టిక్‌టాక్‌ కలిపింది ఇద్దరినీ | Tick Tock Users Love Marriage in Karnataka | Sakshi
Sakshi News home page

టిక్‌టాక్‌ కలిపింది ఇద్దరినీ

Jun 22 2019 7:18 AM | Updated on Jun 22 2019 7:18 AM

Tick Tock Users Love Marriage in Karnataka - Sakshi

కుమార్, ప్రియాంక జంట

యాప్‌ ద్వారా పరిచయం, ప్రేమ, పెళ్లి  

సాక్షి, బెంగళూరు: టిక్‌టాక్‌ ద్వారా ఒక్కటయ్యిందో జంట. టిక్‌టాక్‌ పరిచయంతో ప్రేమ మొగ్గతొడిగి, తర్వాత కులాంతర వివాహం చేసుకున్నారు.  బాగలకోటె జిల్లాలో ఈ సంఘటన జరిగింది. జమఖండికి చెందిన ప్రియాంక, హుణసూరుకు చెందిన కుమార్‌లు టిక్‌టాక్‌ ద్వారా ఒకరినొకరు పరిచయం అయ్యారు. టిక్‌టాక్‌లో పాటలు పాడి కుమార్‌ అప్‌లోడ్‌ చేయడం, వాటిని ప్రియాంక చూసి లైక్‌ కొట్టేది. తర్వాత ఇద్దరూ మొబైల్‌ఫోన్‌ నంబర్లు  ఇచ్చి పుచ్చుకున్నారు. తరచూ మాట్లాడేవారు, ఇలా వారిరువురి మధ్య ప్రేమ చిగురించింది. పేద కుటుంబానికి చెందిన ప్రియాంక తల్లిదండ్రులు వయసు రీత్యా వృద్ధాప్యంలో ఉన్నారు. ఇక కుమార్‌ కుటుంబం కూడా పెళ్లికి అంగీకరించారు. దళిత సంఘర్ష సమితి కార్యకర్తల సహాయం ఈ ప్రేమ జంట మూడుముళ్లు వేసుకుంది. సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయం ఎదుట ఇరు కుటుంబాల పెద్దల సమక్షంలో దండలు మార్చుకుని వివాహం చేసుకున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement