నేడు తెరపైకి ‘తిరుపతి ఎక్స్‌ప్రెస్’ | Today, due to the 'Tirupati Express' | Sakshi
Sakshi News home page

నేడు తెరపైకి ‘తిరుపతి ఎక్స్‌ప్రెస్’

Published Fri, Sep 5 2014 1:25 AM | Last Updated on Sat, Sep 2 2017 12:52 PM

నేడు తెరపైకి ‘తిరుపతి ఎక్స్‌ప్రెస్’

నేడు తెరపైకి ‘తిరుపతి ఎక్స్‌ప్రెస్’

చిన్న చిత్రాల జాబితాలో విడుదలైనా టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్‌లను కురిపించిన చిత్రం ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’.

చిన్న చిత్రాల జాబితాలో విడుదలైనా టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్‌లను కురిపించిన చిత్రం ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’. ఈ చిత్రానికి రీమేక్‌గా కన్నడలో రూపొందించిన ‘తిరుపతి ఎక్స్‌ప్రెస్’ శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రముఖ నిర్మాత శైలేంద్రబాబు ఈ చిత్రాన్ని నిర్మించగా, ఆయన కుమారుడు సుమంత్, నటి కృతి కర్బంద హీరో హీరోయిన్లుగా కనిపించనున్నారు.

ఇక ఇప్పటికే విష్ణువర్థన్, చారులతా వంటి రీమేక్‌లను అందించిన దర్శకుడు పీ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. తన కుమారుడు సుమంత్‌ను ఎలాగైనా సరే శాండల్‌వుడ్‌లో స్టార్‌ని చేయాలనే లక్ష్యంతో శైలేంద్రబాబు ఈ చిత్ర నిర్మాణానికి, ప్రచారానికి ఎక్కువగానే ఖర్చు పెట్టారని గాంధీనగర్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమా సాధించే విజయం పైనే సుమంత్ భవిష్యత్తు ఆధారపడి ఉందనేది సినీవిశ్లేషకుల అభిప్రాయం.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement