సంఘాలు కదంతొక్కాయి. ఉదయం 6 గంటల నుంచి కార్మికులంతా సమ్మెలో పాల్గొని నిరసనలు తెలిపారు. కేంద్రం.. కార్మిక వ్యతిరేక విధానాలను విడనాడాలంటూ నినాదాలు చేశారు. దీంతో ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. కర్నూలు: కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ భారత్ బంద్కు వామపక్ష పార్టీలు పిలుపునిచ్చాయి. బంద్ నేపథ్యంలో కర్నూలు జిల్లాలో విద్యాలయాలకు, వ్యాపార సంస్థలకు స్వచ్ఛందంగా సెలవు ప్రకటించారు. బస్టాండ్ వద్ద వామపక్ష పార్టీ నేతలు బస్సులను బయటకు రాకుండా అడ్డుకున్నారు. బీఎస్ఎన్ఎల్, రైల్వేస్, పోస్ట్ ఆఫీస్ లాంటి కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేట్ పరం చేసేందుకు పావులు కదుపుతున్నారని ఆరోపించారు. ఇదే పరిస్థితి కొనసాగితే వామపక్ష నేతలు ఉద్యమం మరింత ఉధృతం చేస్తామంటున్నారు. మంచిర్యాల/ భద్రాద్రి/ పెద్దపల్లి: మంచిర్యాల, పెద్దపల్లి, భద్రాద్రి జిల్లాల్లో సింగరేణి కార్మికులు రోడ్డెక్కారు. కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సమ్మెకు దిగారు. నిరసన చేపట్టిన కార్మిక నాయకులు గనుల్లోకి వచ్చేందుకు ప్రత్నించడంతో పోలీసులువారి అడ్డుకోవడంతో ఉద్రిక్తంగా మారింది. దీంతో పోలీసులు, కార్మిక నాయకులకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. పోలీసుల తీరుపై కార్మిక సంఘాల నాయకులు మండిపడుతున్నారు. -
నేడు దేశవ్యాప్త సమ్మె
-
బంద్.. ఉందా, లేదా?
బొమ్మనహళ్లి: కేంద్ర ప్రభుత్వ కార్మిక విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా వామపక్ష, వివిధ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో బుధవారం భారత్బంద్కు పిలుపునివ్వగా, బంద్ను పాటించరాదని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించడంతో ఏం జరగనుందా? అని ఉత్కంఠ ఏర్పడింది. ఈ బంద్కు కొన్ని కార్మిక సంఘాలు మద్దతునివ్వడం లేదని ప్రకటించాయి. అయితే మెజారిటీ సంఘాలు బంద్చేసి తీరాలని పట్టుదలతో ఉన్నాయి. ఈ నేపథ్యంలో బంద్ ప్రశాంతంగా జరుగుతుందా.. లేదా? అని అంతటా అనుమానాలు కలుగుతున్నాయి. కొన్ని సంఘాలు బంద్లో పాల్గొనడం లేదని, నిరసన ర్యాలీ మాత్రమే నిర్వహిస్తామని ప్రకటించాయి. బంద్తో సంబంధం లేకుండా బెంగళూరు నగరంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా కేఎస్ ఆర్టీసీ, బీఎంటీసీ బస్సులనునడపాలని నిర్ణయించాయి. విద్యాశాఖ కూడా పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించలేదు. ఒకవేళ నిరసనకారులు ఇబ్బందులకు గురిచేస్తే పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి నడిపించడానికి సిద్ధమయ్యాయి. ప్రభుత్వ కార్యాలయాలు యథావిధిగా పనిచేస్తాయని ప్రభుత్వం ప్రకటించింది. బంద్కు సంఘాలు సిద్ధం సుమారు 10 నుంచి 15 వరకు కార్మిక సంఘాలు ధర్నాలు, ర్యాలీలు చేపట్టాలని సన్నాహాలు చేశాయి. ప్రైవేట్ బ్యాంకులు ముందుగానే సెలవు ప్రకటించినా ప్రభుత్వ బ్యాంకులూ, కార్యాలయాలు యథాప్రకారం పనిచేస్తాయని అధికారులు తెలిపారు. ఐటీ కంపెనీలు కూడా పనిచేస్తాయని సమాచారం. నిరసనలు గాడితప్పకుండా ముందు జాగ్రత్తగా నగరంలో ప్రధాన ప్రాంతాల్లో పెద్దసంఖ్యలో పోలీసు బలగాలను మోహరించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో మంగళవారం సాయంత్రం నుంచే బందోబస్తును ఏర్పాటు చేశారు. ఒత్తిడి చేస్తే చర్యలు తప్పవు పోలీస్ కమిషనర్ బనశంకరి: బలవంతంగా బంద్ చేయించేవారిపై కఠిన చర్యలు తప్పవని నగర పోలీస్ కమిషనర్ భాస్కర్రావ్ హెచ్చరించారు. సంఘాలు ర్యాలీలు చేసుకోరాదన్నారు. ఫ్రీడంపార్కులో మాత్రమే ధర్నాలు చేసుకోవచ్చని చెప్పారు. -
నేడు భారత్ బంద్
న్యూఢిల్లీ: ప్రధాన కార్మిక సంఘాలు నేడు దేశవ్యాప్త బంద్కు పిలుపునిచ్చాయి. ఈ బంద్ ప్రభావం కీలకమైన బ్యాంకింగ్, రవాణా తదితర రంగాలపై పడనుంది. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ, హెచ్ఎంఎస్, టీయూసీసీ, యూటీయూసీ తదితర వివిధ రంగాల కార్మిక సంఘాలు, సమాఖ్యలు జనవరి 8వ తేదీన బంద్ పాటించాలంటూ గత ఏడాది సెప్టెంబర్లో తీర్మానించాయి. ఆర్బీఐ స్వతంత్ర ప్రతిపత్తిని దెబ్బతీసేలా ఉన్న ప్రభుత్వ నిర్ణయాలు, దేశంలో పెరిగిన నిరుద్యోగిత, దిగజారిన ఆర్థిక పరిస్థితులకు నిరసనగా తాము కూడా సమ్మెలో భాగస్వాములవుతామంటూ రిజర్వు బ్యాంకు ఉద్యోగ సంఘాలైన ఏఐఆర్ బీఈఏ, ఏఐఆర్బీడబ్ల్యూఎఫ్ మంగళవారం తెలిపాయి. కార్మిక సంస్కరణలు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, పెట్టుబడుల ఉపసంహరణ, ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ విధానాలు తదితర 12 డిమాండ్లతో కూడిన ఉమ్మడి ఎజెండాపై ఈ నెల 2వ తేదీన జరిపిన చర్చల్లో కార్మిక మంత్రి నుంచి ఎటువంటి హామీ రానందున సమ్మె పిలుపునకు కట్టుబడి ఉన్నట్లు పది కేంద్ర కార్మిక సంఘాలు మంగళవారం ఒక ఉమ్మడి ప్రకటనలో పేర్కొన్నాయి. ఈ సమ్మెలో దేశ వ్యాప్తంగా 25 కోట్లమందికి పైగా పాల్గొంటారని భావిస్తున్నట్లు తెలిపాయి. సమ్మె ప్రభావం బుధవారం బ్యాంకింగ్ సేవలపై పడనుందని ఇప్పటికే పలు ప్రభుత్వ రంగ బ్యాంకులు స్టాక్ ఎక్సే్ఛంజీకి సమాచారం అందించాయి. బ్యాంకుల్లో నగదు, విత్డ్రా, చెక్ క్లియరింగ్ వంటి సేవలపై బంద్ ప్రభావం పడనుంది. ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో కార్యకలాపాలు యథా ప్రకారం కొనసాగనున్నాయి. అఖిల భారత స్థాయి బంద్ కారణంగా బ్యాంకింగ్, రవాణాతోపాటు ఇతర కీలక రంగాలపైనా ఈ ప్రభావం ఉంటుందని భావిస్తున్నారు. పాల్గొంటే కఠిన చర్యలు: కేంద్రం బంద్లో కార్మికులు పాల్గొనకుండా చూడాలంటూ ప్రభుత్వం రంగ సంస్థలను కేంద్రం కోరింది. సమ్మె నేపథ్యంలో అత్యవసర ప్రణాళికలను అమలు చేసి కార్యకలాపాలు యథాతధంగా సాగేలా చూడాలని కోరింది. ఏ విధమైన బంద్, నిరసనల్లో పాల్గొనే ఉద్యోగులపై క్రమశిక్షణ ఉల్లంఘన కింద వేతనంలో కోత వంటి కఠిన చర్యలుంటాయని ప్రభుత్వం మంగళవారం జారీ చేసిన మెమోరాండంలో స్పష్టం చేసింది. ఎటువంటి సమాచారం లేకుండా విధులకు గైర్హాజరయ్యే వారిపైనా నిబంధనల మేరకు చర్యలు తీసుకోవాలని తెలిపింది. -
దాడులకు నిరసిస్తూ 17న వైద్యసేవలు నిలిపేస్తాం
హైదరాబాద్: దేశవ్యాప్తంగా వైద్యులపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ బి.ప్రతాప్రెడ్డి తెలిపారు. వైద్యులపై దాడులకు నిరసనగా శుక్రవారం కోఠిలోని ఐఎంఏ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. దేశవ్యాప్తంగా వైద్యులకు భద్రత కల్పించాలని పెద్దపెట్టున నినాదాలు చేశారు. అనంతరం డాక్టర్ ప్రతాప్రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ.. నేషనల్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఇచ్చిన పిలుపుమేరకు ఈ నెల 17న అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్య సేవలు నిలిపివేసి భారత్బంద్ను నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. దేశవ్యాప్తంగా వైద్యులు ఏకతాటిపైకి వచ్చి ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్యసేవలు నిలిపివేసి వైద్యుల ఐక్యత చాటాలని పిలుపునిచ్చారు. కోల్కతాలో వైద్యుడిపై జరిగిన దాడిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ప్రభుత్వాలు అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులకు భద్రత చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. వైద్యులు 99 శాతం సేవాభావంతో పనిచేస్తారని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని గుర్తించాలన్నారు. అలాగే వైద్యులపై దాడిచేసినవారిపై శిక్షలు కఠినంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం సెక్రటరీ జనరల్ డాక్టర్ రవిశంకర్, ఐఎంఏ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ సంజీవ్సింగ్ యాదవ్, డాక్టర్ రఘురామ్, డాక్టర్ రంగనాథ్, డాక్టర్ ప్రభావతి, డాక్టర్ దయాళ్సింగ్తో పాటు పెద్ద ఎత్తున వైద్యులు పాల్గొన్నారు. -
గిరిజన, దళిత సంఘాల భారత్ బంద్ పిలుపు
సాక్షి, న్యూఢిల్లీ : అటవీ హక్కుల చట్టం కింద ప్రయోజనాలు నిరాకరించబడిన కుటుంబాలను తక్షణమే ఆయా ప్రాంతాల నుంచి తరలించాలని ఫిబ్రవరి 13న సుప్రీం కోర్టు ఇచ్చిన ఉత్తర్వులకు వ్యతిరేకంగా గిరిజన, దళిత సంఘాలు మంగళవారం భారత్ బంద్కు పిలుపు ఇచ్చాయి. సుప్రీం ఉత్తర్వులతో పది లక్షల మంది గిరిజనులు, అడవిపై ఆధారపడిన వారి హక్కులకు విఘాతం కలుగుతుందని భావిస్తున్నారు. అటవీ హక్కుల చట్టాన్ని పునరుద్ధరించాలని కోరుతూ గిరిజన సంఘాలు దేశ రాజధానిలో మండీ హౌస్ నుంచి జంతర్ మంతర్ వరకూ భారీ ప్రదర్శన చేపడుతున్నాయి. గిరిజనులు, ఆదివాసీల హక్కుల పరిరక్షణను న్యాయస్ధానంలో కేంద్ర ప్రభుత్వం సమర్ధంగా తన వాదనను వినిపించలేదని గిరిజన సంఘాలు భగ్గుమంటున్నాయి. అటవీ హక్కుల చట్టం కింద తమ ప్రయోజనాలను పరిరక్షించేందుకు ఎన్డీఏ ప్రభుత్వం తక్షణమే ఆర్డినెన్స్ను తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నాయి. కాగా గుజరాత్, రాజస్తాన్, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, చత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ సహా పలు ఈశాన్య రాష్ట్రాలు నేటి బంద్లో పాల్గొంటున్నాయి. మరోవైపు యూనివర్సిటీల్లో ఫ్యాకల్టీ సభ్యుల నియామకంలో ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లకు సంబంధించి అలహాబాద్ హైకోర్టు ఉత్తర్వులను సర్వోన్నత న్యాయస్ధానం సమర్ధించినందుకు నిరసనగా గిరిజన సంఘాల సమ్మెలో పాల్గొనాలని దళిత సంఘాలు నిర్ణయించాయి. -
మావోల బంద్ ప్రశాంతం
చర్ల: భద్రాచలం ఏజెన్సీలో మావోయిస్టుల బంద్ గురువారం ప్రశాంతంగా జరిగింది. ‘ఆపరేషన్ సమాధాన్’ను వ్యతిరేకిస్తూ, నిరసన వారానికి, 31న బంద్కు మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ పిలుపునిచ్చింది. భద్రాచలం ఏజెన్సీలోని ఇటు వాజేడు, వెంకటాపురం, చర్ల, దుమ్ముగూడెం మండలాలతోపాటు అటు ఆంధ్రప్రదేశ్లోని కూనవరం, వీఆర్పురం, చింతూరు, ఎటపాక మండలాల్లోనూ బంద్ సాగింది. మావోయిస్టుల హెచ్చరికలు, విధ్వంసకర సంఘటనల నేపథ్యంలో రెండు రోజుల నుంచే ఏజెన్సీ ప్రాంతాలకు బస్సు సర్వీసులను ఆర్టీసీ నిలిపివేసింది. బ్యాంకులు, పెట్రోల్ బంక్లు, సినిమా హాళ్లు తెరుచుకోలేదు. దుకాణాలు మూతపడ్డాయి. ప్రభుత్వ, ప్రయివేటు విద్యాలయాలు, కార్యాలయాలు పనిచేశాయి. ఏజెన్సీ గ్రామాలకు ఆటోలు, ఇతర ప్రయివేటు వాహనాలు తిరగలేదు. ‘ఆపరేషన్ సమాధాన్’కు వ్యతిరేకంగా నిరసన వారంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లా చింతూరు మండలం సరివెలలోని అటవీ ప్రాంతంలోగల ప్రధాన రహదారిపై ఆర్టీసీ బస్సును, లారీని మావోయిస్టులు దహనం చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని వెంకటాపురం మండలం సూరవీడు సమీపంలో జేసీబీని దహనం చేశారు. అక్కడ వాల్ పోస్టర్లు పడేశారు, బ్యానర్లు కట్టారు. చర్ల మండలంలోని కొన్ని గ్రామాలతోపాటు భద్రాచలం పట్టణ నడిబొడ్డునగల ఆర్టీసీ బస్టాండ్లో కూడా పోస్టర్ అతికించారు. మావోయిస్టు పార్టీ పిలుపుతో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. పెద్దఎత్తున ప్రత్యేక భద్రతాచర్యలు చేపట్టింది. ఛత్తీస్గఢ్–తెలంగాణ సరిహద్దులోని భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, సుకుబా, బీజాపూర్, దంతెవాడ జిల్లాల్లోని అటవీ ప్రాంతాలు, ఆంధ్రా–ఒడిశా సరిహద్దులోని తూర్పుగోదావరి, విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం, కోరాఫూట్, మల్కన్గిరి. రాయ్గడ్ జిల్లాల్లోని అటవీ ప్రాంతాలు, తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దులోని మంచిర్యాల, కొమరం బీం ఆసీఫాబాద్ జిల్లాల్లోని అటవీ ప్రాంతాలలో ప్రత్యేక పోలీసు బలగాలు వారం రోజుల ముందు నుంచే భారీగా మొహరించాయి. ముమ్మరంగా కూంబింగ్ నిర్వహించాయి. అణువణువునా గాలించాయి. ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని ఏజెన్సీ ప్రజానీకం భీతిల్లింది. మావోయిస్టుల బంద్ ప్రశాంతంగా ముగియడంతో పోలీసు యంత్రాంగంతోపాటు ఏజెన్సీ ప్రజానీకం హాయిగా ఊపిరి పీల్చుకుంది. -
మన్యంలో మావోల బంద్ నేడు
శ్రీకాకుళం , భామిని: మావోయిస్టుల బంద్కు పిలుపునివ్వడంతో మన్యంలో మరోసారి తీవ్ర ప్రభావం చూపనుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును నిరసిస్తూ బుధవారం ఏవోబీలో మల్కన్గిరి జిల్లాలో ప్రైవేటు బస్సును దహనం చేయడంతో ఆందోళన నెలకొంది. దీంతో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. గిరిజన ప్రాంతాలకు నడిచే రాత్రి బస్సులను సరిహద్దు పోలీస్ స్టేషన్లు వద్ద నిలిపివేస్తోంది. ఇప్పటికే సరిహద్దులో కీలకమైన తివ్వాకొండల పరిసరాల్లో ప్రత్యేక సాయుధ దళాలు ముమ్మర కూంబింగ్ చేపడుతున్నాయి. అనుమానిత ప్రాంతాల్లో రాత్రి పూట వాహన తనిఖీలు చేస్తున్నాయి. నిరసన వారోత్సవాల నేపథ్యంలో.. సమాధాన్ పథకం పేరున మావోయిస్టుల ఏరివేత కార్యక్రమాన్ని చేపట్టి, గిరిజన హక్కులను హరిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై ఆగ్రహిస్తూ ఈ నెల 25 నుంచి మన్యంలో నిరసన వారోత్సవం చేపట్టారు. ఇందులో భాగంగా గురువారం మన్యం బంద్కు ప్రత్యేకంగా పిలుపు నివ్వడంతో ఆందోళన మొదలైంది. దీంతో ఏవోబీలో మావోల కదలికలు తీవ్రం కావడంతో పోలీసులు అప్రమత్తం చర్యలు చేపట్టారు. జిల్లా కేంద్రానికి అధికార పార్టీ నాయకులు.. మావోల హిట్లిస్టులో ఉన్న టీడీపీ నాయకులను స్వగ్రామాల్లో ఉండనీయకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. అందులో భాగంగా పాలకొండ, పాతపట్నం నియోజకవర్గాల నుంచి శ్రీకాకుళం జిల్లా కేంద్రానికి తరలిస్తున్నారు. ఇప్పటికే హెచ్చరికలు చేసిన పోలీసులు అధికార పార్టీ కార్యక్రమం పేరున సురక్షితంగా తీసుకెళ్లారు. బంద్ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలూ చోటు చేసుకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిసింది. -
ఏజెన్సీలో దడ దడ..
సాక్షి, కొత్తగూడెం: ‘ఆపరేషన్ సమాధాన్’కు వ్యతిరేకంగా నేడు భారత్ బంద్కు మావోయిస్టులు పిలుపునివ్వడంతో సరిహద్దు ఏజెన్సీలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ బంద్కు మద్దతు ఇవ్వాలని కోరుతూ ఈ నెల 25వ తేదీ నుంచి మావోయిస్టులు సరిహద్దు ఏజెన్సీతోపాటు జిల్లాలోని వివిధ మండలాల్లో బ్యానర్లు, పోస్టర్లు, కరపత్రాల ద్వారా విస్తృత ప్రచారం చేశారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని సరిహద్దుల్లో, ఏవోబీలో మావోయిస్టులు పలుచోట్ల సభలు, ప్రదర్శనలు నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా చింతూరు మండలం సరివెల గ్రామం సమీపంలో వికారాబాద్ జిల్లా తాండూరు డిపోకు చెందిన టీఎస్ ఆర్టీసీ బస్సును మంగళవారం రాత్రి మావోయిస్టులు తగులబెట్టారు. ఈ నేపథ్యంలో, బుధవారం ఉదయం నుంచి భద్రాచలం ఏజెన్సీ పరిధిలో బస్సు సర్వీసులన్నింటినీ ఆర్టీసీ అధికారులు నిలిపివేశారు. దీంతో దుమ్ముగూడెం, చర్ల, వెంకటాపురం, వాజేడు మండలాల్లోని ఏజెన్సీ వాసులు అనేక అవస్థలు పడుతున్నారు. ఇదే అవకాశంగా ప్రైవేటు వాహనాల చోదకులు అధిక చార్జీలు వసూలు చేస్తున్నారు. బంద్ నేపథ్యంలో ఏజెన్సీలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల వద్ద పటిష్ట భద్రత ఏర్పాటైంది. చర్ల బస్టాండ్ వద్ద బుధవారం ఉదయం గుర్తు తెలియని వ్యక్తులు అట్ట పెట్టె వదిలి వెళ్లారు. అందులో బాంబు ఉందేమోనన్న అనుమానాలతో కలకలం బయల్దేరింది. అది ఖాళీ పెట్టె మాత్రమేనని పోలీసులు తేల్చడంతో అందరూ హాయిగా ఊపిరి పీల్చుకున్నారు. గత మే నెలలో ఇదే చర్ల బస్టాండ్లో ఓ బ్యాగులో ప్రెషర్ బాంబును గుర్తు తెలియని వ్యక్తులు వదిలి వెళ్లారు. దానిని పోలీసులు స్వాధీనపర్చుకుని, సమీపంలోని చెరువు వద్ద నిర్వీర్యం చేశారు. అందుకే, ఇప్పుడు ఆ అట్ట పెట్టె కనిపించగానే అందరూ కలవరపడ్డారు. అదనపు బలగాల కూంబింగ్... మావోయిస్టుల బంద్ నేపథ్యంలో అదనపు బలగాలు సరిహద్దుల్లో కూంబింగ్ చేపట్టాయి. సరిహద్దు రాష్ట్రాల పోలీసులతో సమన్వయం చేసుకుంటూ దండకారణ్యాన్ని జల్లెడ పడుతున్నాయి. ‘ఆపరేషన్ సమాధాన్’కు వ్యతికరేకంగా మావోయిస్టులు పోరును ఉధృతం చేసే అవకాశం ఉండడంతో పోలీసు యంత్రాంగం మరింత పకడ్బందీగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే మావోయిస్టులు భద్రాచలం ఏజెన్సీ దాటి వచ్చి గోదావరికి ఇవతల వైపు ఉన్న మండలాల్లోనూ బంద్పై బ్యానర్లు, పోస్టర్లు వేశారు. మంగళవారం గుండాల, శంభునిగూడెం, నర్సాపురం తండ, లింగగూడెం, రోళ్లగడ్డ, సాయనపల్లి గ్రామాల్లో మావోయిస్టుల పేరిట పోస్టర్లు పడ్డాయి. మణుగూరు మండలంలో మావోయిస్టులు సోమవారం రాత్రి సంచరించారన్న వార్తలతో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. గోదావరి పరీవాహక ప్రాంతంలో సీతారామ ప్రాజెక్టు, మిషన్ భగీరథ తదితర పనులు సాగుతున్నాయి. అక్కడ పోలీసులు పటిష్ట నిఘా పెట్టారు. ఈ ప్రాంతంలో ఇప్పటికే ఏఎస్పీ(ఆపరేషన్స్) పర్యటించి, పోలీసులకు సూచనలు చేశారు. మణుగూరు మండలంలోని ఇసుక రీచ్ల వద్దకు మావోయిస్టుల వచ్చే అవకాశముందని ఇంటెలిజెన్స్ సమాచారమిచ్చింది. దీంతో, ఆ ఇసుక రీచ్ల వద్దనున్న వాహనాలను పోలీసులు బయటకు పంపించారు. ఈ నెల 25న భద్రాచలం బస్టాండులో కరపత్రాలు, అశ్వాపురం మండలంలోని మల్లెలమడుగు–నెల్లిపాక బంజర గ్రామాల మధ్యలో బ్యానర్లు, చర్ల మండలంలోని ఆర్.కొత్తగూడెం–కుదునూరు మధ్య ప్రధాన రహదారిపై మావోయిస్టులు పోస్టర్లు వేశారు. ఇటీవలి కాలంలో గోదావరి దాటి మావోయిస్టులు ఇవతలకు రాకుండా పోలీసు యంత్రాంగం అత్యంత పకడ్బందీగా వ్యవహరించింది. ఈ నేపథ్యంలో గుండాల, అశ్వాపురం మండలాలతోపాటు కీలకమైన భద్రాచలం పట్టణంలోని జనసమ్మర్ధం ఎక్కువగా ఉండే బస్టాండులోనూ మావోయిస్టులు బ్యానర్లు, పోస్టర్లు వేయడాన్ని పోలీసులు సీరియస్గా తీసుకున్నారు. వివిధ గిరిజన సంఘాలు కూడా మావోయిస్టులకు వ్యతిరేకంగా కరపత్రాలు వేశాయి. ఏజెన్సీకి బస్సులు ‘బంద్’ చర్ల: ‘ఆపరేషన్ సమాధాన్’కు వ్యతిరేకంగా మావోయిస్టు పార్టీ బంద్ పిలుపునివ్వడంతో ఏజెన్సీ గ్రామాలకు ఆర్టీసీ అధికారులు బస్సు సర్వీసులను నిలిపివేశారు. మావోయిస్టు పార్టీని అంతమొందించాలన్న లక్ష్యంతో ‘ఆపరేషన్ సమాధాన్’ను కేంద్రం, కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి. దీనిని మావోయిస్టు పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇందులో భాగంగా, జనవరి 25 నుంచి 31వ తేదీ వరకు ‘సమాధాన్’ వ్యతిరేక సభలు... సమావేశాలకు, 31న దేశవ్యాప్త బంద్కు పిలుపునిచ్చింది. ఈ క్రమంలోనే భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలతోపాటు ఆంధ్ర–ఒడిశా, ఆంధ్ర–ఛత్తీస్గఢ్, తెలంగాణ–ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతాల్లో వాల్ పోస్టర్లు, బ్యానర్లు పడ్డాయి. మందుపాతర్లు పేల్చడం, బస్సులు.. లారీలకు నిప్పటించడం వంటి విధ్వంసకర చర్యలకు మావోయిస్టులు తెగించారు. తూర్పుగోదావరి జిల్లాలో చింతూరు మండం సరివెల సమీపంలోని ప్రధాన రహదారిపై మంగళవారం రాత్రి మందుపాతరను పేల్చారు. ఆర్టీసీ తాండూరు డిపో బస్సులకు, ఛత్తీస్గఢ్కు చెందిన లారీకి నిప్పంటించారు. వీటన్నింటి నేపథ్యంలో, ఏజెన్సీ ప్రాంతాలకు బస్సు సర్వీసులను ఆర్టీసీ పూర్తిగా రద్దు చేసింది. -
కదంతొక్కిన కార్మిక లోకం
ఎదులాపురం(ఆదిలాబాద్): కేంద్ర ప్రభుత్వ కార్మిక, ఉద్యోగ, ప్రజావ్యతిరేక విధానాలు నిరసిస్తూ జాతీయ కార్మిక సంఘాల పిలుపుమేరకు కార్మికలోకం కదంతొక్కింది. రెండురోజుల సార్వత్రిక సమ్మె జిల్లాలో సక్సెస్ అయింది. చివరి రోజు బుధవారం పలు ఉద్యోగ, కార్మిక సంఘాలు నిరసనలు, ధర్నాలు, ర్యాలీలతో హోరెత్తించాయి. కార్మిక సంఘాల ఆధ్వర్యంలో.. సార్వత్రిక సమ్మెలో భాగంగా వివిధ సంఘాలుఏఐటీయూసీ, ఐఎఫ్టీయూ, సీఐటీయూ కార్మిక సంఘాలు, అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో కలెక్టరేట్లో ఎదుట ధర్నా నిర్వహించారు. నాయకులు మాట్లాడుతూ నిత్యావసర వస్తువుల ధరలు ని యంత్రించి అదుపులో పెట్టాలని డిమాండ్ చేశా రు. కనీస వేతనం నెలకు రూ.18 వేలుగా నిర్ణయించాలన్నారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాల అమ్మకాన్ని, కార్మిక చట్టాల సవరణ ఆపాలని, వాటిని పకడ్బందీగా అమలు చేయాలని, పీఎఫ్, ఈఎస్ఐ, బోనస్ చట్టాలు విధిగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ధర్నాలో ఏఐటీయూసీరాష్ట్ర కార్యదర్శి ఎస్.విలాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి కుంటాల రాములు, సీఐటీ యూ జిల్లా కార్యదర్శి డి.మల్లేశ్, జిల్లా ప్రధాన కార్యదర్శి జాదవ్ రాజేందర్, ఐఎఫ్ టీయూ జిల్లా అధ్యక్షుడు బి.జ గన్, కార్యదర్శి వెంకట నారాయణ, అనుబంధ సంఘాల నాయకులు ముడుపు ప్రభాకర్, కిరణ్, బండి దత్తాత్రి, లంకా రాఘవులు పాల్గొన్నారు. టీఎన్జీవోస్ ఆధ్వర్యంలో.. తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ (టీఎన్జీవోస్) సంఘం ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ ద్వారా నిరసన తెలిపారు. ఎన్జీవోస్ మాట్లాడుతూ ఔట్సోర్సింగ్ సిబ్బంది పర్మినెంట్, సీపీఎస్ రద్దు, ఓపీఎస్ అమలు, ఉద్యోగ ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా అధ్యక్షుడు అశోక్, తాలు కా అధ్యక్షుడు ఎ.నవీన్కుమార్, కార్యదర్శి మ హేందర్, సెంట్రల్ కార్యదర్శి ఎ.తిరుమల్రెడ్డి, ఉపాధ్యక్షురాలు భాగ్యలక్ష్మి, తుమ్మల గోపి, గం గాధర్ చిట్ల, ఆర్.శ్రీనివాస్ పాల్గొన్నారు. వైద్య ఉద్యోగుల ఆధ్వర్యంలో.. తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మినిస్టీరియల్ సం ఘం ఆధ్వర్యంలో డీఎంహెచ్వో కార్యాలయం ఎదుట నిరనస ప్రదర్శన చేపట్టారు. సీపీఎస్ రద్దు చేయాలని నినాదాలు చేశారు. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. నిరసనలో సంఘం శ్రీకాంత్, మహేందర్, సుధీర్ తదితరులు పాల్గొన్నారు. మధ్యాహ్న కార్మికుల ఆధ్వర్యంలో.. మధ్యాహ్న భోజన కార్మికులు (ఏఐటీయూసీ అనుబంధం) డీఈవో కార్యాలయాన్ని ముట్టడించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆరునెలలుగా వేతనాలు అందించడం లేదని, ప్రభుత్వం కోడి గుడ్లకు రూ.4 అందిస్తోందని, బయట రూ.6కు లభిస్తుండగా అదనంగా రెండు రూపాయల భారం నిర్వాహకులపై పడుతోందని ఆవేదన వ్యక్తంచేశారు. జిల్లా కార్యదర్శి కె.రాములు, పట్టణ కార్యదర్శి టి.పుష్పలత, పట్టణ సహా య కార్యదర్శి జి.లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
రెండో రోజు కొనసాగుతున్న భారత్ బంద్..
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా కార్మిక సంఘాలు చేపట్టిన భారత్ బంద్ రెండో రోజు కొనసాగుతోంది. కార్మిక సంఘాల నాయకుల చేపట్టిన బంద్ బెంగాల్లో కొంత హింసాత్మకంగా మారింది. బెంగాల్లో రోడ్డుపైకి వచ్చిన వాహనాలపై ఆందోళన కారులు రాళ్లు రువ్వడంతో వాహనాల అద్దాలు ద్వంసం అయ్యాయి. ఈ ఘటనలో బస్సు డ్రైవర్ త్రీవంగా గాయపడ్డాడు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలుపున్న సీపీఎం నేత సుజన్ చౌదరీను పోలీసులు అరెస్ట్ చేయడంతో అక్కడ కొంత ఘర్షణ వాతావరణం నెలకొంది. దేశ వ్యాప్తంగా వామపక్షాలు, కార్మిక సంఘాలు బంద్లో పాల్గొన్నాయి. మహారాష్ట్ర వ్యాప్తంగా 32వేల మంది కార్మికులు బంద్ను పాటిస్తున్నారు. కార్మికుల హక్కులకై వారు డిమాండ్ చేస్తున్నారు. కేరళలో కూడా రెండో రోజు బంద్ కొనసాగుతోంది. తిరువనంతపురంలో రైలు పట్టాలపై కార్మికులు బైఠాయించడంతో పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. అన్ని రాష్ట్రాల్లోనూ కార్మికులు తెల్లవారుజాము నుంచే రోడ్లమీదకు వచ్చి నిరసనలు తెలుపుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ముందు కార్మిక సంఘాలు 12 డిమాండ్లను ఉంచిన విషయం తెలిసిందే. రెండు రోజుల బంద్కు పది ట్రేడ్ యూనియన్లు మద్దుతు ప్రకటించాయి. -
సమ్మె పాక్షికం
సూపర్బజార్(కొత్తగూడెం): సమస్యల పరిష్కారం కోసం జాతీయ కార్మిక, ఉద్యోగ సంఘాల సంయుక్త అధ్వర్యంలో మంగళ, బుధవారాలలో నిర్వహిస్తున్న దేశ వ్యాపిత సమ్మె మొదటి రోజైన మంగళవారం జిల్లాలో పాక్షికంగా జరిగింది. జిల్లాలోని సింగరేణి, కేటీపీఎస్, ఐటీసీ, ఎన్ఎండీసీ స్పాంజ్ ఐరన్ యూనిట్ తదితర కర్మాగారాలలో కూడా సమ్మె ప్రభావం అంతంతమాత్రంగానే ఉంది. సమ్మె నేపథ్యంలో జిల్లాలో పలు చోట్ల జేఏసీల ఆ«ధ్వర్యంలో ప్రభుత్వ కార్యాలయాల ఎదుట ధర్నా చేసి, కేంద్ర ప్రభుత్వ, ప్రధాని మోదీ దిష్టిబొమ్మలను దçహనం చేశారు. కలెక్టరేట్ ఎదుట తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ ఆసోసియేషన్ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. జిల్లాలో ఉన్న 1.30 లక్షల మంది సంఘటిత, అసంఘటిత కార్మికుల సమస్యలను పరిష్కరించాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, కాంట్రాక్ట్ కార్మికులకు నెలకు కనీసం రూ.18 వేలు ఇవ్వాలని, సీపీఎస్ను రద్దు చేసి ఓపీఎస్ను అమలు చేయాలని, కాంట్రాక్ట్ కార్మికులను క్రమబద్ధీకరించాలని, ఆదాయపన్ను పరిధి రూ.5 లక్షలకు పెంచాలని, ఉద్యోగుల విభజన సమస్యలను పరిష్కరించాలని, గ్రంథాలయం, మార్కెట్, ఎయిడెడ్ ఉద్యోగులకు 010 ద్వారా వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇక సింగరేణిలోని కొత్తగూడెం రీజియన్లో 67 శాతం మంది కార్మికులు విధులకు హాజరయ్యారు. ఐటీసీ, కేటీపీఎస్, మణుగూరు భారజల కర్మాగారం, ఎన్ఎండీసీ స్పాంజ్ ఐరన్ యూనిట్లలోని కార్మికులు కూడా విధులకు హాజరు కావడంతో సమ్మె ప్రభావం పెద్దగా కనిపించలేదు. అధికార పార్టీకి సంబంధించిన యూనియన్లు సమ్మెలో పాల్గొనక పోవడం, సమ్మెకు పిలుపునిచ్చిన సంఘాలలో ఉన్న అనైక్యతల కారణంగా సమ్మె పూర్తిస్థాయిలో విజయవంతం కాలేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. బస్సులు లేక ఇబ్బందులు.. సమ్మె ప్రభావంతో ఆర్టీసీ బస్సులు సరిగా తిరగకపోవడంతో ప్రయాణీకులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఆటోలు యథావిధిగా తిరిగాయి. వర్తక, వాణిజ్యాలకు మాత్రం ఎలాంటి అటంకం కలుగలేదు. పాల్వంచ వంటి ప్రాంతాలలో బ్యాంకులు మామూలుగానే పనిచేశాయి. అయితే కొన్నిచోట్ల అంతర్గత లావాదేవీలను మాత్రమే నిర్వహించారు. పెట్రోల్ బంకులు కొన్ని చోట్ల మొదట పనిచేసినప్పటికీ ఆందోళనకారుల ఒత్తిడితో బంద్ చేశారు. కాగా, బంక్లు ముందు తెరిచి, ఆ తర్వా త బంద్ చేయడంతో వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళ, బుధవారాల్లో నిర్వహిస్తున్న దేశవ్యాపిత సమ్మె దేశ చరిత్రలో 18వది కావడం గమనార్హం. గత నాలుగన్నర సంవత్సరాలలో 48 గంటల దేశ వ్యాప్త సమ్మె ఇదే మొదటిసారి. సమ్మె విచ్ఛిన్నానికి సింగరేణి తదితర సంస్థలు చేసిన కృషి ఫలించడం వల్లే కర్మాగారాలలో సమ్మె మొదటి రోజు పాక్షికంగా జరిగింది. -
కొనసాగుతున్న భారత్ బంద్..ఇందిరాపార్కు వద్ద మహాధర్నా
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా కార్మిక సంఘాలు చేపట్టిన భారత్ బంద్ మంగళవారం ఉదయం ప్రారంభమైంది. సెంట్రల్ ట్రేడ్ యూనియన్ బిల్లు 2018కు వ్యతిరేకంగా సెంట్రల్ ట్రేడ్ యూనియన్లు జనవరి 8, 9న భారత్ బంద్ నకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అన్ని రాష్ట్రాల్లోనూ కార్మికులు తెల్లవారుజాము నుంచే రోడ్లమీదకు వచ్చి నిరసనలు తెలుపుతున్నారు. ఈ బంద్లో బ్యాంకు ఉద్యోగులు కూడా పాల్గొనాలని నిర్ణయించుకున్నారు. దీంతో ఈ రోజు, రేపు బ్యాంకులకు తాళాలు పడనున్నాయి. ట్రేడ్ యూనియన్ బిల్లు 2018 సవరణ ద్వారా ప్రభుత్వం కార్మికుల హక్కులను హరిస్తోందని సీఐటీయు జాతీయ కార్యదర్శి తపన్ సేన్ గుప్తా ఆరోపించారు. ఈ బిల్లు ఆమోదం పొందితే కార్మిక సంఘాల అధికారాలకు తెరపడుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కార్మికులను, ఉద్యోగులను అణిచివేసేందుకు ప్రయత్నం ప్రయత్నిస్తోందన్నారు. తమ 12 డిమాండ్లను కార్మిక సంఘాలు కేంద్ర ప్రభుత్వం ముందుంచాయి. రెండు రోజుల భారత్ బంద్కు 10 పెద్ద ట్రేడ్ యూనియన్లు మద్దతు ప్రకటించగా, ఆలిండియా కిసాన్ మహాసభ కూడా దీనిని స్వాగతించింది. సాధారణ ప్రజలతో పాటు ఈ ఆందోళనల్లో రైతులు కూడా పాలు పంచుకోనున్నారు. పూర్తి రుణమాఫీ, నెలకు రూ.3,500 నిరుద్యోగ భృతి చెల్లించాలని రైతులు కోరుతున్నారు. పబ్లిక్ సెక్టార్, చిన్న పరిశ్రమలు, ప్రైవేట్ రంగ ఉద్యోగులు, నౌకాశ్రయాలలో పని చేసేవారు, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ రంగాల ఉద్యోగులు కూడా ఈ భారత్ బంద్ లో పాల్గొంటున్నారు. సమ్మెలో భాగంగా రైల్ రోకో, రోడ్ రోకో, నిరసన ప్రదర్శనలు, ఇతర ఆందోళనలు చేపడుతున్నారు. ఇందిరాపార్కులో మహా ధర్నా కేంద్ర ప్రభుత్వ అవలంభిస్తున్న కార్మిక, ఉద్యోగ, ప్రజా వ్యతిరేక విధానాలపై భారత్ బంద్లో భాగంగా ఇందిరాపార్కులో మహా ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో పలు కార్మిక సంఘాలు పాల్గొన్నాయి. దేశవ్యాప్తంగా నేడు, రేపు జరగబోయే ఈ సార్వత్రిక సమ్మెలో 12 డిమాండ్లను కార్మిక సంఘాలు, ఉద్యోగ సంఘాలు ప్రస్తావించనున్నారు. కాంట్రాక్, ఔట్ సోర్సింగ్ విధానాన్ని రద్దు చేయాలి, సమాన పనికి సమాన వేతనం, కార్మిక చట్టాల సవరణ ఆపాలి తదితర డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం ముందు ఉంచారు. -
ఫ్లిప్కార్ట్ డీల్ : నేడు భారత్ బంద్కు పిలుపు
పుణే : అమెరికాకు చెందిన రిటైల్ దిగ్గజం వాల్మార్ట్, దేశీయ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ను కొనుగోలు చేయడాన్ని మొదట్నుంచి దేశీయ వర్తకులు వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. ఈ డీల్ ప్రభావం వర్తకులపై, చిన్న వ్యాపారాలపై తీవ్ర చూపనుందని ఆరోపిస్తూ వస్తున్నారు. తాజాగా ఈ డీల్ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ.. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్లు(సియాట్) నేడు భారత్ బంద్కు పిలుపునిచ్చారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్కు చెందిన స్వదేశీ జాగ్రన్ మంచ్ కూడా భారత్ బంద్కు మద్దతు తెలిపింది. ఈ డీల్తో మల్టి-బ్రాండ్ రిటైల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు బ్యాక్డోర్ నుంచి దేశంలోకి ప్రవేశిస్తాయని ట్రేడర్లు చెబుతున్నారు. ‘ఫ్లిప్కార్ట్-వాల్మార్ట్ డీల్ దేశీయ ఎఫ్డీఐ పాలసీకి వ్యతిరేకంగా ఉంది. ఇది ఏడు కోట్ల ట్రేడర్లు, దేశంలోని చిన్న వ్యాపారాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది’ అని సియాట్ జనరల్ సెక్రటరీ ప్రవీణ్ ఖండేల్వాల చెప్పారు. భారత్లోకి ఎఫ్డీఐల ప్రవేశాన్ని తాము అడ్డగించడం లేదని, కానీ వాల్మార్ట్, అమెజాన్తో పోటీపడేలా బలవంతం చేసేముందు, భారతీయ ట్రేడర్లకు కూడా ఆ స్థాయిలో మైదానం కల్పించాలని డిమాండ్ చేస్తున్నట్టు సియాట్ కోఆర్డినేటర్ అజిత్ సేథియా అన్నారు. స్వదేశీ జాగ్రన్ మంచ్ కూడా మల్టి-బ్రాండ్ రిటైల్లో ఎఫ్డీఐను వ్యతిరేకిస్తోంది. అంతేకాక ఫ్లిప్కార్ట్ ఆర్థిక వ్యవహారాలపై విచారణ జరిపించాలని డిమాండ్ కూడా చేస్తోంది. నేషనల్ కంపెనీ లా అప్పీలెంట్ ట్రిబ్యునల్లో వాల్మార్ట్-ఫ్లిప్కార్ట్ డీల్కు చెందిన కేసు విచారిస్తున్న సందర్భంగా భారత్ బంద్కు పిలుపునిచ్చారు. వాల్మార్ట్ ట్రిబ్యునల్ ముందు తన స్పందనలు కూడా తెలిపింది. ఈ విషయంపై విచారణ జరిపించాలని కేంద్ర ప్రభుత్వాన్ని, ఈడీని, ఆర్బీఐని, సీసీఐని డిమాండ్ చేస్తున్నామని స్వదేశీ జాగ్రన్ మంచ్ కో-కన్వీనర్ అశ్వాని మహాజన్ అన్నారు. మల్టి బ్రాండులో ఎఫ్డీఐలు, ఎంటర్ప్రిన్యూర్షిప్ను దెబ్బతీస్తాయని, వ్యవసాయదారులకు వ్యతిరేకంగా ఉంటాయని, ఉద్యోగాల సృష్టిని కూడా హరింపజేస్తాయని స్వదేశీ జాగ్రన్ మంచ్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. -
ధోని భారత్ బంద్లో పాల్గొనలేదు
సాక్షి, రాంచీ : సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్కు హద్దు అదుపులేకుండా పోతుంది. ఆ మధ్య కేరళ వరద బాధితుల కోసం కెప్టెన్ కోహ్లి రూ. 82 కోట్లు.. రోనాల్డో 72 కోట్లు అంటూ ఫేక్ న్యూస్ను ట్రెండ్ చేశారు. ఇదే తరహాలో పెట్రో ధరలను నిరిసిస్తూ గత సోమవారం కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చిన భారత్ బంద్లో టీమిండియా మాజీ కెప్టెన్, సీనియర్ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని పాల్గొన్నాడని ఓ వార్త వైరల్ అయింది. తన సతీమణి సాక్షి సింగ్, కొంతమంది సహచరులతో ధోని పెట్రోల్ బంక్లో కూర్చున్న ఓ ఫొటోను సాక్ష్యంగా చూపిస్తూ ఈ నకిలీ వార్తను ట్రెండ్ చేశారు. ఇది నిజమే అనుకొని కొంతమంది కాంగ్రెస్ పెద్దలు సైతం పప్పులో కాలేశారు. ఈ ట్వీట్స్ను లైక్ చేస్తూ.. రీట్వీట్ కూడా చేశారు. అంతేకాకుండా పెరిగిన పెట్రోల్ ధరలను తాను భరించలేనని, అందుకే హెలిక్యాప్టర్ షాట్స్ ఆడభోనని ధోని వ్యాఖ్యనించినట్లు కూడా కొన్ని పోస్ట్లు పుట్టుకొచ్చాయి. అయితే ఇవన్నీ ఫేక్ న్యూస్ అని ఆ ఫొటోలో ఉన్న ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్ సప్నా భవాని స్పష్టం చేశారు. ఆ ఫొటో సెప్టెంబర్ 10న తీసింది కాదని ఆగస్టు 29న సిమ్లాలో తీసిన ఫొటో అని నాటి పోస్ట్ను రీట్వీట్ చేశారు. ధోని ఎలాంటి బంద్లో పాల్గొనలేదని, ఓ ప్రచార చిత్రం కోసం సిమ్లా వెళ్లినప్పుడు హిందుస్తాన్ పెట్రోలియం వారు తీసిన ఫొటో అని పేర్కొన్నారు. Dhoni with Sakshi and friends during night shoot 😇 Picture Courtesy: @sapnabhavnani #Dhoni 🌃🌉🌌⛺😘 pic.twitter.com/vaU7PpYmA4 — #MSDhoni #MSDhoni MS Dhoni MS Dhoni (@iMSDhoniFC) August 30, 2018 ఆగస్టు నాటి ఫొటోను రీట్వీట్ చేసిన స్వప్నా భవాని -
కొనసాగుతున్న పెట్రో మంట
న్యూఢిల్లీ: పెట్రో ఉత్పత్తుల ధరలు రికార్డు స్థాయిలో కొనసాగుతున్నాయి. విపక్షాలు భారత్ బంద్ నిర్వహించినప్పటికీ ధరల పెరుగుదల ఆగలేదు. డాలర్తో రూపాయి మారకం విలువ పడిపోవడంతో దిగుమతుల ధర పెరిగింది. దీంతో సోమవారం పెట్రోల్ ధర లీటర్కు 23 పైసలు, డీజిల్ 22 పైసలు పెరిగింది. తాజా మార్పులతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.80.73కు చేరగా.. డీజిల్ ధర రూ.72.83గా ఉంది. కాగా, ప్రస్తుతానికి ధరలను నియంత్రించే అవకాశం లేదని కేంద్రం స్పష్టం చేయడంతో వినియోగదారులపై మరింత భారం తప్పేట్లు లేదు. -
మండుతున్న పెట్రోల్ : దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనలు
న్యూఢిల్లీ : సామాన్యులకు వాత పెడుతున్న పెట్రోల్, డీజిల్ ధరలపై నిరసనగా దేశవ్యాప్తంగా భారత్ బంద్ కొనసాగుతోంది. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చిన ఈ భారత్ బంద్కు 21 పార్టీలు మద్దతు తెలిపాయి. తృణమూల్ కాంగ్రెస్ మినహా మిగతా అన్ని విపక్ష పార్టీలు ఈ బంద్ను చేపడుతున్నాయి. ఈ బంద్ ప్రభావంతో దేశమంతా తీవ్ర ఆందోళనలు చెలరేగుతున్నాయి. ఉదయం నుంచే ఆందోళనకారులు రోడ్లపైకెక్కి నిరసన వ్యక్తం చేస్తున్నారు. విపక్షాల ఆందోళనలతో కొన్ని ప్రాంతాల్లో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. బిహార్లో ఏర్పడిన ట్రాఫిక్ జామ్తో ఓ చిన్నారి మృతి చెందింది. ట్రాఫిక్ జామ్లో అంబులెన్స్ చిక్కుకోవడంతో, ఈ సంఘటన ఏర్పడింది. కాంగ్రెస్, వామపక్ష పాలిత రాష్ట్రాల్లో ఈ బంద్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంది. ఢిల్లీలో విపక్షాలతో కలిసి కాంగ్రెస్ భారీ ర్యాలీ చేపట్టింది. చాలా ప్రాంతాల్లో దుకాణాలు స్వచ్ఛందంగానే మూతపడ్డాయి. పలుచోట్ల రైలు రోకోలు జరిగాయి. బంద్ ప్రభావంతో రైళ్లు నిలిచిపోవడంతో, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రైలు రోకోలు చేస్తున్న నిరసనకారులను పోలీసులు అరెస్ట్ చేయడం, ఉద్రిక్తతలకు దారితీసింది. నిరసనకారులు బైక్ ర్యాలీలను కూడా చేపట్టారు. పెట్రోల్, డీజిల్ను జీఎస్టీలోకి తీసుకురావాలని, పెరుగుతున్న ధరలను తగ్గించాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. మోదీ సర్కార్ వైఫల్యం వల్లే చమురు ధరలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కర్ణాటక, ఒడిశాల్లో స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. వారణాసిలో వినూత్న రీతిలో బంద్ చేపట్టారు. చేతులకు సంకెళ్లు వేసుకుని ఈ బంద్ చేపట్టారు. యూపీలో బీజేపీ మినహా మిగతా అన్ని పార్టీలు బంద్లో పాల్గొన్నాయి. దేశవ్యాప్తంగా కొనసాగుతున్న ఈ బంద్తో, పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్తో బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్షా భేటీ అయ్యారు. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల, దేశవ్యాప్తంగా కొనసాగుతున్న ఆందోళనలపై అమిత్ షా మంత్రితో చర్చించారు. మోదీ సర్కార్ గద్దె దించాలి... ‘పెట్రోల్ ధరలు భారీగా పెరుగుతున్నాయి. రూపాయి మారకం విలువ క్షీణిస్తోంది. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పాలవుతున్నారు. అయినా ప్రధాని నరేంద్ర మోదీ నోరు మెదపడం లేదు. ముఖ్యమైన అన్ని అంశాలపై మోదీ మౌనం పాటిస్తూ ఉంటారు. ప్రజల సమస్యలను పట్టించుకోరు. విపక్షాలు ఏకమైన మోదీ సర్కార్ను గద్దె దించాలి’ అని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ నాలుగేళ్ల పాలనలో సామాన్యుడు నష్టపోయాడని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పెట్రోల్, డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ రాహుల్ గాంధీ ఢిల్లీలోని రాజ్ఘాట్ నుంచి రామ్లీలా మైదానం వరకు భారీ ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో పార్టీ శ్రేణులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం రాహుల్ గాంధీ రామ్లీలా మైదానంలో భారీ సభ నిర్వహించారు. ఈ సభలో యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీతో పాటు, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, పలు విపక్ష పార్టీ నేతలు పాల్గొన్నారు. పెట్రోల్, డీజిల్ ధరల పెంపును విపక్షాలు ముక్త కంఠంతో నిరసించాయి. తెలుగు రాష్ట్రాల్లో ధర్నాలు దద్ధరిల్లుతున్నాయ్... తెలుగు రాష్ట్రాల్లోనూ భారత్ బంద్ ప్రభావం కనిపిస్తోంది. ఈ బంద్కు పలు పార్టీలతో పాటు ప్రజాసంఘాలు మద్దతు తెలిపాయి. ఆర్టీసీ డిపోల నుంచి బస్సులు బయటకు రాకుండా ఆందోళనకారులు అడ్డుకున్నారు. విజయవాడ బస్టాండ్ వద్ద అఖిలపక్ష నేతలు ఆందోళన చేపట్టారు. బస్సులు బయటకు రాకుండా అడ్డుకోవడంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. బంద్ సందర్భంగా విజయవాడలో చాలా వరకు స్కూళ్లు, దుకాణాలు స్వచ్చందంగా మూసివేశారు. శ్రీకాకుళంలో బంద్ పాక్షికంగా కనిపించింది. తెల్లవారు జామునుంచే బస్సులు రోడ్లపై కనిపించాయి. పశ్చిమ గోదావరి జిల్లాల్లో కూడా పరిస్థితి దాదాపు శ్రీకాకుళంలానే కనిపించింది. ఇక్కడ కూడా బస్సులు తెల్లవారుజాము నుంచే తిరగడం ప్రారంభించాయి. అడ్డుకోవాలని ప్రయత్నించిన ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేశారు. జనసేన కార్యకర్తలు బస్సు డిపోల బయట బైటాయించి నిరసన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే ఇంధన ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. కడప ఆర్టీసీ బస్టాండ్ ఎదుట కాంగ్రెస్, జనసేన, వామపక్షాలు ధర్నా నిర్వహించాయి. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, పెరుగుతున్న ధరలు సామాన్యుల నడ్డి విరుస్తున్నాయని, పెట్రో ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తేవాలని డిమాండ్ చేశాయి.తిరుపతిలో శ్రీవారి భక్తులను తిరుమలకు చేరవేసే బస్సులు మినహా మరేవీ నడవడం లేదు. విశాఖ, గుంటూరు, నెల్లూరు, ఏలూరు, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, మెదక్, నల్గొండ తదితర ప్రాంతాల్లోనూ బంద్ ప్రభావం కనిపిస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా కార్యకర్తలు ఆందోళనలు, నిరసనలు, నినాదాలు చేస్తున్నారు. మోదీ పాలన సామాన్యులకు భారంగా మారిందని కాంగ్రెస్ పార్టీ నేతలన్నారు. ధర్నా చేస్తున్న కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం విధిస్తున్న వ్యాట్, ఇతర పన్నులు, ఎక్స్చేంజ్ డ్యూటీ తగ్గించాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. -
పెట్రో సెగ: బండిని భుజాలపై మోస్తూ నిరసన
పట్నా: వాహనదారులకు చుక్కలు చూపిస్తున్న పెట్రోల్, డిజీల్ ధరలను నిరసిస్తూ ప్రతిపక్షాలు చేపట్టిన భారత్బంద్ కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా పలురాష్ట్రాల్లో ఆయా పార్టీల నేతలు నిరసన కార్యాక్రమాలు చేపట్టారు. అయితే బిహార్లోని శరద్యాదవ్ కొత్తగా ఏర్పాటు చేసిన లోక్తంత్రిక్ జనతా దళ్ (ఎల్జేడీ) కార్యకర్తలు వినూత్నంగా నిరసన తెలిపి అందరి దృష్టిని ఆకర్షించారు. ఈ పెట్రోల్ ధరలతో బైక్ను నడపడం కన్నా దానిని మోసుకుపోవడమే బెటర్ అంటూ భూజాలపై ఎత్తుకుని నిరసన తెలిపారు. పెరిగిన ధరలు తమకు ఎంత భారంగా మారాయో తెలియజేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట్లో హల్చల్ చేస్తున్నాయి. బీహార్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రయివేట్ స్కూళ్లు స్వచ్చందంగా బంద్పాటిస్తున్నాయి. ఇక ఢిల్లీలో కాంగ్రెస్ నేతలు బైక్స్ను ఎడ్ల బండిపై ఎక్కించి నిరసన తెలిపారు. పెరిగిన పెట్రోల్ ధరలను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఈ బంద్కు సుమారు 21 పార్టీలు మద్దతు తెలిపాయి. ఆదివారం లీటర్ పెట్రోల్పై 12 పైసలు, డీజిల్పై 10 పైసలు పెంచుతూ ప్రభుత్వ ఆయిల్ కంపెనీలు మరోసారి షాకిచ్చాయి. దీంతె హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధన 85.35 పైసలుండగా.. డీజిల్ 78.98కు చేరుకుంది. ముంబై అత్యధికంగా లీటర్ పెట్రోల్ ధర 90(89.97)కు చేరుకుంది. -
పెట్రో సెగ.. భారత్ బంద్
-
పెట్రో సెగ.. దేశవ్యాప్తంగా నిరసనలు,ర్యాలూలు
-
పెట్రో సెగ.. కొనసాగుతున్న భారత్ బంద్
సాక్షి, న్యూఢిల్లీ : పెట్రోల్, డీజిల్ ధరల పెంపునకు నిరసనగా ఈ రోజు దేశ వ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి నిరసిస్తూ కాంగ్రెస్ సహా విపక్షాలు ఈ బంద్లో పాల్గొన్నాయి. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఆ పార్టీ ఇతర నేతలు పెట్రెల్, డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ ఢిల్లీలోని రాజ్ఘాట్ నుంచి రామ్లీలా మైదానం వరకు కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని వారు డిమాండ్ చేశారు. తెలుగు రాష్ట్రాల్లోనూ... విజయవాడ : పెట్రోల్, డీజిల్ ధరలకు వ్యతిరేకంగా చేపట్టిన భారత్ బంద్లో వామపక్షాలు, కాంగ్రెస్, జనసేన పార్టీలు పాల్గొన్నాయి. ధరలను నిరసిస్తూ విజయవాడ ఆర్టీసీ బస్టాండ్ ఎదుట ఆందోళన చేపట్టాయి. అక్కడ ఎలాంటి ఆవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా పోలీసులు మోహరించారు. కరీంనగర్ : పెట్రోల్, డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ కాంగ్రెస్ నాయకులు బస్టాండ్ వద్ద బైఠాయించారు. బస్టాండ్ నుంచి బస్సులను బయటకు రానివ్వకుండా వారు అడ్డుకున్నారు. ఏఐసీసీ కార్యదర్శి శ్రీనివాస్ కృష్ణన్, టీపీసీసీ ఉపాధ్యక్షులు పొన్నం ప్రభాకర్, డీసీపీ అధ్యక్షులు మృత్యుంజయంతో పాటు పలువురిని పోలీసులు అరెస్టు చేశారు. అనంతపురం : పెట్రోల్, డీజిల్ ధరల పెంపుకు నిరసనగా కాంగ్రెస్, జనసేన, వామపక్షాలు నిరసన చేపట్టాయి. ఈ సందర్భంగా ఆందోళన కారులు ఆర్టీసీ బస్సులను అడ్డుకున్నారు. నల్గొండ : పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలను నిరసిస్తూ చేపట్టిన భారత్ బంద్లో వామపక్షాలు పాల్గొన్నాయి. బంద్లో భాగంగా నల్గొండ బస్ డిపోలో వామపక్షాల నాయకులు బైఠాయించారు. బైఠాయింపుతో రాకపోకలు నిలిచిపోయి ఆర్టీసీ బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. చిత్తూరు : జిల్లాలో బంద్ కొనసాగుతోంది. పలు ప్రాంతాల్లో భారత్ బంద్ సందర్భంగా సీపీఐ,సీపీఎమ్, జనసేన కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. బంద్ కారణంగా బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. పెట్రోల్ డీజల్ ధరల పెంపును నిరసిస్తూ మదనపల్లిలో వామపక్షాలు, జనసేన ,కాంగ్రెస్ పార్టీల ఆధ్వర్యంలో బంద్ కొనసాగుతోంది. బంద్కు మద్దతుగా పలు ప్రైవేట్ విద్యాసంస్థలు స్వచ్ఛందంగా సెలవులు ప్రకటించాయి. గుంటూరు : పెట్రోలు, డీజిల్ ధరల పెంపునకు నిరసనగా కాంగ్రెస్, జనసేన, వామపక్షాలు బంద్ చేపట్టాయి. గుంటూరు, వినుకొండ, నరసరావుపేట, రేపల్లె, సత్తెనపల్లి బస్టాండ్ వద్ద ఆందోళనకారులు బైఠాయించారు. వారు ఆర్టీసీ బస్సులు బయటకు రానివ్వకుండా అడ్డుకున్నారు. దీంతో ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. కృష్ణాజిల్లా : పెట్రోల్, డీజిల్ ధరలకు నిరసనగా చేపట్టిన దేశవ్యాప్త బంద్ కొనసాగుతోంది. తిరువూరులో బస్సులను అడ్డుకున్న కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం కార్యకర్తలు, నాయకులు 15 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆందోళనకారులను పోలీసు స్టేషన్కు తరలించారు. అనంతరం ఆర్టీసీ అధికారులు బస్సులను తిప్పుతున్నారు. కర్నూల్ : పెరుగుతున్న పెట్రోల్, డీజల్ ధరలను వ్యతిరేకిస్తూ డోన్లో సీపీఐ, సీపీఎం, జనసేన ఆధ్వర్యంలో తెల్లవారు జామున 4 గంటలకే బంద్ ప్రభావం మొదలైంది. ఆర్టీసీ డిపో ముందు బైఠాయించిన ఆందోళనకారులు బస్సులు బైటికి రాకుండా అడ్డుకున్నారు. కర్నూలు నగరంలో సైతం పెంచిన పెట్రో ధరలకు నిరసనగా ఆర్టీసీ బస్స్టాండ్ వద్ద వామపక్షాలు ఆందోళన చేపట్టాయి. డిపో వద్ద బస్సులను ఆందోళనకారులు అడ్డుకున్నారు. ప్రకాశం : జిల్లాలో పెట్రోల్, డీజిల్ ధరలకు పెంపునకు నిరసనగా భారత్ బంద్ కొనసాగుతోంది. బంద్లో భాగంగా ఒంగోలు ఆర్టీ బస్టాండ్ ఎదుట వామపక్షాలు, కాంగ్రెస్, జనసేన పార్టీ నేతలు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆ పార్టీల కార్యకర్తలు బస్సులను బయటకు రాకుండా అడ్డుకున్నారు. మేడ్చల్ : పెట్రోల్,డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ కాంగ్రెస్ నాయకులు కుత్బుల్లాపూర్ జీడిమెట్ల బస్ డీపో వద్ద బైఠాయించారు. డిపో నుంచి బస్సులను బయటకు రానివ్వకుండా అడ్డుకున్నారు. ఈ బంద్లో కూన శ్రీశైలం గౌడ్ పాల్గొన్నారు. వైఎస్సార్ : జిల్లాలో పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ వామపక్షాలతో పాటు పలు పార్టీలు భారత్ బంద్లో పాల్గొన్నాయి. కడప ఆర్టీసీ బస్టాండ్ గేట్ వద్ద వామపక్షాల నేతలు భైఠాయించారు. బంద్లో కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, జనసేన పార్టీ నేతలు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల : పెట్రోల్, డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ చేపట్టిన భారత్ బంద్లో కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. బంద్లో భాగంగా వేములవాడ ఆర్టీసీ డిపో ముందు ఆది శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. విజయనగరం : పెరిగిన పెట్రోలు, డీజిల్ ధరలకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ బంద్ చేపట్టింది. బంద్లో భాగంగా ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద కాంగ్రెస్ పార్టీ నేతలు ఆందోళన చేపట్టారు. కాంగ్రెస్, వామపక్షాల నేతలను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం ఆర్టీసీ బస్సులు యధావిధిగా తిరుగుతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం : పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలకు నిరసనగా చేపట్టిన భారత్ బంద్లో అఖిలపక్షం పాల్గొంది. పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించి జీఎస్టీ పరిధిలోకి తీసుకు రావాలని అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్బంగా కొత్తగూడెం ఆర్.టి.సి. డిపో ఎదుట వారు ధర్నా చేపట్టారు. పశ్చిమ గోదావరి : పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలను నిరసిస్తూ వామపక్షాలు, జనసేన పార్టీల ఆధ్వర్యంలో బంద్ కొనసాగుతోంది. ఏలూరు కొత్త బస్టాండ్ వద్ద తెల్లవారుజాము నుంచి బంద్ మొదలైంది. దీంతో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. నిరసన తెలుపుతున్న ఆందోళన కారులను పోలీసులు అరెస్టు చేసి అక్కడి నుంచి తరలించారు. నర్సాపురంలో పెరిగిన పెట్రోలు, డీజిల్ ధరలకు నిరసనగా సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్, జనసేన నాయకులు, కార్యకర్తలు నర్సాపురం ఆర్టీసీ డిపోను ముట్టడించారు. దీంతో పలువురు నాయకులు, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. బంద్కు మద్దతుగా ప్రైవేటు విద్యా సంస్ధలు సైతం సెలవు ప్రకటించాయి. జంగారెడ్డిగూడెం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం బస్టాండ్ వద్ద తెల్లవారుజాము నుంచి బంద్ మొదలైంది. పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తలను అరెస్టు చేసి అక్కడి నుంచి తరలించారు. అనంతరం బస్సులు యధావిధిగా తిరుగుతున్నాయి. మహబూబ్ నగర్ : జిల్లాలోని నారాయణపేటలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన భారత్ బంద్ పిలుపు మేరకు తేల్లావారు జామున 5 గంటల నుంచి అఖిలపక్ష నాయకులు బస్ డిపో ముందు బైఠాయించారు. బస్సులు బయటకు రాకుండా అడ్డుకోవటంతో బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ ఎమ్ఎల్, పీడీఎస్యూ, పీవైఎల్, వివిధ పార్టీల కార్యకర్తలు, నాయకులు బంద్లో పాల్గొన్నారు. భారత్ బంద్ సందర్భంగా పెట్రోల్ ధరలను నిరసిస్తూ వామపక్షాలు తాండూరు ఆర్టీసీ బస్టాండ్ వద్ద భైఠాయించాయి. శ్రీకాకుళం : పెట్రోల్, డీజిల్ ధరల పెంపునకు నిరసనగా శ్రీకాకుళం, టెక్కలి, పలాస, పాలకొండ ఆర్టీసీ కాంప్లెక్స్ల వద్ద వామపక్షాల కార్యకర్తలు బస్సులను అడ్డుకున్నారు. బస్సులు ఎక్కడికి కదలలేక డిపోలకే పరిమితమయ్యాయి. దీంతో వామపక్షాల కార్యకర్తలను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని స్టేషనుకు తరలించారు. వరంగల్ రూరల్ : నర్సంపేట పట్టణంలో డీజల్, పెట్రోల్ ధరల పెరుగుదలను నిరసిస్తూ కాంగ్రెస్, వామపక్షాలు చేపట్టిన భారత్ బంద్ నేపథ్యంలో ఆర్టీసీ బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు డిపో ముందు బైఠాయించి బైక్ ర్యాలీలు, నిరసనలు తెలియజేశారు. మహబూబాబాద్లో పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలకు నిరసనగా తొర్రూర్లో కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, టీడీపీ ఆధ్వర్యంలో భారీ బైకు ర్యాలీ చేపట్టారు. నెల్లూరు : పెట్రోల్, డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ వామపక్షాలు, కాంగ్రెస్ నేతలు బంద్ను చేపట్టారు. వారు నెల్లూరు ఆర్టీసీ బస్స్టాండ్ వద్ద బస్సులను అడ్డుకున్నారు.దీంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జగిత్యాల : పెట్రోల్, డీజిల్ ధరలను నిరసిస్తూ చేపట్టిన బంద్లో భాగంగా జగిత్యాలలో తాజా మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి వినూత్న నిరసన చేపట్టారు. ఎడ్ల బండిలో పర్యటిస్తూ బంద్ను పర్యవేక్షించారు. అనంతరం కాంగ్రెస్ కార్యకర్తలు బైక్ ర్యాలీ నిర్వహించారు. నిర్మల్ : పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై నిర్వహించిన బంద్ విజయవంతమైంది. అఖిలపక్షాల బంద్కు వ్యాపారస్తులు, విద్యాసంస్థలు, స్వచ్చందంగా సహకరించారు. ప్రైవేట్ పాఠశాలలను మూసి నిరసనకు మద్దతు తెలిపారు. ఈ సందర్బంగా పలువురు కాంగ్రెస్ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. మంచిర్యాల : లకిశెట్టిపేట పట్టణంలో డీజల్, పెట్రోల్ ధరల పెరుగుదలను నిరసిస్తూ కాంగ్రెస్ ,వామపక్షాలు బంద్ చేపట్టాయి. ఈ నేపథ్యంలో స్కూల్స్, వ్యాపార సంఘలు సైతం బంద్ పాటించాయి. ఆదిలాబాద్ : ఉట్నూర్లో భారత్ బంద్ సందర్భంగా ఉట్నూర్ బస్ డిపో వద్ద కాంగ్రెస్ నేతలు ధర్నా చేపట్టారు. బంద్ కారణంగా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ఆందోళనకారులను అరెస్ట్ చేసిన పోలీసులు ఉట్నూర్ పోలీస్ స్టేషన్ తరలించారు. -
నేటి ‘భారత్ బంద్’కు విపక్షాలు సన్నద్ధం
సాక్షి,హైదరాబాద్: పెట్రోల్, డీజిల్ ధరల పెంపునకు నిరసనగా సోమవారం నిర్వహించనున్న భారత్బంద్కు కాంగ్రెస్ సహా విపక్షాలన్నీ సన్నద్ధమయ్యాయి. హైదరాబాద్లో ప్రజాందోళనకు అన్నిపక్షాలు రంగంలోకి దిగడంతో ప్రజారవాణా వ్యవస్థపై ప్రభావం పడనుంది. వ్యాపార, వాణిజ్య సంస్థలు మూత పడనున్నాయి. ఆర్టీసీ కార్మిక సంఘాలు బస్సుల బంద్కు పిలుపునివ్వనప్పటికీ ఆందోళనకారులు ఆర్టీసీ, సిటీ బస్సులను డిపోల నుంచి బయటికి రాకుండా అడ్డుకునే అవకాశాలు లేకపోలేదు. అయితే, బస్సులు యథావిధిగా నడుస్తాయని ఆర్టీసీ వర్గాలు తెలిపాయి. మరోవైపు భారత్ బంద్కు తెలంగాణ లారీ అసోసియేషన్ మద్దతు ప్రకటించింది. బంద్ పాటిస్తామని ఆటో యూనియన్ వెల్లడించింది. ఎంఎంటీఎస్, మెట్రో రైళ్లు యథావిధిగానే నడు స్తాయని మెట్రో రైల్వే వర్గాలు పేర్కొన్నాయి. ప్రయాణికుల డిమాండ్ను బట్టి ట్రిప్పుల సంఖ్య పెంచు తామని రైల్వే వర్గాలు తెలిపాయి. భారత్బంద్ సందర్భంగా విద్యాసంస్థలకు ఎలాంటి సెలవు ప్రకటించలేదు. దీంతో అవి యథావిధిగా నడిచే అవకాశాలున్నాయి. కాగా, పెట్రోల్, డీజిల్ ధరల పెంపునకు నిరసనగా బంద్ పాటించి విజయవంతం చేయాలని కాంగ్రెస్, వామపక్షాలు ప్రజలకు విజ్ఞప్తి చేశాయి. -
రికార్డు స్థాయికి పెట్రో మంట
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పెట్రో ఉత్పత్తుల ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. రాజధాని ఢిల్లీలో తొలిసారిగా పెట్రోల్ ధర రూ. 80 మార్కును దాటింది. డాలర్తో రూపాయి మారకవిలువ తగ్గడంతో దిగుమతుల ధరలు పెరిగినందువల్లే ఈ స్థాయిలో రేట్లు పెరిగిపోయాయి. శనివారం ఒక్కరోజే పెట్రోల్ ధర 39 పైసలు, డీజిల్ ధర 44 పైసలు పెరిగింది. తాజా పెంపుతో ఢిల్లీలో లీటరు పెట్రోల్ రూ.80.38కి, డీజిల్ రూ.72.51కి చేరింది. అటు ముంబైలో లీటరు పెట్రోల్ ధర రూ.87.77 కాగా, డీజిల్ రూ. 76.98కు పెరిగింది. మిగిలిన మెట్రో నగరాలు, రాష్ట్రాల రాజధానులతో పోలిస్తే ఢిల్లీలో ధరలు తక్కువగా, ముంబైలో అత్యధికంగా ఉన్నాయి. కాగా, పెరుగుతున్న పెట్రోల్ ధరలను నిరసిస్తూ సోమవారం (సెప్టెంబర్ 10న) విపక్షాలు భారత్ బంద్కు పిలుపునిచ్చాయి. కేంద్ర, రాష్ట్రాల పన్నుల కారణంగానే పెట్రో ఉత్పత్తుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. పెట్రోల్ ధరలను తగ్గించే విషయంపై కేంద్రం ప్రయత్నాలు ప్రారంభించింది. మరో రెండు నెలల్లో 4 రాష్ట్రాలకు ఎన్నికల నేపథ్యంలో ప్రజావ్యతిరేకత రాకుండా వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. -
సెప్టెంబర్ 10న బంద్కు పిలుపునిచ్చిన విపక్షాలు
-
నిశ్శబ్ద ఉద్యమం వెనుక కృత్రిమ మేధ
వాషింగ్టన్: కృత్రిమ మేధ, భౌగోళిక సమాచార వ్యవస్థ (జీఐఎస్), బిగ్ డేటాలను వినియోగించడంతో ఏప్రిల్ 2 నాటి భారత్ బంద్కు పిలుపు వచ్చిందని తేలింది. ఈ బంద్ వెనుక అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న ఓ దళిత సంస్థ ఉన్నట్లు తెలిసింది. అక్రమ కేసుల్లో ఇరుక్కుంటున్న వారికి రక్షణ కల్పించేందుకు ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టంలో సుప్రీంకోర్టు స్వల్ప సవరణలు చేయడంతో దళితులు చేపట్టిన భారత్ బంద్ హింసాత్మకమై 13 మంది చనిపోయారు. న్యూజెర్సీకి చెందిన దిలీప్ మాస్కే అనే వ్యక్తి అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా తదితర దేశాల్లో ఉంటున్న దాదాపు వంద మందికిపైగా దళితులతో ఓ రహస్య బృందాన్ని ఏర్పాటు చేశారు. యూపీ, మధ్యప్రదేశ్, రాజస్తాన్, బిహార్, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లోని 100 లోక్సభ నియోజకవర్గాలపై తాము దృష్టి పెట్టామనీ, అక్కడ గెలుపోటములను ప్రభావితం చేస్తామని బృందంలోని కొందరు అన్నారు. ఏప్రిల్ 2 నాటి భారత్ బంద్కు కృత్రిమ మేధ ద్వారా తాము ప్రయోగాత్మకంగా పిలుపునిచ్చామని దిలీప్ అన్నారు. కొన్నేళ్లుగా కృత్రిమ మేధ సాయంతో ఆన్లైన్ నుంచి డేటా సేకరించామనీ, రాజకీయ వర్గాలకు వ్యతిరేకంగా ఆందోళనలు నిర్వహించేందుకు ప్రణాళికలు రచించామన్నారు. లండన్కు చెందిన ఓ కంపెనీ నుంచి డేటా కొన్నామని చెప్పారు. -
విపక్షం.. అభివృద్ధికి ఆటంకం
మోతిహారి: ప్రభుత్వం పేదల అభ్యున్నతికోసం చేస్తున్న ప్రయత్నాలకు విపక్షాలు అడ్డుతగులుతున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ ఘాటుగా విమర్శించారు. సమాజంలో విభజన తీసుకురావటం ద్వారా ఢిల్లీ నుంచి గల్లీ వరకు ప్రతిపనిలోనూ అడ్డంకులు సృష్టిస్తున్నాయన్నారు. ‘గల్లీ నుంచి పార్లమెంటు వరకు ప్రభుత్వం పనిలో విపక్షాలు సమస్యలు సృష్టిస్తున్నాయి. ప్రభుత్వం ప్రజలను కలిపేందుకు ప్రయత్నిస్తే.. విపక్షాలు మాత్రం సమాజాన్ని విడదీసేందుకు కుట్రపన్నుతున్నాయి’ అని మోదీ ఆరోపించారు. చంపారన్ సత్యాగ్రహం శతాబ్ది ఉత్సవాల ముగింపు సందర్భంగా.. బిహార్లోని మోతిహారీలో 20వేల మంది స్వచ్ఛాగ్రహి (స్వచ్ఛత వాలంటీర్లు)లనుద్దేశించి మోదీ ప్రసంగించారు. ఎస్సీ–ఎస్టీ చట్టంపై సుప్రీం కోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో భారత్ బంద్ హింసాత్మకంగా మారటం, పార్లమెంటు వరుస వాయిదాల నేపథ్యంలో మోదీ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. బిహార్ సీఎం భేష్ బిహార్ సీఎం నితీశ్ కుమార్ అవినీతి, అసాంఘిక శక్తులతో (పరోక్షంగా ఆర్జేడీ–కాంగ్రెస్ కూటమిని విమర్శిస్తూ) పోరాటం చేస్తూనే రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడుపుతున్నారని ప్రశంసించారు. నితీశ్ ప్రయత్నాలకు కేంద్రం పూర్తి మద్దతిస్తుందన్నారు. ‘ప్రతి మిషన్ను బిహార్ ప్రభుత్వం విజయవంతంగా పూర్తి చేస్తోంది. మార్పును కోరుకోని వాళ్లకు ఈ ప్రభుత్వ పనితీరు ఇబ్బంది కలిగిస్తోంది. పేదల అభ్యున్నతి జరిగితే.. అసత్యాలను వారిని మభ్యపెట్టే పరిస్థితి ఉండదు. అందుకే వారి అభ్యున్నతి కోసం చేసే ప్రతి పనిలోనూ ఆటంకాలు సృష్టిస్తున్నారు’ అని మోదీ పేర్కొన్నారు. సమాజంలో ఓ వర్గాన్ని మరో వర్గంపైకి రెచ్చగొడుతున్నారన్నారు. స్వచ్ఛభారత్ పథకం అమలులో బిహార్ సాధిస్తున్న విజయాలు దేశానికే ఆదర్శమన్నారు. ఈ సందర్భంగా వివిధ రాష్ట్రాలకు చెందిన 10 మంది స్వచ్ఛాగ్రహిలను మోదీ సన్మానించారు. ఇందులో ఆరుగురు మహిళలున్నారు. ఒక్కొక్కరికి రూ.51వేల నగదు, జ్ఞాపికతో సత్కరించారు. అంతకుముందు, వేదికపై మహాత్ముని విగ్రహానికి మోదీ పుష్పాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో సీఎం, డిప్యూటీ సీఎం సుశీల్ మోదీ, గవర్నర్ సత్యపాల్ మాలిక్, పలువురు కేంద్ర మంత్రులు పాల్గొన్నారు. అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభం భారత దేశ తొలి భారీ విద్యుత్ సామర్థ్యమున్న ఎలక్ట్రిక్ గూడ్స్ రైలు ఇంజన్ను మోదీ ప్రారంభించారు. బిహార్లోని మాధేపుర ఫ్యాక్టరీలో ఉన్న ఇంజన్ను మోతిహారీ నుంచి రిమోట్ ద్వారా ప్రారంభించారు. 12వేల హార్స్పవర్ సామర్థ్యమున్న ఈ ఇంజన్ను భారతీయ రైల్వే, ఫ్రెంచ్ తయారీ సంస్థ అల్స్టోమ్ సంయుక్తంగా రూపొందించాయి. మాధేపుర ఫ్యాక్టరీకి ఏడాదికి 110 లోకోలను రూపొందించే సామర్థ్యం ఉంది. 11 ఏళ్లలో 800 లోకోలను తయారుచేయాలని భారతీయ రైల్వే లక్ష్యంగా పెట్టుకుంది. కతిహార్–పాత ఢిల్లీ మధ్య నడవనున్న చంపారన్ హమ్సఫర్ ఎక్స్ప్రెస్ను మోదీ జెండా ఊపి ప్రారంభించారు. ముజఫర్పూర్–సాగౌలీ, సాగౌలీ–వాల్మీకీ నగర్ మధ్య రైల్వే లైను డబ్లింగ్ పనులకు శంకుస్థాపన చేశారు. తొలిసారిగా ప్రధాని దీక్ష రేపు పార్లమెంటు ఆవరణలో సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: స్వతంత్ర భారత చరిత్రలో తొలిసారిగా ప్రధాని నిరాహార దీక్షలో పాల్గొననున్నారు. ఏప్రిల్ 12న బీజేపీ ఎంపీల ఒకరోజు నిరాహార దీక్షలో ప్రధాని మోదీ, పార్టీ చీఫ్ అమిత్షా కూడా పాలు పంచుకోనున్నారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలను విపక్ష పార్టీలు అడ్డుకున్నందుకు నిరసనగా దీక్ష చేపట్టనున్నట్లు పార్టీ ఆవిర్భావ దినోత్సవం నాడు మోదీ స్వయంగా వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే ప్రభుత్వ వ్యతిరేకత పెరిగిపోతుండటం, రాజకీయంగా పరిస్థితి చేయిదాటుతున్నట్లు కనబడుతున్న నేపథ్యంలో ఈ దీక్ష చేపట్టాలని బీజేపీ నిర్ణయించినట్లు తెలిసింది. అయితే దీక్ష సందర్భంగా మోదీ.. సెలవు తీసుకోకుండా రోజులాగే ఫైళ్లను క్లియర్ చేయటం, ప్రజలు, అధికారులతో మాట్లాడటం వంటివి కొనసాగిస్తారని బీజేపీ నేత ఒకరు తెలిపారు. అటు, అమిత్ షా అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న కర్ణాటకలో దీక్షలో పాల్గొంటారు. పార్లమెంటు కొనసాగకపోవటంతో బీజేపీ బాధపడుతోందనే విషయాన్ని ప్రజలకు వెల్లడించేందుకే దీక్ష చేపట్టామని ఎంపీ జీవీఎల్ నరసింహారావు చెప్పారు. ఫూలే, అంబేడ్కర్ జయంతి కార్యక్రమాలతో.. ఏప్రిల్ 11న జ్యోతిబా ఫూలే జయంతిని సమతా దివస్గా జరుపుకోవాలని బీజేపీ నిర్ణయించింది. ఈ సందర్భంగా ఎంపీలు వారి నియోజకవర్గాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలి. దీనికితోడు పార్టీపై పడుతున్న దళిత వ్యతిరేకి ముద్రను తొలగించుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా ఏప్రిల్ 14 (అంబేడ్కర్ జయంతి) నుంచి మే 5 వరకు ఎంపీలు.. 50 శాతం కన్నా ఎక్కువ ఎస్సీ జనాభా ఉన్న గ్రామాల్లో రాత్రి నిద్ర చేయాలని, ప్రభుత్వం దళితుల కోసం ఉద్దేశించిన పథకాలను వారికి వివరించాలని మోదీ సూచించారు. ప్రధాని దీక్షలో పాల్గొనటం ద్వారా.. బ్యాంకు కుంభకోణాలను నియంత్రించటంలో, ప్రత్యేక హోదా తదితర అంశాలపై విపక్షాల ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేని అశక్తతను వెల్లడించినట్లవుతుందని పలువురు బీజేపీ ఎంపీలు భావిస్తున్నట్లు సమాచారం. -
నిఘా నీడన భారత్ బంద్
సాక్షి, న్యూఢిల్లీ : కుల ప్రాతిపదికన రిజర్వేషన్ల విధానాన్ని వ్యతిరేకిస్తున్న పలు సంఘాలు మంగళవారం భారత్ బంద్కు పిలుపు ఇచ్చిన క్రమంలో వివిధ రాష్ట్రాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. బంద్ సందర్భంగా ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టం సంభవించకుండా అప్రమత్తంగా ఉండాలని హోంమంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలనూ కోరింది. బంద్ నేపథ్యంలో రాజస్ధాన్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాల్లో 144 సెక్షన్ విధించారు. ఏప్రిల్ 10న బంద్కు సోషల్ మీడియాలో, వాట్సాప్లో మెసేజ్లు వెల్లువెత్తడంతో కొన్ని ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాన్ని నీరుగార్చడాన్ని నిరసిస్తూ ఏప్రిల్ 2న దళిత సంఘాలు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. భారత్ బంద్ నిరసనల సందర్భంగా పది మంది మరణించగా, పలువురికి తీవ్ర గాయాలైన విషయం తెలిసిందే. ఎస్సీ, ఎస్టీ చట్టంపై సుప్రీం తీర్పును పునఃసమీక్షించాలని దళిత సంఘాలు పట్టుబడుతున్నాయి. మరోవైపు ఆందోళనలు చేస్తున్న వారు తమ తీర్పును పూర్తిగా చదవలేదని సర్వోన్నత న్యాయస్ధానం పేర్కొనగా, దళితుల ప్రయోజనాల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడిఉందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. తాజాగా రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ భారత్ బంద్కు పిలుపు ఇవ్వడంతో హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. -
రేపు భారత్ బంద్!: కేంద్రం సూచనలు
సాక్షి, న్యూఢిల్లీ : విద్యా, ఉద్యోగాల్లో కులం ప్రాతిపదికన అమలవుతోన్న రిజర్వేషన్లను రద్దు చేయాలనే డిమాండ్తో కొందరు మంగళవారం భారత్ బంద్కు పిలుపునిచ్చారు. దీంతో కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. అయితే, రేపటి బంద్కు ఏ ఒక్క సంస్థగానీ, రాజకీయ పార్టీగానీ బాధ్యత వహించడంలేదు. కేవలం సోషల్ మీడియాలో సాగుతోన్న ప్రచారం ఆధారంగానే కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఈ మేరకు రంగంలోకి దిగింది. ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టంలో మార్పులను వ్యతిరేకిస్తూ ఏప్రిల్ 2న దళిత సంఘాలు చేపట్టిన భారత్ బంద్ హింసాత్మకంగా మారిన నేపథ్యంలో కేంద్రం సూచన ప్రాధాన్యం సంతరించుకుంది. సోషల్ మీడియాలో వైరల్: రిజర్వేష్లను వ్యతిరేకిస్తూ ఈ నెల 10న భారత్ బంద్ జరగబోతున్నట్లు సామాజిక మాధ్యమాల్లో వార్తలు వైరల్ అయ్యాయి. విద్యా, ఉదోగ్యాల్లో కుల ప్రాతిపదిక రిజర్వేషన్లు రద్దు చేయాలంటూ వాట్సప్, ఫేస్బుక్ల ద్వారా లక్షలకొద్దీ సందేశాలు వెలువడటంతో కేంద్రం అప్రమత్తమైంది. మొన్నటి అనుభవం దృష్ట్యా భద్రతను కట్టుదిట్టం చేయాలని అన్ని రాష్ట్రాలకూ సూచనలు పంపింది. -
ఆ అధికారుల్ని వదలం : మాయావతి
సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్, మధ్రప్రదేశ్లలో తాము అధికారంలోకి వచ్చాక దళితులపై ఎన్డీయే సర్కార్ అక్రమంగా పెట్టిన కేసులన్నీ ఎత్తేస్తామని బహుజన సమాజ్వాదీ పార్టీ అధినేత్రి మాయావతి అన్నారు. బీజేపీకి కొమ్ముగాస్తూ.. దళితులపై అక్రమ కేసులు బనాయించిన అధికారులను సస్పెండ్ చేస్తామని ఆమె హెచ్చరించారు. ఆమె ఆదివారం విలేకరులతో మాట్లాడారు. దళిత సంఘాలు చేపట్టిన ‘భారత్ బంద్’ విజవంతమవ్వడంతో బీజేపీ వెన్నులో వణుకుపుట్టిందని పేర్కొన్నారు. తమ ఐక్యతను చూసి ఓర్వలేకనే ఎన్డీయే పాలిత రాష్ట్రాల్లో దళితులపై దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. నిరసనలకు కూడా చోటు లేదు.. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ వంటి ఎన్డీయే పాలిత రాష్ట్రాల్లో కనీసం నిరసన వ్యక్తం చేసే పరిస్థితులు కూడా దళిత, బహుజనులకు లేవని ఆవేదన వ్య్తక్తం చేశారు. దళితులు చేస్తున్న నిరసనల్లో చోటుచేసుకున్న చిన్నచిన్న సంఘటనల్ని కూడా భూతద్దంలో పెట్టి చూపిస్తున్నారని, దగ్గరుండి వీడియోలు తీయించి కేసుల పేరుతో వారిని హింసిస్తున్నారని మండిపడ్డారు. దళితులకు రక్షణ కవచంలా పనిచేసే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని సుప్రీంకోర్టు నీరుగారుస్తోందంటూ ఈ నెల 2న దేశవ్యాప్తంగా దళిత సంఘాలు చేపట్టిన భారత్ బంద్ విజయవంతమైన సంగతి తెలిసిందే. ఈ బంద్లో పాల్గొన్న దళితులను పోలీసులు వేధిస్తున్నారంటూ బీజేపీ దళిత ఎంపీ ఉదిత్రాజ్ ట్విటర్లో చేసిన కామెంట్పై మాయవతి స్పందించారు. బీజేపీ దళిత ఎంపీలను దళిత సమాజం ఎన్నటికీ క్షమించదని ఉదిత్రాజ్పై విమర్శలు గుప్పించారు. స్వార్ధ రాజకీయాలు చేసే బీజేపీ దళిత నేతలు, ఎంపీలు తమ జాతికి ద్రోహం చేస్తున్నారని ఆమె ధ్వజమెత్తారు. -
యువకుల బుల్లెట్లకు దళితులు బలి
సాక్షి, న్యూడిల్లీ : రాకేశ్ జాటవ్కు 40 ఏళ్లు. రోజు కూలి చేసుకుని బతికే సంసారి. మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ సిటీ, భీమ్నగర్ దళిత వాడలో నివసిస్తున్నాడు. ప్రతిరోజు లాగే సోమవారం నాడు కూడా ఉదయం ఎనిమిది గంటలకు రెడీ అయ్యాడు. కూతురు టిఫిన్ బాక్సులో చపాతీలు కట్టివ్వగా తీసుకొని సమీపంలోని కూలీ అడ్డాకు బయల్దేరి వెళ్లారు. మధ్యాహ్నానికి పక్కింటాయన పరుగెత్తుకుంటూ వచ్చి ‘మీ నాన్నకు బుల్లెట్ తగిలింది. కింద పడిపోయాడు’ అంటూ 18 ఏళ్ల కూతురు కాజల్కు చెప్పారు. కూతురు పరుగెత్తుకుంటూ కుమ్హార్ పురలోని కూలీల అడ్డకు వెళ్లింది. దూరం నుంచే ఓ పోలీసు ఆమెను అడ్డుకున్నారు. రక్తం మడుగులో నుంచి అప్పుడే రాజీవ్ జాటవ్ శరీరాన్ని లేపి అంబులెన్స్లోకి ఎక్కిస్తున్నారు. ‘అప్పటికి నాన్న ఊపిరి కొట్టుకుంటుందో లేదో, నాకు తెలియదు. ఛాతిలో నుంచి బుల్లెట్ దూసుకపోయిందంటూ అక్కడి వారు చెప్పుకుంటుంటే విన్నాను. ఆ తర్వాత నేను ఆస్పత్రికి వెళ్లేలోగా నాన్న చనిపోయాడు’ అని కాజల్ మీడియాకు వివరించింది. భారత్ బంద్ సందర్భంగా గ్వాలియర్ సిటీలో దళితులు, అగ్రవర్ణాల మధ్య జరిగిన ఘర్షణల్లో మరణించిన ముగ్గురు దళితుల్లో రాకేశ్ జాటవ్ ఒకరు. మిగతా ఇద్దరు దళితులు కూడా బుల్లెట్ గాయాలకే మరణించారు. వారిలో 22 ఏళ్ల దీపక్ ఒకరు. అతను గ్వాలియర్ నగరంలోని గొల్లకొత్తార్ ప్రాంతానికి చెందిన వాడు. మరొకరు 26 ఏళ్ల విమల్ ప్రకాష్. గ్వాలియర్కు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న సెవారియా ఫూల్ గ్రామస్థుడు. ఈ ముగ్గురులో ఎవరికి కూడా బంద్తోగానీ, ఘర్షణతోగానీ సంబంధం లేదని తేలింది. రాకేశ్ జాటవ్ రోడ్డు మీద వెళుతుండగా ఛాతిలోకి బుల్లెట్ దిగింది. జీవితంలో ఎస్సై కావాలనుకుంటున్న విమల్ 40 కిలోమీటర్ల దూరంలోని దాబ్రాలో కోచింగ్ తరగతులకు హాజరై ఇంటికి వస్తుండగా మార్గమధ్యంలో బుల్లెట్ తగిలి అక్కడికక్కడే మరణించాడు. ఇక ఆటోనడిపే దీపక్ రోడ్డు పక్కన ఆటో ఆపుకొని నిలబడి ఏదో గొడవ జరుగుతోందని అనుకుంటున్నంతలోనే మెడలో నుంచి బుల్లెట్ దూసుకుపోయి అక్కడికక్కడే చనిపోయారు. అన్న చనిపోతున్న దృశ్యాన్ని పక్కనే ఉన్న 20 ఏళ్ల తమ్ముడు సచిన్ చూశాడు. పోలీసులు వచ్చే వరకే అన్న చనిపోయాడని తెలిపాడు. తాము ఘర్షణలను ఆపేందుకు లాఠీలతో బెదిరించామేగానీ, ఒక్క బుల్లెట్ను కూడా పేల్చలేదని పోలీసులు స్పష్టం చేశారు. రాళ్లు విసురుతున్న దళితులపైకి అగ్రవర్ణాలకు చెందిన గుర్తుతెలియని యువకులు తుపాకులతో కాల్పులు జరపడంతో వారు మరణించినట్లు భావిస్తున్నామని పోలీసులు తెలిపారు. తాము ముందుగా ఎలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడలేదని, ఎస్సీ, ఎస్టీల చట్టాన్ని నీరు కార్చవద్దని నినాదాలు చేస్తూ ప్రదర్శనగా వెళుతుంటే అగ్రవర్ణాలకు చెందిన యువకులు తుపాకులతో బెదిరించారని, వారిని ఎదుర్కోవడం కోసం తాము రాళ్లు రువ్వాల్సి వచ్చిందని దళితులు చెబుతున్నారు. దళితులే తమ ఇళ్లపైకి దాడులకు దిగారని అగ్రవర్ణాల వారు ఆరోపిస్తున్నారు. అల్లర్లకు కారణం ఎవరైనా గుర్తుతెలియని యువకులు దళితులపైకి తుపాకులతో కాల్పులు జరుపుతున్న దశ్యాలు సీసీటీవీ కెమెరాలకు చిక్కాయి. వాటి ఆధారంగా పోలీసులు పలువురిని అరెస్ట్చేసి దర్యాప్తు జరుపుతున్నారు. అరెస్టైన వారిలో ఇరువర్గాల వారున్నారని పోలీసులు చెప్పారు. సోమవారం నాటి బంద్ సందర్భంగా జరిగిన హింసాకాండలో ఎనిమిది మంది మరణించిన విషయం తెల్సిందే. మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో ముగ్గురు మరణించగా, భింద్ జిల్లలో ఇద్దరు, రాజస్థాన్లోని అల్వార్ జిల్లాలో ఇద్దరు, యూపీలో ఒకరు మరణించారు. -
ప్రమాదకర ధోరణి
సమస్య వచ్చిపడినప్పుడు నాన్చుడు ధోరణి అవలంబిస్తే ఫలితం ఎలా ఉంటుందో ఉత్తరభారతంలో సోమవారం జరిగిన ఉదంతాలు రుజువు చేశాయి. ‘భారత్ బంద్’ పలు రాష్ట్రాలను రణక్షేత్రాలుగా మార్చింది. 9మంది పౌరులు ప్రాణాలు కోల్పోగా, వందలమంది గాయపడ్డారు. భారీయెత్తున విధ్వంసం చోటుచేసుకుంది. ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వాలు, పోలీసులు విఫలమైనప్పుడు నిరసనలు కట్టుదాటడం రివాజే. కానీ ఈసారి జరిగింది అది కాదు. దళితులు, వారిని వ్యతిరేకించేవారి మధ్య ఘర్షణలు జరిగాయి. తాము ఒకటి రెండుచోట్ల గాల్లోకి మాత్రమే కాల్పులు జరిపామని పోలీసులు చెబుతుంటే, చనిపోయినవారంతా తూటా గాయాల వల్లే కన్నుమూశారు. చానళ్లు చూపిన దృశ్యాల్లో ప్రైవేటు వ్యక్తి ఒకరు ఆందోళనకారుల్ని గురిచూసి కాల్చినట్టు స్పష్టంగా కనబడుతోంది. ఇది ఆందోళన కలిగించే అంశం. రాజస్తాన్లోని కరౌలీ జిల్లా హిందువాన్ నగరంలో తొలినాటి బంద్ను నిరసిస్తూ ఆధిపత్య కులాలకు చెంది నవారు మంగళవారం బీజేపీ, కాంగ్రెస్లకు చెందిన ఇద్దరు దళిత ఎమ్మెల్యేల ఇళ్లకు నిప్పుపెట్టారు. ఎస్సీ, ఎస్టీ(అత్యాచారాల నిరోధక) చట్టం వేధింపులకు ఆయుధంగా మారుతున్నదని, అది దుర్వినియోగమవుతున్నదని గత నెల 20న సుప్రీంకోర్టు వ్యాఖ్యానించి, ఆ కేసుల్లోని నిందితుల అరెస్టుకు కొన్ని మార్గదర్శకాలు జారీచేసిన నాటి నుంచీ దళిత వర్గాల్లో అసంతృప్తి, ఆగ్రహావేశాలు కనబడుతూనే ఉన్నాయి. దీనిపై ప్రభుత్వం రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలని దాదాపు అన్ని పార్టీలూ డిమాండు చేశాయి. బీజేపీలోని దళిత ఎంపీలు సైతం దీనితో శ్రుతి కలిపారు. కేంద్రం సైతం సోమవారం రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది. కానీ పదిహేను రోజులపాటు కేంద్రం వైఖరేమిటో ప్రభుత్వంలోని వారెవరూ చెప్పలేకపోయారు. దళితుల్లో గూడుకట్టుకున్న అసంతృప్తిని అంచనా వేయడంలో వైఫల్యం చెందడంవల్ల దురదృష్టకర పరిణామాలు ఏర్పడ్డాయి. ఏ ప్రధాన రాజకీయ పార్టీ ‘భారత్ బంద్’కు పిలుపునివ్వలేదన్న సంగతిని ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఉత్తరప్రదేశ్ డీజీపీయే ఈ మాట చెబుతున్నారు. సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన రెండురోజులకు జాతీయ దళిత సంస్థల సమాఖ్య(ఎన్ఏసీడీఓఆర్) తొలిసారి ఈ బంద్ పిలుపునిస్తే అఖిల భారత దళిత హక్కుల సమాఖ్య(ఏఐడీఆర్ఎఫ్), ఎస్సీ,ఎస్టీ ఉద్యోగుల సంఘాలు, మరికొన్ని ఇతర సంస్థలు దానితో గొంతు కలిపాయి. ఆ తర్వాతే బీఎస్పీ తదితర పార్టీలు మద్దతు ప్రకటించాయి. బంద్ పిలుపులు దేశంలో కొత్తగాదు. తమ ఆగ్రహాన్నీ, అసంతృప్తినీ వ్యక్తం చేయడానికి, పాలకుల మెడలు వంచడానికి, సమస్యపై పాలకులు దృష్టి సారించేలా చేయడానికి దాన్నొక ఆయుధంగా వాడుకోవడం స్వాతంత్య్రానికి పూర్వం నుంచి ఉన్నదే. దాదాపు అన్ని రాజకీయ పార్టీలు, సంఘాలు ఈ మార్గాన్ని అవలంబిస్తూనే ఉంటాయి. కానీ బంద్కు మద్దతుగా దళిత శ్రేణులు ఒకపక్క ఊరేగింపులు తీస్తుం డగా...ఆ బంద్ను నిరసిస్తూ మరికొన్ని గుంపులు రంగంలోకి దిగాయి. రాజస్తాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ వంటి చోట్ల ఇలాంటి ఉదంతాలు చోటుచేసుకున్నాయి. ఇరుపక్షాల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఒకటి రెండు చోట్ల గాల్లోకి కాల్పులు జరిపామని పోలీసులు చెబుతున్నారు. మరైతే మృతుల్లో అత్యధికులు బుల్లెట్ గాయాలతో ఎలా మరణించారు? ఉద్యమానికి చెడ్డపేరు తీసుకొచ్చేందుకు కొన్ని అసాంఘిక శక్తులు ఈ పని చేశాయా లేక దళిత శ్రేణులతో తలపడేందుకు వీధుల్లోకొచ్చినవారు ఈ కాల్పులకు తెగబడ్డారా అన్నది తేలాలి. మరణించిన 9మందిలో ఏడుగురు దళితులే కావడం వల్ల ఇది ప్రత్యర్థివర్గాల పనికావొచ్చునన్న సందేహాలు సహజంగానే తలెత్తుతాయి. సమస్య ఎదురైనప్పుడు సకాలంలో స్పందించడం ప్రభుత్వాల కనీస ధర్మం. సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు విషయంలో కేంద్రం సాచివేత ధోరణి అవ లంబించినట్టే, సోమవారంనాటి బంద్ తీవ్రతను అంచనా వేయడంలో ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్తాన్, పంజాబ్ ప్రభుత్వాలు విఫలమయ్యాయి. ప్రధాన పార్టీలు ఇచ్చిన బంద్ పిలుపు కాదు గనుక దీని ప్రభావం పెద్దగా ఉండదని అంచనా వేసి ఉంటే అక్కడి ప్రభుత్వాలు తమ తమ ఇంటెలిజెన్స్ సంస్థలను ప్రక్షాళన చేసు కోవడం ఉత్తమం. ఈ బంద్ను ప్రతిఘటించాలని ఆధిపత్య కులాలవారు నిర్ణయిం చిన సంగతిని కూడా ఈ సంస్థలు పసిగట్టలేకపోయాయి. ఫేస్బుక్, వాట్సాప్, ట్వీటర్ వంటి సామాజిక మాధ్యమాల ప్రభావం అమితంగా ఉన్న ఈ కాలంలో ఎలాంటి సమాచారమైనా, సందేశమైనా క్షణాల్లో లక్షలమందికి సులభంగా చేరు తుందని గూఢచార విభాగాలు గుర్తించలేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. హింసకు దిగినవారెవరు... వారి ఉద్దేశాలేమిటన్న సంగతలా ఉంచితే ప్రధాన రాజకీయ పక్షాల ప్రమేయం లేకుండానే వేలాదిమంది దళితులు వీధుల్లోకి రావడం ఆశ్చర్యం కలిగిస్తుంది. తమ రక్షణకుద్దేశించిన చట్టం తగినంత ఆసరా ఇవ్వలేకపోతున్నదని, సుప్రీంకోర్టు తీర్పు పర్యవసానంగా అది మరింత నీరు గారుతుందని వారు ఆందోళన చెంది ఉండొచ్చు. వాదప్రతివాదాల సమయంలో ప్రభుత్వం తరఫున సమర్ధవంతమైన వాదన వినిపించి ఉంటే ఈ పరిస్థితి తలెత్తేది కాదు. గత అయిదేళ్లలో దళితులపై దాడులు బాగా పెరిగాయని నిరుడు విడుదలైన జాతీయ క్రైం రికార్డుల బ్యూరో లెక్కగట్టింది. 2009–15 మధ్య ఈ చట్టం కింద తప్పుడు కేసుల పెట్టడం గణనీయంగా తగ్గిందని వెల్లడించింది. వీటిని విస్మరించి శిక్షల శాతం తక్కువగా ఉన్నదన్న కారణంతో చట్టం దుర్వినియోగమవుతున్నదన్న నిర్ణయానికి రావడం సబబు కాదని ప్రభుత్వం తరఫు న్యాయవాది చెప్పి ఉంటే బాగుండేది. ఇప్పుడు స్టే ఇవ్వడానికి నిరాకరించినా, తీర్పును సమీక్షించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది గనుక ఈసారైనా అవసరమైన గణాంకాలతో సమర్ధవంతమైన వాదనలు వినిపించి దళితుల ప్రయోజనాలు దెబ్బతినకుండా చూడటం ముఖ్యం. ఈ దిశగా కేంద్రం అడుగులేయాలి. -
భారత్ బంద్కి తొలి పిలుపెవరిది?
‘కంట్రీ విల్ గవర్న్డ్ బై కానిస్టిట్యూషన్, నాట్ ఫాసిజం’ నినాదానికి పునాది ఎవరు? ఒక్క వాట్సాప్ మెసేజ్ నిర్భయ ఘటనకు వ్యతిరేకంగా ఢిల్లీ పురవీధుల్లో యువతరం కదం తొక్కేలా చేసింది. ఒకే ఒక్క వాట్సాప్ మెసేజ్ ప్రముఖ జర్నలిస్టు గౌరీలంకేశ్ మరణాన్ని ధిక్కరించేలా చేసింది. ఇప్పుడు ‘కంట్రీ విల్ గవర్న్డ్బై కానిస్టిట్యూషన్, నాట్ ఫాసిజం’ అనే నినాదం స్ఫూర్తితో భారత్ బంద్ పిలుపు దేశాన్ని అట్టుడికేలా చేసింది. ఈ అనూహ్యమైన ఉద్యమం ఆరంభానికి దారితీసిన సామాజిక, రాజకీయ పరిస్థితులు ఒక ఎల్తైతే, భారత్ బంద్ పిలుపుతో ఉద్యమాన్ని రాజుకునేలా చేసిన చిన్న నిప్పు కణికలాంటి వాట్సాప్ మెసేజ్ ఒక ఎత్తు. నిజానికి ఈ ఉద్యమానికి స్ఫూర్తి ఎవరు? సౌరాన్పూర్ పునాదిగా ఏర్పడిన భీమ్ ఆర్మీనా, జాతీయ దళిత సంఘాల సమాఖ్య (నాక్డర్) కారణమా లేదంటే ఇంకెవరైనా యువకులు ఈ ఉద్యమాన్ని వెనకుండి నడిపించారా? అసలు మొదట భారత్ బంద్ పిలుపుని వాట్సాప్లో పంపిందెవరు? అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఎస్సీ, ఎస్టీల వేధింపు నిరోధక చట్టంపై సుప్రీంకోర్టు తీర్పుని నిరసిస్తూ దేశవ్యాప్తంగా, ప్రధానంగా ఉత్తరాదిన ఎగిసిన దళిత ఉద్యమం సోమవారం హింసాత్మకంగా మారి, పరిస్థితి తీవ్రతను కొనసాగిస్తోంది. అనేక పోరాటాల అనంతరం సాధించుకున్న ప్రివెన్షన్ ఆఫ్ ఎస్సి, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ని నీరుగార్చడం తగదంటూ వెల్లువెత్తిన ప్రజాపోరాటానికి మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో కలిపి 9 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయిన ఘటన ఇప్పుడు యావత్ దేశాన్ని కుదిపివేస్తోంది. అయితే ఉత్తరభారతమంతటినీ అట్టుడికేలా చేసిన ఈ ఉద్యమం అసలు రాజుకున్నదెక్కడ అనేదే ఇప్పుడు హాట్ టిపిక్గా మారింది. ఒకే సారి అన్ని చోట్లా ఈ ఉద్యమం ఎగిసిపడడానికి పునాది ఎవరు? సోమవారం జరిగిన భారత్బంద్ను ఇంత మిలిటెంట్గా నడిపిందెవరు? అన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ ఉద్యమం ఆరంభాన్ని అంచనా వేసేందుకు చేసిన ప్రయత్నంలో అనేక విషయాలు వెలుగుచూసాయి. అశోక్ భారతి నేతృత్వంలోని జాతీయ దళిత సంఘాల సమాఖ్య ( నాక్డర్) మొదట భారత్ బంద్ పిలుపునిచ్చిందా? లేక సోషల్ మీడియానే ఈ ఉద్యమానికి నాయకత్వం వహించిందా? అనే విషయం అక్కడి భద్రతా దళాలను సైతం గందరగోళంలో ముంచేసింది. సోమవారం సాయంత్రం వరకు ఎవరిదో తెలియని ఫోన్ నంబర్ నుంచి వచ్చిన ఈ వాట్సాప్ మెసేజే ఈ ఉద్యమానికి ఊపరిలూదిందని భావించారు. అయితే నిజానికి ఈ విషయాన్ని అంచనా వేయడంలో స్థానిక ఇంటెలిజన్స్ సహా ప్రభుత్వ యంత్రాంగమంతా పూర్తిగా విఫలమైనట్టు నేషనల్ మీడియా అభిప్రాయపడింది. మొట్ట మొదట అశోక్ భారతి నాయకత్వంలోని జాతీయ దళిత సంఘాల సమాఖ్య (నాక్డర్) భారత్ బంద్కి పిలుపునిచ్చినట్టు భావించారు. క్రమేణా అన్ని దళిత సంఘాలు, ఉద్యమకారులు వ్యక్తులు, సంస్థలు ఒక్కొక్కటీ ఇందులో చేరాయని అంచనా వేస్తున్నారు. అయితే భీం ఆర్మీతో సహా అనేక సంఘాలు, సంస్థలు ఈ ఉద్యమంలో పాల్గొన్నప్పటికీ భీం ఆర్మీ ప్రధాన సలహాదారు జై భగవాన్ జాటవ్ ఈ ఉద్యమాన్ని ‘లీడర్లెస్ ఉద్యమంగా’ పేర్కొనడం గమనార్హం. తీర్పు వెలువడిన తరువాత మంగళవారం భీం ఆర్మీ ఏర్పాటు చేసిన సమావేశానికి మొత్తం 25 దళిత సంఘాలు హాజరై భవిష్యత్ ఉద్యమంపై చర్చించినట్టు ఆయన తెలిపారు. అయితే సోమవారం ఉవ్వెత్తున ఎగిసిపడిన ఈ ఉద్యమం మాత్రం దానంతటదే స్వచ్ఛందంగా రాజుకున్నదేననీ, దానికి ప్రత్యేకించి నాయకులెవ్వరూ లేరనీ మీడియాతో ప్రస్తావించారు. ఇది కేవలం వాట్సాప్ మెసేజ్లు, సోషల్ మీడియా ప్లాట్ఫాంగా అంటుకుని దావానలంలా వ్యాపించిందని జాటవ్ స్పష్టం చేశారు. కేవలం ఏ ఒక్క దళిత సంఘమో దీని వెనుక లేదని జాటవ్ తేల్చి చెప్పారు. ఉద్యమం ముందుభాగాన ఉన్న జాతీయ దళిత సంఘాల సమాఖ్య నాయకురాలు సుమేధ మీడియాతో మాట్లాడుతూ మార్చి 20న తీర్పు వెలువడిన అనంతరం తమ నాయకుడు అశోక్ భారతి మార్చి 21–22 తేదీల్లో ఉద్యమానికి శ్రీకారం చుట్టినప్పటికీ, చివరకు ఏప్రిల్ 2న దేశవ్యాప్తంగా బంద్ నిర్వహించాలని దేశంలోని అన్ని దళిత సంఘాలకు సమాచారమిచ్చినట్టు తెలిపారు. అయితే భీం ఆర్మీ ప్రధాన సలహాదారు జాటవ్ మాత్రం కొందరు ఈ ఉద్యమాన్ని తమదిగా చెప్పుకుంటున్నారనీ, నిజానికి ఏదో తెలియని నంబర్ నుంచి వచ్చిన ఈ వాట్సాప్ మెసేజ్ ను సంఘం యువకులు సోషల్ మీడియా ద్వారా విస్త్రుతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళినట్టు తెలిపారు. అలాగే ఎవరో పంపిన ఈ వాట్సాప్ మెసేజ్లో ‘ భారత్ బంద్ని జయప్రదం చేయాలనీ, ఈ మెసేజ్ అందిన ప్రతి ఒక్కరూ పది మందికి చొప్పున ఫార్వర్డ్ చేయాలనీ, లేదంటే మీరూ, మీ భవిష్యత్ తరాలూ వేధింపులకు గురికాక తప్పదని’ ఉన్నట్టు ఆయన వెల్లడించారు. ఈ సమాచారాన్ని ఉత్తరప్రదేశ్ భీం ఆర్మీ యువత విస్త్రుతంగా ప్రచారంలోనికి తెచ్చినట్టు పేర్కొన్నారు. తమ డిమాండ్ని ప్రభుత్వం అంగీకరించే వరకు ఈ ఉద్యమం కొనసాగుతుందని జాటవ్ స్పష్టం చేశారు. అయితే ఈ ఉద్యమం ఊపందుకున్న రాష్ట్రాలు దళితులపై వేధింపుల్లో అగ్రభాగాన ఉన్నాయనీ, ఈ రాష్ట్రాల్లో ఇప్పటికే కొనసాగుతున్న దళితుల వేధింపులు, దళిత స్త్రీలపై అత్యాచారాలు, గో రక్షక్ల దాడులు, అగ్రవర్ణాల దురాగతాలతో విసిగి వేసారి ఉన్న దళితులకు సుప్రీం తీర్పు అగ్నికి ఆజ్యం పోసిందని జాతీయ దళిత సంఘాల సమాఖ్య నాయకుడు అశోక్ భారతి వ్యాఖ్యానించారు. అయితే నిజానికి కొంత మేరకు దళిత సంఘాలు ఈ ఉద్యమానికి సన్నాహాలు చేసిన మాటనిజమే అయినప్పటికీ సోషల్ మీడియాది సైతం ఇందులో కీలక పాత్రగా అందరూ అంగీకరిస్తున్న విషయం. -
‘అతేదైనా’ అనర్ధదాయకమే!
సాక్షి, న్యూఢిల్లీ : భారత దేశంలో ఈ మధ్య న్యాయ వ్యవస్థ క్రియాశీలత రోజు రోజుకు పెరుగుతోంది. చట్ట సభలకు సంబంధించిన వ్యవహారాల్లో నేరుగా జోక్యం చేసుకుంటోంది. ఆ మధ్య దేశంలోని నదుల అనుసంధానం గురించి స్వయంగా ఉత్తర్వులు జారీ చేయగా, ఆ తర్వాత దేశంలోని డీజిల్ కార్లపై నిషేధం విధించింది. క్రికెట్ పాలక మండలి బాధ్యతలను చేతుల్లోకి తీసుకొంది. ముంబైలో గోకుల అష్టమి సందర్భంగా మానవ పిరమిడ్లు 20 అడుగులు మించరాదంటూ ఆదేశాలు జారీ చేసింది. తాజాగా ఎస్సీ, ఎస్టీలపై వేధింపుల నిరోధక చట్టాన్ని నీరుగారుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ చట్టం దుర్వినియోగం అవుతోందని, అందుకు ఈ చట్టం కింద అతి తక్కువ శిక్షలు పడడమేనని సుప్రీం కోర్టు చెబుతోంది. అది అబద్ధం. ఎందుకంటే, టెర్రరిస్టుల వ్యతిరేక చట్టం కింద ఇంతకన్నా చాలా తక్కువ శిక్షలు పడుతున్నాయి. వరకట్న వ్యతిరేక చట్టం 498 ఏ చట్టం ఇంకా ఎక్కువ దుర్వినియోగం అవుతోంది. ఎస్సీ, ఎస్టీల చట్టానికి వ్యతిరేకంగా సోమవారం దేశంలోని దళితులు బంద్ నిర్వహించడం, అది హింసాత్మకంగా మారడం, దాదాపు పది మంది మరణించడం తెల్సిందే. సుప్రీం కోర్టు అతి వల్లనే ఇది జరిగిందని చెప్పవచ్చు. ఎస్సీ, ఎస్టీల చట్టాన్ని సడలించక పోయినట్లయితే దళితుల ఆందోళన జరిగేది కాదు, అమాయకుల ప్రాణాలు పోయేవి కావు. జడ్జీలను జడ్జీలే నియమించుకునే చిత్రమైన ప్రజాస్వామ్య పార్లమెంటరీ వ్యవస్థ భారత్లో ఉండడం వల్లనే ఇలా జరుగుతుంది. ఇలాంటి న్యాయ వ్యవస్థ ప్రపంచంలో మరెక్కడా లేదు. ఇది చట్ట సభల పరిధిలోనిది, అది కార్యనిర్వహణ వ్యవస్థ పరిధిలోనిది, కనుక తాము జోక్యం చేసుకోమంటూ గతంలో తీర్పులు చెప్పిన సుప్రీం కోర్టు ఇప్పుడు అన్నింట్లో జోక్యం చేసుకోవడానికి కారణం ఏమిటో అంతు చిక్కడం లేదు. పార్లమెంటరీ, కార్యనిర్వహణా వ్యవస్థలు దేశంలో బలహీనపడ్డాయని భావించడం వల్లనా? బలమైన రాజకీయ పార్టీ అధికారంలో లేదని భ్రమించడం వల్లనా? తమ క్రియాలత్వానికి మరింత పదును పెట్టాలని భావించడం వలనా! ప్రజాస్వామ్య వ్యవస్థలో తమదే పైచేయని నిరూపించుకోవడానికా? ఎదేమైనా కొంత అతిగానే కనిపిస్తుంది. -
దళితులపై దాడులను ఖండించిన కేసీఆర్
సాక్షి, హైదరాబాద్ : భారత్ బంద్ సందర్భంగా దళితులపై వివిధ రాష్ట్రాలలో జరిగిన దాడులను తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు తీవ్రంగా ఖండించారు. తరతరాలుగా సామాజిక, ఆర్థిక, రాజకీయ వెనుకబాటుకు గురైన దళితులకు, ప్రభుత్వం, సమాజం అన్నివిధాలుగా అండగా ఉండాల్సిన అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు. అణిచివేతకు గురైన దళితులకు అండగా ఉండడం కోసమే రాజ్యాంగంలో ప్రత్యేక హక్కులు కల్పించారని, భారత ప్రభుత్వం కూడా అనేక సందర్భాలలో దళితులకు రక్షణగా ఉండడం కోసం ప్రత్యేక చట్టాలు చేసిందని కేసీఆర్ గుర్తుచేశారు. దళితులకు కల్పించిన హక్కులు, తీసుకొచ్చిన చట్టాలను పకడ్బందీగా అములు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుందని ముఖ్యమంత్రి అన్నారు. ఇటీవల సుప్రీంకోర్టు జారీ చేసిన మార్గదర్శకాలు తమ హక్కులను కాలరాసే విధంగా, తమ రక్షణ కోసం తీసుకొచ్చిన చట్టాలకు తూట్లు పొడిచే విధంగా ఉన్నాయని దళితులు భావిస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. దళితుల అభిప్రాయాలను, మనోవేదనను న్యాయ స్థానాలు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. దళితుల రక్షణ కోసం తీసుకొచ్చిన చట్టాలను అమలు చేయాల్సిన బాధ్యత కలిగిన ప్రభుత్వం కూడా న్యాయస్థానం మార్గదర్శాకాలపై స్పందించాలని కోరారు. ప్రధాని మోదీ వెంటనే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో మాట్లాడాలని కేసీఆర్ పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ అమలు విషయంలో సుప్రీంకోర్టు జారీ చేసిన మార్గదర్శకాలు దళితుల ఆత్మ స్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఉన్నాయనే విషయాన్ని ప్రభుత్వం తరపున న్యాయస్థానానికి చెప్పాలని ప్రధానిని కోరారు. తమ హక్కులకు, చట్టాలకు భంగం కలుగుతందనే బాధలో దళితులు చేస్తున్న ఆందోళనను ప్రభుత్వం సానుభూతితో అర్థం చేసుకోవాలన్నారు. దళితుల వెంట తాము ఉన్నామనే భరోసా ఇవ్వడం ప్రభుత్వ కనీస కర్తవ్యమని చెప్పారు. -
భారత్ బంద్ హింస: పెరిగిన మృతుల సంఖ్య
భోపాల్ : భారత్ బంద్ సందర్భంగా మధ్యప్రదేశ్లో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల్లో మరణించిన వారి సంఖ్య పెరిగింది. మధ్యప్రదేశ్లో ఆందోళనకారులకు, పోలీసులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో సోమవారం ఆరుగురు మరణించగా.. మంగళవారం మృతుల సంఖ్య ఏడుకు చేరుకుంది. పోలీసుల కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డ ఓ వ్యక్తి మంగళవారం ఉదయం ప్రాణాలు విడిచాడు. అటు ఉత్తరప్రదేశ్లోనూ భారత్ బంద్ ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. తీవ్ర ఘర్షణలు చోటుచేసుకున్న మీరట్లో ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా పోలీసులుస మధ్యాహ్నం రెండు 2 గంటలవరకు ఇంటర్నెట్ నిలిపివేశారు. ఎస్సీ, ఎస్టీల వేధింపుల నిరోధక చట్టంపై సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పును నిరసిస్తూ దేశవ్యాప్తంగా దళిత సంఘాలు సోమవారం నిర్వహించిన భారత్ బంద్.. మధ్యప్రదేశ్లో తీవ్ర హింసాత్మకంగా మారిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా చోటుచేసుకున్న హింసలో మధ్యప్రదేశ్లో ఏడుగురు చనిపోగా, ఉత్తరప్రదేశ్లో ఇద్దరు, రాజస్తాన్లో ఒకరు.. మొత్తం పదిమంది ఇప్పటివరకు ప్రాణాలు కోల్పో యారు. ముందస్తుగా అనేక ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించగా.. మధ్యప్రదేశ్లోని భింద్ జిల్లాలో ఆర్మీని రంగంలోకి దింపారు. చదవండి: చెలరేగిన హింస.. తొమ్మిది మంది మృతి, వందల మందికి గాయాలు -
భారత్ బంద్ హింసాత్మకం
న్యూఢిల్లీ/భోపాల్/లక్నో: ఎస్సీ, ఎస్టీల వేధింపుల నిరోధక చట్టంపై సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పును నిరసిస్తూ దేశవ్యాప్తంగా దళిత సంఘాలు నిర్వహించిన భారత్ బంద్ హింసాత్మకంగా మారింది. ప్రాణ నష్టంతో పాటు పెద్ద ఎత్తున ఆస్తినష్టం చోటుచేసుకుంది. దేశంలోని ఏడు రాష్ట్రాల్లో పలు చోట్ల దళిత ఆందోళనకారులు రైళ్లను అడ్డుకోవడంతో పాటు పోలీసులతో ఘర్షణ పడ్డారు. వాహనాలకు నిప్పుపెట్టారు. ఈ హింసలో 9 మంది పౌరులు మరణించగా, అనేక మంది గాయపడ్డారు. జోధ్పూర్లో రాస్తారోకోలో పాల్గొన్న వందలాది మంది దళితులు, భీమ్ సేన కార్యకర్తలు మధ్యప్రదేశ్లో ఆందోళనకారులు, పోలీసులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఆరుగురు మరణించగా.. ఉత్తరప్రదేశ్లో ఇద్దరు, రాజస్తాన్లో ఒకరు చొప్పున ప్రాణాలు కోల్పో యారు. ముందస్తుగా అనేక ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించగా.. మధ్యప్రదేశ్లోని భింద్ జిల్లాలో ఆర్మీని రంగంలోకి దింపారు. పంజాబ్లో ఉదయం నుంచే ఆర్మీ, పారామిలటరీ బలగాల్ని సిద్ధంగా ఉంచారు. బిహార్, ఒడిశా, జార్ఖండ్ల్లో కూడా పెద్దఎత్తున ఆందోళనలు కొనసాగాయి. పలు రాష్ట్రాల్లో దాదాపు 100కు పైగా రైళ్లను ఆందోళనకారులు అడ్డుకోవడంతో రవాణాకు తీవ్రంగా అంతరాయం కలిగింది. రైల్వే శాఖ 9 రైళ్లను పూర్తిగా రద్దు చేసింది. ఉత్తర, తూర్పు భారతదేశంపై తీవ్ర ప్రభావం చూపిన బంద్ ఛాయలు దక్షిణాదిలో కనిపించకపోవడం గమనార్హం. ముంబైలో నిరసనకార్యక్రమంలో నినాదాలిస్తున్న కార్యకర్త హుటాహుటిన బలగాలు బంద్ నేపథ్యంలో కొన్ని రాష్ట్రాల్లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించగా.. ఇంటర్నెట్, మొబైల్ సేవల్ని నిలిపివేశారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా మధ్య ప్రదేశ్, రాజస్తాన్, ఉత్తరప్రదేశ్, బిహార్, పంజాబ్ తదితర రాష్ట్రాల్లో ఆస్తుల దహనం, కాల్పులు, విధ్వంస ఘటనలు చోటుచేసుకున్నాయి. ‘ఆందోళన సందర్భంగా ఎదురుకాల్పులు జరగడంతో మధ్యప్రదేశ్లోని భింద్ జిల్లాలో ముగ్గురు, గ్వాలియర్ జిల్లాలో ఇద్దరు, మొరేనా జిల్లాలో ఒక్కరు మరణించారు’ అని మధ్యప్రదేశ్ ఐజీ (శాంతి భద్రతలు) మార్కండ్ దేవ్స్కర్ తెలిపారు. మృతుల్లో నలుగురు దళితులు, ఇద్దరు ఉన్నత కులాలకు చెందినవారని అధికారులు వెల్లడించారు. ఉత్తరప్రదేశ్లోని ముజఫర్నగర్లో ఒకరు, మీరట్లో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. రాజస్తాన్లోని అల్వార్లో ఒకరు మరణించగా.. 