గంటలోపే స్వామివారి దర్శనం: ఈవో | summar Preparations in tirumala | Sakshi
Sakshi News home page

గంటలోపే స్వామివారి దర్శనం: ఈవో

Mar 14 2017 2:24 PM | Updated on Sep 5 2017 6:04 AM

స్వామి వారి దర్శనానికి వచ్చే భక్తులకు గంటలోగా దర్శనం చేయించేలా ఏర్పాట్లు చేసినట్లు ఈవో సాంబశివరావు వెల్లడించారు.

తిరుమల: తిరుమల స్వామి వారి దర్శనానికి వచ్చే భక్తులను కంపార్టుమెంటు నుంచి విడుదల చేసిన తరువాత గంటలోగా దర్శనం చేయించేలా ఏర్పాట్లు చేసినట్లు ఈవో సాంబశివరావు వెల్లడించారు. వేసవిలో భక్తులు రద్దీని తట్టుకునేందుకు అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేశామన్నారు. టీటీడీ పరిధిలో అగ్నిప్రమాదాలు జరగకుండా ముందు జాగ్రత్తలు తీసుకున్నట్లు వివరించారు.  ప్రభుత్వం ఆధీనంలోని అటవీ ప్రాంతంలో ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. దర్శనం, వివిధ పూజల నిమిత్తం భక్తులు ఆన్ లైన్ లో పొందే టికెట్లను బార్ కోడ్ విధానంలో తనిఖీ చేస్తామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement