క్యూలైన్లో రిటైర్డ్ వైద్యుడు మృతి
నందికొట్కూరు: కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయం సామాన్య ప్రజానీకాన్ని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. శుక్రవారం నుంచి పెద్ద నోట్లు బ్యాంకులలో మాత్రమే చెల్లుబాటు అవుతుండటంతో.. తన ఖాతాలో డబ్బులు వేసుకోవడానికి బ్యాంకుకు వచ్చిన ఓ విశ్రాంత పశువైద్యడు బాలరాజు గుండెపోటుకు గురై మృతి చెందారు. ఈ సంఘటన కర్నూలు జిల్లా నందికొట్కూరులో చోటు చేసుకుంది. బాలరాజును జూపాడుబంగ్లా మండలం తరిగోపుల గ్రామానికి చెందిన వాడిగా పోలీసులు గుర్తించారు.