9 మంది పోలీసులతో సహా 26 మంది గాయపడ్డారు. మరోవైపు ఈ హింసపై స్పందించిన కేంద్ర ప్రభుత్వం.. ప్రజల ప్రాణాలు, ఆస్తులకు రక్షణ కల్పించేలా శాంతిభద్రతల్ని అదుపులోకి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. ఉత్తర ప్రదేశ్, మధ్య ప్రదేశ్, రాజస్తాన్, పంజాబ్లకు అల్లర్ల నిరోధానికి ప్రత్యేక్ష శిక్షణ పొందిన 1,700 మందిని హుటాహుటిన పంపింది. అలాగే యూపీకి ఎనిమిది కంపెనీలు, మధ్యప్రదేశ్కి నాలుగు, రాజస్తాన్కు మూడు కంపెనీల ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ (ఆర్ఏఎఫ్) సిబ్బందిని కేంద్రం తరలించింది. మధ్యప్రదేశ్లో మూడు జిల్లాల్లో కర్ఫ్యూ పరిస్థితి అదుపు తప్పడంతో మధ్యప్రదేశ్లో గ్వాలియర్, భింద్, మొరేనా జిల్లాల్లో కర్ఫ్యూ విధించారు. చంబల్, గ్వాలియర్, సాగర్ రీజియన్లలో ఇంటర్నెట్ సేవల్ని నిలిపివేశారు. రాష్ట్రంలోని అనేక చోట్ల రాళ్లు రువ్వడం, దహనాలు, లూటీలు వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. ఆందోళనకారులు కాల్పులు జరపడంతో మొరేనా జిల్లాలో విద్యార్థి నాయకుడు రాహుల్ పాఠక్ మరణించినట్లు పోలీసులు తెలిపారు. ఒక్కసారిగా హింస మిగతా ప్రాంతాలకు విస్తరించడంతో గ్వాలియర్ పట్టణంలో కర్ఫ్యూ విధించినట్లు సబ్ డివిజినల్ మెజిస్ట్రేట్ ఉమేశ్ శుక్లా చెప్పారు. భింద్ జిల్లాలో మరణించిన వ్యక్తిని మహావీర్ సింగ్గా గుర్తించామని, మరో ఇద్దరు గాయపడ్డారని స్థానిక అధికారులు వెల్లడించారు. ఝబువాలో ఆందోళనకారులు దుకాణాల్ని లూటీ చేయడంతో తీవ్ర ఉద్రిక్తత కొనసాగింది. భోపాల్లో ఆందోళనకారులు రోడ్లను దిగ్బంధించడంతో పాటు పలు వాహనాల్ని ధ్వంసం చేశారు. యూపీలో 75 మందికి గాయాలు ఉత్తరప్రదేశ్ హింసలో 40 మంది పోలీసులు సహా 75 మంది గాయపడ్డారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని డీఐజీ (శాంతి భద్రతలు) ప్రవీణ్ కుమార్ చెప్పారు. విధ్వంసానికి, దహనాలకు పాల్పడిన 450 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మీరట్లో బీఎస్పీ మాజీ ఎమ్మెల్యే యోగేశ్ వర్మను అరెస్టు చేశారు. రాష్ట్రంలోని 75 జిల్లాల్లో అత్యంత అప్రమత్తత ప్రకటించారు. అజాంగఢ్లో ఆందోళనకారులు రెండు బస్సులకు నిప్పుపెట్టడంతో పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. ఆగ్రా, హాపూర్, మీరట్లో ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో అదనపు బలగాలు పంపాలని యూపీ డీజీపీ ఓపీ సింగ్ కేంద్రాన్ని కోరారు. యూపీలో రాజధాని, శతాబ్ది ఎక్స్ప్రెస్లతో అనేక రైళ్లను ఆందోళనకారులు అడ్డుకున్నారు. పంజాబ్లో సీబీఎస్ఈ పరీక్షలు వాయిదా హరియాణాలో అంబాలా, రోహ్తక్తో పాటు చండీగఢ్లోను ఆందోళనలు కొనసాగాయి. భారత్ బంద్ నేపథ్యంలో పంజాబ్లో జరగాల్సిన 10, 12వ తరగతి సీబీఎస్ఈ పరీక్షల్ని వాయిదా వేశారు. దేశ రాజధాని ఢిల్లీలో పలు చోట్ల ఆందోళనకారులు పట్టాలపై కూర్చుని రైళ్ల రాకపోకల్ని అడ్డుకున్నారు. డెహ్రాడూన్ , రాంచీ రాజధాని ఎక్స్ప్రెస్లతో పాటు పలు రైళ్లు నిలిచిపోయాయి. ఘజియాబాద్లోని ఒక గుంపు రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగించిందని ఉత్తర రైల్వే అధికారి ఒకరు తెలిపారు. మండి హౌస్ ప్రాంతంలో రోడ్లపై ఆందోళనకారులు బైఠాయించి జై భీమ్ అంటూ నినాదాలు చేశారు. రైల్వే ట్రాక్లు, రోడ్లను దిగ్బంధించడంతో పాటు ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించిన 30 మందిని రాజస్తాన్లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్నాలో ఆందోళనకారులు ఒక్కసారిగా రైల్వే స్టేషన్ను ముట్టడించి టికెట్ కౌంటర్లను మూయించివేశారు. పదుల సంఖ్య రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగించారు. ఒడిశా, జార్ఖండ్లోని పలు ప్రాంతాల్లో నిరసనల వల్ల జన సామాన్యానికి అంతరాయం కలిగింది. గుజరాత్లోని ప్రధాన పట్టణాల్లో రోడ్లపై ఆందోళనలు చేపట్టడంతో బస్సుల రాకపోకలు నిలిచిపోయాయి. సుప్రీం తీర్పులో ఏముంది? ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం కేసుల్లో తక్షణ అరెస్టులు వద్దని మార్చి 20న సుప్రీంకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. అలాంటి కేసుల్లో వారంలోగా ప్రాథమిక విచారణ నిర్వహించి ఫిర్యాదు సరైందేనని నిర్ధారించుకోవాలని, ప్రాథమిక సాక్ష్యాధారాలు లేకపోతే ముందస్తు బెయిల్ కూడా ఇవ్వవచ్చని కోర్టు పేర్కొంది. ఎఫ్ఐఆర్ నమోదైనా అరెస్టు తప్పనిసరి కాదని స్పష్టం చేసింది. ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులపై ఎస్సీ, ఎస్టీ చట్టం కింద ఫిర్యాదు దాఖలైతే ఏ విధంగా ముందుకెళ్లాలన్న అంశంపై కూడా సుప్రీం ఆదేశాలిచ్చింది. ప్రభుత్వోద్యోగిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం మేరకు ఫిర్యాదు చేస్తే.. ఆ ఉద్యోగికి అరెస్టుకు సంబంధిత నియామక అధికారి అనుమతి తప్పనిసరి అని చెప్పింది. ఇతరులపై ఫిర్యాదుల విషయంలో సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ లేదా డీఎస్పీ అనుమతి అవసరమంది. ఈ చట్టం ఆసరాగా కొందరు ప్రభుత్వ ఉద్యోగులను తప్పుడు కేసులతో బెదిరిస్తూ విధి నిర్వహణలో అడ్డుతగులుతున్నారనీ, అమాయక పౌరులను వేధిస్తున్న ఘటనలూ చాలా జరుగుతున్నాయంది. సుప్రీంలో కేంద్రం రివ్యూ పిటిషన్ ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టంపై తీర్పును సమీక్షించాలని విజ్ఞప్తి వీలైనంత తొందరగా విచారించాలని కోరే చాన్స్ న్యూఢిల్లీ: ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సమీక్షించాలని కోరుతూ కేంద్రం అత్యున్నత న్యాయస్థానంలో సోమవారం రివ్యూ పిటిషన్ దాఖలుచేసింది. దళితులు, గిరిజనులపై వేధింపుల్ని అడ్డుకునేలా ఉన్న నిబంధనలపై సుప్రీం తీర్పు ఎస్సీ, ఎస్టీ చట్టం అసలు ఉద్దేశాన్ని నీరుగార్చేలా ఉందని పిటిషన్లో పేర్కొంది. దేశంలోని గణనీయంగా ఉన్న ఎస్సీ, ఎస్టీలపై ఈ తీర్పు తీవ్ర ప్రభావం చూపుతుందని వెల్లడించింది. పార్లమెంటు శాసన విధానానికి ఈ ఉత్తర్వులు విరుద్ధంగా ఉన్నాయని తెలిపింది. ఈ కేసును బహిరంగంగా విచారించాలంది. ప్రభుత్వం పలు చర్యలు తీసుకున్నప్పటికీ ఇంకా దళితులు, గిరిజనులు వెనుకబడే ఉన్నారనీ, వారిపై పలు చోట్ల దాడులు, దౌర్జన్యాలు జరుగుతున్నాయని పిటిషన్లో పేర్కొంది. ప్రభుత్వ పిటిషన్ను వీలైనంత తొందరగా విచారించాలని అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ మంగళవారం సుప్రీంకోర్టును కోరే అవకాశముంది. మరోవైపు ఎస్సీ, ఎస్టీ చట్టంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ప్రభుత్వం విభేదిస్తున్నట్లు కేంద్ర ఐటీ, న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. సుప్రీం తీర్పును నిలిపివేయాలని ఆల్ఇండియా ఫెడరేషన్ ఆఫ్ ఎస్సీ, ఎస్టీ ఆర్గనైజేషన్స్ దాఖలుచేసిన రివ్యూ పిటిషన్ను వెంటనే విచారించేందుకు సీజేఐ జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్ల ధర్మాసనం నిరాకరించింది. సంయమనం పాటించండి హింసాత్మక సంఘటనలపై కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పందిస్తూ.. సంయమనం పాటించాలని పిలుపునిచ్చారు. కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ మాట్లాడుతూ.. ఎస్సీ,ఎస్టీ చట్టంపై సుప్రీంకోర్టు తీర్పులో కేంద్ర ప్రభుత్వం భాగస్వామి కాదని, తీర్పు అంశాలతో తాము ఏకీభవించడం లేదన్నారు. ఇప్పటికే సుప్రీంకోర్టులో సమగ్ర రివ్యూ పిటిషన్ దాఖలు చేశామని తెలిపారు. రివ్యూ పిటిషన్పై ప్రభుత్వం చాలా వేగంగా నిర్ణయం తీసుకుందని దళిత నాయకుడు, కేంద్ర మంత్రి రాం విలాస్ పాశ్వాన్ అభినందించారు. 2014లో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దేశంలో దళితులు, మైనార్టీలపై అత్యాచారాల ఘటనలు పెరిగిపోయాయని కాంగ్రెస్ నేత ఆజాద్ ఆరోపించారు. -
భారత్ బంద్ హింసాత్మకం.. రాజకీయ కుట్ర!
న్యూఢిల్లీ: ఎస్సీ, ఎస్టీలపై అత్యాచార నిరోధక చట్టాన్ని నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపిస్తూ దళిత సంఘాలు చేపట్టిన భారత్ బంద్ కార్యక్రమంలో తీవ్ర హింస చెలరేగింది. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం దేశవ్యాప్తంగా 10 మంది మరణించగా, వందల మందికి గాయాలయ్యాయి. బంద్ పిలుపు మేరకు మెజారిటీ రాష్ట్రాల్లోని దళిత సంఘాలు సోమవారం ఉదయం నుంచే నిరసనలు చేపట్టాయి. ఎక్కడిక్కడ రైళ్లు, బస్సులను అడ్డుకుని, రహదారులను దిగ్భందించారు. వేల సంఖ్యలో గుమ్మికూడిన దళితులు ర్యాలీలు చేపట్టారు. పలు రాష్ట్రాల్లోని కీలక ప్రాంతాల్లో అప్రకటిత కర్వ్యూ వాతావరణం నెలకొంది. తొలుత రోడ్లపై టైర్లను తగులబెట్టిన నిరసనకారులు.. అదే క్రమంలో కొన్ని వాహనాలకు నిప్పుపెట్టారు. నిరసనకారులను అడ్డుకునే ప్రయత్నంలో చాలా చోట్ల పోలీసులు లాఠీచార్జ్ చేయగా, మరికొన్ని చోట్ల కాల్పులు జరిగినట్లు తెలిసింది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో హింస: ఎస్సీ, ఎస్టీలపై అత్యాచార నిరోధక చట్టం కింద నిందితులను తక్షణమే అరెస్టు చేయరాదంటూ గత నెల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై దేశవ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమైంది. చట్టంలో మార్పులను వ్యతిరేకిస్తూ అన్ని రాష్ట్రాల్లోని దళిత సంఘాలు సోమవారం భారత్ బంద్కు పిలుపునిచ్చాయి. బంద్ ఉధృతంగా సాగుతుండగానే.. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై అప్పీలుకు వెళతామని న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ చెప్పారు. కాగా, బీజేపీ అధికారంలో ఉన్న మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో హింసాయుత ఘటనలు అధికంగా చోటుచేసుకోవడం గమనార్హం. అటు పంజాబ్, హరియాణా, బిహార్, జార్ఖండ్, గుజరాత్, మహారాష్ట్రలో భారత్ బంద్ తీవ్ర ఉద్రికతలకు దారితీసింది. పెద్ద ఎత్తున నిరసనకారులు రోడ్లపైకి వచ్చి బలవంతంగా షాపులు మూయించారు. ఆస్తుల విధ్వంసానికి దిగారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే హింస చెలరేగడం రాజకీయ కుట్రేలో భాగంగానే జరిగిందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. (చదవండి: ఎస్సీ, ఎస్టీల చట్టాన్ని రద్దు చేయాల్సిందేనా?) మొబైల్, ఇంటర్నెట్ సేవలు బంద్: అల్లర్లు మరిన్ని ప్రాంతాలకు విస్తరించకుండా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా పోలీసులు మొబైల్, ఇంటర్నెట్ సేవలను నిషేధించారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోని పలు పట్టణాల్లో ఈ నిషేధం కొనసాగుతున్నది. రాష్ట్రాలు కోరితే అవసరమైన మేరకు కేంద్ర బలగాలు, సైన్యాన్ని పంపేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని హోం మంత్రి రాజ్నాథ్ సింగ్ మీడియాతో అన్నారు. మాయ, మమత సంతాపం: దళిత సంఘాలు చేపట్టిన భారత్ బంద్ పలు ప్రాంతాల్లో హింసాత్మకంగా మారడం, 10 మంది చనిపోవడం బాధాకరమని బీఎస్సీ చీఫ్ మాయావతి, టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీలు అన్నారు. ఉత్తరప్రదేశ్లో ముజఫర్ నగర్, మీరట్ సహా పలు ప్రాంతాల్లో ఆందోళనలకు సంబంధించి పలువురు బీఎస్పీ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకోవడాన్ని మాయావతి ఖండించారు. దక్షిణాదిలో అంతంతమాత్రమే: దళిత సంఘాల భారత్ బంద్ పిలుపు మధ్య, ఉత్తర భారతాన్ని ప్రభావితం చేసినంతగా దక్షిణ భారతాన్ని చేయలేకపోయింది. రెండు తెలుగు రాష్ట్రాలు, ఎన్నికల రాష్ట్రం కర్ణాటక, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరిల్లో బంద్ ప్రభావం అంతగా కనిపించలేదు. -
ఎస్సీ, ఎస్టీల చట్టాన్ని రద్దు చేయాల్సిందేనా?
సాక్షి, న్యూఢిల్లీ : కేరళ రాష్ట్రంలో ఇటీవల ఇతర వెనకబడిన కులాలకు చెందిన ఎజావ సామాజిక వర్గానికి చెందిన ఓ వ్యక్తి తన కన్న కూతురునే ఓ దళితుడిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడిందన్న కారణంగా చంపేశారు. ఊరిలో పెళ్లి ఊరేగింపులకు తమకు అనుమతివ్వాలంటూ దళితులు డిమాండ్ చేసినట్లయితే వారి అంతు చూస్తామని ఉత్తరప్రదేశ్ ఠాకూర్లు హెచ్చరిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీల వేధింపుల నిరోధక చట్టంపై ఇటీవల సుప్రీంకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను సమీక్షించాలని కేంద్ర ప్రభుత్వం కోరినట్లయితే విధ్వంసం సష్టిస్తామని మహారాష్ట్రలోని మరాఠీలు హెచ్చరిస్తున్నారు. మొత్తానికే ఈ చట్టాన్ని ఎత్తివేయాలని అగ్రవర్ణమైన వర్ణియార్లు ఎక్కువగా ఉన్న తమిళనాడులోని ‘పట్టాలి మక్కల్ కాచ్చి’ డిమాండ్ చేస్తోంది. దేశంలోని దళితుల పట్ట వివిధ సామాజిక వర్గాలకు ఎలాంటి అభిప్రాయం ఉందో ఈ వార్తలు స్పష్టం చేస్తున్నాయి. దళితుల పట్ల దేశంలో ఇంకా ఇలాంటి అభిప్రాయాలు కొనసాగుతున్నందునే ఎస్సీ, ఎస్టీల చట్టాన్ని నీరుకార్చాల్సిన అవసరం లేదన్నది స్పష్టం అవుతోంది. ఎస్సీ, ఎస్టీల చట్టం దుర్వినియోగం అవుతోందని భావించాల్సిన అవసరం లేదు. నిజంగా దుర్వినియోగం అవుతుంటే అందుకు కారణాలేమిటో క్షుణ్నంగా పరిశీలించి చట్టంలో ఆమోదయోగ్యమైన మార్పులు తీసుకరావచ్చు. అంతేగానీ చట్టాన్ని సవరణ పేరిట పలుచన చేయరాదు. సుప్రీం కోర్టు పలచన చేసిందన్న కారణంగానే, దాని సమీక్షను కోరుతూ కేంద్రం రివ్యూ పిటీషన్ దాఖలు చేయాలంటూ నేడు ఎస్సీ, ఎస్టీలు భారత్ బంద్ను పాటిస్తున్నాయి. మొన్నటి వరకున్న చట్టం నిబంధనల ప్రకారం ఎస్సీ,ఎస్టీల చట్టం కింద ఫిర్యాదు అందితే తక్షణం కేసు నమోదు చేసి ఎలాంటి అనుమతులు లేకుండా నిందితులను అరెస్ట్చేసే అవకాశం ఉండింది. ఈ కేసులో నిందితులకు బెయిల్ కూడా వెంటనే లభించేది కాదు. ఈ చట్టం దుర్వినియోగం అవుతుందున్న కారణంగా బాధితుల నుంచి ఫిర్యాదు అందితే దానిపై వారం రోజుల్లో సమగ్ర దర్యాప్తు జరిపి, ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలని, ఆ తర్వాత నిందితులపై చర్య తీసుకోవాలని, ఇక ప్రభుత్వ అధికారులపై కేసు దాఖలైతే వారిని అరెస్ట్ చేయడానికి వారి పైఅధికారుల నుంచి అనుమతి తీసుకోవాలని సుప్రీం కోర్టు ఇటీవల సవరణ ఉత్తర్వులు జారీ చేసింది. దేశంలో దళితులపై రోజురోజుకు దాడుల ఘటనలు పెరుగుతున్నప్పటికీ వారిపై ఎస్సీ, ఎస్టీల చట్టం కింద నమోదవుతున్న కేసుల సంఖ్య తక్కువ. ఇక వాటిల్లో శిక్ష పడుతున్న సందర్భాలు చాలా తక్కువ. మొత్తం కేసుల్లో 25 శాతం కేసులకు మించి నిందితులకు శిక్షలు పడడం లేదు. ఎందుకంటే నిందితుల ఒత్తిళ్లకు లొంగి పోలీసులు బాధితులతో రాజీలు కుదుర్చడమే అందుకు కారణం. ఇక ఈ కేసుల్లో తక్షణ అరెస్ట్లు కూడా లేకపోతే నిందితులపై కేసులు దాఖలు చేయడం తగ్గిపోతుంది. దాఖలైనా రాజీలే ఎక్కువ జరిగి శిక్షలు మరింత తగ్గిపోతాయి. గత రెండేళ్లలో దేశవ్యాప్తంగా పలు చోట్ల దళితులపై గోరక్షకులు దాడులు జరపగా, వాటిల్లో 20 శాతం కేసుల్లో కూడా ఎస్సీ, ఎస్టీల చట్టాన్ని ప్రయోగించలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ చట్టాన్ని మరింత కఠినం చేయాలని ‘నేషనల్ కొహలిషన్ ఫర్ స్ట్రెన్తనింగ్ ఎస్సీ, ఎస్టీ పీఓఏ యాక్ట్’ డిమాండ్ చేస్తోంది. కుల మతాలతో సంబంధం లేకుండా దేశంలోని పౌరులందరికి గౌరవంతో జీవించే హక్కు ఉంది. భారత రాజ్యాంగంలోని 14వ అధికరణం కులాని, అగ్రవర్గాన్ని కాకుండా అంటరాని తనాన్ని నిషేధిస్తోంది. అందుకనే 1955లో దేశంలో అంటరానితనం నిషేధిత చట్టం అమల్లోకి వచ్చింది. అదే 1974లో పౌర హక్కుల పరిరక్షణ చట్టంగా మారింది. 1989లో ఎస్సీ, ఎస్టీల వేధింపుల నిరోధక చట్టంగా రూపాంతరం చెందింది. వర్ణ వ్యవస్థ ఆధిపత్యంగల భారత్లో ఆశించిన మార్పు రాకపోవడంతో చట్టాన్ని సవరిస్తూ వచ్చారు. ఇప్పటి వరకు చట్టాన్ని కఠినతరం చేస్తూ రాగా, ఇప్పుడు సుప్రీం కోర్టు దాన్ని సడలించింది. చట్టం దుర్వినియోగం అవుతుందన్న కారణంగా ఈ చొరవ తీసుకున్నట్లు పేర్కొంది. రాజ్యాంగంలోని 498ఏ, ప్రివెన్షన్ ఆఫ్ అన్లాఫుల్ యాక్టివిటీ చట్టాలు ఎస్సీ,ఎస్టీల చట్టంకన్నా ఘోరంగా దుర్వినియోగం అవుతున్నాయి. -
భారత్ బంద్లో కాల్పుల కలకలం
-
భారత్ బంద్: బాల్కనీలో నిల్చుంటే.. బుల్లెట్ తగిలి!
న్యూఢిల్లీ: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టాన్ని నీరుగార్చవద్దంటూ దళిత సంఘాలు చేపట్టిన భారత్ బంద్ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ఉత్తరాది రాష్ట్రాల్లో ఈ బంద్ హింసాత్మకంగా మారింది. ముఖ్యంగా మధ్యప్రదేశ్లో జరిగిన ‘భారత్ బంద్’ ఆందోళనలో హింస చోటుచేసుకుంది. పోలీసులతో నిరసనకారులు ఘర్షణ పడటం, పోలీసులు గాలిలోకి కాల్పులు జరపడంతో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్కు 450 కిలోమీటర్ల దూరంలోని మోరెనా ప్రాంతంలో నిరసనకారులు, పోలీసులకు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. నిరసనకారులు ఇక్కడ రైల్వేట్రాక్లను తొలగించేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో అడ్డుకున్న పోలీసులపై రాళ్లు రువ్వారు. పోలీసులు నిరసనకారులను నియంత్రించేందుకు ఒక దశలో గాలిలో కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఓ వ్యక్తి మరణించడంతో తీవ్ర విషాదం నెలకొంది. నిరసనకారులు, పోలీసులు ఘర్షణ పడుతున్న సమయంలో సమీపంలో ఉన్న భవనం బాల్కనీలోంచి రాహుల్ పాఠక్ అనే వ్యక్తి ఈ గొడవను చూస్తున్నాడు. ఈ క్రమంలో పోలీసులు గాలిలో కాల్పులు జరపడంతో.. ఓ బుల్లెట్ దూసుకొచ్చి ఆయనకు తగిలింది. దీంతో తీవ్రంగా గాయపడిన ఆయనను ఆస్పత్రికి తరలించే లోపే ప్రాణాలు విడిచాడని సమాచారం. ఇటు ఉత్తరప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్, హరియాణా, బిహార్, జార్ఖండ్, గుజరాత్, మహారాష్ట్రలో భారత్ బంద్ తీవ్ర ఉద్రికతలకు దారితీసింది. పెద్ద ఎత్తున నిరసనకారులు రోడ్లపైకి వచ్చి బలవంతంగా షాపులు మూయించారు. ఆస్తుల విధ్వంసానికి దిగారు. దీంతో పలు ప్రాంతాల్లో పోలీసులకు, నిరసనకారుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. పోలీసులు లాఠీచార్జ్ జరపడంతో పలువురు గాయపడ్డారు. -
భారత్ బంద్: దిగొచ్చిన కేంద్రం!
సాక్షి, న్యూఢిల్లీ: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని నీరుగారుస్తున్నారంటూ దళిత సంఘాలు దేశ్యాప్తంగా భారత్ బంద్ నిర్వహిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దిగొచ్చింది. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంపై సుప్రీంకోర్టు తాజాగా తీర్పుపై రివ్యూకు వెళుతున్నట్టు స్పష్టం చేసింది. ‘ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం విషయంలో సుప్రీంకోర్టు తీర్పుపై మేం సమగ్ర పిటిషన్ను దాఖలు చేశాం. ప్రభుత్వం తరఫున సీనియర్ లాయర్లు వాదనలు వినిపించనున్నారు’ అని కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ సోమవారం మీడియాకు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని కులం ఆధారంగా అమాయకులను వేధించేందుకు ఉపయోగించరాదని పేర్కొంటూ.. ఈ చట్టం అమలు విషయంలో పలు మార్పులు సూచిస్తూ జస్టిస్ ఏకే గోయల్, జస్టిస్ యూయూ లలిత్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం గత నెల 20న తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. అయితే, సుప్రీంకోర్టు తీర్పు పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తున్న దళిత సంఘాలు సోమవారం దేశవ్యాప్తంగా భారత్ బంద్కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల కారణంగా ఎస్సీ, ఎస్టీల అత్యాచారాల నిరోధక చట్టం బలహీనపడుతుందని కేంద్రం భావిస్తోంది. ఎస్సీ, ఎస్టీ చట్టం–1989 ప్రకారం.. వేధింపుల ఘటనల్లో అరెస్టులు, కేసు నమోదు వెనువెంటనే జరగాల్సి ఉంటుంది. కానీ, తక్షణ అరెస్టులు, కేసుల నమోదు ఆపాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ ఉత్తర్వు ఫలితంగా బలహీన వర్గాలకు రక్షణగా నిలిచేందుకు ఉద్దేశించిన ఈ చట్టం నిరుపయోగంగా మారుతుందనీ, ఎస్సీ, ఎస్టీలపై వేధింపులు పెరుగుతాయని ప్రభుత్వం తన పిటిషన్లో సుప్రీంకోర్టుకు తెలుపింది. అంతేకాకుండా, దళితులు, షెడ్యూల్ తెగల వారికి న్యాయం అందించటంలో తాజా ఉత్తర్వు ప్రతికూల ప్రభావం చూపుతుందని వివరించింది. -
భారత్ బంద్ హింసాత్మకం..!
-
భారత్ బంద్ హింసాత్మకం..!
సాక్షి, న్యూఢిల్లీ: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంలో ప్రతిపాదించిన మార్పులను వ్యతిరేకిస్తూ దళిత సంఘాలు పిలుపునిచ్చిన భారత్ బంద్ పలుచోట్ల హింసాత్మకంగా మారింది. బంద్లో భాగంగా సోమవారం ఉదయం దళిత సంఘాల కార్యకర్తలు భద్రతా దళాలతో ఘర్షణ పడ్డారు. నిరసనకారులు తెరిచి ఉన్న పలు దుకాణాలపై దాడులు చేసి.. ధ్వంసం చేశారు. నినాదాలతో హోరెత్తించారు. దీంతో స్థానిక పోలీసులు లాఠీచార్జ్ చేసి వారిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. దీంతో ఆగ్రాలో ఉద్రిక్తత నెలకొంది. దేశవ్యాప్తంగా ‘భారత్ బంద్’విజయవంతంగా కొనసాగుతోంది. పలుచోట్ల దళిత సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. పంజాబ్లోని లుథియానా, జిరాక్పూర్లో దళిత సంఘాలు రోడ్డెక్కాయి. భారత్ బంద్లో భాగంగా నిరసనకారులు రైళ్ల రాకపోకలను అడ్డుకున్నారు. పట్టాలపై కూర్చొని నిరసన తెలిపారు. దీంతో బిహార్, ఒడిశా, పంజాబ్లో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. బిహార్లోని పట్నా, ఫోర్బెస్గంజ్, ఆర్హా ప్రాంతాల్ భీమ్ ఆర్మీ, దళిత సంఘాల ఆధ్వర్యంలో నిరసనకారులు రైళ్లను అడ్డుకున్నారు. ప్రధాన రహదారులపై బైఠాయించి వాహనాల రాకపోకలను స్తంభింపజేశారు. పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు భారత్ బంద్ సందర్భంగా జార్ఖండ్ రాజధాని రాంచీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మహిళా నిరసనకారులు పోలీసులతో ఘర్షణ పడ్డారు. పోలీసు వాహనంపై రాళ్లు రువ్వారు. దీంతో భద్రతా సిబ్బంది మహిళలని చూడకుండా నిరసనకారులపై లాఠీ ఝళిపించారు. దీంతో పలువురికి గాయాలయ్యాయి. ఉత్తరప్రదేశ్ మీరట్లో పోలీసులు నిరసనకారులతోపాటు రోడ్డుపై దొరికిన వారిని కూడా చితకబాదారు. మధ్యప్రదేశ్ భింద్లోనూ పెద్దసంఖ్యలో మూగిన నిరసనకారులు పోలీసులపై రాళ్లు రువ్వారు. దీంతో ఇక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దేశంలోని చాలాచోట్ల నిరసనకారుల ఆందోళనలతో తీవ్ర ఉద్రిక్తత నెలకొది. పలుచోట్ల నిరసనకారులు ఆస్తుల విధ్వంసానికి దిగారు. ర్యాలీలు నిర్వహించారు. -
డిసెంబర్ 1న భారత్ బంద్.. పద్మావతి విడుదల అయ్యేనా!
సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన ‘పద్మావతి’ సినిమా విడుదల తేదీ దగ్గరపడుతున్నకొద్దీ.. ఈ సినిమా వివాదం మరింత ముదురుతోంది. ఈ సినిమాకు వత్యిరేకంగా రాజ్పుత్ వర్గీయుల ఆధ్వర్యంలోని కర్ణిసేన ఆందోళనలు రోజురోజుకు తీవ్రమవుతున్నాయి. డిసెంబర్ 1న పద్మావతి సినిమా విడుదల కావాల్సి ఉండగా.. సినిమా విడుదలకు వ్యతిరేకంగా 'భారత్ బంద్'కు కర్ణిసేన పిలుపునిచ్చింది. ఈ సినిమాను విడుదలను ఆపాల్సిందేనని, ఒకవేళ సినిమాను విడుదల చేస్తే.. తీవ్ర పరిణామాలు తప్పవని కర్ణిసేనకు చెందిన లోకేంద్ర సింగ్ కల్వి హెచ్చరించారు. ఒకవేళ 'పద్మావతి' సినిమా విడుదలైతే.. నిరసన జ్వాలలతో దేశం తగలబడుతుందని, దీనిని అడ్డుకుంటే అడ్డుకోండి అని ఆయన సవాల్ విసిరారు. మరోవైపు బెంగళూరులో సినిమాకు వ్యతిరేకంగా కర్ణిసేన పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన నిర్వహించింది. రాణి పద్మావతి కథ ఆధారంగా తెరకెక్కిన ’పద్మావతి’ సినిమాను వివాదాలు విడిచిపెట్టడం లేదు. ఈ సినిమాలో చరిత్రను వక్రీకరించారని, ఈ సినిమాను నిషేధించాలంటూ జోరుగా రాజ్పుత్లు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా విడుదల కాకుండా నిషేధించాలంటూ హర్యానా మంత్రి విపుల్ గోయెల్ ఇప్పటికే కేంద్ర సమాచార ప్రసారశాఖ మంత్రి స్మృతి ఇరానీకి లేఖ రాశారు. డిసెంబర్ 1న విడుదల కానున్న ఈ చిత్రాన్ని నిలిపి వేయాలని డిమాండ్ చేస్తూ మరోవైపు జోరుగా ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ చిత్రం లో రాణీ పద్మినిగా దీపికా పదుకొనే, ఆమె భర్త రతన్సింగ్గా షాహీద్ కపూర్, అల్లా వుద్దీన్ ఖిల్జీగా రణ్వీర్సింగ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో రాణీ పద్మిని, అల్లావుద్దీన్ ఖిల్జీల మధ్య ఓ ప్రేమగీతాన్ని చిత్రీకరించారని ఆరోపిస్తూ కర్ణిసేన నేతృత్వంలో రాజ్పుత్లు ఆరోపిస్తున్నారు. అయితే, తమ సినిమా ఎవరి మనోభావాలను దెబ్బతీసేవిధంగా ఈ సినిమాను తెరకెక్కించలేదని, ఈ సినిమాతో రాజ్పుత్ల పట్ల గౌరవం పెంపొందుతుందే కానీ, భంగం వాటిల్లబోదని దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ ఇప్పటికే ఓ వీడియో ద్వారా వివరణ ఇచ్చారు. -
'అందుకే మోదీ నోట్ల రద్దు నిర్ణయం'
హైదరాబాద్ : దేశాన్ని పట్టిపీడిస్తున్న నల్లధనం, అవినీతి, నకిలీ కరెన్సీ, నక్సలిజం, ఉగ్రవాదం వంటి సమస్యలను అరికట్టేందుకు ప్రధాని మోదీ పెద్దనోట్ల రద్దు నిర్ణయాన్ని తీసుకున్నారని బీజేపీ సీనియర్ నేత నల్లు ఇంద్రసేనారెడ్డి అన్నారు. హైదరాబాద్లో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ..నల్లధనం అరికట్టేందుకు మొదటి కేబినేట్లోనే సిట్ ఏర్పాటు చేశారన్నారు. పన్నులు కట్టకుండా ఎగవేస్తున్న ధనం క్రమబద్దీకరణ కోసమే పెద్ద నోట్ల రద్దు చేశారని ఆయన చెప్పారు. బినామీ ఆస్తులను అరికట్టేందుకు బినామీ చట్టం తెచ్చారన్నారు. ప్రతిపక్షాల బంద్ను రెచ్చగొట్టే చర్యల్లో భాగంగానే పరిగణిస్తున్నామని చెప్పారు. కంపెనీలు, స్టాక్మార్కెట్ షేర్లు బినామీ పేర్లతో ఉన్నాయని, వీటన్నింటినీ వెలికి తీసేందుకు ప్రభుత్వం సిద్ధం అవుతుందన్నారు. నక్సలైట్ల వద్ద రూ.60 వేల కోట్లు ఉన్నాయని, నోట్ల రద్దుతో అవన్నీ చిత్తుకాగితాలు అవుతాయన్నారు. ప్రతిపక్షాలన్నీ కలిపి బంద్కు పిలుపునిచ్చినా ప్రజలు దాన్ని విఫలం చేశారన్నారు. రానున్న రోజుల్లో విద్య, వైద్యం ఖర్చులు తగ్గుతాయని తెలిపారు. విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని కూడా వెనక్కితేవడం కోసం కేంద్రం చర్యలు చేపడుతుందని ఇంద్రసేనారెడ్డి చెప్పారు. -
నోట్ల రద్దుకు నిరసనగా హర్తాళ్
-
నోట్ల రద్దుపై భారత్ బంద్ శోచనీయం
అమరావతి : చలామణిలో ఉన్న పెద్ద నోట్ల రద్దును వ్యతిరేకిస్తూ కమ్యూనిస్టు పార్టీలు సోమవారం దేశవ్యాప్త బంద్ను తలపెట్టడం శోచనీయం, దౌర్భాగ్యమని భారతీయ జనతా పార్టీ ఆంధప్రదేశ్ శాఖ పేర్కొంది. ఆ పార్టీ నేతలు ఎస్. సురేష్రెడ్డి , యడ్లపాటి రఘునాధ్బాబులు ఆదివారం వేర్వేరుగా విలేకరులతో మాట్లాడారు. దేశ హితం కోసం కేంద్రంలో ఉన్న ప్రభుత్వాలు తీసుకునే నోట్ల రద్దు వంటి కీలకమైన నిర్ణయాలను కూడా ప్రతిపక్ష పార్టీలు గుడ్డిగా వ్యతిరేకించడం సరైందని కాదని రఘునాథ్బాబు అన్నారు. ప్రజలను ఇబ్బంది పెట్టే బంద్లు ఏవిధంగాను సహేతకం కాదని చెప్పారు. తాడేపల్లిగూడెం బీజేపీ రైతు మహాసభ తమ పార్టీ అంచనాలకు మించి విజయవంతం అయిందని సురేష్రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. సభను జయప్రదం చేసిన రైతు సోదరులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. -
కరెన్సీ కష్టాలపై బంద్కు మద్దతు
నల్లధనంపై మోదీ పోరుకు అనుకూలం జనం కష్టాలతో కలవరం అందుకే భారత్ బంద్కు సంపూర్ణ సహకారం వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అమర్నాథ్ బ్యాంకులు, హాస్పిటల్స్కు మినహారుుంపు స్వచ్ఛందంగా కలసిరావాలని ప్రజలకు పిలుపు డాబాగార్డెన్స: ‘నల్లధనంపై పోరు ఆశయం మంచిదే. కానీ ఆ క్రమంలో సామాన్యులు పడుతున్న ఇబ్బందులు అంతులేకుండా ఉన్నారుు. ఈ కష్టాలకు, బాధలకు స్పందనగానే వైఎస్సార్సీపీ భారత్ బంద్కు మద్దతు ఇస్తోంది.’ అని పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ చెప్పారు. నల్లధనం వెలికితీయాలన్న మోదీ నిర్ణయాన్ని, ఆశయాలను వైఎస్సార్ సీపీ స్వాగతిస్తోందని, కానీ 18 రోజులుగా దేశంలో ప్రజలు పడతున్న కష్టాలకు స్పందనగా తమ పార్టీ కేంద్రంపై పోరాడుతుందని చెప్పారు. అందుకే భారత్బంద్కు వైఎస్సార్ సీపీ సంపూర్ణ మద్దతు తెలుపుతోందన్నారు. జగదాంబ జంక్షన్ సమీపాన గల పార్టీ జిల్లా కేంద్ర కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో 80 నుంచి 90 శాతం ప్రజలు డబ్బుల కోసం క్యూలో పడిగాపులు పడుతున్నారని, కొందరు అభాగ్యులు ప్రాణాలు వదులుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పెళ్లిళ్లు, శుభకార్యాలకు అవరోధాలు ఎదురవుతున్నాయని చెప్పారు. ప్రజలు, సామాన్యులు పడతున్న కష్టాలను దృష్టిలో ఉంచుకుని ఈ నెల 28న విపక్షాలు పిలుపునిచ్చిన భారత్ బంద్కు పూర్తిగా సహకరిస్తామన్నారు. బ్యాంకులు, ఆస్పత్రులు మినహారుుస్తే.. అందరూ బంద్లో పాల్గొనాలని, సహకరించాలని కోరారు. తీరు అనుచితం ప్రధాని మోదీ ఆలోచన మంచిదే అరుునా లోటుపాట్లు చూడకుండా.. విపక్షాలతో చర్చించకుండా నిర్ణయం తీసుకున్నారని, నిర్ణయం తీసుకున్న తర్వాతైనా విపక్షాలను సంప్రదించకపోవడం శోచనీయమని అమర్నాథ్ చెప్పారు. ప్రధాని నిర్ణయం వల్ల 85 శాతం మంది సామాన్యులే ఇబ్బందులు పడతున్నారని తెలిపారు. 18 రోజుల్లో నల్లధనం ఉన్న వ్యక్తులెవరూ క్యూలైన్లలో నిల్చున్నారా? అని ప్రశ్నించారు. వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి ప్రధానమంత్రి నరేంద్రమోదీకి సలహాలు, సూచనలతో కూడిన లేఖ రాసిన సంగతిని గుర్తు చేశారు. బంద్కు విశాఖ ప్రజానీకం సహకరించాలని కోరారు. వీలైతే విపక్షాలతో చర్చించనున్నట్టు చెప్పారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొయ్య ప్రసాదరెడ్డి, నియోజకవర్గ సమన్వయకర్తలు కోలా గురువులు(దక్షిణం), తిప్పల నాగిరెడ్డి(గాజువాక), పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ, ప్రచారకమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవిరెడ్డి, యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి కనకల ఈశ్వర్, గిడ్డంగుల శాఖ మాజీ అధ్యక్షుడు, పార్టీ సీనియర్ నాయకుడు సత్తి రామకృష్ణారెడ్డి, మహిళ విభాగం నగర అధ్యక్షురాలు పసుపులేటి ఉషాకిరణ్, ఎస్సీ సెల్ జిల్లా అద్యక్షుడు బోని శివరామకృష్ణ, మైనార్టీ విభాగం నగర అద్యక్షుడు మహ్మద్ షరీఫ్, నగర అధికార ప్రతినిధి గుత్తుల నాగభూషణం, సేవాదళ్ నగర అధ్యక్షుడు శ్రీనివాస్గౌడ్, మహిళా విభాగం నగర కార్యదర్శి శ్రీదేవివర్మ, సాంస్కృతిక విభాగం ప్రతినిధి రాధ తదితరులు పాల్గొన్నారు. -
నోట్ల రద్దుపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత
భారత్ బంద్కు తృణమూల్ కాంగ్రెస్ దూరం పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ కోల్కతా : పెద్ద నోట్ల రద్దును ప్రజలు తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తున్నారని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. ఈ నిర్ణయాన్ని కేంద్రం వెనక్కు తీసుకునే వరకు ప్రజలకు అండగా ఉండి పోరాడతానని ఆమె స్పష్టం చేశారు. శనివారం కోల్కతాలోని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ముఖ్యనేతలతో మమతా సమావేశమయ్యారు. నోట్ల రద్దు అనంతరం జరిగిన పరిణామాలను నియంత్రించడంలో మోదీ విఫలమయ్యారన్నారు. నోట్ల రద్దుని వ్యతిరేకిస్తున్న అన్ని పార్టీలను కలుపుకొని ఆందోళనలు చేయాలని పార్టీ నేతలకు ఆమె దిశానిర్దేశం చేశారు. ఈ నెల 28న తలపెట్టిన భారత్ బంద్లో తృణమూల్ కాంగ్రెస్ పాల్గొనబోదని ఆమె స్పష్టం చేశారు. బంద్ జరిపితే ప్రజలు మరింత ఇబ్బందులు పడతారని అందుకే బంద్కు దూరంగా ఉండాలని పార్టీ నేతలను ఆమె ఆదేశించారు. నోట్ల రద్దు అంశంపై తృణమూల్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈ నెల 29న (మంగళవారం) కోల్కతాలో భారీ ర్యాలీ చేపట్టాలని సమావేశంలో నిర్ణయించారు. -
'బంద్కు టీఆర్ఎస్ మద్దతుండదు'
హైదరాబాద్ : పెద్ద నోట్ల రద్దుకు నిరసనగా ఈనెల 28న ప్రతిపక్షాలు పిలుపునిచ్చిన భారత్బంద్కు తమ పార్టీ మద్దతుండదని టీఆర్ఎస్ ఎంపీ వినోద్ స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పార్లమెంట్లో నోట్ల రద్దు చర్చపై కాంగ్రెస్, బీజేపీలకు చిత్తశుద్ధిలేదన్నారు. నియోజకవర్గాల పునర్విభజనకు రాజ్యాంగ సవరణ అవసరం లేదన్నారు. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశామని ఎంపీ వినోద్ తెలిపారు. -
నోట్ల రద్దుకు నిరసనగా భారత్ బంద్
కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేయడానికి నిరసనగా ప్రతిపక్షాలన్నీ కలిసి ఈనెల 28వ తేదీన భారత్బంద్కు పిలుపునిచ్చాయి. ఈ మేరకు దాదాపు 13 ప్రతిపక్ష పార్టీలు నిర్ణయించాయి. పెద్దనోట్ల రద్దుపై ప్రచారాన్ని ముమ్మరం చేయాలని, ప్రధానంగా ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఇది మరింత ఉధృతంగా చేయాలని ప్రతిపక్షాలు తీర్మానించాయి. పెద్దనోట్ల రద్దుపై ప్రధానమంత్రి మాట్లాడాలని పార్లమెంటు లోపల, బయట విపరీతంగా డిమాండు పెరుగుతున్నా ఆయన మాత్రం మౌనాన్నే ఆశ్రయించడాన్ని నిరసిస్తూ 13 ప్రతిపక్ష పార్టీలు పార్లమెంటు వెలుపల నిరసన వ్యక్తం చేశాయి. కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, బీఎస్పీ తదితర పార్టీలు ఈ నిరసనలలో పాల్గొన్నాయి. ఇక తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ జంతర్ మంతర్ వద్ద పలు పార్టీల ఆధ్వర్యంలో జరిగిన నిరసన ప్రదర్శనలో పాల్గొని.. పెద్ద నోట్ల రద్దుపై పోరాటాన్ని తాము మరింత తీవ్రంగా కొనసాగించి తీరుతామని చెప్పారు. ప్రజాగ్రహంలో మోదీ సర్కారు కొట్టుకుపోతుందని ఆమె మండిపడ్డారు. రైతులు తాము ఇన్నాళ్లూ దాచుకున్న మొత్తాన్ని కోల్పోతున్నారని, వాళ్లు ఎలా బతకాలని ప్రశ్నించారు. స్విస్ బ్యాంకులో దాచుకున్న నల్లడబ్బు మాటేం చేశారని నిలదీశారు. దేశ ఆర్థిక వ్యవస్థ స్థిరమైన వృద్ధిరేటుతో సాగుతున్నప్పుడు.. ప్రభుత్వం ఉన్నట్టుండి ఇలాంటి నిర్ణయం తీసుకోవడంతో ఒక్కసారిగా మందగమనంలో పడిందని మండిపడ్డారు. ఈ విషయంలో బీజేపీ కార్యకర్తలు కూడా ఆ పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించరని అన్నారు. అయితే కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు మాత్రం పెద్దనోట్ల రద్దును సమర్థించారు. దీనిపై చర్చ జరగనివ్వాలని ప్రతిపక్షాలను ఆయన కోరారు. ఈ అంశంపై చర్చించడానికి తాము సిద్ధంగా ఉన్నా.. ప్రతిపక్షాలు మాత్రం సభను నడవనివ్వడం లేదన్నారు. యావద్దేశం పెద్దనోట్ల రద్దు విషయంలో ప్రధానమంత్రిని సమర్థిస్తోందని ఆయన చెప్పారు. -
జీతాలు పెంచినా సమ్మె ఎందుకు?
న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా దాదాపు 15 కోట్ల మంది కార్మికులు శుక్రవారం నాడు సమ్మె చేస్తున్నారు. ఫ్యాక్టరీలు, బ్యాంకులు, గనులు, రవాణా తదితర రంగాలకు చెందిన కార్మికులు ఇందులో పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవలనే కార్మికుడి కనీస దినసరి వేతనాన్ని 350 రూపాయలకు, అంటే నెలకు 9,100 రూపాయలకు పెంచినప్పటికీ, ఆ విషయాన్ని కేంద్రమే తాటికాయంత అక్షరాలతో ఈ రోజు వాణిజ్య ప్రకటనలతో పత్రికల్లో ఊదరగొట్టినప్పటికీ కార్మికులు ఎందుకు సమ్మెకు దిగారు? అందుకు కారణాలేమిటీ? అన్న ప్రశ్నలు తలెత్తక మానవు. వివిధ రంగాల్లో పనిచేస్తున్న కార్మికులు దేశ జనాభాలో 46 కోట్ల మంది ఉన్నారు. వారిలో వ్యవసాయేతర రంగాల కార్మికులకు మాత్రమే కేంద్రం కనీస వేతన ఉత్తర్వులు వర్తిస్తాయి. అందులోను కేవలం 48 కేటగిరీలకు చెందిన కార్మికులకు మాత్రమే కేంద్రం ఉత్తర్వులు వర్తిస్తాయి. ఇనుప గనుల్లో పనిచేసే కార్మికులు, రైల్వే సరకుల అన్లోడింగ్, రాళ్లు కొట్టడం లాంటి కేటగిరీలు కేంద్ర ప్రభుత్వం పరిధిలోకి వస్తాయి. ఈ రంగాల్లో ఇప్పటికే కేంద్రం నిర్ణయించిన కనీస దినసరి వేతనం 350 రూపాయలకన్నా ఎక్కువే పొందుతున్నారు. ఇక 1679 జాబ్ కేటగిరీలు రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోకి వస్తాయి. ఈ క్యాటగిరీ కార్మికులకు కేంద్రం ఉత్తర్వులు వర్తించవు. దేశంలోని మొత్తం 46 కోట్ల మంది కార్మికుల్లో కేవలం 70 లక్షల మందే, అంటే 1.5 శాతం మంది కార్మికులు మాత్రమే కేంద్రం ప్రకటించిన కనీస వేతన ఉత్తర్వుల వల్ల లబ్ధి పొందుతారు. కేంద్ర వేతన సంఘం కనీస వేతనాన్ని 18 వేల రూపాయలుగా సిఫార్సు చేయగా, కార్మికులకు మాత్రం అందులో కనీస వేతనాన్ని సగానికి సగంగా నిర్ణయించడం అన్యాయమని కేంద్ర కార్మిక సంఘాలు విమర్శిస్తున్నాయి. రాష్ట్రాల కిందకు వచ్చే 1679 కేటగిరీలకార్మికులకు రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఇష్టానుసారం వేతనాలు ఇవ్వొచ్చు. ఇలాంటి అవకాశం లేకుండా కేంద్రం ఉత్తర్వులను తూచాతప్పకుండా రాష్ట్రాలు అమలు చేసేలా చట్టాల్లో మార్పులు తీసుకరావాలని కూడా కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కనీస వేతన బోర్డు సూచన మేరకే కార్మికుల కనీస వేతనాన్ని తాము 350 రూపాయలుగా నిర్ణయించామంటూ కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ సమర్థించుకోవడానికి ప్రయత్నించి తప్పులో కాలేశారు. కేవలం రెండు రోజుల నోటీసుతో ఆగస్టు 29న కనీస వేతన బోర్డు సబ్యుల సమావేశాన్ని కేంద్రం ఆదరాబాదరగా ఏర్పాటు చేసింది. అందులో తాము కేంద్ర వేతన సంఘం సిఫార్సు చేసిన మేరకు కార్మికుల కనీస వేతనాన్ని నెలకు 18 వేల రూపాయలుగా నిర్ణయించాలని తాము డిమాండ్ చేశామని, అయితే ఏకాభిప్రాయం కుదరక, ఎలాంటి నర్ణయం తీసుకోకుండానే సమావేశం ముగిసిందని కార్మిక సంఘాల తరఫున ప్రాథినిధ్యం వహిస్తున్న బోర్డు సభ్యుడు డాక్టర్ కాశ్మీర్ సింగ్ తెలిపారు. బోనస్ చెల్లించడంలో, కార్మికులకు సామాజిక భద్రతను కల్పించడంలో కూడా కేంద్ర ప్రభుత్వం విఫలమైంది. కార్మికుల కనీస బోనస్ను 3,500 రూపాయల నుంచి ఏడు వేల రూపాయలకు పెంచుతున్నట్లు 2015, డిసెంబర్లో ఘనంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించినప్పటికీ ఇప్పటికీ దాన్ని నోటిఫై చేయలేదు. దాంతో గత రెండేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులకు బోనస్ చెల్లించలేదు. ప్రాఫిడెంట్, ప్రభుత్వ బీమా పథకం కింద అసంఘటిత కార్మికులకు సామాజిక భద్రత కల్పిస్తామన్న కేంద్రం హామీ ఇప్పటికీ అమలుకు నోచుకోలేదు. కమిటీల మీద కమీటీలు వేస్తూ కాలయాపన చేస్తోంది. ఈ పథకం అమల్లోకి వస్తే దాదాపు 20 లక్షల మంది అంగన్వాడి కార్యకర్తలు ఎక్కువగా లబ్ధిపొందుతారు. -
దీదీ చెప్పిందే జరిగింది!
కోల్ కతా: భారత్ బంద్ లో భాగంగా బెంగాల్ లో ట్రేడ్ యూనియన్లు శుక్రవారం చేస్తున్న బంద్ అంతగా ప్రభావం చూపడం లేదు. రైలు, విమానయాన సేవలు సాధారణంగా కొనసాగుతున్నాయి. రోడ్లపై వాహనాలు తిరుగుతున్నాయి. బంద్ కారణంగా జనం రోడ్ల మీదకు రావడం లేదు. బస్సు సర్వీసులు మామూలుగానే నడుస్తున్న బంద్ కారణంగా వాటిలో జనం కనిపించడం లేదు. ట్యాక్సీ, ఆటోలు కూడా రోడ్లెక్కాయి. రాష్ట్ర ప్రభుత్వశాఖల్లోని ఉద్యోగులు అందరూ విధులకు హాజరయ్యారు. అయితే ఎక్కువమంది ఉద్యోగులు గురువారం రాత్రి సమయంలో పనిచేయడానికే మొగ్గు చూపారు. ట్రేడ్ యూనియన్ల సంఘాలు అక్కడక్కడా ర్యాలీలు నిర్వహించాయి. మరికొన్ని ప్రదేశాల్లో తృణమూల్, సీపీఎం వర్గాల మధ్య గొడవలు జరగడంతో పోలీసులు రంగంలోకి దిగాల్సివచ్చింది. శిలిగురి వద్ద బంద్ కు మద్దతుగా నిలిచిన సీపీఎం ఎమ్మెల్యే అశోక్ భట్టాచార్య, మరో 30 మంది కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. కాగా మత గురువుల జాబితాలో మథర్ థెరిస్సాను చేర్చుతుండటంతో ఆ వేడుకను తిలకించేందుకు మమత వాటికన్ సిటీకి శుక్రవారం ఉదయం బయల్దేరి వెళ్లారు. రాష్ట్రంలో బంద్ ఫెయిల్ అవుతుందని ఆమె చేసిన వ్యాఖ్యలు నిజమయ్యాయి. అయితే ట్రేడ్ యూనియన్ సంఘాలు మాత్రం బంద్ విజయవంతమైందని ప్రకటించాయి. -
'ఉక్కుపై ఉత్పత్తికి అంతరాయం లేదు'
విశాఖ: దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మె ప్రభావం విశాఖ ఉక్కు కర్మాగారంపై పాక్షికంగా పడింది. సూపర్వైజర్లు, బీఎంఎస్ సంఘానికి చెందిన కార్మికులు యథావిధిగా విధులకు హజరయ్యారు. స్టీల్ ప్లాంట్ ప్రధాన ర్వారం వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తు ఏర్పాటుచేశారు. సమ్మె వల్ల ఉత్పత్తికి ఎలాంటి అంతరాయం లేదని యాజమాన్యం తెలిపింది. -
దేశవ్యాప్తంగా భారత్ బంద్
-
తిరుమలకు తాకిన బంద్ ప్రభావం
తిరుమల: నేడు దేశవ్యాప్తంగా చేపడుతున్న సార్వత్రిక బంద్ ప్రభావం చిత్తూరు జిల్లా తిరుమలను తాకింది. టీటీడీ కార్మికులు కూడా బంద్లో పాల్గొనడంతో పారిశుధ్య పనులకు తీవ్ర అంతరాయ కలుగుతోంది. దీంతో శ్రీవారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
సమ్మె ఎఫెక్ట్: జనం జేబుకు చిల్లు
తెలుగు రాష్ట్రాల్లో సార్వత్రిక బంద్ విజయవంతంగా సాగుతోంది. హైదరాబాద్ సహా పలు నగరాల్లో ఆర్టీసీ సిటీబస్సులు నిలిచిపోయాయి. ఆటోలు కూడా అంతంతమాత్రంగానే నడుస్తున్నాయి. దాంతో సామాన్యులకు మాత్రం కష్టాలు తప్పడం లేదు. సిటీబస్సులు లేకపోవంతో కార్యాలయాలకు వెళ్లాల్సిన వాళ్లు దిక్కుతోచని పరిస్థితుల్లో పడ్డారు. ప్రతిరోజూ వందలాది బస్సులు నడిపే వేలాది ట్రిప్పులలో లక్షలాది మంది ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుకుంటారు. కానీ సార్వత్రిక సమ్మె పేరుతో ఆర్టీసీ సిటీబస్సులు ఆగిపోవడంతో.. ఇక సెట్విన్ బస్సులు, షేర్ ఆటోలను ఆశ్రయించాల్సి వచ్చింది. దొరికిందే చాన్సని సెట్విన్ బస్సులలో కూడా రెట్టింపు చార్జీలు వసూలు చేస్తున్నారని, వాటిలో పుష్పకవిమానంలా ఎంతమంది వస్తే అంతమందిని ఎక్కిస్తూ ఇరికిస్తున్నారని ప్రయాణికులు వాపోయారు. ఇక షేర్ ఆటోలు, మామూలు ఆటో చార్జీల గురించి చెప్పనక్కర్లేదు. వనస్థలిపురం, ఎల్బీనగర్ ప్రాంతాల మీదుగా వెళ్లే షేర్ ఆటోలలో ఒక్కోదాంట్లో దాదాపు 15 మంది వరకు ఎక్కిస్తున్నారు. డ్రైవర్కు అటూ ఇటూ ఐదుగురు కూర్చుంటున్నారు. అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో ఈ ఆటోలు వెళ్తున్నాయి. రామంతపూర్ నుంచి కోఠి వరకు వెళ్లాలంటే సాధారణంగా షేర్ ఆటోలో 15 రూపాయలు తీసుకుంటారు. కానీ, శుక్రవారం మాత్రం ఇది అమాంతం 100 రూపాయలు అయిపోయింది!! దూరప్రాంత ప్రయాణాలు చేయాల్సిన వాళ్లు అవసరమైతే వాయిదా వేసుకునే అవకాశం ఉన్నా.. ప్రతిరోజూ ఆఫీసులకు వెళ్లేవాళ్లు మాత్రం సమ్మె వల్ల బాగా ఇబ్బంది పడ్డారు. వాతావరణ కాలుష్యాన్ని నివారించేందుకు వ్యక్తిగత వాహనాలను వాడొద్దంటూ ప్రభుత్వం ముమ్మరంగా ప్రచారం చేస్తోంది. కానీ, ఇలాంటి సమయాల్లో మాత్రం ప్రత్యామ్నాయం కల్పించడం గురించి ఏమాత్రం పట్టించుకోవడం లేదని జంటనగరాల వాసులు మండిపడుతున్నారు. -
సమ్మె కారణంగా పరీక్షలు వాయిదా
హైదరాబాద్: దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె నేపథ్యంలో జేఎన్టీయూహెచ్ పరిధిలోని కళాశాలల్లో శుక్రవారం జరగాల్సిన అన్నీ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు వర్సిటీ డెరైక్టర్ ఆఫ్ ఎవాల్యుయేషన్(డీఈ) ఆంజనేయప్రసాద్ వెల్లడించారు. ఈ రోజు జరగాల్సిన ఎంబీఏ, ఎంసీఏ, మొదటి సెమిస్టర్ పరీక్ష సెప్టెంబర్ 16వ తేది మధ్యాహ్నం, రెండో సెమిస్టర్ పరీక్ష అదే రోజు ఉదయం నిర్వహించనున్నట్లు వివరించారు. అలాగే బీటెక్, బీఫార్మసీ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు ఈ నెల 13న నిర్వహించనున్నట్లు చెప్పారు. -
నేడు భారత్ బంద్
-
నేడు భారత్ బంద్
♦ బ్యాంకింగ్, రవాణా, టెలికం సేవలకు తీవ్ర అంతరాయం ♦ సమ్మెలో పాల్గొంటున్న 10 కేంద్ర కార్మిక సంఘాలు ♦ 12 డిమాండ్లపై కేంద్రం వైఖరికి నిరసనగా బంద్: కార్మిక సంఘాలు ♦ కనీస వేతనం రూ. 18 వేలు, పెన్షన్ రూ. 3 వేలు చేయాలని డిమాండ్ న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా నేడు కేంద్ర కార్మిక సంఘాల బంద్తో ప్రభుత్వ కార్యాకలాపాలు స్తంభించనున్నాయి. బ్యాంకింగ్, ప్రజా రవాణా, టెలికం వంటి కీలక సేవలకు తీవ్ర ఆటంకం కలిగే అవకాశాలున్నాయి. తమ డిమాండ్లపై కేంద్రం ఉదాసీనత, కార్మిక వ్యతిరేక చట్ట సవరణలకు నిరసనగా 10 కేంద్ర కార్మిక సంఘాలు బంద్కు పిలుపునిచ్చాయి. ఆర్ఎస్ఎస్ అనుబంధ బీఎంఎస్(భారతీయ మజ్దూర్ సంఘ్) మినహా అన్ని ప్రధాన సంఘాలు బంద్లో పాల్గొంటున్నాయి. సమ్మెలో 18 కోట్ల మంది ఉద్యోగులు, కార్మికులు పాల్గొంటారని అంచనా. తమ డిమాండ్ల పరిశీలనకు కేంద్రం హామీ, రెండేళ్ల బోనస్, కనీస వేతనం రూ.350కి పెంపు చర్యలు సరిపోవ ంటూ కార్మిక సంఘాలు సమ్మెకు దిగాయి. నెలకు కనీస వేతనం రూ. 18 వేలు చేయాలని, నెలకు రూ. 3 వేల కనీస పెన్షన్ వంటి 12 డిమాండ్లు పరిష్కరించాలన్నాయి. ‘12 అంశాలతో కూడిన డిమాండ్ల పరిష్కారంపై ప్రభుత్వ నిర్లక్ష్యం, ఏకపక్ష కార్మిక వ్యతిరేక చట్ట సవరణల్ని నిరసిస్తూ సంఘటిత, అసంఘటిత రంగ కార్మికులు రోడ్లపై నిరసన తెలుపుతారు’ అని కార్మిక సంఘాల సమన్వయ కమిటీ ప్రధాన కార్యదర్శి తివారీ చెప్పారు. కార్మికులతో ఘర్షణ పడాలని తమ ప్రభుత్వం కోరుకోవడం లేదని, వారి సహకారం, మద్దతు కావాలని కార్మిక మంత్రి దత్తాత్రేయ అన్నారు. మొత్తం 12 డిమాండ్లలో ఎనిమిది కార్మిక శాఖకు సంబంధించినవి కాగా వాటిలో ఏడింటిని అంగీకరించామని చెప్పారు. కనీస వేతనం రూ. 18 వేలు సహేతుకమే: సమ్మెతో ఓడరేవులు, పౌరవిమానయానం, రవాణా, టెలికం, బ్యాంకింగ్ రంగాలు స్తంభిస్తాయని టీయూసీసీ ప్రకటించింది. ఆస్పత్రులు, విద్యుదుత్పత్తి కేంద్రాల్లో సిబ్బంది బంద్లో పాల్గొంటారని, రోజువారీ విధులకు భంగం కలగకుండా నిరసన తెలుపుతారంది. కోల్ ఇండియా, గెయిల్, ఓఎన్జీసీ, ఎన్టీపీసీ, ఓఐఎల్, హెచ్ఏఎల్, బీహెచ్ఈఎల్ సిబ్బంది కూడా సమ్మెలో పాల్గొంటారని తివారీ చెప్పారు. తాము ఎక్కువ అడగడం లేదని, ఏడో వేతన సంఘం సిఫార్సుల మేరకు నెలవారీ కనీస వేతనం రూ. 18 వేలు చేయాలని కోరుతున్నామన్నారు. ధరల పెరుగుదల నేపథ్యంలో ఈ పెంపు సరైనదేనంటూ సమర్ధించుకున్నారు. నేటి సమ్మెలో రైల్వే, ఇతర కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొనడం లేదు. 7వ వేతన సంఘం సిఫార్సుల మేరకు నెలవారీ వేతనం రూ. 18 వేల నుంచి దాదాపు రూ. 26 వేలకు పెంచాలన్న వారి డిమాండ్ పరిశీలనకు ఇప్పటికే కమిటీ ఏర్పాటు చేశారు. 11 రాష్ట్రాల్లో రాస్తారోకోలు: ఏఐటీయూసీ సంఘటిత, అసంఘటిత రంగాలకు సంబంధించిన పారిశ్రామిక ప్రాంతాలు, పలు విభాగాల్లో పెద్ద ఎత్తున నిరసనలు తెలుపుతామని ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్(ఏఐటీయూసీ) తెలిపింది. ఢిల్లీలోని ఓక్లా, కీర్తినగర్, మయపురి ఏరియా, వజీర్పూర్, మంగోల్పూరి, పత్పర్గంజ్ సహా అన్ని పారిశ్రామిక ప్రాంతాల్లో ర్యాలీ నిర్వహిస్తామని వెల్లడించింది. బ్యాంకులు, బీమా, యూనివర్సిటీ, తపాలా, టెలికం, రక్షణ, ఇంధన రంగాలకు చెందిన కార్మికులు, ఉద్యోగులు జంతర్మంతర్ నుంచి పార్లమెంట్ వరకు ర్యాలీ నిర్వహిస్తారని, అలాగే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, బిహార్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, కర్నాటక సహా 11 రాష్ట్రాల్లో రాస్తారోకోలు చేస్తామని ఏఐటీయూసీ పేర్కొంది. ఆగస్టు 31న కేంద్ర కార్మిక శాఖ మంత్రి మాట్లాడారని, కార్మికులకు సరైన వేతనం, సాంఘిక భద్రతకు ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందంటూ ఆగస్టు 31న మంత్రి దత్తాత్రేయ చెప్పారని తెలిపింది. రేడియాలజిస్టుల సమ్మె.. తమ సమస్యలపై కేంద్ర ప్రభుత్వం నుంచి సరైన హామీ రాకపోవడంతో రేడియాలజిస్టులు నేటి నుంచి నిరవధిక సమ్మె చేయనున్నారు. దీంతో రేడియాలజీ , అల్ట్రాసోనోగ్రఫీ, ఇతర స్కానింగ్ సేవలు తీవ్రంగా ప్రభావితం కానున్నాయి. స్తంభించనున్న బ్యాంకింగ్ రంగం ఆరు ప్రభుత్వ రంగ బ్యాంకు సంఘాల ఉద్యోగులు సమ్మెలో పాల్గొనాలని నిర్ణయించడంతో నేటి సమ్మెతో ఆ రంగం కార్యకలాపాలు ప్రభావితం కానున్నాయి. ఇప్పటికే వినియోగదారులకు బ్యాంకులు ఆ విషయాన్ని వెల్లడించాయి. ఆలిండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోషియేషన్(ఏఐబీఈఏ), బ్యాంకు ఎంప్లాయీస్ ఫెడెరేషన్ ఆఫ్ ఇండియా(బీఈఎఫ్ఐ), ఆలిండియా బ్యాంకు ఆఫీసర్స్ అసోషియేషన్(ఏఐబీఓఏ), ఆలిండియా ఆఫీసర్స్ కాన్ఫడరేషన్(ఎఐబీఓసీ), ఇండియన్ నేషనల్ బ్యాంకు ఆఫీసర్స్ కాంగ్రెస్లు బంద్కు నోటీసులిచ్చాయి. -
'సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలి'
హైదరాబాద్: కార్మిక వర్గ పొట్టకొట్టేందుకు ప్రయత్నిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును నిరసిద్దామని, రేపు (సెప్టెంబర్ 2న) సార్వత్రిక సమ్మెను జయపద్రం చేద్దాం' అంటూ వైఎస్ఆర్సీపీ ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు గౌతంరెడ్డి పిలుపునిచ్చారు. కార్మిక సంఘాల భారత్ బంద్ నేపథ్యంలో గురువారం ఆయన పత్రిక ప్రకటన విడుదల చేశారు. ఎన్నికలకు ముందు హామీలతో ఊదరగొట్టి.. తీరా ఎన్నికలైపోయాక కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రధాన మంత్రి ఉద్యోగాన్ని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఉద్యోగాన్ని చంద్రబాబు నాయుడు సంపాదించేసుకున్నారని గౌతంరెడ్డి విమర్శించారు. ఇచ్చిన హామీలు గాలికొదిలేసి ప్రజా సంక్షేమాన్ని ఆటకెక్కించారని ధ్వజమెత్తారు. ప్రభుత్వరంగ పరిశ్రమలన్నింటినీ ప్రైవేటీరణ, కార్మిక సంస్కరణల పేరిట మొత్తం కార్మికుల చట్టాలన్నింటినీ కుదించి కార్మికుల హక్కును అణిచివేయడం లాంటి చర్యలు కార్మికులలో తీవ్ర ఆగ్రహాన్ని కలిగిస్తున్నాయని గౌతంరెడ్డి దుయ్యబట్టారు. కాగా, రేపు దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు భారత్ బంద్కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ సమ్మెలో 10 లక్షల మంది ఉద్యోగులు పాల్గొననున్నారు. ఈ బంద్ నేపథ్యంలో బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాలు, రవాణా సంస్థలు మూతపడనున్నాయి. అఖిల భారత సమ్మెకు స్థానిక కార్మిక సంఘాలు మద్దతు తెలిపాయి. -
‘సెప్టెంబర్ 2న భారత్ బంద్’
పరిశ్రమల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ.. ఐఎన్టీయూసీ భారత్బంద్కు పిలుపునిచ్చింది. కార్మికుల కనీస వేతనాన్ని రూ. 18 వేలకు పెంచాలని డిమాండ్ చేస్తూ.. దేశ వ్యాప్తంగా ఉన్న అన్నీ కార్మిక సంఘాలతో కలిసి సెప్టెంబర్ 2న భారత్ బంద్ నిర్వహిస్తామని ఐఎన్టీయూసీ జాతీయ అధ్యక్షులు సంజీవ రెడ్డి తెలిపారు. పరిశ్రమల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ చేపట్టిన ఈ బంద్కు త్వరలోనే అన్ని సంఘాల నుంచి మద్దతు కూడగడతామని ఆయన అన్నారు. ఆదివారం ఎన్టీపీసీ రామగుండంలోని అతిథి గృహంలో విలేకరుల సమావేశంలో ఆయన ప్రసంగించారు. -
భారత్ బంద్ విజయవంతం